Wednesday, 18 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో ఏపీ హంస జిల్లా కార్యవర్గ సమావేశం – కో–ఆప్షన్ ఎన్నికల ద్వారా కొత్త బాధ్యుల ఎంపిక

28.11.2025 నెల్లూరు యుటిఎఫ్ ఆఫీస్, అన్నమయ్య సర్కిల్ నందు ఏపీ హంస జిల్లా కార్యవర్గ సమావేశం సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి తాలూకా వింజమూరు తాలూకా కావలి తాలూకా బుచ్చిరెడ్డిపాలెం తాలూకా కార్యవర్గాల్లో ఏర్పడిన ఖాళీల్లో కో ఆప్షన్ ద్వారా ఏకగ్రీవ ఎన్నిక నిర్వహించడం జరిగింది, ఈ ఎలక్షన్ ప్రొసీజర్ ను జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కప్పా నారాయణరాజు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ జలీల్ అహ్మద్ , జిల్లా పబ్లిసిటీ సెక్రటరీ మజార్, సిటీ అధ్యక్షులు గౌస్ బాషా సిటీ సెక్రెటరీ మంజరి, రూరల్ తాలూకా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి సిటీ సెక్రెటరీ సుజాత, కోవూరు తాలూకా అధ్యక్షులు ఉమా ఎలక్షన్ ఆఫీసర్స్ గా వ్యవహరించి నిర్వహించారు. ఉదయగిరి తాలూకా ప్రెసిడెంట్ షేక్ గాజుల నౌషాద్ బాబు, తాలూకా సెక్రెటరీ షేక్ కాజా మొహిద్దిన్, మహిళా వింగ్ సెక్రెటరీ ఎం చంద్రావతి, వైస్ ప్రెసిడెంట్స్ షేక్ రబ్బానీ భాషా ఎం లావణ్య జాయింట్ సెక్రటరీలు జై శైలజ కె జయమ్మ, అదేవిధంగా వింజమూరు తాలూకా వైస్ ప్రెసిడెంట్స్ గా వి. ఝాన్సీ రాణి డి. శ్రీవిద్య మహిళా వింగ్ సెక్రెటరీ ఎం సుహాసిని జాయింట్ సెక్రటరీలు డి కృష్ణవేణి, పి. రమణమ్మ, మంజులవాణి బుచ్చిరెడ్డిపాలెం తాలూకా ఆరోగ్యమేరి ట్రెజరర్, సుకన్య వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రెటరీలు వాణి, అరుణ కావలి తాలూకా షేక్ నూర్ భాషా ట్రెజరర్, ఎస్ భార్గవి వైస్ ప్రెసిడెంట్ , పి.శాంత కుమారి జాయింట్ సెక్రెటరీ తదితరులును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంను ఉద్దేశించి ఎపి హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు మాట్లాడుతూ వైద్య మరియు ఆరోగ్య శాఖలో తొలగించబడిన హెల్త్ అసిస్టెంట్స్ లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు తీర్పు ఇచ్చిన సందర్భంగా త్వరితగతిన వారిని విధుల్లో కి తీసుకోవాలని, తొలగించిన టైంలో మృతి చెందిన హెల్త్ అసిస్టెంట్ల కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏఎన్ఎంలకు పెంచిన యాప్లు తగ్గించాలని, 25 సంవత్సరాలు పైబడి సర్వీస్ చేసిన ఏఎన్ఎం లకు పదోన్నతులు లేని పరిస్థితి ఉందని, కొంతమంది పదోన్నతి లేకుండానే రిటైర్మెంట్ అవ్వడం జరుగుతుందని, పదోన్నతుల్లో జాప్యం జరగకుండా ఉన్నతాధికారుల చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుచ్చి తాలూకా ప్రెసిడెంట్ సరస్వతి కావలి తాలూకా సెక్రెటరీ లక్ష్మి నరసయ్య పలు తాలూకాలు నాయకులు అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు

వనపర్తి

ఘనంగా జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్ గారు

*వనపర్తి జిల్లా జిల్లాస్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన* *ఘనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్* పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 28 11 2025 2025-2026 వనపర్తి జిల్లా చిట్యాల గురుకుల పాఠశాలలో గౌరవ కలెక్టర్ ఆదర్శ్ సురభి గారి అధ్యక్షతన , గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని సార్ గారి ఆధ్వర్యంలో, డీఎస్ఓ శ్రీనివాసులు సార్ పర్యవేక్షణలో చిట్యాల గురుకుల పాఠశాలలో ఈరోజు జిల్లాస్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన నవంబర్ 28, 29, 30 మూడు రోజులు జిల్లా స్థాయిలోన నేడు జరుగుతున్నది,జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారి శాస్త్ర విజ్ఞాన ప్రయోగాలను చిట్యాల గురుకుల పాఠశాలలోన ప్రదర్శించడం జరుగుతుంది, ఈ సందర్భంగా వనపర్తి జిల్లా గౌరవ కలెక్టర్ ఆదర్శ్ సురభి గారు మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞాన ప్రయోగాలు విద్యార్థులలో సృజనాత్మకతకు నిదర్శనం అన్నారు, శాస్త్ర విజ్ఞానపు ప్రయోగాలు సత్యం అన్నారు, ఈ కార్యక్రమంలో సూపర్ విజన్ కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీ, స్టేజ్ కమిటీ, కల్చరల్ కమిటీ, ఫుడ్ కమిటీ, ప్రెస్ కమిటీ చైర్మన్లు గా గజిటెడ్ ప్రధానోపాధ్యాయులను నియమించడం జరిగింది, ఈరోజు జిల్లాస్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వనపర్తి ఎమ్మార్వో రమేష్ రెడ్డి గారు, జిల్లా అన్ని ఉపాధ్యాయ సంఘాలు, పత్రికా విలేఖరులు పాల్గొనడం జరిగింది. ప్రెస్ కమిటీ,ఎం ఎన్ విజయకుమార్, బి.గిరిరాజాచారి.

అన్నమయ్య

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అత్తింజేరి శ్రీనాథ్ దరఖాస్తు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏఐసీసీ చేపట్టిన “సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమం నేపథ్యంలో, జిల్లాలో సంస్ధాగత బలోపేతానికి చేపట్టిన చర్యలలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి అత్తింజేరి శ్రీనాథ్ ఇవాళ తన దరఖాస్తును సమర్పించారు. రాజంపేటకు వచ్చిన ఏఐసీసీ అబ్జర్వర్ కే. మహేంద్రన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఈ దరఖాస్తును అందజేశారు.ఈ సందర్భంగా పిసీసీ కార్యవర్గ సభ్యులు అత్తింజేరి శ్రీనాథ్ మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ కోసం గత ఎన్నాళ్లుగానో నిరంతర కృషితో,నిబద్ధతతో పనిచేసిన అనుభవాన్ని వివరించారు.గ్రామ,వార్డు, బూత్ స్థాయిల్లో కాంగ్రెస్ కార్యకర్తలను చైతన్యపరచడం,యువతను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చే దిశగా పనిచేస్తానని తెలిపారు.ప్రజల సమస్యలు, సంక్షేమ అంశాలపై తరచూ వినతిపత్రాలు సమర్పించడం, ప్రెస్ మీట్లు నిర్వహించడం, ప్రభుత్వంపై పోరాటాలు చేయడం వంటి చర్యలతో పార్టీకి ప్రజల్లో తిరిగి నమ్మకం తెచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మళ్లీ బలోపేతం చేయడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు చెప్పారు.మహిళలు, యువత, అణగారిన వర్గాలు, సీనియర్ నాయకులు అంతా కలిసి ముందుకు సాగేలా సమన్వయం చేయడం తన ప్రధాన లక్ష్యమని శ్రీనాథ్ వెల్లడించారు.గతంలో పార్టీ పటిష్టంగా నిలబడిన రోజుల్లో పనిచేసిన కార్యకర్తలను తిరిగి ఒకే వేదికపైకి తీసుకురావడం, బూత్ కమిటీలను పునర్నిర్మించడం,గ్రామ స్థాయిలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా శ్రమిస్తానని పేర్కొన్నారు.చివరిగా, “కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తాను. అయితే జిల్లా కాంగ్రెస్ పునర్నిర్మాణానికి నా సేవలను వినియోగించే అవకాశాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను” అని అత్తింజేరి శ్రీనాథ్ వినయపూర్వకంగా కోరారు. బి

