Thursday, 19 March 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కొత్త లేబర్ కోడ్స్ తో మరింత సమానత్వం

కొత్త లేబర్ కోడ్స్.. భారత అభివృద్ధి దిశలో మైలురాయి అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత అత్యంత కీలక మార్పులుగా ఇవి నిలుస్తాయని చెప్పారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. వీటితో ఉద్యోగుల భద్రత మరింత బలోపేతమవుతుందని, వేతనాల హామీ ఉంటుందని పేర్కొన్నారు. కార్మికుల గౌరవం, హక్కలకు ప్రాముఖ్యత లభిస్తుందని వివరించారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేక రక్షణతో పాటు మహిళలకు మరింత సమానత్వం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ చరిత్రాత్మక సంస్కరణను ఆమోదించిన ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు.

E-పేపర్

గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలో చిలకా సాయి తేజ అయ్యప్ప స్వామి పరమ భక్తుని పాదయాత్ర

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి గోపాలపురం మండలం ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలో చిలకా సాయి తేజ అయ్యప్ప స్వామి పరమ భక్తుడు ఐదు సంవత్సరాలుగా మాల ధరిస్తూ గత సంవత్సరం టూ వీలర్ పై అయ్యప్ప స్వామి శబరిమలై వెళ్లి దారిలో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ తిరిగి వచ్చాడు అదేవిధంగా ఈ సంవత్సరం పాదయాత్ర చేయాలని కోరికతో 1800 కిలోమీటర్లు శబరిమలై, కాణిపాకం, శ్రీపురం, జంబుకేశ్వరం, మొదలగు పుణ్యక్షేత్రాలు పాదయాత్ర చేసి మరలా తిరిగి స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఆ మహా భక్తుడు రాకను గ్రామస్తులు తల్లిదండ్రులు స్వాగతించారు END

ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్త టీచర్లకు సెలవుల పై ప్రభుత్వం క్లారిటీ*

*ఏపీలో కొత్త టీచర్లకు సెలవుల పై ప్రభుత్వం క్లారిటీ* అమరావతి : ఏపీలో మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన 15,941 మంది కొత్త టీచర్లకు సెలవులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 3న వీరు విధుల్లో చేరగా డిసెంబర్ వరకు వర్తించే ప్రపోర్షనేట్ సెలవులను వెల్లడించింది. 4 CL(క్యాజువల్ లీవ్), 1 OH(ఆప్షనల్ హాలిడే), 2 SPL CL(స్పెషల్ క్యాజువల్ లీవ్), మహిళలు అదనంగా ఒక స్పెషల్ CL వినియోగించు కోవచ్చని తెలిపింది.

నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా కొత్త ఎస్పీగా డా. సంగ్రామ్ సింగ్ పాటిల్ బాధ్యతలు స్వీకారం*

*నాగర్ కర్నూల్ జిల్లా కొత్త ఎస్పీగా డా. సంగ్రామ్ సింగ్ పాటిల్ బాధ్యతలు స్వీకారం* వైద్యవృత్తి నుంచి సివిల్‌ సర్వీసెస్‌ వరకు ఆయన అరుదైన ప్రయాణం నాగర్ కర్నూల్ జిల్లాకు నూతన పోలీస్ సూపరింటెండెంట్‌గా డా. సంగ్రామ్ సింగ్ పాటిల్ నియమితులయ్యారు. మహారాష్ట్రకు చెందిన ఆయన, వైద్యవిద్యలో ఉన్నత చదువులు పూర్తి చేసి సమాజానికి మరింత సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్ సర్వీసెస్‌లో అడుగుపెట్టడం ఆయన కెరీర్‌లో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. మూడో తరం వైద్యుడిగా మొదలైన ప్రయాణం మహారాష్ట్రలో జన్మించిన డా. సంగ్రామ్ సింగ్ పాటిల్ వైద్యవృత్తికి చెందిన కుటుంబంలో పెరిగారు. కుటుంబంలో మూడు తరాలుగా కొనసాగుతున్న వైద్య సేవల సంప్రదాయంతో చిన్నప్పటి నుంచి సేవాభావం పెరిగింది. ఎంబీబీఎస్ నుంచి ఢిల్లీ వైద్య సేవల వరకు 2011లో మహారాష్ట్రలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలో కొంతకాలం వైద్యుడిగా సేవలందిస్తూ సామాన్య ప్రజల ఆరోగ్య సమస్యలను సమీపంగా అర్థం చేసుకున్నారు. సమాజ సేవ కోసం సివిల్ సర్వీసెస్ IPS ఎంపిక ప్రజాసేవలో మరింత ప్రభావాన్ని చూపాలనే సంకల్పంతో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) లో ఎంపికయ్యారు.ఆదివాసీ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో తాను సంపాదించిన వైద్య జ్ఞానాన్ని ప్రజల అభ్యున్నతికి ఉపయోగించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణలో ములుగు – భూపాలపల్లి జిల్లాల్లో ప్రజాదరణ పొందిన ఎస్పీ ములుగు మరియు భూపాలపల్లి జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన సమయంలో, నేర నియంత్రణ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలు ప్రజాసేవా కార్యక్రమాలు ఆరోగ్య శిబిరాలు వంటి పలు రంగాల్లో గుర్తింపు పొందారు. ఇప్పుడేమో… నాగర్ కర్నూల్ జిల్లాకు కొత్త ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ పాటిల్ ఇప్పుడు మా నాగర్ కర్నూల్ జిల్లా కొత్త ఎస్ పి గా బాధ్యతలు స్వీకరించడంతో, జిల్లాలో శాంతి భద్రతల వ్యవస్థ, సేవా కార్యక్రమాలు మరింత బలోపేతం కావాలనే ప్రజల్లో ఆశలు పెరిగాయి. సామాజిక సేవ, వైద్య అవగాహన, ప్రజలతో సాన్నిహిత్యం—ఈ మూడు సిద్ధాంతాలతో పనిచేసే ఆయన, ఇప్పటికీ వేలాది మంది ప్రజల మనసుల్లో విశేష స్థానం సంపాదించారు..

