Thursday, 19 March 2026

Blog

రంగారెడ్డి

* శ్రీశైలం నేషనల్ హైవేను పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : మహేశ్వరం నియోజకవర్గంలోని శ్రీశైలం హైవే రహదారిని జల్పల్లి మున్సిపాలిటీ ఎర్రకుంట వద్ద మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గతంలోనే ఈ రహదారిని నేషనల్ హైవే అథారిటీ పరిధిలోకి తీసుకుని, మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఉన్న రోడ్డును నాలుగు లైన్లుగా వెడల్పు చేయడానికి ₹80 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా చంద్రయాన్‌గుట్ట నియోజకవర్గ పరిధిలోని 1.8 కిలోమీటర్ల మిగిలి ఉన్న రహదారి ఆర్ అండ్ బీ శాఖ ద్వారా ఇంకా ₹20 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. మొత్తం ₹100 కోట్లతో చంద్రయాన్‌గుట్ట నుంచి జల్పల్లి గేట్ వరకు 5.8 కిలోమీటర్ల ఫోర్ లైన్ రోడ్డు నేషనల్ హైవే అథారిటీ నొమ్స్ ప్రకారంగా నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.రోడ్డు పనులు అధికారికంగా ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టినా, ప్రస్తుత రహదారి పరిస్థితులు దారుణంగా ఉన్నందున, రహదారిపై ఉన్న గోతులు, నీరు నిలిచే ప్రాంతాలను తక్షణమే సరిచేయాలని కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాత్కాలిక మరమ్మత్తులను వెంటనే చేపట్టి, నాణ్యతతో కూడిన శాశ్వత రహదారి పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కో-ఆప్షన్ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాలలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : మహేశ్వరం మండల పరిధిలోని రామచంద్రగూడలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంగోత్ రాజు నాయక్ సోదరుడు మోతిలాల్ నాయక్ నిర్వహించిన శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం..మరియు కందుకూరు మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి గార్డెన్ లో “ఎక్స్ రోడ్డు” సన్నిధానం గురు స్వామి రామకృష్ణ చారి గారి 18 వ మెట్టు శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు .సబితా ఇంద్రారెడ్డి అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాలలో పాల్గొన్న సబితా ఇంద్రా రెడ్డికి స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు శాలువాలు మెమొంటోలతో సత్కరించిన అయ్యప్ప స్వాములు బృందం..ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు..

రంగారెడ్డి

*హైదరాబాద్ జిల్లా మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలకు మా మహేశ్వరం భూములు ఎందుకు.! –బి ఆర్ ఎస్ , కాంగ్రెస్ ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గాన్ని మరో పాతబస్తీగా మారుస్తున్నారు – శ్రీరాములు అందెల*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మామిడిపల్లి గ్రామంలో 50 ఎకరాల భూభాగంలో హైదరాబాద్ జిల్లాకు చెందిన మైనారిటీ వెల్ఫేర్ స్కూల్ నిర్మాణం చేస్తున్నారని తెలిసి ఆ ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మొదటిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని, పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని, రంగనాయకుల స్వామి ఆలయాన్ని సందర్శించి హిందూ బంధువులు అందరితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ ఈ భూమిలో అనేక ఆలయాలకు సంబంధించిన భూములు ఉన్నాయని నియోజకవర్గ హక్కులకు సంబంధం లేని, హైదరాబాద్ జిల్లాకు చెందిన మైనారిటీ స్కూల్‌ను ఇక్కడ ఎందుకు నిర్మించాలి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వానికి చాలానే ఖాళీ స్థలాలు ఉన్నాయని అవన్నీ వదిలి మహేశ్వరంకి వచ్చి ఇక్కడ నిర్మించడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో దేవాలయ భూములను ఇండస్ట్రీలకు నిర్బంధంగా ఇచ్చేశారు; కానీ వాటికి ప్రత్యామ్నాయంగా ఒక్క గజం భూమి కూడా ఇవ్వలేదు అని గుర్తు చేశారు. సూర్యగిరి ఎల్లమ్మతల్లి ఆలయానికి ఇంతవరకు సరైన రోడ్డు సౌకర్యం లేదు, హిందువుల ఆస్తులకు రక్షణ లేకుండా పోయే పరిస్థితిని సబితా ఇంద్రారెడ్డి తెచ్చారన్నారు. “హిందూ దేవాలయ భూములను పట్టించుకోని ప్రభుత్వం, హామీ చేసిన అభివృద్ధి పనులన్నీ మధ్యలో ఆపేసి, కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసం అవసరం లేని పనులు మాత్రమే చేస్తోంది. ఇది మహేశ్వరం ప్రజలపై అన్యాయం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మైనారిటీ వెల్ఫేర్ స్కూల్ నిర్మాణాన్ని అనుమతించము. ప్రభుత్వం వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో సమావేశమై వారి అభ్యంతరాలను విన్నారు.ఇది నియోజకవర్గం గౌరవానికి, ప్రజల హక్కులకు జరిగిన దాడి. మహేశ్వరంలో హిందువుల, దేవాలయాల భూములను రక్షించడం మా బాధ్యత. ఈ విషయంపై పోరాటానికి వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు” అని స్పష్టం స్పష్టం చేసి స్థానికులకు మనోధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

* తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల కవిత *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులొ రంగారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షులు పాండురంగారెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం జనంబాట లో భాగంగా రెండు రోజులు రంగారెడ్డి జిల్లా పర్యటిస్తున్నాం. మహేశ్వరం, ఎల్ బీ నగర్, ఇబ్రహీం పట్నంలోని సమస్యలను ఇవ్వాళ తెలుసుకుంటాం. ప్రజలకు ఉన్న అనేక సమస్యలు వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై స్థానికులు, మేధావులతో చర్చిస్తున్నాం. నిన్న శేరిలింగంపల్లి నుంచి రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్ లో ఉన్న సమస్యలు తెలుసుకున్నాం. నియోజకవర్గ స్థాయిలో గతంలో ఉన్న ఆఫీస్ లు కాకుండా ఇది తొలి అడుగు. మహేశ్వరంలో జాగృతి కార్యాలయం ద్వారా ప్రజలకు మంచి జరగాలి. మహేశ్వరం అంటేనే లక్కీ అనే పేరు ఉంది. జాగృతి కి కూడా శుభం జరగాలి.మహేశ్వరంలో గతంలో ఉద్యమంలో పనిచేసిన జాగృతి కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున చేరుతూ జాగృతిని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలను నాయకులను కోరారు

రంగారెడ్డి

* మహేశ్వరం ఆర్టీసీ బస్సులో కె ఎల్ ఆర్ఉ–చిత బస్సు ప్రయాణంపై మహిళలతో ముచ్చట –రోజూ 36వేల మంది ఆడపడుచుల ప్రయాణం*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : ప్రతీ బీద కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల నెలకు దాదాపు రూ.3000 నుంచి రూ.4వేలు ఆదా అవుతుందని కిచ్చెన్న చెప్పారు.ఇవాళ మహేశ్వరం పట్టణంలో ఆర్టీసీ బస్సు ఎక్కి పలువురు మహిళా ప్రయాణికులతో లక్ష్మారెడ్డి ముచ్చటించారు. మహేశ్వరం డిపో ద్వారా ఉచితంగా 36 వేల మంది మహిళా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు స్పష్టం చేశారు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి త్వరలోనే మహేశ్వరం, కందుకూరు మండలాలకు ప్రతీ ఊరికి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితారెడ్డి సహా మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీలు, గ్రామ, బూత్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రంగారెడ్డి

