Saturday, 14 March 2026

Blog

తిరుపతి

గ్రామీణ బ్యాంకు ద్వార బాధితుడుకి రూ.5,00,000 ప్రమాద బీమా చెక్కు అందజేత

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 16, శ్రీకాళహస్తి మండలంలోని ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, ఎగువవీధి బ్రాంచ్ ఆధ్వర్యంలో చోళ యంస్ జనరల్ ఇన్సూరెన్సు ద్వారా పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్సు క్లెయిమ్ ను విజయవంతంగా పరిష్కరించడంజరిగింది. చుక్కలనిడిగల్లి గ్రామానికి చెందిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యురాలు పి.రాధ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో పర్సనల్ యాక్సిడెంటల్ స్కీముకు ఎన్రోల్మెంట్ జరిగినది. ఇటీవల జరిగిన యాక్సిడెంట్లో పి రాధ మరణించడంటో నామినీకి చోళ యంస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు రూ.5,00,000/- విలువైన చెక్కును ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ పి. ప్రకాష్ రత్న బాబు చేతుల మీదుగాచెక్కునుఅందజేయడం జరిగింది. ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ పి. ప్రకాష్ రత్న బాబు, చోళ యంస్ జనరల్ ఇన్సూరెన్సు మేనేజర్ యస్వంత్, బ్రాంచ్ మేనేజర్ యస్. బాల నరసింహం, ఇన్సూరెన్సు రిప్రెసెంటేటివ్స్ మరియు బ్రాంచ్ స్టాఫ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ పి. ప్రకాష్ రత్న బాబు మాట్లాడుతూ, ఈ బీమా మొత్తాన్ని చనిపోయిన పి.రాధ కుమార్తె భవిష్యత్ విద్యా మరియు కెరీర్ అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని,ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, చోళ యంస్ జనరల్ ఇన్సూరెన్సు సంస్థలు వినియోగదారుల సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉన్నాయని తెలియజేశారు.

విశాఖపట్నం

నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారి ఆధ్వర్యంలో నగరంలోని వివిధ పరిశ్రమల సంస్థల ప్రతినిధులతో విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (VCSC) మీటింగ్ ను నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించడం జరిగినది.

*విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి* నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారి ఆధ్వర్యంలో నగరంలోని వివిధ పరిశ్రమల సంస్థల ప్రతినిధులతో విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (VCSC) మీటింగ్ ను నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం నందు విశాఖపట్నం నగరంలో భద్రత, సంక్షేమం మరియు అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పోలీస్ కమిషనర్ గారు “సెవెన్ డ్రీమ్స్ (Seven Dreams)” అనే దూరదృష్టి గల ప్రణాళికను వెల్లడించారు. విశాఖ నగరం ముందుగా దేశంలోనే ఉత్తమ పోలీసింగ్ గల నగరంగా, ఆ తర్వాత ప్రపంచంలోనే ఆదర్శ పోలీసింగ్ నగరంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఇది కేవలం పోలీస్ శాఖ కల మాత్రమే కాకుండా, నగర ప్రజలందరి కలగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఈ లక్ష్య సాధనలో విశాఖపట్నం భద్రతా మండలి (Vizag Security Council) కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పోలీసు కమిషనర్ గారు పేర్కొన్నారు. మొదటిది ట్రాఫిక్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని, ప్రణాళిక ప్రకారం 2026 ఏప్రిల్ 1 నుండి AI ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను నగరంలో ప్రవేశపెట్టనున్నామని, ఈ వ్యవస్థ ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ సమకాలీకరణ జరిగి, వాహనాల సగటు వేగం పెరిగి ప్రజలు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారని తెలిపారు. ఆటోమేటిక్ నంబర్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి, ఉల్లంఘనదారులకు ఇంటికి చేరకముందే చలాన జారీ అయ్యే విధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ జరుగుతుందని చెప్పారు. ఈ విధానంతో ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బాధ్యత పూర్తిగా ఆధునిక సాంకేతికత తీసుకుంటుందని, ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ నియంత్రణపై మాత్రమే దృష్టి సారిస్తారని తెలిపారు. ట్రాఫిక్ వాలంటీర్ల వ్యవస్థను బలోపేతం చేయడంలో, అలాగే ట్రాఫిక్ సమస్యలపై స్వతంత్రంగా అంచనా వేయడంలో భద్రతా మండలి సహకారం అవసరమని పేర్కొన్నారు. రెండవది మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా భర్తలు లేదా కుటుంబ సభ్యులచే హింసకు గురైన మహిళలు, అలాగే పిల్లలతో విడిచిపెట్టబడిన మహిళలకు సమాజం అండగా నిలవాలని, భద్రతా మండలిలోని దాతలు మరియు దయాగుణం కలిగిన వ్యక్తుల సహకారంతో బాధిత మహిళలకు పునరావాసం కల్పించి, వారి పిల్లలకు విద్య అందించేలా నిధులు సమకూర్చాలన్నదే తమ ఆశయమని సీపీ గారు వెల్లడించారు. మూడవది సమాజంలోని బలహీన వర్గాలకు జీవనోపాధి మరియు పునరావాసం కల్పించాలని, ఆశ్రయం లేని వారు, ట్రాన్స్‌జెండర్‌లు, జైలు నుంచి విడుదలైన మాజీ ఖైదీలు, డ్రగ్ మరియు మద్యం వ్యసనాల నుంచి కోలుకున్నవారు, నిరుద్యోగులైన పోలీస్ సిబ్బంది పిల్లలు మరియు రిటైర్డ్ హోమ్ గార్డులకు తగిన ఉపాధి కల్పిస్తే వారు తప్పుదారుల్లోకి వెళ్లే అవకాశాలు ఉండవని తెలిపారు. సమాజం అంగీకారం మరియు సహకారం లభిస్తే విశాఖపట్నం మరింత సురక్షితమైన నగరంగా మారుతుందని సీపీ గారు తెలిపారు. నాలుగవది హోమ్ గార్డుల సంక్షేమంపై కమిషనర్ ఆవేదన వ్యక్తం చేస్తూ, హోమ్ గార్డులు 60 ఏళ్ల తర్వాత ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా పదవీ విరమణ చేయాల్సి వస్తోందని, ఉద్యోగ భద్రత లేకుండా, అనారోగ్యంతో ఉన్నప్పుడు వేతనం కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారని, అందుకే హోమ్ గార్డ్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి, వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కృషి