Thursday, 19 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“అండర్ పాస్ బ్రిడ్జి సాధన పోరాట కమిటీ పోరాట ఫలితం

” చింతారెడ్డి పాళెం జంక్షన్‌ వద్ద ప్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.115.27 కోట్లు మంజూరు ప్రమాదాలకు నిలయంగా మారిన నెల్లూరు జాతీయరహదారి చింతారెడ్డి పాళెం జంక్షన్‌ అంశంపై శనివారం ప్రభుత్వ శాఖల సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ సమస్యపై పలు పిటిషన్లు వచ్చిన విషయాన్ని ఎన్‌హెచ్‌ పీడీ ఎంకె చౌదరిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వివరణకోరగా, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం 115.27 కోట్లు మంజూరు చేసిందని, త్వరలోనే టెండర్లు పూర్తిచేసి ప్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారి చెప్పారు. అలాగే ప్రమాదాల నివారణకు హైవేపై బ్లింకర్లు, సోలార్‌ లైట్లు ఏర్పాటు ప్రక్రియ డిసెంబరు 25లోగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

కడప

కిడ్నాప్ కేసులో పోలీసులు హస్తం : ఎమ్మెల్యే వరద ఆగ్రహం

*కడపజిల్లా* *ప్రొద్దుటూరు* *ప్రొద్దుటూరు పోలీసుల తీరుపై ఎమ్మెల్యే వరద ఆగ్రహం* .. *స్వాత్రంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ప్రొద్దుటూరు ప్రజలకు మాత్రం స్వాతంత్రం లేదు* .. *మొన్న రాత్రి పోలీసులు బంగారు వ్యాపారిని కార్లో సీక్రెట్ గా తీసుకెళ్లారు* … *తనికంటి శ్రీనివాసులు, ఆయన తమ్ముడు వెంకటస్వామిని పోలీసులు అక్రమంగా తీసుకెళ్లారు* .. *పోలీసులు సివిల్ మాటర్ లో ఎలా వీళ్ళను తీసుకెళ్తారు* .. *ప్రొద్దుటూరు పోలీసులు 7 కోట్ల సెటిల్మెంట్ చేయాలని తనికంటి శ్రీనివాసులును ఎత్తుకెళ్లారు* .. *పోలీసులు తనికంటి శ్రీనివాసులు ఇంటికెళ్లి దౌర్జన్యంగా కోట్ల విలువ చేసే ఆస్తుల పత్రాలు,బంగారు అంగడి తాళాలు తీసుకెళ్లారు* .. *రక్షించవలసిన పోలీసులే ఇలా చేస్తే ఇక ప్రజలకు రక్షణ ఎలా ఉంటుంది* … *పోలీసులు డబ్బులు రాబట్టడం కోసం కిడ్నప్ చేయడం ఏంటి* .. *తనికంటి వెంకట స్వామిని,మనోహర్ అనే అబ్బయిని విచక్షణ రహితంగా పోలీసులు కొట్టడం అమానుషం* .. *ఉన్నతాధికారుల మెప్పుకోసం పోలీసులు ఇలా వ్యవహరించడం చట్టవ్యతిరేకమైన పనే* !! *ఒక్కరోజంతా తీసుకెళ్లిన వాళ్ళను పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం దారుణం* .. *ప్రొద్దుటూరులాంటి వ్యాపార కేంద్రంలో పోలీసులు ఇలా ప్రవర్తించడం ఏమిటి* .. *పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని,కిడ్నప్ చేసిన వారిని 48 గంటలు కావస్తోన్నా కోర్టుకు ఎందుకు హాజరుపరచలేదు* ?? *శ్రీనివాసులు భార్య శ్రీలక్ష్మి డిఎస్పీ ఆఫీస్ దగ్గర 3 గంటల సేపు ఉన్నాకుడా డీఎస్పీ కనీసం ఆమెతో మాట్లాడలేదు* .. *బ్రిటీష్ పరిపాలనే మేలు అనేలా ప్రొద్దుటూరులో పోలీసు వ్యవస్థ ఉంది* .. *అధికారం ఉందని మనుషుల్ని హించించమని పోలీసులకు చట్టం ఏమైనా ఉందా* ??? *ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తా-ఎమ్మెల్యే వరద* .. *వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళేపుడు పోలీసులు చట్టాన్ని చేతుల్లోకినంటేసుకుని వారిని కొట్టే అధికారం ఎవరిచ్చారు* … *తనికంటి శ్రీనివాసులు భార్య కామెంట్స్* .. *ప్రొద్దుటూరు ప్రముఖ బంగారు వ్యాపార వేత్త హస్తం నా భర్త కిడ్నప్ వెనక ఉంది* .. *మా ఆయన్ని పోలీసులు చంపుతామని బెదిరించారు* .. *విజయవాడ పోలీసు అధికారి వసంత్ నన్నుకుడా బెదిరించారు* .. *ప్రెస్, ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్లారు ..అని నన్ను బెదిరించారు* .. *నా* *భర్తను ఈరోజు ఉదయం 11 నుండి స్టేషన్ లో పెట్టి,కనీసం చూపించలేదు* .. *నా భర్తకు సంబంధంలేని అప్పులు మాఫీ రుద్దాలని పోలీసులు చూస్తున్నారు* .. *నా భర్తను కాపాడండి ఎమ్మెల్యే గారు..*

