Wednesday, 18 March 2026

Blog

తూర్పు గోదావరి

దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వీల్ చైర్స్ పంపిణీ..

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు లో దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయ సహకారములతో కొవ్వూరు లో 80శాతం శరీరం చచ్చుపడిపోయి, నడవలేక పోతున్న రుద్ర వేణి అనే అమ్మాయి కి వీల్ ఛైర్ అందించడం జరిగింది..ఈ కార్యక్రమంలో దేవోక్తి ఛారిటబుల్ సంస్థ చైర్మన్ ప్రత్తి పాటి నాగరాజు, సభ్యులు జోడాల వెంకట్, వీ.టి విల్సన్ రాజు మరియు వై . కే. శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ప్రత్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ఆపన్నులకు అవసరమైన సహాయ సహకారములు అందించడానికి దేవోక్తి ఛారిటబుల్ సంస్థ ఎప్పుడూ సన్నద్ధమేనని, ఇప్పటివరకూ 250 మందికి ఆర్టిఫిషియల్ లింబ్స్ ఉచితంగా అందించడం జరిగిందన్నారు..కుత్రిమ అవయవాలు కావలసినవారు తమ సంస్థను సంప్రదించిన వారికి 9391089381 ఉచితముగా అందించడం జరుగుతుంది..

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల NSS ప్రత్యేక శిబిరం ముగింపు….

కంకిపాడు ,పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ యూనిట్స్ -1,2 29-11 -2025 వ తేదీన పునాదిపాడు గ్రామంలో అను మై బేబీ హాస్పిటల్, విజయవాడ. గైనిక్ -డాక్టర్. ఎన్. మౌనిక మరియు pediatrician డాక్టర్ రేవంత్ . స్త్రీలకు సంబంధించిన పాప్స్ మేయర్ టెస్టులు ,గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, క్యాన్సర్ అవేర్నెస్ మీద అవగాహన కల్పించే విధంగా ర్యాలీని,క్లీన్ అండ్ గ్రీన్, సానిటరీ న్స్ అవగాహన కల్పించేలా చెప్పడం, Menstrual Hygien మీద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పునాదిపాడు హైస్కూల్లో విద్యార్థినీ విద్యార్థులకు ఆరోగ్యం పట్ల, పరిశుభ్రత పట్ల, అవగాహన కల్పించేలా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ .కె.సరళ శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

జోగులాంబ గద్వాల

గద్వాల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ జోరు ఏకగ్రీవలతో ఫుల్ జోష్ తో ఉన్న గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్లు

గద్వాల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ జోరు ఏకగ్రీవలతో ఫుల్ జోష్ తో ఉన్న గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్లు రోజు రోజుకు జిల్లాలో BRS పార్టీ ఉనికి కోల్పోతున్న పరిస్థితి పోటీ చేయడానికి అభ్యర్థులు లేక అల్లాడి పోతున్న BRS పార్టీ…పోటీ చేసే అభ్యర్థుల కోసం వెతుకులాట మండల స్థాయి లీడర్లు పట్టించుకోకపోవడంతో కార్యకర్తలలో గందరగోళం పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా అధిష్టానం స్పందించి గద్వాల్ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు

జోగులాంబ గద్వాల

నడిగడ్డలో గ్రామ సర్పంచు పదవులను డబ్బు వేలంతో బలవంతపు ఏకగ్రీవాల మీద చర్యలు తీసుకోవాలి… కలెక్టర్ కి ఫిర్యాదు