E-పేపర్

స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక పరిణామం… గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధి విధానాలను ఖరారు చేస్తూ రేపు జీవో ఇవ్వనున్న పంచాయితీరాజ్ శాఖ

పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక పరిణామం… గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధి విధానాలను ఖరారు చేస్తూ రేపు జీవో ఇవ్వనున్న పంచాయితీరాజ్ శాఖ… రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కొత్త రిజర్వేషన్ల సిఫార్సు… డెడికేటెడ్ కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పణ… సిఫార్సుల సర్క్యులేషన్ విధానంలో కేబినెట్ ఆమోదం… మంత్రులకు ఫైల్ పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు…

అన్నమయ్య

రైల్వే కోడూరు నియోజకవర్గం – ప్రముఖ టీడీపీ నాయకుడు సయ్యద్ బాబాసాహెబ్ మృతి పట్ల సంతాపం

చిట్వేల్ నవంబర్ 21 పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ బాబాసాహెబ్ గారి మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ కాలం నుంచి ఎన్టీఆర్ నేతృత్వంలోనూ, అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలోనూ పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని నేతలు పేర్కొన్నారు.మరణవార్త తెలిసిన వెంటనే, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి శుక్రవారం బాబాసాహెబ్ కుటుంబాన్ని ప్రత్యేకంగా పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తూ, వారి బాధను పంచుకున్నారు. పార్టీ తరఫున ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రైల్వే కోడూరు అభివృద్ధికి దిశానిర్దేశం – ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో మండల నేతలతో ప్రత్యేక సమీక్షా సమావేశం

చిట్వేల్ నవంబర్ 21పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో కోడూరు మండల నాయకులు మరియు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం శుక్రవారం విజయవంతంగా జరిగింది. మండలానికి చెందిన పలు గ్రామాలు, పంచాయతీల అభివృద్ధి, ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.మండలంలోని పంచాయతీల నుంచి వచ్చిన నాయకులు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అందుబాటులో లేని మౌలిక సదుపాయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా రూపానంద రెడ్డి ,తెలియజేశారు. ప్రతి గ్రామానికి సంబంధించి సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి గారు మాట్లాడుతూ—“కోడూరు మండల నాయకులు ప్రస్తావించిన సమస్యలను సమగ్రంగా పరిశీలిస్తాం. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత. ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు అందేలా కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో రైల్వే కోడూరు అభివృద్ధి మరింత వేగవంతం కానుంది” అని పేర్కొన్నారు.ఇటీవల రైల్వే కోడూరు అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.“గౌరవ చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రైల్వే కోడూరు అభివృద్ధిలో కొత్త అధ్యాయం రాబోతోంది. పార్టీ బలోపేతంతో పాటు అభివృద్ధి పట్ల ప్రతి నేత బాధ్యతగా వ్యవహరించాలి” అని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ జయప్రకాశ్ కోడూరు మండల నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

