నెల్లూరులో ఏపీ హంస జిల్లా కార్యవర్గ సమావేశం – కో–ఆప్షన్ ఎన్నికల ద్వారా కొత్త బాధ్యుల ఎంపిక
28.11.2025 నెల్లూరు యుటిఎఫ్ ఆఫీస్, అన్నమయ్య సర్కిల్ నందు ఏపీ హంస జిల్లా కార్యవర్గ సమావేశం సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి తాలూకా వింజమూరు తాలూకా కావలి తాలూకా బుచ్చిరెడ్డిపాలెం తాలూకా కార్యవర్గాల్లో ఏర్పడిన ఖాళీల్లో కో ఆప్షన్ ద్వారా ఏకగ్రీవ ఎన్నిక నిర్వహించడం జరిగింది, ఈ ఎలక్షన్ ప్రొసీజర్ ను జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కప్పా నారాయణరాజు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ జలీల్ అహ్మద్ , జిల్లా పబ్లిసిటీ సెక్రటరీ మజార్, సిటీ అధ్యక్షులు గౌస్ బాషా సిటీ సెక్రెటరీ మంజరి, రూరల్ తాలూకా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి సిటీ సెక్రెటరీ సుజాత, కోవూరు తాలూకా అధ్యక్షులు ఉమా ఎలక్షన్ ఆఫీసర్స్ గా వ్యవహరించి నిర్వహించారు. ఉదయగిరి తాలూకా ప్రెసిడెంట్ షేక్ గాజుల నౌషాద్ బాబు, తాలూకా సెక్రెటరీ షేక్ కాజా మొహిద్దిన్, మహిళా వింగ్ సెక్రెటరీ ఎం చంద్రావతి, వైస్ ప్రెసిడెంట్స్ షేక్ రబ్బానీ భాషా ఎం లావణ్య జాయింట్ సెక్రటరీలు జై శైలజ కె జయమ్మ, అదేవిధంగా వింజమూరు తాలూకా వైస్ ప్రెసిడెంట్స్ గా వి. ఝాన్సీ రాణి డి. శ్రీవిద్య మహిళా వింగ్ సెక్రెటరీ ఎం సుహాసిని జాయింట్ సెక్రటరీలు డి కృష్ణవేణి, పి. రమణమ్మ, మంజులవాణి బుచ్చిరెడ్డిపాలెం తాలూకా ఆరోగ్యమేరి ట్రెజరర్, సుకన్య వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రెటరీలు వాణి, అరుణ కావలి తాలూకా షేక్ నూర్ భాషా ట్రెజరర్, ఎస్ భార్గవి వైస్ ప్రెసిడెంట్ , పి.శాంత కుమారి జాయింట్ సెక్రెటరీ తదితరులును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంను ఉద్దేశించి ఎపి హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు మాట్లాడుతూ వైద్య మరియు ఆరోగ్య శాఖలో తొలగించబడిన హెల్త్ అసిస్టెంట్స్ లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు తీర్పు ఇచ్చిన సందర్భంగా త్వరితగతిన వారిని విధుల్లో కి తీసుకోవాలని, తొలగించిన టైంలో మృతి చెందిన హెల్త్ అసిస్టెంట్ల కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏఎన్ఎంలకు పెంచిన యాప్లు తగ్గించాలని, 25 సంవత్సరాలు పైబడి సర్వీస్ చేసిన ఏఎన్ఎం లకు పదోన్నతులు లేని పరిస్థితి ఉందని, కొంతమంది పదోన్నతి లేకుండానే రిటైర్మెంట్ అవ్వడం జరుగుతుందని, పదోన్నతుల్లో జాప్యం జరగకుండా ఉన్నతాధికారుల చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుచ్చి తాలూకా ప్రెసిడెంట్ సరస్వతి కావలి తాలూకా సెక్రెటరీ లక్ష్మి నరసయ్య పలు తాలూకాలు నాయకులు అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు










