విశాఖపట్నం
25 రాష్ట్రాల ప్రతినిధులతో జాతీయ స్థాయి కార్యక్రమం. విశాఖపట్నం లో జీవీఎంసీ నీటి సరఫరా నిర్వహణ వ్యవస్థ ఆదర్శపూరితం. విశాఖ నగర పరిశుభ్రతకు సుందరీకరణకు ముగ్ధులైన వర్క్ షాప్ ప్రతినిధులు. ఎం ఓ హెచ్ యు ఏ డిప్యూటీ సెక్రటరీ గ్రేస్ లాల్క్రింది పచావ్ భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎం ఓ హెచ్ యు ఏ), గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి), అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏ ఎస్ సి ఐ) సంయుక్త ఆధ్వర్యంలో ‘డ్రింక్ ఫ్రం ట్యాప్’ (డీ ఎఫ్ టి) ప్రాజెక్ట్ అమలు పై 25 రాష్ట్రాల ప్రతినిధులతో జాతీయస్థాయి కార్యక్రమంగా రాష్ట్ర స్థాయి వర్క్షాప్ను నవంబర్ 20, 2025న హోటల్ గ్రీన్పార్క్, విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ వర్క్షాప్ ప్రధాన ఉద్దేశ్యం అమృత్ 2.0 కార్యక్రమం కింద 24×7 సురక్షిత తాగునీటి సరఫరా వ్యవస్థలను అమలు చేయడంలో రాష్ట్ర పట్టణ సంస్థల అధికారుల సామర్థ్యాలను పెంపొందించడం, అలాగే “డ్రింక్ ఫ్రం ట్యాప్” లక్ష్యాల వైపు విశాఖపట్నం చేస్తున్న పురోగతిని పంచుకోవడం జరిగినది. విశాఖ నగరం విమానాశ్రయం నుండి వర్క్ షాప్ కార్యక్రమానికి చేరుకునే వరకు విశాఖ నగర పరిశుభ్రత , సుందరీకరణ చాలా అద్భుతంగా ఉందని, అందర్నీ జీవీఎంసీ ముగ్ధులను చేసిందని , జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విశాఖ నగరంలో చేపడుతున్న ప్రత్యేక కార్యాచరణ అందరికీ ఆకర్షణీయంగా నిలిచిందని ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సి పి హెచ్ ఈ ఈ ఓ, ఎం ఓ హెచ్ యు ఏ డిప్యూటీ అడ్వైజర్ (పీహెచ్ఇ) డా. రామకాంత్ వర్క్షాప్ ఆవశ్యకతను వివరించారు . తరువాత ఏ ఎస్ సి ఐ అడ్జంక్ట్ ప్రొఫెసర్, సెంటర్ డైరెక్టర్ డా. బి. జనార్ధన్ రెడ్డి, ఐఏఎస్ (రిటైర్డ్) నగర తాగునీటి సరఫరా విధానాన్ని ‘ఇంటర్మిటెంట్’ నుండి ‘కంటిన్యుయస్’ వ్యవస్థగా మార్చాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రీ-మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అండ్ అర్బన్ ఫ్లడింగ్ మిటిగేషన్పై సలహా పుస్తకాన్ని విడుదల చేశారు. ఇది మాన్సూన్ సీజన్ ముందు పట్టణ స్థానిక సంస్థలకు మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఎం ఓ హెచ్ యు ఏ తరఫున డిప్యూటీ సెక్రటరీ గ్రేస్ లాల్క్రింది పచావ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా “డ్రింక్ ఫ్రం ట్యాప్”, అమృత్ 2.0 కార్యక్రమాల పురోగతిపై ప్రసంగించారు. విశాఖపట్నం జీవీఎంసీ నీటి సరఫరా నిర్వహణ వ్యవస్థ ఆదర్శపూరితంగా ఉన్నందున ఈ వర్క్ షాప్ కార్యక్రమంను విశాఖలో నిర్వహించడం జరిగిందని, విశాఖపట్నంలో నీటి సరఫరా నిర్వహణ వ్యవస్థను, విశాఖ నగర అభివృద్ధి, సుందరీకరణ అందర్నీ అబ్బురపరిచేలా జీవీఎంసీ తీర్చిదిద్దడం అభినందనీయమని, జీవీఎంసీ విజయ గాధను అందరూ తెలుసుకునేందుకు ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుందన్నారు. 