చేయాలనీ తెలిపారు. ఐదవది నగర భద్రతను మరింత పటిష్టం చేసే మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని, ప్రతీ ప్రాంతంలో నైట్ విజన్ సదుపాయం కలిగిన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఫుటేజ్‌ను క్లౌడ్‌లో భద్రపరచాలని, బిజీ కూడళ్లలో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా జాతీయ లేదా రాష్ట్ర క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాబేస్‌లలో ఉన్న నేరస్థులను గుర్తించి వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేసే విధానం అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న డ్రోన్‌లతో పాటు, నిఘా, నేర నిరోధం, సైరన్ మరియు పబ్లిక్ అడ్రస్ వ్యవస్థలతో కూడిన ఆధునిక డ్రోన్‌లు, అలాగే విపత్తుల సమయంలో ఆహారం మరియు మందులు సరఫరా చేసే డ్రోన్‌లు మరింత అవసరమని, ప్రతి పోలీస్ స్టేషన్‌లో కనీసం ఒక డ్రోన్ ఉండాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. ఆరవది బీచ్ భద్రత మరియు ట్రాఫిక్ ఉపకరణాలపై దృష్టి సారించాలని, మునిగిపోయే అవకాశం ఉన్న ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు, లైట్లు, లైఫ్ గార్డ్‌లు ఏర్పాటు చేయాలని, మునిగిపోతున్న వారిని రక్షించేందుకు రిమోట్ కంట్రోల్ ఇంటిగ్రేటెడ్ బోట్లు మరియు లైఫ్ జాకెట్లు అవసరమని, అలాగే మద్యం సేవించి వాహనం నడిపే వారిని గుర్తించేందుకు మరిన్ని బ్రీత్ ఎనలైజర్‌లు, అతివేగాన్ని గుర్తించేందుకు స్పీడ్ లేజర్ గన్‌లు అవసరమని పేర్కొన్నారు. ఏడవది ప్రజల్లో అవగాహన మరియు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీపీ గారు, ప్రతి రకమైన సైబర్ నేరంపై తెలుగులో అవగాహన చిత్రాలను రూపొందించి, వాటిని వీధుల్లో మొబైల్ వాహనాల ద్వారా ప్రదర్శించాలని, వ్యసన విముక్తి కేంద్రాలు సరిపోవడం లేదని, ప్రతి డ్రగ్‌కు అనుగుణంగా ఉత్తమ చికిత్స అందించే కేంద్రం ఏర్పాటు చేయడానికి భద్రతా మండలి సహకారం అవసరమని తెలిపారు. ఆసుపత్రులకు దూరంగా ఉన్న ప్రాంతాలలో ప్రజా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని, 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు HPV టీకాలు అందించి ప్రతి బాలికకు టీకా అందిన దేశంలో తొలి నగరంగా విశాఖపట్నాన్ని నిలపాలన్న లక్ష్యాన్ని వెల్లడించారు. అలాగే టైఫాయిడ్, న్యుమోనియా, ఇన్‌ఫ్లుయెంజా వంటి ముఖ్యమైన టీకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాలు, మహిళలపై ఆన్‌లైన్ నేరాలు, ఆస్తి నేరాలు, డ్రగ్స్, మానవ అక్రమ రవాణా మరియు ఆర్థిక నేరాలపై క్రమం తప్పకుండా ప్రజలకు చేరువయ్యే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రజలు, పోలీసులు మరియు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ద్వారా అద్భుతాలు సాధించవచ్చని కమిషనర్ గారు పేర్కొన్నారు. చాలా కాలం నుండి భద్రతా మండలి నిద్రావస్థలో ఉందని, ఇకపై చురుకుగా పనిచేసే, తనను కూడా నిద్రపోనివ్వని సభ్యులు కావాలని,, పోలీస్ శాఖ తరఫున గాజువాక ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్‌లను సమన్వయాధికారులుగా నియమించినట్లు తెలిపారు. అనంతరం విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ నుండి పలువురు ప్రతినిధులు విశాఖ నగర అభివృద్ధికి మరియు పలు సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయడానికి తమ కార్యా చరణ తెలియజేయడం జరుగుతుంది,తిరిగి 2026 జనవరి 07 వ తేదీన రెండవ మీటింగ్ నిర్వహించడం జరుగుతుందని తీర్మానించారు. ఈ కార్యక్రమం నందు డిసిపి-I గారు, డి.సి.పి-II గారితో పాటుగా ఏ.డి.సి.పి లు, ఏ.సి.పి లు, నగర VCSC నాయకత్వ బృందం , వీకిస్సీ సభ్యులు, పలు పరిశ్రమల ప్రతినిధులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు

