అన్నమయ్య
నందలూరు మండలం అరవపల్లి గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన హజరత్ ఖాదర్ వల్లి దర్గా ఉరుస్ మహోత్సవాలు భక్తులు,ప్రజలు,నాయకుల సందడితో కిక్కిరిసిపోయాయి.ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి హాజరై దర్గా పెద్దల ఆశీస్సులు పొందారు.ఆర్.అండ్.బి బంగ్లా నుండి దర్గా వరకు భారీ బాణాసంచా,బ్యాండ్ బాజాలు, మేళతాళాలతో కమిటీ సభ్యులు,గ్రామ యువత అయినను ఘన స్వాగతం పలికారు.దర్గా కమిటీ ఆయనకు శాలువాతో సత్కారం నిర్వహించగా, గురువులయ్య చేత ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసర సమయంలో అందరికీ అండగా ఉండడమే తన ధ్యేయమని తెలిపారు.ఎన్నడూ లేనివిధంగా వేలాదిమంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి రావడం ఈ ఉరుస్ మహోత్సవ వైభవాన్ని సూచిస్తుందన్నారు. మతసామరస్యానికి ఈ దర్గా ప్రతీకగా నిలుస్తుందని,ప్రతీ ఏడాది గ్రామ ప్రజలు,దర్గా పెద్దలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ ఉరుసును నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ప్రతి కార్యక్రమానికి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ,వక్ఫ్ బోర్డు మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తాటి సుబ్బరాయుడు,రాజంపేట తెలుగు యువత పార్లమెంటు ఉపాధ్యక్షుడు కొండిశెట్టి సుదర్శన్,నందలూరు సర్పంచ్ రాము,నారపు శెట్టి శివ,టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్, తుమ్మది శివకుమార్,పొంబల నరసింహులు,వ్యాపారవేత్త దార్ల సురేష్,సీనియర్ నాయకులు హరిబాబు,బిజెపి రాష్ట్ర నాయకులు హిమగిరి నాథ్,టిడిపి మైనార్టీ నాయకులు షేక్ మౌలా,షేక్ మొహమ్మద్,రాజంపేట టీడీపీ ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా,ఉప్పుశెట్టి రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.ఉరుస్ మహోత్సవం మొత్తం ప్రాంతంలో పండుగ వాతావరణాన్ని నెలకొలిపింది.