* శ్రీశైలం నేషనల్ హైవేను పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : మహేశ్వరం నియోజకవర్గంలోని శ్రీశైలం హైవే రహదారిని జల్పల్లి మున్సిపాలిటీ ఎర్రకుంట వద్ద మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గతంలోనే ఈ రహదారిని నేషనల్ హైవే అథారిటీ పరిధిలోకి తీసుకుని, మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఉన్న రోడ్డును నాలుగు లైన్లుగా వెడల్పు చేయడానికి ₹80 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా చంద్రయాన్‌గుట్ట నియోజకవర్గ పరిధిలోని 1.8 కిలోమీటర్ల మిగిలి ఉన్న రహదారి ఆర్ అండ్ బీ శాఖ ద్వారా ఇంకా ₹20 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. మొత్తం ₹100 కోట్లతో చంద్రయాన్‌గుట్ట నుంచి జల్పల్లి గేట్ వరకు 5.8 కిలోమీటర్ల ఫోర్ లైన్ రోడ్డు నేషనల్ హైవే అథారిటీ నొమ్స్ ప్రకారంగా నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.రోడ్డు పనులు అధికారికంగా ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టినా, ప్రస్తుత రహదారి పరిస్థితులు దారుణంగా ఉన్నందున, రహదారిపై ఉన్న గోతులు, నీరు నిలిచే ప్రాంతాలను తక్షణమే సరిచేయాలని కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాత్కాలిక మరమ్మత్తులను వెంటనే చేపట్టి, నాణ్యతతో కూడిన శాశ్వత రహదారి పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కో-ఆప్షన్ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* నిరుపేదకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 9 వ డివిజన్ నంది హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 14 లో నివాసం ఉండే కొట్టం యాదయ్య అక్క ఆనారోగ్య గురై హాస్పిటల్ లో అడ్మిట్ కావడం జరిగింది హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితుల్లో 9 వ డివిజన్ ఇంచార్జి రామిడి నర్సిరెడ్డినీ సంప్రదించగా ఆయన కొట్టం యాదయ్య అక్క ఆనారోగ్య పరిస్థితిని మాజీ మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు సబిత ఇంద్రారెడ్డి చొరవ తో 60,000 రూపాయల CM రిలీఫ్ ఫండ్ చెక్ శాంక్షన్ చేయించి మేడం ఆదేశానుసారం శుక్రవారం బాధితులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రామిడి నర్సిరెడ్డి, మట్ట సత్యనారాయణ గౌడ్, జహంగీర్ పాల్గొనడం జరిగింది

రంగారెడ్డి

* అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాలలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : మహేశ్వరం మండల పరిధిలోని రామచంద్రగూడలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంగోత్ రాజు నాయక్ సోదరుడు మోతిలాల్ నాయక్ నిర్వహించిన శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం..మరియు కందుకూరు మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి గార్డెన్ లో “ఎక్స్ రోడ్డు” సన్నిధానం గురు స్వామి రామకృష్ణ చారి గారి 18 వ మెట్టు శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు .సబితా ఇంద్రారెడ్డి అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాలలో పాల్గొన్న సబితా ఇంద్రా రెడ్డికి స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు శాలువాలు మెమొంటోలతో సత్కరించిన అయ్యప్ప స్వాములు బృందం..ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు..

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాష్ట్రపతికి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. ఈ సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి స్వాగతం పలికారు మంత్రి నారా లోకేష్.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కొత్త లేబర్ కోడ్స్ తో మరింత సమానత్వం

కొత్త లేబర్ కోడ్స్.. భారత అభివృద్ధి దిశలో మైలురాయి అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత అత్యంత కీలక మార్పులుగా ఇవి నిలుస్తాయని చెప్పారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. వీటితో ఉద్యోగుల భద్రత మరింత బలోపేతమవుతుందని, వేతనాల హామీ ఉంటుందని పేర్కొన్నారు. కార్మికుల గౌరవం, హక్కలకు ప్రాముఖ్యత లభిస్తుందని వివరించారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేక రక్షణతో పాటు మహిళలకు మరింత సమానత్వం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ చరిత్రాత్మక సంస్కరణను ఆమోదించిన ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.