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ORS మార్కెట్ నుంచి తొలగించాలని రాష్ట్రాలకు FSSAI ఆదేశాలు

భారత ఆహార సురక్షా ప్రమాణాల సంస్థ (FSSAI) రాష్ట్రాలకు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ORS పేరును దుర్వినియోగం చేస్తూ పండ్ల ఆధారిత పానీయాలు, కార్బొనేటెడ్ డ్రింకులు, ఫ్లేవర్డ్ బాటిల్ వాటర్‌లను కొన్ని కంపెనీలు మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో, ఈ ఉత్పత్తులను వెంటనే మార్కెట్ నుంచి తొలగించాలని సూచించింది. ORS అనేది వైద్యపరంగా ఆమోదిత రీఫైడ్రేషన్ ద్రావణం కావడంతో దాని పేరును వాణిజ్య దుర్వినియోగం చేయడం వినియోగదారులను తప్పుదారి పట్టించే చర్యగా FSSAI పేర్కొంది. ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఈ విధమైన ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే తయారీ సంస్థలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ఆహార భద్రతా విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.

విశాఖపట్నం

జింకపిల్ల పరుగు… జూ భద్రతపై పెద్ద ప్రశ్నలు! సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రజల్లో భయం – విశాఖ జూ అధికారులపై తీవ్ర విమర్శలు

విశాఖపట్నం: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌లో భద్రతా లోపాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. ఆదివారం ఉదయం జూలోని ప్రహరీ గోడ దాటి ఒక జింకపిల్ల బహిరంగ రోడ్డుపైకి రావడం స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. జింకపిల్ల రోడ్డుపై హల్చల్ చేస్తుండగా, అటుగా వెళ్తున్న చాలామంది దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి ప్రసార మాధ్యమాలకు పంపించారు. ప్రహరీ గోడ ధ్వంసం – కంచె పగలగొట్టుకుని బహిరంగ ప్రదేశానికి జూ పరిధి కంచె పాడై ఉండటమే ఈ ఘటనకు కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జంతువులు బయటకు వస్తున్నాయన్న విమర్శలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. “జింక తప్పించుకోవడం చిన్న విషయం కాదు… అందులోనే జూ భద్రత స్థాయి బయటపడింది” సాధారణ జీవి అయిన జింక బయటకు వచ్చినా పెద్ద ప్రమాదం లేదు కానీ, ఇదే పరిస్థితి చిరుత, పులి, ఎలుగుబంటి వంటి క్రూరమృగాల విషయంలో జరుగితే ప్రజల పరిస్థితి ఏమవుతుంది? అని ప్రత్యక్ష సాక్షులు ప్రశ్నిస్తున్నారు. జూ భద్రతలో ఉన్న లోపాలు, సిబ్బంది అలక్ష్యం పర్యాటకుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి ఉందని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూ సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది జూ పరిధిలో పర్యవేక్షణ, ప్రహరీ గోడల మరమ్మతులు, జంతువుల నిరంతర పరిశీలన వంటి మూలపనులు చేయడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సంవత్సరం భారీగా నిధులు కేటాయించబడుతున్నా, భద్రతా ఏర్పాట్లు మాత్రం నీరసంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఇప్పటికైనా మేల్కొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి” జూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రహరీ గోడలు, కంచెలు, సీసీ కెమెరాలు, భద్రతా పర్యవేక్షణ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జంతువుల భద్రత మాత్రమే కాదు… ప్రజల ప్రాణాల భద్రత కూడా జూ అధికారుల బాధ్యతే!

Others

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములూ..జర జాగ్రత్త! నదీ స్నానాల్లో ముక్కులోకి నీరు పోనివ్వొద్దు

అయ్యప్ప స్వాములూ..జర జాగ్రత్త! కేరళ నదుల్లో చెరువుల్లో స్నానానికి దిగేముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి. లేదంటే అంతే సంగతులు. బ్రెయిన్‌ ఈటర్‌ అమీబా బారినపడే అవకాశం ఉంది. అది మీ బాడిలో చేరితే, బ్రెయిన్‌ ఫీవర్‌తో పరిస్థితి ప్రాణాంతకంగా మారే చాన్స్‌ ఉంది.