విశాఖపట్నం

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో మంగళవారం 281 ఆక్రమణల తొలగింపు.

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో మంగళవారం 281 ఆక్రమణల తొలగింపు. * – జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర్ రావు *విశాఖపట్నం డిసెంబర్ 16 పున్నమి ప్రతినిధి*: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా 281 ఆక్రమణలను మంగళవారం తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు నగర పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో లో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది. 1వ జోన్ పరిధిలో మంగమారిపేట నుండి భీమిలి బీచ్ రోడ్డు వరకు 13 ఆక్రమణలు, 2 వ జోన్ పరిధిలో కార్ షెడ్ జంక్షన్ నుండి పీఎం పాలెం ఆఖరి బస్ స్టాప్ వరకు 18 ఆక్రమణలు, 3వ జోన్ పరిధిలో రామా టాకీస్ నుండి సత్యం జంక్షన్ వరకు, సత్యం జంక్షన్ నుండి ఏ ఎస్ ఆర్ విగ్రహం వరకు, ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ రోడ్డు నుండి పోర్ట్ స్టేడియం వరకు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుండి గురుద్వార్ జంక్షన్ వరకు 83 ఆక్రమణలు, 4 వ జోన్ పరిధిలో అగర్వాల్ హాస్పిటల్ నుండి ఎస్టీ ఆంతోనీ స్కూల్ వరకు 33 ఆక్రమణలు, 5 వ జోన్ పరిధిలో అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డు నుండి రైల్వే న్యూ కాలనీ వరకు 40 ఆక్రమణలు, 6 వ జోన్ పరిధిలో బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు, శ్రీనగర్ జంక్షన్ నుండి దుర్గా నగర్ రోడ్డు వరకు, అగనంపూడి జంక్షన్ నుండి విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ వరకు 67 ఆక్రమణలు, వెస్ట్ జోన్ పరిధిలో మల్కాపురం నుండి కోరమండల్ గేట్ వరకు 12 ఆక్రమణలు, 8వ జోన్ పరిధిలో వ్యాపకుంట జంక్షన్ నుండి చిన్న ముషిడివాడ జంక్షన్ వరకు 15 ఆక్రమణలతో కలిపి మొత్తం 281 ఆక్రమణలు తొలగించడం అయినదని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల కమిషనర్లు, సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది , పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

