దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వీల్ చైర్స్ పంపిణీ..
పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు లో దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయ సహకారములతో కొవ్వూరు లో 80శాతం శరీరం చచ్చుపడిపోయి, నడవలేక పోతున్న రుద్ర వేణి అనే అమ్మాయి కి వీల్ ఛైర్ అందించడం జరిగింది..ఈ కార్యక్రమంలో దేవోక్తి ఛారిటబుల్ సంస్థ చైర్మన్ ప్రత్తి పాటి నాగరాజు, సభ్యులు జోడాల వెంకట్, వీ.టి విల్సన్ రాజు మరియు వై . కే. శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ప్రత్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ఆపన్నులకు అవసరమైన సహాయ సహకారములు అందించడానికి దేవోక్తి ఛారిటబుల్ సంస్థ ఎప్పుడూ సన్నద్ధమేనని, ఇప్పటివరకూ 250 మందికి ఆర్టిఫిషియల్ లింబ్స్ ఉచితంగా అందించడం జరిగిందన్నారు..కుత్రిమ అవయవాలు కావలసినవారు తమ సంస్థను సంప్రదించిన వారికి 9391089381 ఉచితముగా అందించడం జరుగుతుంది..