గద్వాల నవంబర్ 29 (పున్నమి ప్రతినిధి) నడిగడ్డలో గ్రామ సర్పంచు పదవులను డబ్బు వేలంతో బలవంతపు ఏకగ్రీవాల మీద చర్యలు తీసుకోవాలి… కలెక్టర్ కి ఫిర్యాదు నామినేషన్లు వేయనివ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నా వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి ఓటర్లకు డబ్బు,మద్యం, మాంసం పంపిణీ జరగకుండ, మద్యం పూర్తిగా ఎలక్షన్లు అయిపోయే వరకు బంద్ చేయాలి జిల్లా కలెక్టర్ సంతోష్ గారికి వినతిపత్రం అందజేత.. .భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్ మాచర్ల ప్రకాష్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షుడు ఎదుల నాగరాజు ✍️ జోగులంబ గద్వాల జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో గ్రామ సర్పంచ్ పదవులను వేలం పాట పాడి డబ్బుతో కొనుగోలు చేసి ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని , ప్రజా స్వామ్యాన్ని ఎన్నికలను ఉల్లంఘనకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా నామినేషన్ వేసే యువతను బెదిరింపులకు పాల్పడే వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలనీ ఈరోజు గద్వాల జిల్లా కలెక్టర్ బీ,ఎం సంతోష్ గారికీ భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇంచార్జ్ మాచర్ల ప్రకాష్ గారు మరియు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షులు ఏదుల నాగరాజు కలిసి వినతిపత్రం అందజేశారు గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా ప్రజాస్వామ్య బద్దంగా జరిగే విధంగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని గ్రామాలలో డబ్బు మద్యం పంపిణీ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఓటర్లకు డబ్బు, మద్యం, మాంసం పంపిణీ కాకుండా చూడాలని అదేవిధంగా ఎన్నికలు పూర్తి అయ్యేవరకు మద్యాన్ని బందు చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ గారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య, యేసు, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు

ఎన్ టి ఆర్ జిల్లా

*పేదల పాలిట ఆపద్బాండవం సీఎం సహాయ నిధి* *నందిగామలో 67 మందికి రూ.34.34 లక్షల చెక్కుల పంపిణీ*

నందిగామ ఆర్థిక సంక్షోభం నడుమ కూడా పేదల కోసం అనుక్షణం స్పందిస్తున్న కూటమి ప్రభుత్వం—సీఎం సహాయ నిధి ద్వారా ప్రజలకు అండగా నిలుస్తోంది. గత ఏడాదిన్నర కాలంలోనే రూ.3.5 కోట్ల సహాయాన్ని లబ్ధిదారులకు అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో శనివారం నందిగామ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మొత్తం 67 మందిలబ్ధిదారులకు రూ.34,34,792 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ— “ప్రభుత్వం పేదల పక్షాన కట్టుబడి ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అవసరమైన ప్రతి చోట సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తాం” అని పేర్కొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఈ సహాయంతో ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే సౌమ్యకు కృతజ్ఞతలుతెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నాయకులు, సహకార సంఘాల చైర్మన్లు, స్థానికప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల IQAC కమిటీ…. Faculty development program….

ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ (IQAC) 20/11/2025న “R ప్రోగ్రామింగ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ డేటా సైన్స్ అండ్ రీసెర్చ్” అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. ఈ సెషన్‌లో అధ్యాపక సభ్యులకు R యొక్క ప్రాథమిక అంశాలు, డేటా హ్యాండ్లింగ్ టెక్నిక్‌లు, విజువలైజేషన్ టూల్స్ మరియు రీసెర్చ్-ఓరియెంటెడ్ అప్లికేషన్‌లను పరిచయం చేయడం ద్వారా వారి సాంకేతిక మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. VIT-APలోని గణాంకాల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. శివ, రిసోర్స్ పర్సన్, ఆచరణాత్మక శిక్షణ, ఆచరణాత్మక ప్రదర్శనలు మరియు గణాంక విశ్లేషణ మరియు పరిశోధన నమూనా కోసం R వాడకంపై విలువైన అంతర్దృష్టులను అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలలోని అధ్యాపకులు చురుకుగా పాల్గొన్నారు. మరియు నిరంతర నాణ్యత మెరుగుదల పట్ల సంస్థ యొక్క నిబద్ధతను బలోపేతం చేయడానికి ఇది దోహదపడింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి వి సుబ్రహ్మణ్య కుమార్ గారి ఆధ్వర్యంలో IQAC కమిటీ సభ్యులు విజయవంతం గావించారు.