3వ జోన్ లో డిసెంబర్ 23న బహిరంగ వేలం

3వ జోన్ లో డిసెంబర్ 23న బహిరంగ వేలం ప్రకటన *విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి*: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 3వ జోన్ (ఆశీలు మెట్ట) పరిధిలో ఖాళీగా వున్న షాపు రూములకు, కమ్యూనిటీ హాల్ నకు డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడునని 3వ జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్ మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. 3వ జోన్ పరిధిలో గల యం.వి.పి కాలనీ వాణిజ్య సముదాయములో షాప్ రూమ్ నెం.10,11,12,13,14,15&16 లకు, డైమండ్ పార్క్ వాణిజ్య సముదాయములో షాప్ రూమ్ నెం.09, జగ్గారావు బ్రిడ్జి వాణిజ్య సముదాయములో షాప్ రూమ్ నెం.06 మరియు బి.టి.ఆర్ కాలనీ, రెల్లివీధి లో గల కమ్యూనిటీ హాల్ కు 3 సంవత్సరముల కాలమునకు గుత్తలకు ఇచ్చుటకు గాను తేది: 23-12-2025 న ఉదయం 11 గంటలకు జీవీఎంసీ జోన్-3 ఆశీలు మెట్ట కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించబడునని, ఆసక్తి గల పాటదారులు పూర్తి వివరాలకు 3వ జోనల్ కమిషనర్ కార్యాలయం లోని పని వేళలో పర్యవేక్షకులను సంప్రదించగలరని జోనల్ కమిషనర్ తెలియజేశారు.

విశాఖపట్నం

స్కిల్ కోసం ప్రపంచం ఉత్తరాంధ్రవైపు చూసే రోజు వస్తుంది : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.*