అన్నమయ్య

ఐఎంఏ నూతన అధ్యక్షుడు డాక్టర్ బాలరాజును సత్కరించిన శ్రీశైలం ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ సంగరాజు బాలరాజు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా,స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొని, డాక్టర్ బాలరాజును శాలువాతో సత్కరించి, స్వామివారి పవిత్ర వస్త్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య సేవల విస్తరణలో ఐఎంఏ కీలక పాత్ర పోషిస్తుందని, కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్ అగర్వాల్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి, ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు,బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రెండు వివాహ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మేడా విజయ శేఖర్ రెడ్డి

అన్నమయ్య జిల్లా రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లో శనివారం రెండు వివాహ మహోత్సవాలు సందడిగా జరిగాయి.ఈ రెండు వేడుకలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.మొదటగా రాజంపేట లోని సిటీ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో జరిగిన చమర్తి వారి పెళ్లి వేడుకలో చమర్తి నారాయణ రాజు కుమారుడు సురేష్ కుమార్ రాజు – అశ్విని దంపతులను మేడా విజయ శేఖర్ రెడ్డి ఆశీర్వదించారు.కొత్త జీవన ప్రయాణం సుఖసంతోషాలతో కొనసాగాలని వధూవరులకు మంచి మాటలతో ఆశీస్సులు అందించారు.తరువాత రాయచోటి లోని పి.డీ.ఆర్.కన్వెన్షన్ కళ్యాణ మండపంలో జరిగిన దాసరి వారి వివాహంలో దేవిక రెడ్డి – కార్తీక్ రెడ్డి వివాహానికి హాజరైన మేడా విజయ శేఖర్ రెడ్డి నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందించారు.ఈ కార్యక్రమం కూడా సందడిగా, శోభాయమానంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.రాజంపేట నుంచి రాయచోటి వరకూ జరిగిన ఈ రెండు కార్యక్రమాల్లోనూ శుభాకాంక్షల సందడి నిండిపోగా, వధూవరుల కుటుంబాలు మేడా విజయ శేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

అన్నమయ్య

నూతన వధూవరులను ఆశీర్వదించిన మేడా విజయ శేఖర్ రెడ్డి గారు

నేడు 23-11-2025వ తేదీ ఒంటిమిట్ట టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కళ్యాణ వేదికపై జరిగిన గాదె వారి పెళ్లి సందడిలో సిద్ధవటం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ ఆదినారాయణ గారి కుమార్తె”సాయి లావణ్య – వెంకట సాయి వినీత్” వివాహముకు ముఖ్యఅతిథిగా వారి వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య,మోదుగుల నరసింహులు, మామిల ఈశ్వరయ్య,రఘునాథ్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

అన్నమయ్య

పల్లె వారి పెళ్లి సన్నిధిలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేడా విజయ శేఖర్ రెడ్డి

రాజంపేటలోని కళాంజలి కళ్యాణ మండపంలో ఆదివారం నాడు జరిగిన పల్లె కుటుంబ వివాహ వేడుకలో నూతన వధూవరులకు ఆశీర్వాదాలు అందించే కార్యక్రమం ఘనంగా జరిగింది. పల్లె నాగమోహన్ కుమారుడు సాయి కృష్ణ – దేవిక దంపతుల వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.కళ్యాణ వేదికపై వధూవరులను ఆశీర్వదించిన మేడా విజయ శేఖర్ రెడ్డి, నూతన దంపతులు సుఖసంతోషాలతో కొత్త జీవన ప్రయాణాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు.కుటుంబ బాంధవ్యాలు మరింత బలపడేలా పరస్పరం ప్రేమాభిమానాలతో జీవించాలని సూచించారు. వివాహ వేడుకకు లేబక సర్పంచ్ లంకయ్య గారి నరసయ్య,పల్లె సుబ్రహ్మణ్యం, టిడిపి పార్టీ దళిత నాయకుడు సాతపల్లి వెంకీతో పాటు మోహన్,మురళి,పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు,బంధు మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

అన్నమయ్య

ఇండ్లూరు వారి పెళ్ళి సందడిలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేడా విజయ శేఖర్ రెడ్డి

టంగుటూరులోని ఇండ్లుర్ రామయ్య నివాసంలో నేడు ఆయన కుమారుడు ఇండ్లుర్ జనార్ధన్ – పల్లవి వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శుభకళ్యాణ వేదికలో వేదమంత్రాల నడుమ జరిగిన ఈ పవిత్ర వేడుకకు ప్రాంత ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి, వధూవరులను హార్దికంగా ఆశీర్వదిస్తూ వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో, విజయాలతో నిండాలని ఆకాంక్షించారు.కుటుంబ విలువలు,ఆనందం, సమైక్యత మన సంస్కృతిలోని మూలస్థంభాలని పేర్కొంటూ, ఇలాంటి పవిత్ర వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషకరమని తెలిపారు. కార్యక్రమంలో లేబక సర్పంచ్ లంకయ్య గారి నరసయ్య, గుజ్జల ఈశ్వరయ్య, టంగుటూరు టీడీపీ సీనియర్ నాయకులు కొండయ్య, టీడీపీ దళిత యువ నాయకుడు సాతపల్లి వెంకీ, టీడీపీ నాయకులు మునగ హరి తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ ప్రజలు, కార్యకర్తలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వివాహ వేడుకను పురస్కరించుకున్నారు. వివాహ వేదికలో సంగీతం, మంగళవాయిద్యాలు, సంప్రదాయ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తం కార్యక్రమం కుటుంబ సభ్యుల శ్రద్ధాకార్యాచరణలతో విజయవంతంగా ముగిసింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.