ఆంధ్రప్రదేశ్

వ్యవసాయం లో పంచ సూత్రాలపై వివరించిన పెడన MLA కాగితకృష్ణప్రసాద్ గారు

కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రక గ్రామంలో “రైతన్నా….మీకోసం” కార్యక్రమంలో పాల్గొన్న పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ అన్నదాతకు లాభసాటి వ్యవసాయం కోసం సీఎం ప్రకటించిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు… అనే పంచ సూత్రాలపై అన్నదాతలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

వాచ్యతండా సర్పంచ్ బరిలో హథిరాం నాయక్ (చిన్న)

రిపోర్టర్ సింగం కృష్ణ, మునుగోడు ప్రతినిధి, నారాయణపురం,వాచ్య తాండా,నవంబర్29,(పున్నమి ప్రతినిధి) యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని వాచ్యతండా సర్పంచ్ బరిలో ఉన్నారు హతీ రామ్ నాయక్,(చిన్న).ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యతను ఇస్తూ గ్రామ ప్రజలు తనను గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని ప్రజలను కోరారు.నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పత్రిక ముఖంగా ఆయన తెలియజేశారు.గ్రామంలోని సమస్యలను తీర్చడానికి కంకణ బద్రుడనై గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,ఆయన అభిమానులు,తదితరులు,పాల్గొన్నారు.

E-పేపర్

తిరుపతిలో అజ్ఞాత భక్తురాలి కి జరిగిన యదార్థ సంఘటన

శ్రీరస్థు ఓంగం గణపతయే నమః శ్రీరస్తు శుభమస్తు నాకు జరిగిన యదార్థ సంఘటన ఈ ప్రపంచానికి తెలియ చేయలని అనుకున్నాను. నేను అనేక సంవత్సరాలు పాటు లక్ష్మినారాయణుడు భక్తురాలని నేను తిరుపతి లో నివసిస్టును నాపేరు దివ్య నేను ప్రతి రోజు కపిలేశ్వర ఆలయoలో లక్ష్మి నారాయణ గుడికి వెళ్తాను అక్కడ 30 నిమిషాలు పాటు ద్యానం చేస్తాను అప్పుడు ఒక రోజు ద్యానంలో వుండగా లక్షి దేవి నాకు కనపడి నేను ఈ కపిలేశ్వర ఆలయం వెనుక ఉన్న కొండ గృహలో తము మానవ రూపులో తప్పస్సు చేస్తున్నాను. నేను అన్యులకు కనపడను త్వరలో నే ఈ కలి యుగంలో లోక కళ్యాణం కోసం శ్రీ మంజుల మహాలక్ష్మి అవతరిసాను అని నాకు లక్ష్మి దేవి తెలియచేసింది. ఈ విషయన్ని అందురు లక్ష్మి దేవి కృపకు పాత్రులు అవ్వలని ఈ సందెశాన్ని అందరికి తెలియచేస్తున్నాను. ఓం శ్రీ మంజుల మహాష్మియేనమః

కర్నూలు

ఎమ్మిగనూరు మండలం కోటేకళ్ రెండు డి కోటడం జరిగింది

_*కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవి జయనాగేశ్వర్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని చేరుకుని ఘటనను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మిగనూరు శాసన సభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు, అక్కడి పరిస్థితులను స్థానికులతో, అధికారులతో తెలుసుకున్నారు.*_ – _*రోడ్డు ప్రమాదం పై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు, ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణం మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.*_ – _*రెండు కార్లు ఢీకొన్న ఈ భయానక ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందడం ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే డాక్టర్ బీవి జయనాగేశ్వర్ రెడ్డి గారు విచారం వ్యక్తం చేశారు.*_ – _*మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు తెలిపారు.*_

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.