అమరావతి

గంగపుత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది*

*గంగపుత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది* *మత్స్యకారులు–ఆక్వా ఫార్మర్లు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక* *మత్స్య ఉత్పత్తి పెంపు, ఆధునిక సాంకేతికత ప్రోత్సాహం కూట‌మి ప్రభుత్వ లక్ష్యం* *స్థిరత్వం, సమతుల్యత, నాణ్యత…నీలి విప్లవం సాధించే మార్గం* *అంతర్జాతీయ పోటీకి ఆక్వా రంగాన్ని సిద్ధం చేసే ప్రణాళికలు* *మత్స్యకారులకు, ఆక్వా ఫార్మర్లకు ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన‌ రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు* *అమ‌రావ‌తి విశాఖ పున్నమి ప్రతినిధి* ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగపుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని, గంగపుత్రుల జీవనోపాధి, వారి కుటుంబాల భద్రత కోసం కూటమి ప్రభుత్వం అచంచల కట్టుబాటుతో పనిచేస్తోందని తెలిపారు.సముద్రాలు, నదులు, చెరువులు లాంటి ప్రకృతి సంపదలపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న లక్షలాది కుటుంబాల కోసం కూట‌మి ప్రభుత్వం సంపూర్ణ కట్టుబాటుతో పనిచేస్తోంది. మత్స్య ఉత్పత్తిని అభివృద్ధి చేయడమే కాక, ఈ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించేందుకు, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. స్థిరత్వం, సమతుల్యత, నాణ్యత ఈ మూడు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టే చర్యల ద్వారానే నీలి విప్లవం నిజస్వరూపం దాల్చుతుంది. రాష్ట్రంలో ఆక్వా రంగం మరింత పురోగమించేలా, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. మత్స్యకారుల పట్ల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మాట నిలబెట్టుకుని, వేట నిషేధకాలంలో గత ప్రభుత్వం ఇచ్చిన రూ.10,000 భృతిని కూటమి ప్రభుత్వం రూ.20,000కు పెంచినట్లు తెలిపారు. *మత్స్యకారుల సేవలో* పథకం ద్వారా ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు మొత్తం రూ.259 కోట్ల ఆర్థిక లాభం కల్పించామని పేర్కొన్నారు. కేవలం వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం ఇవ్వడం మాత్రమే కాకుండా, వలసలు వెళ్లే మత్స్యకారులకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దీర్ఘ తీరరేఖ కలిగిన రాష్ట్రం కావడంతో తీరం అభివృద్ధి ద్వారా మత్స్యకార కుటుంబాలకు స్థిరమైన ఆర్థిక భద్రత కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మత్స్య పరిశ్రమ సమగ్ర అభివృద్ధే లక్ష్యమని, కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ఆక్వా రంగానికి ఊతమిచ్చే విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి గారు చెప్పారు. ఆక్వా రైతులకు విద్యుత్ టారిఫ్ తగ్గించి, రంగం అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. తీవ్ర తుఫానులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మత్స్యకారుల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం ముందస్తు చర్యలు, హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేసినట్లు తెలిపారు. మత్స్య సంపద ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను అగ్రస్థానంలో నిలబడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఇందుకు అనుగుణంగా వ్యాపార అవ‌కాశాల వృద్ధికి అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్నామ‌ని, తీర ప్రాంత ప్ర‌జ‌లు త‌మ ప‌రిధిలో వీటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అన్నారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యంపై శ్ర‌ద్ధ‌వ‌హించి, సామాజిక ఆర్థిక రంగాల‌లో ఉన్న‌తి సాధించాల‌ని కోరారు. సముద్రమే జీవనోపాధిగా చేసుకున్న గంగపుత్రుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి అభివృద్ధి, భద్రత, ఆత్మగౌరవం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు.

విశాఖపట్నం

కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్*

*కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* కుటుంబ సమేతంగా కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే దంపతులు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం కోరిన కోరికలు తీర్చే అమ్మవారిని వేడుకను ప్రారంభించడం నా పూర్వ జన్మ సుకృతం మార్గశిర మాసోత్సవాల్లో దాదాపు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం పోలి పాడ్యమి కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో అదనపు ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేసిన దేవస్థానం. ఈ నెల రోజుల పాటు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం. కనక మహాలక్ష్మి అమ్మ వారి అనుగ్రహం మన విశాఖ కు రాష్ట్రానికి ఉండాలి. రాష్ట్ర ప్రజలు సకల ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరిన ఎమ్మెల్యే. ఈరోజు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు బురుజుపేటలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మ వారి ఆలయంలో జరిగే మార్గశిర మాసోత్సవములను సాంప్రదాయపద్ధంగా ప్రారంభించారు. అమ్మవారి గర్భాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారి మండపంలో మార్గశిర మాస పూజను నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే అమ్మవారి వేడుకను ప్రారంభించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు తో పాటు అదనపు ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి , ఏఈఓ ఆనంద్ రాజేంద్ర , ఈ ఈ రమణ , ఆలయ అర్చకులు పాల్గొన్నారు….

