Monday, 16 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు కార్యాలయంలో ప్రభుత్వ అధికారి వి ఆర్ ఓ సస్పెండ్

దుత్తలూరు మండల లో VRO గా పనిచేస్తున్న చింతల చెరువు శ్రీనివాసులు సస్పెండ్ చేస్తూ జిల్లా ఉన్నతాదికారులు ఆదేశాలు జారీచేశారు ఈ వివరాలను దుత్తలూరు తహశీల్దార్ యనమల నాగరాజు VRO గా గతంలో ఏరుకొల్లు పనిచేస్తున్న సమయంలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడంతో పాటు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించాడని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు విచారణలో నేరం రుజువు కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు .

అనంతపురం

పవర్ గ్రిడ్ అధికారుల దౌర్జన్యం – రైతు ఆత్మహత్యాయత్నం

రైతు గంగాధర్ పరిస్థితి విషమం తాడిపత్రి, శుక్రవారం: తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో పవర్ గ్రిడ్ అధికారులు నిర్వహిస్తున్న టవర్ ఏర్పాటుపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులతో చర్చించకుండా, వారికి అందాల్సిన పరిహారం కన్నా తక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ టవర్లను బలవంతంగా ఏర్పాటు చేస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేడ్కరిస్ట్) అనంతపురం జిల్లా అధ్యక్షుడు వీర నాగరాజు మాట్లాడుతూ, “పవర్ గ్రిడ్ అధికారుల నిరంకుశ చర్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. రైతులను నష్టపరిచే ఈ ప్రాజెక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము” అని పేర్కొన్నారు. అధికారుల వ్యవహారశైలి వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన రైతు గంగాధర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబసభ్యులు, గ్రామస్థులు స్పందించి అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గ్రామంలో ఈ ఘటన కలకలం రేగించగా, రైతులు న్యాయమైన పరిహారం చెల్లించే వరకు టవర్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అనంతపురం

సజ్జలదిన్నెలో జడ్‌పి హై స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్ విజయవంతం

సజ్జలదిన్నెలోని జడ్‌పి హై స్కూల్ ప్రాంగణంలో ఈరోజు నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ హర్షోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది. విద్యార్థుల అభ్యాసం, పాఠశాల అభివృద్ధి, భవిష్యత్ విద్యా మార్గదర్శకాలపై తల్లిదండ్రులతో కలిసి సమగ్ర చర్చలు జరిపారు. కార్యక్రమానికి మాజీ ప్రెసిడెంట్ రంగన్న, స్కూల్ కమిటీ చైర్మన్లు ప్రకాశ్, నారాయణస్వామి ముఖ్య అతిథులుగా హాజరై సమావేశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం తెచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహులు విద్యార్థుల విద్యా ప్రగతి, స్కూల్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే పరీక్షలపై వివరాలు అందించారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో మీటింగ్‌కు హాజరై ఉపాధ్యాయులతో విద్యార్థుల ప్రగతి, బలాలు–బలహీనతలపై ఆలోచనలు పంచుకున్నారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం స్కూల్–పేరెంట్స్ మధ్య సమన్వయం మరింత బలపడాలని అతిథులు సూచించారు. సక్రమమైన విద్యతో పాటు నియమనిష్టలు, నైపుణ్యాలు పెంపొందించే వాతావరణం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలకు తల్లిదండ్రుల సహకారం కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

క్షణాల్లో టీటీడీ టికెట్లు ఖాళీ

జనవరి 2 నుంచి 8 దాకా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి 300 రూపాయల వైకుంఠ దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వెబ్సైట్ ద్వారా లక్ష 500 టికెట్లను ఆన్లైన్లో ఉంచింది. కేవలం కొద్ది నిమిషాల్లోనే టికెట్లు అన్ని బుక్ అయిపోయాయి

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ వారి*FIRELESS COOKING*

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల (విజయవాడ ) 6.12.2025 వ తేదీన ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రెండో సంవత్సరం విద్యార్థుల కోసం **ఫైర్‌లెస్ కుకింగ్ కార్యక్రమం** నిర్వహించింది. ఇందులో విద్యార్థులు **పన్నగుల్కండ్, క్యారట్ లడ్డూ, బ్రెడ్ రసమలై, చాక్లెట్ ఫడ్జ్, గ్రౌండ్‌నట్ సాలాడ్లు** తదితర వంటకాలను సిద్ధం చేశారు. ఈ పోటీలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, తమ సృజనాత్మక ఆలోచనలను మరియు నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నందుకుగాను ప్రిన్సిపల్ డాక్టర్ VVS కుమార్ గారు FOOD SCIENCE AND TECNOLOGY DEPARTMENT HOD Dr.A. అన్నపూర్ణ , అధ్యాపకులు CH. గాయత్రి, తేహమిన,T. కుందన విద్యార్థులను అభినందించారు.