*స్కిల్ కోసం ప్రపంచం ఉత్తరాంధ్రవైపు చూసే రోజు వస్తుంది : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.* – ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కావడం చారిత్రాత్మక దినం – ఈ పద్ధెనిమిది నెలలు చంద్రబాబు, లోకేష్ లు ఉత్తరాంధ్ర పై ప్రత్యేక దృష్టి. – ఏవియేషన్ లో కీలక సంస్కరణకు ఆనాడు మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు బీజం వేశారు. – 30 ఏళ్ల దూర దృష్టితో చంద్రబాబు ఆలోచన.. భవిష్యత్ అవసరాలు తీర్చనున్న GMR మాన్సాస్ ఎడ్యుసిటీ. *విశాఖపట్నం డిసెంబర్ 16 పున్నమి ప్రతినిధి*: నైపుణ్యం కోసం భవిష్యత్ లో ప్రపంచం.. ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం నాడు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో జిఎంఆర్, మన్సాస్ సంస్థల మధ్య ఏవియేషన్ ఎడ్యుసిటీ నిర్మాణం కోసం ఏం.ఓ.యు మార్పిడి కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో కలసి.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వేదికపై నుండి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కావడం దేశంలోనే చరిత్రాత్మక రోజు అని రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండటంతో పాటు.. ఓ ఉత్తరాంధ్ర వాసిగా చాలా గర్వపడుతున్నా అని అన్నారు. గడిచిన పద్ధెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల ప్రత్యేక దృష్టి ఉత్తరాంధ్ర పై నిలిపారని కితాబిచ్చారు. ఇన్నాళ్లు మనం చూసిన ఉత్తరాంధ్ర వేరు.. రేపటి ఉత్తరాంధ్ర వేరు అని స్పష్టం చేశారు. ప్రధానంగా ఏవియేషన్ రంగంలో ప్రపంచానికే కేంద్రంగా ఉత్తరాంధ్ర మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ మొదటి సారి బాధ్యతలు తీసుకున్నప్పుడు అందులో పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉండేవారని.. అనేక కీలక సంస్కరణలకు ఆనాడే ఆయన బీజం వేశారని అన్నారు. ప్రస్తుతం 12% వృద్ధి రేటుతో దూసుకుపోతున్న ఏకైక రంగం దేశ విమానయాన వ్యవస్థ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం 800 విమానాలు అందుబాటులో ఉంటే.. సమీప భవిష్యత్లో మరో 1700 విమానాలకు ఇప్పటికే ఆర్డర్లు వెళ్లాయని తెలిపారు. మిగిలిన లక్ష్యాలను పూర్తి చేసుకుని 3000 లకు పైగా విమానాలను కలిగి ప్రపంచంలోనే మేటిగా మన దేశ విమానాయన వ్యవస్థ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కో విమానం నుండి సరాసరి 100 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే.. లక్షలాది మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ఏవియేషన్ ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్ గా అభివర్ణించిన రామ్మోహన్ నాయుడు.. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఉన్నప్పటికీ.. అందుకు తగ్గ స్కిల్ సెంటర్లు లేవు అనే అసంతృప్తి ఉండేదని అన్నారు. తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రాష్ట్రంలో ఏవియేషన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలసి ఏవియేషన్ యూనివర్సిటీ ఆలోచన పంచుకుందామని ఆలోచన చేస్తే.. నా కన్నా ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విజన్ ను స్పష్టం చేశారని అన్నారు. 30,40 ఏళ్ల తర్వాత ప్రపంచం ఏమని ఆలోచిస్తుందో ముందే ఊహించే చంద్రబాబు నాయుడు.. ఏవియేషన్ యూనివర్సిటీ గురించి తన ఆలోచన చెప్పడం ఆశ్చర్యపోయా అని అన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం శరవేగంగా జరుగుతోందని.. ఒక నెల రోజుల్లో వ్యాలీడేషన్ ఫ్లైట్ ల్యాండ్ కానుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మొత్తంగా విమానాశ్రయం నిర్మాణం పూర్తి జూన్ 2026 అనుకున్నాం కానీ.. అంతకన్నా ముందే ప్రారంభించే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపారు. జిఎంఆర్ మన్సాస్ ఎడ్యుసిటీ గురించి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం నారా లోకేష్ తీవ్రంగా శ్రమించారని కితాబిచ్చారు. ఏవియేషన్ యూనివర్సిటీ అంటే ఒక కళాశాల కే పరిమితం అవుతుందని.. ఎడ్యుసిటీ గా మార్చడం వల్ల, అమెరికా వంటి ఇతర దేశాల్లో ఉన్న స్కిల్ కాలేజీలు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. లోకేష్ ఆలోచన మేరకు ఏవియేషన్ యూనివర్సిటీ ను.. ఎడ్యుసిటీ గా మార్చామని తెలిపారు. దీని ద్వారా మన దేశీయ ఏవియేషన్ అవసరాలు తీరడంతో పాటు.. ప్రపంచానికి కూడా వనరులు అందిస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర కు పూసపాటి కుటుంబం ఎంతో చేసిందని.. వారికి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు. పూసపాటి వంశీయులు మన ప్రాంతంలో ఉండటం ఉత్తరాంధ్ర చేసుకున్న అదృష్టం అని అన్నారు. ఎన్నో రాజ వంశీయుల కుటుంబాలు ఉన్నా.. విద్య పేరు చెబితే.. ధారాళంగా భూములు ఇచ్చే కుటుంబం పూసపాటి వంశం అని కితాబిచ్చారు. 136 ఎకరాలు ఇవ్వడం పై ధన్యవాదాలు తెలిపారు. GMR సంస్థ కూడా ఉత్తరాంధ్ర ప్రొడక్ట్ గా అభివర్ణించిన రామ్మోహన్ నాయుడు.. GMR.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి గౌరవం తెచ్చారని అన్నారు. విలువలు, మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ.. మన ప్రాంతానికి శక్తిని ఇచ్చే కార్యక్రమాలు GMR సంస్థ చేస్తోందని అన్నారు. ఈ ఎడ్యుసిటీ కి సంబంధించి నారా లోకేష్.. ఎలాంటి టైమ్ లైన్ ఇచ్చినా.. పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దీనికి ప్రతిగా పన్నెండు నెలల్లో పూర్తి చెయ్యాలని నారా లోకేష్ బదులిచ్చారు. రీసెర్చ్, ఇన్నోవేషన్.. ఈ ఎడ్యుసిటీ లో వృద్ధి చెందుతాయని.. నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం ఉన్న నేపథ్యంలో.. రాబోయే డిమాండ్ ను తట్టుకునేందుకు ఈ ఎడ్యుసిటీ ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి అందరూ సహకరించి.. భాగస్వామ్యం అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అదితి గజపతి రాజు, GMR సంస్థ నుండి GBS రాజు, ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