విశాఖపట్నం

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి మహోత్సవాలు –

*ప్రశాంతినిలయం విశాఖ పున్నమి ప్రతినిధి* *భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి మహోత్సవాలు – ఆత్మనివారణ, భక్తి, శాంతి మార్గాలపై ఆత్మీయ ఆవిష్కరణలతో నిండిన ప్రేరణామయ ఉదయం* XI శ్రీ సత్య సాయి ప్రపంచ సదస్సు – 2వ రోజు ఉదయం కార్యక్రమం “వ్యక్తిని లయపరచడం – ప్రపంచ శాంతి కోసం మార్గాలు” శ్రీ సత్య సాయి బాబా వారి శతజయంతి మహోత్సవాల సందర్భంగా ప్రశాంతినిలయంలో జరుగుతున్న XI శ్రీ సత్య సాయి ప్రపంచ సదస్సు రెండో రోజు ఉదయం కార్యక్రమం ఆధ్యాత్మిక స్పూర్తితో ప్రారంభమైంది. “వ్యక్తిని లయపరచడం” (dissolving the individual )అనే అంశంతో ప్రారంభమైన ఈ సమావేశం, పరిమిత వ్యక్తిత్వాన్ని దాటి అనంత దైవిక సాన్నిధ్యాన్ని అనుభవించే పథంలో లోతైన ఆత్మచింతనను కలిగించింది. ఉదయం కార్యక్రమం వైదిక మంత్రాల గంభీరఘోషతో ప్రారంభమై సాయి కులవంత్ మందిరం పవిత్రతతో నిండిపోయింది. శ్రీ సత్య సాయి గ్లోబల్ కౌన్సిల్ (SSSGC), శ్రీ సత్య సాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల ప్రపంచ సదస్సులో 45 దేశాల నుండి 2500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. *భక్తి యొక్క గాఢత – మిస్ సరీతా అయ్యర్ ప్రసంగం* మిస్ సరీతా అయ్యర్ తన ఆధ్యాత్మిక సందేశంలో “భక్తి” యొక్క మర్మాన్ని అందంగా వివరించారు. దైవ మహిమను, దైవ కరుణను నిజంగా గుర్తించిన క్షణమే భక్తి పుడుతుందని ఆమె పేర్కొన్నారు. గజేంద్ర మోక్షం ప్రసంగంలోని అంతర్లీనార్థాన్ని వివరిస్తూ— పూర్ణ సమర్పణ, నిర్మలమైన శరణాగతి ఉన్నచోట భగవంతుడు ఎలా వెంటనే ప్రత్యక్షమై రక్షిస్తాడో అద్భుతంగా వివరించారు. ఆమె సందేశం మొత్తం సభలో ఆత్మనివేదన, భక్తి భావాలను మరింత పెంచింది. *ఆకట్టుకున్న శ్రీ సత్య సాయి గ్లోబల్ కౌన్సిల్ యంగ్ అడల్ట్స్ సంగీత సమర్పణ* తరువాత శ్రీ సత్య సాయి గ్లోబల్ కౌన్సిల్ యువత విభాగం సమర్పించిన హృదయం కదిలించే సంగీతార్పణ భక్తి వాతావరణాన్ని మరింత గాఢం చేసింది. *శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ డా. వీ. మోహన్ ప్రసంగం* శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ వీ. మోహన్ సందేశం అనంతరం, సదస్సు ప్రధాన అంశాలపై లోతైన ఆలోచనలకు ప్రేరేపించే ఆడియో-విజువల్ ప్రదర్శనను చూపించారు. పుట్టపర్తి మాత్రమే భగవాన్ వారి యొక్క జన్మభూమి అని, వారు ఇక్కడి నుంచే అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల పుట్టపర్తి కర్మభూమి గా కుడా ఎప్పటికీ విలసిల్లుతుంది అని డాక్టర్ వి మోహన్ చెప్పారు. భగవాన్ వారు సూచించిన సేవా మార్గం లో ప్రతిఒక్కరూ ఈ సందర్భంగా పునరంకితం కావాలని, అదే ప్రతి ఒక్కరూ స్వామి వారికి ఇవ్వగలిగిన పుట్టినరోజు గిఫ్ట్ గా అభివర్ణించారు. *ఈ రోజు కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులు: శ్రీ అశోక్ చవాన్, రాజ్యసభ సభ్యుడు & మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, డా. భగవత్ కరాడ్, రాజ్యసభ సభ్యుడు, శ్రీమతి సిందూరా రెడ్డి, ఎమ్మెల్యే – పుట్టపర్తి, డా. జి. గీతా రెడ్డి, తెలంగాణ మాజీ శాసన సభ్యురాలు* *ముందుగా శ్రీ ఆర్‌.