తెలంగాణ

భారతీయ కళ మహోత్సవ్ కు జిల్లా నుండి వెళ్లిన మహిళా సంఘం అధ్యక్షులు

నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) శుక్రవారం నల్గొండ జిల్లా నుండి సికింద్రాబాద్ ( బొల్లారంలో) రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవం కు జిల్లా నుండి వెళుతున్న స్వయం సహాయక మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల ప్రత్యేక బస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ కార్యాలయం వద్ద జండా ఊపి ప్రారంభించి, మహిళా సంఘాల సభ్యులు నూతన ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించి ఆర్థికంగా మరింత ముందుకు ఎదగాలని కలెక్టర్ అన్నారు.

కడప

ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ తిని విద్యార్థులకు అస్వస్థత

కడప జిల్లా పొద్దుటూరు మండలం వసంతపేట హైస్కూల్లో మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ తిని ఆరవ తరగతికి చెందిన పదిమంది విద్యార్థిని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు అన్నం పప్పు తిన్న వెంటనే కడుపునొప్పి రావడంతో వారందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా గదిలో నిర్బంధించి డాక్టర్ను పిలిపించి అక్కడే వైద్యం చేయించేందుకు ఉపక్రమించిన హెడ్మాస్టర్ విషయం బయటికి బొక్కడంతో వారందరినీ పెద్ద ఆస్పత్రికి తరలించిన హెడ్మాస్టర్ గుర్రప్ప

కామారెడ్డి

గంగమ్మ వాగు వంతెన ఆకస్మిక తనిఖీ: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చర్యలకు ఆదేశాలు

కామారెడ్డి, 28 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం గంగమ్మ బ్రిడ్జిపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ఆకస్మి కంగా సందర్శన నిర్వహించారు. కెలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కార్యక్రమ ప్రాధాన్యతను స్పష్టం చేస్తూ, త్వరిత చర్యల కోసం సంబంధిత శాఖల ప్రధానుల కు మార్గదర్శకత్వం ఇచ్చారు.వంతెనకు చేరే రహ దారి భాగంలో ఏర్పడిన గుంతను ఆయన పరిశీ లించి,అక్కడి పరిస్థితిని అధికారులతో సమీక్షిం చారు.వంతెన, రహదారి భద్రతపై కలెక్టర్ ఆందో ళన వ్యక్తం చేసి, తక్షణమే మరమ్మతులు జరగాల ని ఆదేశాలు జారీ చేశారు.రహదారి ప్రయాణంలో ఎలాంటి కష్టం లేకుండా త్వరగా పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగవలెని సూచించారు.ఈ సంద ర్శన సమయంలో ఆర్ అండ్ బి విభాగం ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ పి. మోహన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. రవితేజ, రామారెడ్డి మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ) సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

హెల్త్ టిప్స్

మానవ శరీరం – అద్భుత శక్తులు & షాకింగ్ నిజాలు!

మన శరీరం ఒక జీవంత సూపర్ మెషిన్! గుండె, మెదడు, నరాల వ్యవస్థ – అన్నీ కలిసి అద్భుతమైన పనితీరును చూపిస్తున్నాయి. ఈ వీడియోలో తెలుసుకోండి👇 💓 గుండె ఒక రోజులో ట్రక్కును 32 కి.మీ. నడిపించగల శక్తిని ఉత్పత్తి చేస్తుందని 🧠 మెదడుకు నొప్పి గ్రాహకాలు లేవు – అందుకే నొప్పి అనిపించదని ⚡ మెదడు సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుందని 👀 మనం చూసే దృశ్యాలలో 90% ను మెదడే సృష్టిస్తుందని 🔋 గుండె, మెదడు సహజంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయని ఇవి వింటే ఆశ్చర్యమే కాదు… గర్వంతో తలెత్తిపోతాం! Video: https://youtu.be/zW2pHRGYlnE?si=CUrsuR-Ir45dS3LX

కామారెడ్డి

ల్యాగల మహిపాల్… రామారెడ్డి ప్రజల ప్రేరణా స్తంభం!

