పిల్లల అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు! బోగినేని కాశీరావు
ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం చిన్నక్రాక లో జనసేన పార్టీ తరుపున గుండబతిన రామమూర్తి, తేలప్రోలు రమేష్ గారి ఆధ్వర్యంలో జరిపిన బాలల దినోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ సభ్యులు బోగినేని కాశీరావు, ఉపాధ్యాయులతో కలిసి పిల్లల అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఈ రోజు అవశ్యకతను వారికి వివరించి అందరికీ నోటు బుక్కులు, చాక్లెట్స్ , పెన్, పెన్సిల్, బిస్కట్ లు పంచి, పిల్లల అందరూ జీవితంలో ఏం సాధించాలో ఒక లక్ష్యము పెట్టుకొని, ఆ లక్ష్యం సాధించే విధంగా కృషి చేయాలని పిల్లల కు సూచించారు. అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మాటలను జవదాటకుండా క్రమశిక్షణతో నడుచుకోవాలని ఆకాంక్షించారు.. పిల్లలే దేశ భవిష్యత్తు అని, వారిని జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన చెప్పారు.. మంచి విద్యను పిల్లలకు అందించడం మనందరి బాధ్యత. భవిష్యత్తులో దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను అని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమం లో జలదంకి మండలం దాసరి అగ్రహారం చెరువు వైస్ చైర్మన్ మాధవరావు, పసుపులేటి వెంకటేశ్వర్లు, మురళి, జనసేన నాయకుడు బోగినేని కాశి రత్తయ్య, సీతారామపురం ఊర చెరువు అధ్యక్షుడు నీలి రత్నయ్య, సీతారామపురం సొసైటీ డైరెక్టర్ లు గొల్లపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.