జె. రత్నాకర్, మేనేజింగ్ ట్రస్టీ – శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్, విశిష్ట అతిధులందరికీ హృదయపూర్వక స్వాగతం తెలిపారు*. శ్రీ నిమిష్ పాండ్యా, (ఆల్ ఇండియా ప్రెసిడెంట్ – SSSSO & వైస్ చైర్మన్ – SSSGC) తన స్వాగత సందేశం లో ప్రశాంతినిలయం కు రావడం వల్ల, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ద్వారా సేవలో పాల్గొనడం వల్ల ప్రతిఒక్కరూ మార్పు చెంది తమ జీవితాల్ని ఉన్నతంగా తీర్చి దిద్దుకోవడానికి దోహద పడుతుందని తెలియ చేశారు. *శ్రీ అశోక్ చవాన్ తన హృదయపూర్వక అనుభవాలను పంచుకున్నారు*. తానూ పలు ఏళ్లుగా తన పదవికి సంబంధం లేకుండా, కేవలం భక్తుడిగా మాత్రమే పుట్టపర్తిని సందర్శిస్తూ వచ్చానని తెలిపారు. ఒకసారి అకస్మాత్తుగా వచ్చిన సందర్శన తనలో మరింత వినమ్రతను, భక్తిని పెంచిందని భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. తాను 55 సంవత్సరాలుగా పుట్టపర్తి వస్తున్నానని, భగవాన్ బాబా వారి ఆశీస్సులు తనకు ఎంతగానో దోహదపడ్డాయని, కాపాడాయని అయన పేర్కొన్నారు. ఇప్పటికీ బాబా వారు రక్షిస్తూనే ఉన్నారని శ్రీ ఆషా చవాన్ పేర్కొన్నారు. *మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ కీలక ప్రసంగం* ప్రశాంతినిలయంలో తొలిసారి ప్రసంగించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారు. తన కుటుంబం అనేక దశాబ్దాలుగా స్వామివారి భక్తులు అని చెప్పి, పుట్టపర్తిలో ప్రతి చోటా స్వామి ప్రేమ, దివ్యసాన్నిధ్యం వెలిసిపోతుందని హృదయపూర్వకంగా పంచుకున్నారు. స్వామివారు ప్రపంచానికి అందించిన శాశ్వత సందేశం—“Love All, Serve All” తనతో పాటు తీసుకెళ్తానని పేర్కొన్నారు. *ఒడిశా గవర్నర్ గౌరవనీయులు డా. కంభంపాటి హరి బాబు గారి ప్రసంగం* డా. హరి బాబు గారు భగవాన్‌ను మానవతా దీప్తి, నిస్వార్థ సేవకు ప్రతిరూపం అని వర్ణించారు. స్వామివారి త్రివిధ సేవా యజ్ఞాలు—శుద్ధజల ప్రాజెక్టులు,సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, విలువల ఆధారిత విద్యా వ్యవస్థ,ఇవన్నీ ప్రపంచానికి ఆదర్శ నమూనాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకలుగా ప్రకటించడాన్ని డాక్టర్ కె హరిబాబు అభినందించారు. స్వామి బోధించిన ఏకత్వం, ప్రేమ, సేవనే మనం ఆచరించడం ఆయనకు అత్యుత్తమ నైవేద్యమని పేర్కొన్నారు. *“శ్రీ సత్య సాయి జీవన ఉపాధి” కార్యక్రమ ప్రారంభం – 100 ఆటోరిక్షాల పంపిణీ* ఈ రోజు ముఖ్య విశేషంగా, కేరళ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు చేపట్టిన *“శ్రీ సత్య సాయి జీవన ఉపాధి”* కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, కేరళ రాష్ట్రానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం విశిష్ట అతిథుల హస్తాల ద్వారా జరిగి, సేవ, సాక్షాత్కార, శక్తివంతతలకు ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమం లో భాగంగా ఈ రోజు ఆర్ధికంగా వెనుకబడిన అయిదు గురికి ఆటోరిక్షాల పంపిణీ చేశారు. ఈనాటి కార్యక్రమం లో శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీలు కూడా పాల్గొన్నారు. ఈ నాటి ఉదయ కార్యక్రమం భజనలు మంగళారతి తో ముగిసాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.