తెలంగాణ

క్రీడలు విద్యార్థి భవిష్యత్తును తీర్చి దిద్దుతాయన్న : కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) క్రీడల ద్వారా సహజ సిద్ధంగా విలువలు, జట్టు భావన, పట్టుదల, కృషి, సమయపాలన, విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే, సమగ్ర వికాసం సాధ్యమవుతుందన్నారు. ఓటమి, విజయాలను సమానంగా స్వీకరించే సంస్కారాన్ని క్రీడలు నేర్పుతాయని, అందుకే ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడను అభ్యసించే అలవాటు చేసుకోవాలన్నారు. కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో చదువుకొనడం చాలా అదృష్టమని, బాగా చదువుకొని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలవాలని కోరారు.

E-పేపర్

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ మండలం I పంగిడి గ్రామంలోని జెడ్పీ హై స్కూల్‌లో “మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ మండలం I పంగిడి గ్రామంలోని జెడ్పీ హై స్కూల్‌లో “మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 3.0” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చడించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ….విద్య అనేది కేవలం పరీక్షల పరిమితి కాదని, విలువలు, శిస్థాచారం, సమాజం పట్ల బాధ్యతను నేర్పేది కూడా విద్యేనని వివరించారు. తల్లిదండ్రులు పిల్లల కలలు సాకారం చేయాలంటే ఆ పిల్లల ప్రతిభను నిరంతరం గమనిస్తూ స్ఫూర్తినివ్వాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా చిన్నచిన్న లోపాలను గుర్తించి, వెంటనే దిద్దితేనే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించగలరని చెప్పారు. చదువుతో పాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకునే వాతావరణం ఏర్పడాలని వివరించారు. వ్యక్తిత్వ వికాసం, మానసిక బలం, నైతిక విలువలు పెరుగడానికి తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు కలిసి పిల్లలకు సహకరించాలని సూచించారు. విద్యార్థుల అబిలిటీలను, ఆసక్తులను గుర్తించి, వారితో సన్నిహిత అనుసంధానం కొరకు ఈ మెగా పీటీఎం 3.0 కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమని ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. END

తెలంగాణ

డిసెంబర్ 6న దేవరకొండకు రానున్న : సీఎం

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా డిసెంబర్ 6న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈరోజు ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవరకొండ రాక సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

విశాఖపట్నం

విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి — డాక్టర్ కందుల నాగరాజు *విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:-* మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థానానికి ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆకాంక్షించారు. విశాఖ రైల్వే స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సిసి క్యాడేట్స్ గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సమాజ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతో పాటు వినయం, విధేయత, సంస్కారం, మానవతా విలువలను కూడా నేర్పించాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి విధ్యనభ్యసించి తమ తల్లిదండ్రులకు తమ ప్రాంతానికి మంచి పేరు తీసు కురావాలన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడల్లో రాణించడం వల్ల విద్య ఉద్యోగాల్లో వారికి మొదటి ప్రాధాన్యం లభిస్తుందన్నారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే దిశలో విద్యార్థులు క్రమశిక్షణ తో ఉజ్వల భవిష్యత్తు ఏర్పరుచుకోవాలని అన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ వై. మీనాక్షి అలాగే బి.రామారావు, ఏబి మాణిక్యం, ఎం ఆర్ వి నర్సమ్మ, టి పద్మజ, పి సుధా, ఎస్ ఆర్ తులసి, ఏఎస్ రాజా, ఎన్ పవన్ కుమార్ కె.సాయి విమల కుమారి, ఎస్ కే మదీనా, బి.శివ ప్రసాద్, ఈ.మేరీ సుశీల , జి.ఆనంద్, సిహెచ్ ఝాన్సీ, కె .రామారావు ,ఆర్ ఏ ప్రసన్న, టి.జయ, ఏ.మణి, డి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

స్నేహ MACS భారీ ఆర్థిక మోసాన్ని విశాఖపట్నం సిటీ పోలీసులు చేదించారు; ప్రధాన నిందితుల అరెస్ట్

