25వ జాతీయ పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్ విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్*
*25వ జాతీయ పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్ విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్* *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి* నవంబర్ 15 నుంచి 18 వరకు హైదరాబాద్ లో గచ్చిబౌలి నందు GMC బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన 25వ జాతీయ పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్ లో గెలుపొందిన విశాఖపట్నం పారా స్విమ్మింగ్ క్రీడాకారులను జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ అభినందించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ ఛాంపియన్షిప్ లో విశాఖపట్నం జిల్లాకు చెందిన క్రీడాకారులు వలసనైని రవి 100 mts Free style లో బంగారు పతకం, 50mts back stroke లో రజత పతకం, కౌశర్ సాహిల్ షేక్ 50 Mts back stroke లో స్వర్ణ పతకం, 50 mts Free style లో స్వర్ణ పతకం, 100 mts Free style లో రజత పతకం, అడారి ప్రణీత్ 50 mts back stroke లో స్వర్ణ పతకం, 100 mts Back stroke లో స్వర్ణ పతకం, 100 mts Free style లో కాంస్య పతకం, నిధి బైపోతు 100 mts back stroke లో స్వర్ణ పతకం, 50 Mts Free style లో రజత పతకం, సాలపు పూర్ణ చంద్ర రావు 100 mts Free style లో కాంస్య పతకం, 50 mts Free style లో కాంస్య పతకం, M.సాయి నిఖిల్ గౌతమ్ 100 Mts Breast Stroke లో కాంస్య పతకాలు కావ్య 50 ఫ్రీ స్టైల్ లో బంగారు పతకం సాధించారు. ఈ క్రీడాకారులను జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ నందు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని విశాఖపట్నం జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా దివ్యాంగుల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కవిత, విశాఖపట్నం జిల్లా పారా స్పోర్ట్స్ గౌరవ అధ్యక్షులు శీతల్ మదన్, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సెక్రటరీ వి.రామస్వామి, అసోసియేషన్ సభ్యురాలు లక్ష్మీ, క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.