24/7 వాటర్ సప్లై, పోర్టబుల్ వాటర్ సిస్టం, ఎఫిషియన్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్జ్యూమర్ బెనిఫిట్స్, సస్టైన్బిలిటీ అనే అంశాలతో కూడిన “డ్రింక్ ఫ్రమ్ ట్యాప్” సంబంధించి పి పి టి ద్వారా అందరికీ వివరించారు. తదనంతరం తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి, సి డి ఎం ఏ (ఎఫ్ ఏ సి) డా. టి.కె. శ్రీదేవి, ఐఏఎస్ ప్రత్యేక ప్రసంగం చేస్తూ డ్రింక్ ఫ్రం ట్యాప్ లక్ష్యాలు, ప్రాముఖ్యత పట్టణ తాగునీటి సరఫరా వ్యవస్థల బలోపేతం గురించి విశదీకరించారు. టెక్నికల్ సెషన్లో, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్, ఐఏఎస్ నిరంతర తాగునీటి సరఫరా, నాన్-రెవెన్యూ వాటర్ (ఎన్ ఆర్ డబ్ల్యు) తగ్గింపు పై విశాఖపట్నం నగర అనుభవాన్ని, పురోగతిని వివరించారు. జీవీఎంసీ పది జోన్లలో 24/7 నీటి సరఫరా అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధంగా ఉందని, విశాఖ నగరానికి 11 వనరుల ద్వారా నీటి సరఫరా పుష్కలంగా ఉంటుందని, 310 జి ఎస్ ఎల్ ఆర్, ఇ ఎస్ ఎల్ ఆర్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, ఏడిబి,అమృత్ ,15 ఫైనాన్స్ ద్వారా ఆర్థిక సహకారం జీవీఎంసీ కి అందుతుందని, స్మార్ట్ సిటీ ద్వారా నీటి సరఫరా నిర్వహణ ఉందని, మొత్తంగా 28 లక్షల ప్రజానీకానికి 400 ఎంఎల్డి నీరు సరఫరా చేయబడుతుందని, జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ద్వారా నిర్వహిస్తున్న స్కాడ సిస్టం ,సిఓసి వ్యవస్థ,న్యూ హౌస్ సర్వీస్ కనెక్షన్స్ , జిఐఎస్ మ్యాపింగ్ ,ఆటోమేషన్ డబ్ల్యూ టి పి ఎస్,575 వార్డ్ ఇమ్యూనిటీస్ సెక్రటరీస్ ద్వారా ఇన్ హౌస్ వాటర్ టెస్టింగ్ నిత్యం జరుగుతుందని కమిషనర్ పిపిటి ద్వారా వివరిస్తూ విశాఖ నగరంలో “డ్రింక్ ఫ్రమ్ టాప్ ” వర్క్ షాప్ వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తదనంతరం జరిగిన ఇతర టెక్నికల్ సెషన్లలో డా. రామకాంత్ – బ్యాంకబుల్ ప్రాజెక్ట్ అంశాలు డా. అశోక్ నటరాజన్ – ఎన్ఆర్ డబ్ల్యు మేనేజ్మెంట్ డా. ఎం. స్నేహలత (ఏ ఎస్ సి ఐ) – అమృత్ 2.0 సామర్థ్య వేదిక డీఎఫ్ టి మాడ్యూళ్లు చిన్మయ్ త్రిపాఠీ (డబ్ల్యూ ఏ టి సి ఓ, ఒడిశా ప్రభుత్వం) – ఒడిశా రాష్ట్రం డ్రింక్ ఫ్రం ట్యాప్ అమలు అనుభవం పై అంశాలపై పిపిటి ద్వారా వివరించారు. మధ్యాహ్నం, జివిఎంసి ఆధ్వర్యంలో వర్క్షాప్ పాల్గొన్న వారందరికీ ఫీల్డ్ విజిట్ ఏర్పాటు ఏర్పాటు చేయడమైనది. ఈ ఫీల్డ్ విజిట్ లో మాధవధారలోని ఎస్ సి ఏ డి ఏ సిస్టమ్ సౌకర్యాన్ని, నగర తాగునీటి పర్యవేక్షణ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం గాజువాక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూ టి పి) ను సందర్శించి అమృత్ 2.0 కింద చేపట్టిన సంస్కరణలను పరిశీలించారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ జీవీఎంసీ సమావేశ మందిరంలో అందరితో సమీక్షా సమావేశం నిర్వహించి , వారికి జ్ఞాపికలను అందించారు. ఈ వర్క్షాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు డ్రింక్ ఫ్రం ట్యాప్ ప్రాజెక్ట్ల ప్రణాళిక, అమలు చర్యల్లో మరింత పురోగతిని సాధించడంలో తోడ్పడుతుందని అధికారులు తెలిపారు.