*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:-* *స్నేహ MACS భారీ ఆర్థిక మోసాన్ని విశాఖపట్నం సిటీ పోలీసులు చేదించారు; ప్రధాన నిందితుల అరెస్ట్, ఆస్తుల జాబితా సిద్ధం* మోసం మరియు FIRల సంక్షిప్త చరిత్ర: విశాఖపట్నం సిటీ పోలీసులు “స్నేహా MACS” (Sneha Mutually Aided Co-operative Society Ltd.) మరియు దానికి సంబంధించిన బినామీ సంస్థల పేరిట నిర్వహించబడిన భారీ ఆర్థిక మోసాన్ని వెలికితీశారు. యాజమాన్యం అధిక వడ్డీ ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి, ఆ మొత్తాలను వ్యక్తిగత ప్రయోజనాలకు మరియు బినామీ కంపెనీలకు మళ్లించి, విశాఖపట్నం మరియు ఇతర జిల్లాల్లో విస్తారంగా స్థిరాస్థులు కొనుగోలు చేసింది. ప్రధాన బాధితులు SC/ST సమాజ సభ్యులు మరియు ఇతర మధ్యతరగతి డిపాజిటర్లు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సిద్ధాంతాలు మరియు “Pay Back to Society” నినాదం నమ్మి తమ జీవన పొదుపులను పెట్టుబడి చేసినారు. డిపాజిటర్ల నుండి వచ్చిన వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా, స్నేహా MACS యాజమాన్యం మరియు సంబంధిత సంస్థలపై విశాఖపట్నం నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అనేక FIRలు నమోదు చేయబడ్డాయి: 1. Cr. No. 166/2025 – దువ్వాడ PS, నమోదు: 22.04.2025 2. Cr. No. 85/2025 – ద్వారకా PS, నమోదు: 01.05.2025 3. Cr. No. 215/2025 – గోపాలపట్నం PS, నమోదు: 07.08.2025 4. Cr. No. 222/2025 – II Town PS, నమోదు: 18.12.2025 మోసం విధానం (Modus Operandi) A.P. MACS Act, 1995 సెక్షన్ 29 ప్రకారం నిర్వహించిన దర్యాప్తు మరియు పోలీస్ చట్టపరమైన విచారణలో వెల్లడైన ముఖ్యాంశాలు: • “SC/ST Sneha MACS” (Regd. No. AMC/VSP/DCO/2008/2446) పేరుతో 2008లో రాజేంద్రనగర్, సీతమ్మపేట, విశాఖపట్నంలో రిజిస్టర్ అయిన ఈ సోసైటీ పేరు 2014లో అసలు SC/ST సభ్యులకు తెలియజేయకుండా “Sneha MACS” గా మార్చబడింది. • అంబేద్కర్ సిద్ధాంతాలు ప్రచారం చేస్తూ, అధిక వడ్డీ వాగ్దానాలు చేసి, ముఖ్యంగా SC సభ్యులను ఏజెంట్లు మరియు సిబ్బంది ద్వారా పెట్టుబడులకు ప్రోత్సహించారు. • కానీ, ఆ డిపాజిట్లను సహకార ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలు, బినామీ పెట్టుబడులు, మరియు అక్రమ ఆస్తుల కొనుగోలుకు మళ్లించారు. విచారణ నివేదిక ప్రకారం: • Sneha MACS కి మొత్తం 2,504 మంది డిపాజిటర్లు ఉన్నారు. • చెల్లించవలసిన మొత్తం డిపాజిట్లు: ₹55.10 కోట్లు • అక్రమ రుణాలు, నిబంధనలకు వ్యతిరేకంగా నిధులను మళ్లించడం కారణంగా విశాఖపట్నం MACS ఖాతాల నుండి హైదరాబాద్, పన్నూరు MACSలకు మరియు అనేక బినామీ సంస్థలకు సుమారు ₹56.10 కోట్లు మళ్లించబడినట్లు బయటపడింది. ప్రధాన నిందితులు ఈ కేసుల్లో ముఖ్య నిందితులు: • వ్యవస్థాపక అధ్యక్షుడు : కటికల శివ భాగ్యరావు • అధ్యక్షరాలు (President) : కె. స్వర్ణలత • వారి కుమారులు : కె. శ్రీకాంత్, కె. క్రాంతి కుమార్ • డైరెక్టర్లు మరియు CEO : ఏ. పున్నారావు • బినామీ సంస్థలు : ప్రుధ్వి కన్స్ట్రక్షన్స్, యునైటెడ్ పబ్లికేషన్స్, స్నేహ ప్రియా ఫైనాన్షియల్ సర్వీసెస్, వీటిని ఎస్. ధనుంజయ శరత్, గుమ్మడి మనోరంజన్ ఇతర బినామి లు నిర్వహించారు. లుక్ అవుట్ నోటీసులకు పంపిన ప్రతిపాదనలు : కె. స్వర్ణలత కే. శ్రీకాంత్ 3. అల్లాడి పున్నారావు 4. గుమ్మడి మనోరంజన్ 5. కె. క్రాంతి కుమార్ వివిధ కేసుల్లో అరెస్టులు : • Cr. No. 166/2025 (దువ్వాడ PS): మతూరి శ్రీనివాసరావు, గుమ్మడి మనోరంజన్, ఉండవల్లి శ్రీనివాసరావు, గూడూరి సీతా మహాలక్ష్మి, లిఖితపూడి విశ్వేశ్వరరావు, పి. శ్రీహరి రాజు, గుంటక రంగారావు, జంపరంగి ధనలక్ష్మి, సజ్జా ధనుంజయ శరత్ తదితరులు అరెస్టై రిమాండ్‌కు పంపబడ్డారు. • Cr. No. 215/2025 (గోపాలపట్నం PS): సజ్జా ధనుంజయ శరత్ అరెస్టై రిమాండ్‌కు వెళ్లారు. Cr. No. 85/2025 (ద్వారకా PS): మదిరి విజయ్‌కుమార్ (Sneha TV, Sneha Spoorthy Chits), కటికల శ్రీకాంత్, కటికల క్రాంతి కుమార్ అరెస్టై రిమాండ్‌కు పంపబడ్డారు. Cr. No. 222/2025 (II Town PS): ప్రధాన నిందితుడు కటికల శివ భాగ్యరావు 04-12-2025న అరెస్టై కోర్టులో హాజరుచేయబడి రిమాండ్ అయ్యారు. బినామీ ఆస్తుల గుర్తింపు : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మరియు తహసీల్దార్లకు పంపిన రిక్విజిషన్ల మేరకు సర్టిఫైడ్ కాపీలు సేకరించి, భూములను సర్వే చేసి, జియోట్యాగ్ చేసి, మళ్లించిన డిపాజిటర్ల డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులు గుర్తించబడ్డాయి: వెంకన్నపాలెం / రాయపురాజుపేట వద్ద కుటుంబ సభ్యులు మరియు ప్రుధ్వి కన్స్ట్రక్షన్స్ బినామి పేర్లలో సుమారు 21.12 ఎకరాలు (డాక్యుమెంట్ నంబర్లు: 3075/2011, 5727/2011, 9625/2012, 9655/2012, 3789/2014, 3926/2014 మొదలైనవి). ఎలమంచిలిలో దుప్పిటూరు గ్రామంలో 0.47 ఎకరాలు, దబ్బందలో 1.50 ఎకరాలు – Sneha Priya Financial Services పేర్లలో. శీలనగర్ STBL దగ్గర 2450 చ.గజాలు — యునైటెడ్ పబ్లికేషన్స్ పేరిట. చిన్నవాల్తేర్‌లో అక్షయ సత్యప్రసాద్ విస్టాలో 2125 చ.అడుగుల ఫ్లాట్ – ₹96,00,000కు గుమ్మడి మనోరంజన్ పేరిట. మర్రిపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో 350 చ.గజాలు – Sneha Priya Financial Services పేరుతో. ఇవి అన్నీ మోసపూరితంగా మళ్లించిన ప్రజా డిపాజిట్లతో కొనుగోలు చేసిన ఆస్తులే. ప్రస్తుతం కేసు స్థితి : • A.P. MACS Act సెక్షన్ 29 ప్రకారము కోర్టు విచారణ పూర్తయి, వ్యవస్థాపకులు, అధ్యక్షులు, డైరెక్టర్లు మరియు బినామీ సంస్థలపై క్రిమినల్ చర్యలు, అలాగే ఆస్తుల అటాచ్‌మెంట్ కోసం సిఫార్సు చేయబడింది. • పోలీసు వివిధ కేసుల్లో కీలక నిందితులను అరెస్టు చేసి, PT వారెంట్లు అమలు చేసి సంబంధిత కేసులకు కనెక్ట్ చేస్తున్నారు. • గుర్తించిన ఆస్తులపై మరిన్ని లావాదేవీలు జరగకుండా సబ్ రిజిస్ట్రార్లకు హోల్డ్ పెట్టమని రిక్విజిషన్లు పంపబడ్డాయి. • మళ్లించిన నిధుల రికవరీ కోసం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి; ఇంకా గుర్తించాల్సిన బాధితులు మరియు బినామీ ఆస్తుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.