కామారెడ్డి 28, నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : ల్యాగల మహిపాల్… రామారెడ్డి ప్రజల ప్రేరణా స్తంభం! రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సంస్కర ణాత్మక ఆత్మతో, ల్యాగల మహిపాల్ గ్రామ దుర్మా ర్గాలను తొలగించి అభివృద్ధి తీసుకువస్తానని శపతం చేశారు. సతీసహగమనాన్ని ధిక్కరించిన మహానుభావుడి మార్గంలో నడుస్తూ, రామారెడ్డి ప్రజలకు కొత్త ఆశలు పెంపొందిస్తానని అన్నారు. ఆశలు కలిపి, కలలు నెరవేర్చే సేవకుడు!వితంతు స్త్రీ విద్యకు పోరాడిన ఆదర్శాలతో, యువతకు ఉపాధి, పొలాలకు సంపద కల్పిస్తాను అంటూ ల్యాగల మహిపాల్ హృదయపూర్వక వాగ్దానం చేస్తున్నాడు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి,మార్పు చూపిస్తాను! పాలకుడు కాదు, ప్రజల సేవకుడు… ల్యాగల మహిపాల్ మా ఆశయ ప్రతీక!బ్రహ్మసమా జ్ స్థాపకుడిలా సమాజాన్ని ఏకం చేసి, గ్రామాన్ని ముందుకు నడిపిస్తాడు. మీ ఓటే నా బలం, రామా రెడ్డి భవిష్యత్తు మీ చేతుల్లో! తెలంగాణ మట్టిమా ట! రామ్మోహన్ రాయ్ ఆదర్శా లతో కూడిన ఈ సేవా హృదయం, ప్రతి ఇంటి ముందు నిలబడి మీ కష్టాలు తీర్చుతుందని అన్నా రు. ల్యాయల్ మహిపాల్‌కు ఓటు వేయండి, అభివృద్ధి వెలుగొందుతాదని చెప్పారు.

జోగులాంబ గద్వాల

బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా ఫూలే వర్ధంతి. దేశంలో విద్య వ్యాప్తికి కృషి చేసిన మహాత్ముడు ఫూలే.

బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా ఫూలే వర్ధంతి. దేశంలో విద్య వ్యాప్తికి కృషి చేసిన మహాత్ముడు ఫూలే. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు* జోగులాంబ నవంబర్28 పున్నమి ప్రతినిధి ( ఎర్రవల్లి) – దేశంలో విద్య వ్యాప్తి కృషి చేసిన బహుజన యోధుడు మహాత్మా జ్యోతి రావు ఫూలే అని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు అన్నారు. శుక్రవారం ఎర్రవల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ధర్మవరం రాముడు ఏర్పాటు చేసిన ఫూలే వర్ధంతి కార్యక్రమంకు ఆయన హాజరైయారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మహాత్మా జోతిరావు ఫూలే భారత సామాజిక ఉద్యమాల పితామహుడు అన్నారు.భారతీయ సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య, మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరంగా పోరాడిన మహానుభావుల్లో మహాత్మా జోతిరావు గోవిందరావు ఫూలే (11 ఏప్రిల్ 1827 – 28 నవంబర్ 1890) ప్రత్యేక స్థానం పొందారు. అణచివేతకు గురైన వర్గాలు, మహిళలు, శూద్ర–అతిశూద్రుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు భారత చరిత్రలో సామాజిక పునర్‌వ్యవస్థీకరణకు బలమైన పునాది వేశారు.అణగారిన వర్గాల విద్యోద్యమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఫూలే అని అన్నారు. 1848లో జోతిరావు ఫూలే, తన జీవిత భాగస్వామి సావిత్రిబాయి ఫూలేతో కలిసి పూణెలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు. భారతదేశంలో మహిళలకు విద్యా హక్కుతో కూడిన ప్రాయోగిక ఉద్యమం ఇదే మొదటిసారి.తరువాత శూద్రులు, అతిశూద్రులు, కార్మికుల పిల్లల కోసం పలు పాఠశాలలు, రాత్రి బడులు, వితంతు శరణాలయాలు వంటి కార్యక్రమాలు చేపట్టారు. భారత మహిళా విద్యా చరిత్రలో సావిత్రిబాయి–జోతిరావు ఫూలే దంపతులను అగ్రగాములుగా నిలిపిన ఘనత ఇది.సత్యశోధక్ సమాజ్ – సమానత్వ దిక్సూచి అన్నారు.1873లో ఫూలే ‘సత్యశోధక్ సమాజ్’ను స్థాపించారు. జన్మ ఆధారంగా ఉన్న అసమానతలను ప్రశ్నించిందన్నారు. సామాజిక న్యాయ భావజాలాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిందన్నారు.కులపరమైన వివాహాల్లో పురోహితాధారిత నియమాలను సవాలు చేసిందన్నారు.1880లో బొంబాయి హైకోర్టు సత్యశోధక్ సమాజ్ పద్ధతిలో జరిగిన వివాహాలు చట్టబద్ధమని తీర్పు ఇవ్వడం ఫూలే ఉద్యమ విజయానికి చిహ్నం అన్నారు.సామాజిక దోపిడీపై ధైర్యవంతమైన ప్రతిఘటన.ఫూలే సమాజంలో వ్యాప్తి చెందిన వర్ణవ్యవస్థ, అస్పృశ్యత, మహిళల అణచివేత వంటి సమస్యలను తన రచనలు, ప్రసంగాల ద్వారా బహిరంగంగా విమర్శించారు. ఆయన రచించిన ‘గులాం గిరి’, ‘శేతి ఆనీ కమటి’ వంటి గ్రంథాలు భారత సామాజిక మేలుకోసం ఇప్పటికీ మార్గదర్శకాలు పేర్కొన్నారు.విద్యేనే మనిషిని స్వతంత్రుడిని చేస్తుంది’’ అనేది ఫూలే మాటల్లోని ముఖ్య సారాంశం అన్నారు. డా. బి.ఆర్. అంబేడ్కర్ స్వయంగా జోతిరావు ఫూలేను తన గురువులలో ఒకరిగా పేర్కొన్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ రచించిన ‘శూద్రులు ఎవరు?’ గ్రంథాన్ని ఫూలేకు అంకితం చేయడం ఈ బంధాన్ని మరింత స్పష్టంగా చూపుతుందన్నారు.ఫూలే ఉద్యమం భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆలోచనలకు సామాజిక పునాది వేసిందన్నారు.1888లో బొంబాయిలోని మాండ్వీ ప్రాంతంలో జరిగిన ప్రజాసభలో జోతిరావు ఫూలేకు “మహాత్మా” బిరుదును ప్రజలే ప్రకటించారు. ఇది ఆయన చేసిన సేవలకు సమాజం ఇచ్చిన అత్యున్నత గుర్తింపు అని గుర్తు చేశారు. కార్యక్రమంలో దేవన్న, బుడ్డన్న, నారాయణ, బీమన్న, మోషన్న, నిశిత్, హుస్సేన్, వడ్డే కృష్ణ ఇతరులు పాల్గొన్నారు.

E-పేపర్

జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన వైసీపీ నాయకులు

కోడూరు టౌన్ మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన కోడూరు పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు ,రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర. రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి నంద బాల ,ఎస్ రాజగోపాల్. పుష్పలత ఆంజనేయులు. బండారు మల్లికార్జున ఎంపీటీసీ సభ్యులు. కే ప్రసాద్ కే శంకరయ్య.ఈ చైతన్య. పి సుబ్బరాయుడు. లక్ష్మయ్య సాయి, పురుషోత్తం మొదలగువారు నివాళులర్పించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.