జనగాం
స్టేషన్ ఘనపూర్ పున్నమి ప్రతినిధి: *ఈ రోజు ప్రపంచ మత్స్య దినోత్సవం* సందర్బంగా రఘునాథ్ పల్లి గ్రామంలో *ముదిరాజ్ కమిటీ అధ్యక్షులు* మట్టెపల్లి బుచయ్య మాట్లాడుతూ ముదిరాజ్ కుటుంబ సభ్యులందరికి *ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు* తెలియజేస్తూ ప్రపంచ మత్స్య దినోత్సవన్ని పురస్కరించుకొని ముదిరాజ్ జెండాను ఆవిష్కరణ చెయ్యడం జరిగింది. * 🐟 *ముదిరాజులకు ఇచ్చిన అభయహస్తం హమీలు అమలు పరచండి* 🐠✊* 1.అభయహస్తం-కామరెడ్డి బిసి డిక్లరేషన్లో చెప్పిన విధంగా 42% శాతం విద్య, ఉద్యోగాలలో రేజర్వేషన్లు కల్పించాలి. పెరిగే రిజర్వేషన్లలో ముదిరాజులకు మా జనాభాకు తగట్లు మా వాటా ఇవ్వవల్సిందిగా కోరుతున్నాము. 2. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు బిసిలకు కల్పించాలి. 3. అభయహస్తంలో పేర్కొన్న హామీ ప్రకారము జి.వో. 15 తేది 19-02-2009 ముదిరాజ్/ముత్తరాసి/ తెనుగోళ్లు బి.సి. “డి” నుండి బి.సి. “ఏ” పునరుద్ధరణ చేసి తక్షణమే దానిని బి.సి. “ఏ”లో చేరడం జరగాలి. 4. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం SLC 11/10/2022 ఈ సమస్యను రాష్ట్ర కమీషన్ ద్వారా పరిష్కరించడానికి ఆదేశాలు జారీ చేసినందున తెలంగాణ బిసి కమిషన్ తగిన ఆదేశాలు జారీ చేసి పైహామీ అమలు చేయవలసిందిగా కోరుచున్నాము. 5. ముదిరాజుల అభివృద్ధి కోసం మీరు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కో-ఆపరేటివ్ సోసైటీస్ కార్పోరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసినందుకు ధన్యవాదములు, కాని దానికి 50కోట్లు మాత్రమే కేటాయించారు, మా సంఖ్య పరంగా కూడా ఆలోచించి రూ॥ 1000 కోట్ల నిధులు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. 6. GO. M.S. NO 98, 22:22-01-1964 (8), GO, M.S. NO. 74, GO. M.S. NO. 4. GO. M.S. NO.6 ລ້ຍ ప్రకారము చెరువు కుంటలపై, మత్స్య సంపదపై తెనుగు / ముత్తరాశి/ ముదిరాజ్, బెస్త, గంగపుత్ర మరియు గూండ్ల కులాలకు మాత్రమే “హక్కులు ఉండే విధముగా చట్టపరమైన ఆదేశాలు జారీ చేయవలసినదిగా కోరుతున్నాము. 7. తెలంగాణ మత్స్య అభివృద్ధి కోసం తెలంగాణ మత్స్య కోఆపరేటివ్ ఫెడరేషన్కు వెంటనే ఎన్నికలు జరిపి చైర్మన్ మరియు పాలక మండలిని నియమించాలి. గ్రామ మరియు జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి. 8.తెలంగాణ మత్స్య శాఖకు 3000 కోట్ల రూపాయలు కేటాయించి వివిధ పథకాల ద్వారా మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి. 9. మత్య్సకారుల భరోసా కార్యక్రమం ప్రారంభించి ప్రతి సొసైటీకి ఉచిత చేప పిల్లల బదులుగా నగదు బదిలీ చేయాలని కోరుతున్నాం. 10. గౌడ కులస్తులకు మరియు నేతన్నలకు 50 సంవత్సరాలకు ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్లను మత్స్యకారులకు కూడా 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా దండు ఆగయ్య,అన్నేపు అశోక్, ఉప్పలయ్య, రాజయ్య,రాజు, రమేష్, సింగరపు అశోక్,మట్టెపల్లి ఎల్లయ్య,నరేల్లి వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.