స్కిల్ కోసం ప్రపంచం ఉత్తరాంధ్రవైపు చూసే రోజు వస్తుంది : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.*

*స్కిల్ కోసం ప్రపంచం ఉత్తరాంధ్రవైపు చూసే రోజు వస్తుంది : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.* – ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కావడం చారిత్రాత్మక దినం – ఈ పద్ధెనిమిది నెలలు చంద్రబాబు, లోకేష్ లు ఉత్తరాంధ్ర పై ప్రత్యేక దృష్టి. – ఏవియేషన్ లో కీలక సంస్కరణకు ఆనాడు మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు బీజం వేశారు. – 30 ఏళ్ల దూర దృష్టితో చంద్రబాబు ఆలోచన.. భవిష్యత్ అవసరాలు తీర్చనున్న GMR మాన్సాస్ ఎడ్యుసిటీ. *విశాఖపట్నం డిసెంబర్ 16 పున్నమి ప్రతినిధి*: నైపుణ్యం కోసం భవిష్యత్ లో ప్రపంచం.. ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం నాడు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో జిఎంఆర్, మన్సాస్ సంస్థల మధ్య ఏవియేషన్ ఎడ్యుసిటీ నిర్మాణం కోసం ఏం.ఓ.యు మార్పిడి కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో కలసి.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వేదికపై నుండి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కావడం దేశంలోనే చరిత్రాత్మక రోజు అని రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండటంతో పాటు.. ఓ ఉత్తరాంధ్ర వాసిగా చాలా గర్వపడుతున్నా అని అన్నారు. గడిచిన పద్ధెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల ప్రత్యేక దృష్టి ఉత్తరాంధ్ర పై నిలిపారని కితాబిచ్చారు. ఇన్నాళ్లు మనం చూసిన ఉత్తరాంధ్ర వేరు.. రేపటి ఉత్తరాంధ్ర వేరు అని స్పష్టం చేశారు. ప్రధానంగా ఏవియేషన్ రంగంలో ప్రపంచానికే కేంద్రంగా ఉత్తరాంధ్ర మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ మొదటి సారి బాధ్యతలు తీసుకున్నప్పుడు అందులో పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉండేవారని.. అనేక కీలక సంస్కరణలకు ఆనాడే ఆయన బీజం వేశారని అన్నారు. ప్రస్తుతం 12% వృద్ధి రేటుతో దూసుకుపోతున్న ఏకైక రంగం దేశ విమానయాన వ్యవస్థ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం 800 విమానాలు అందుబాటులో ఉంటే.. సమీప భవిష్యత్లో మరో 1700 విమానాలకు ఇప్పటికే ఆర్డర్లు వెళ్లాయని తెలిపారు. మిగిలిన లక్ష్యాలను పూర్తి చేసుకుని 3000 లకు పైగా విమానాలను కలిగి ప్రపంచంలోనే మేటిగా మన దేశ విమానాయన వ్యవస్థ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కో విమానం నుండి సరాసరి 100 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే.. లక్షలాది మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ఏవియేషన్ ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్ గా అభివర్ణించిన రామ్మోహన్ నాయుడు.. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఉన్నప్పటికీ.. అందుకు తగ్గ స్కిల్ సెంటర్లు లేవు అనే అసంతృప్తి ఉండేదని అన్నారు. తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రాష్ట్రంలో ఏవియేషన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలసి ఏవియేషన్ యూనివర్సిటీ ఆలోచన పంచుకుందామని ఆలోచన చేస్తే.. నా కన్నా ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విజన్ ను స్పష్టం చేశారని అన్నారు. 30,40 ఏళ్ల తర్వాత ప్రపంచం ఏమని ఆలోచిస్తుందో ముందే ఊహించే చంద్రబాబు నాయుడు.. ఏవియేషన్ యూనివర్సిటీ గురించి తన ఆలోచన చెప్పడం ఆశ్చర్యపోయా అని అన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం శరవేగంగా జరుగుతోందని.. ఒక నెల రోజుల్లో వ్యాలీడేషన్ ఫ్లైట్ ల్యాండ్ కానుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మొత్తంగా విమానాశ్రయం నిర్మాణం పూర్తి జూన్ 2026 అనుకున్నాం కానీ.. అంతకన్నా ముందే ప్రారంభించే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపారు. జిఎంఆర్ మన్సాస్ ఎడ్యుసిటీ గురించి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం నారా లోకేష్ తీవ్రంగా శ్రమించారని కితాబిచ్చారు. ఏవియేషన్ యూనివర్సిటీ అంటే ఒక కళాశాల కే పరిమితం అవుతుందని.. ఎడ్యుసిటీ గా మార్చడం వల్ల, అమెరికా వంటి ఇతర దేశాల్లో ఉన్న స్కిల్ కాలేజీలు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. లోకేష్ ఆలోచన మేరకు ఏవియేషన్ యూనివర్సిటీ ను.. ఎడ్యుసిటీ గా మార్చామని తెలిపారు. దీని ద్వారా మన దేశీయ ఏవియేషన్ అవసరాలు తీరడంతో పాటు.. ప్రపంచానికి కూడా వనరులు అందిస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర కు పూసపాటి కుటుంబం ఎంతో చేసిందని.. వారికి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు. పూసపాటి వంశీయులు మన ప్రాంతంలో ఉండటం ఉత్తరాంధ్ర చేసుకున్న అదృష్టం అని అన్నారు. ఎన్నో రాజ వంశీయుల కుటుంబాలు ఉన్నా.. విద్య పేరు చెబితే.. ధారాళంగా భూములు ఇచ్చే కుటుంబం పూసపాటి వంశం అని కితాబిచ్చారు. 136 ఎకరాలు ఇవ్వడం పై ధన్యవాదాలు తెలిపారు. GMR సంస్థ కూడా ఉత్తరాంధ్ర ప్రొడక్ట్ గా అభివర్ణించిన రామ్మోహన్ నాయుడు.. GMR.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి గౌరవం తెచ్చారని అన్నారు. విలువలు, మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ.. మన ప్రాంతానికి శక్తిని ఇచ్చే కార్యక్రమాలు GMR సంస్థ చేస్తోందని అన్నారు. ఈ ఎడ్యుసిటీ కి సంబంధించి నారా లోకేష్.. ఎలాంటి టైమ్ లైన్ ఇచ్చినా.. పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దీనికి ప్రతిగా పన్నెండు నెలల్లో పూర్తి చెయ్యాలని నారా లోకేష్ బదులిచ్చారు. రీసెర్చ్, ఇన్నోవేషన్.. ఈ ఎడ్యుసిటీ లో వృద్ధి చెందుతాయని.. నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం ఉన్న నేపథ్యంలో.. రాబోయే డిమాండ్ ను తట్టుకునేందుకు ఈ ఎడ్యుసిటీ ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి అందరూ సహకరించి.. భాగస్వామ్యం అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అదితి గజపతి రాజు, GMR సంస్థ నుండి GBS రాజు, ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది*

*జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది* *ఈ రోజు ఏపీలో మీరు చూస్తున్నది ఓ చరిత్ర* *కొంతమంది విజన్ లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు* *ఏపీ అభివృద్ధికి మిస్సైల్స్ గా పనిచేస్తున్నాం* *ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25 శాతం తెలుగువారు ఉండాలనేది లక్ష్యం* *జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ ప్రారంభ వేడుకలో మంత్రి నారా లోకేష్* *మంత్రి నారా లోకేష్ సమక్షంలో జీఎంఆర్- మాన్సాస్ మధ్య ఎంవోయూ* *విశాఖపట్నం డిసెంబర్ 16 పున్నమి ప్రతినిధి* జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఈ రోజు ఏపీలో మీరు చూస్తున్నది ఓ చరిత్ర. ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25 శాతం తెలుగువారు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు పనిచేస్తున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్ట్ సహకారంతో భోగాపురం సమీపం భీమిలి మండలం అన్నవరం వద్ద 136.63 ఎకరాల్లో జీఎంఆర్ సంస్థ అభివృద్ధి చేయనున్న జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ కు నేడు అంకురార్పణ జరిగింది. విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్ లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో జీఎంఆర్- మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రాజెక్ట్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. బీహార్ లో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లినప్పుడు చాలా మంది కేంద్ర, రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అక్కడ ఓ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నాను. 18 నెలలుగా ఏపీలో ఏదో మ్యాజిక్ జరుగుతోందని, ఆ మ్యాజిక్ వెనుక సీక్రెట్ ఏంటని ఆయన అడిగారు. ఒకటి మిస్సైల్స్, రెండోది జీపీఎస్ అని నేను సమాధానం చెప్పారు. జీపీఎస్ అంటే వేదికపై ఉన్న అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు లాంటి పెద్దలు. మిస్సైల్స్ కూడా వేదికపై ఉన్నారు. మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కె.రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. మేం మిస్సైల్స్ గా పనిచేస్తున్నాం. జీపీఎస్ కూడా చాలా అవసరం. *ఈ రోజు ఏపీలో మీరు చూస్తున్నది ఓ చరిత్ర* ఈ రోజు ఏపీలో మీరు చూస్తున్నది ఓ చరిత్ర. మేం చరిత్ర సృష్టిస్తున్నాం. ఏపీకి ఏదో చేయాలి అని ఇక్కడున్న పెద్దలందరూ అహర్నిశలు కృషిచేస్తున్నారు. విభజనతో మనం చాలా నష్టపోయాం. దక్షిణ భారతదేశంలో ఏపీ తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. దీనిని అధిమించాలని అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తులు వీరు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గెలుపు కోసం నేను ఎక్కువ కష్టపడుతున్నాను. ఎందుకంటే ఐటీ కంపెనీలు ఎక్కువగా భీమిలికే వస్తున్నాయి. *ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ జీఎంఆర్* జీఎంఆర్ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. ఇక్కడే మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన పదో తరగతి ఫెయిల్ అయ్యారు. తర్వాత పట్టుదలతో చదివి దేశానికే కాదు.. ప్రపంచానికే అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు. జీఎంఆర్ గారు శంషాబాద్ విమానాశ్రయం నిర్మించాలని భావించినప్పుడు చంద్రబాబు గారికి సందేహం ఉండేది. తర్వాత తన సామర్థ్యం నిరూపించుకున్నారు. చంద్రబాబు గారిని ఒప్పంచి ప్రపంచంలో నెం.1 ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు. అనుకున్నది సాధించారు. ఈ రోజు తెలంగాణ జీడీపీలో 12 శాతం జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ అందిస్తోంది. ఎయిర్ పోర్ట్ కు 5వేల ఎకరాలు అవసరమా అని ఆనాడు ఎగతాళి చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఈ రోజు వెళ్లి చూడండి. బెంగళూరు, చెన్నైలలో రెండో ఎయిర్ పోర్ట్ నిర్మించే పరిస్థితి. చంద్రబాబు గారి విజన్ వల్ల హైదరాబాద్ కు ఆ అవసరం లేదు. వచ్చే వందేళ్లను దృష్టిలో పెట్టుకుని నిర్మించారు. *ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25 శాతం తెలుగువారు ఉండాలనేది లక్ష్యం* విజన్ అనేది చాలా అవసరం. కొంతమంది విజన్ లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు. చంద్రబాబు గారు రాజుగారిని కలిసిన తర్వాత ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25 శాతం తెలుగువారు ఉండాలనేది లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని చెప్పారు. దేశంలో కనీసం 70శాతం వర్క్ ఫోర్స్ తెలుగువారు ఉండాలన్నారు. చంద్రబాబు గారు తన విజన్ తో ఆదేశాలు జారీ చేశారు. ఒక వరల్డ్ క్లాస్ ఇన్ స్టిట్యూట్ తయారు చేయాలని. ఏదో ఒక యూనివర్సిటీ ఏర్పాటుచేయడం కాదు.. కామన్ ఇన్ ఫ్రాస్టక్చర్, ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని మేమంతా భావించాం. బెస్ట్ ఇన్ క్లాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీని తీసుకువస్తేనే మన ప్రాంత రూపురేఖలు మారతాయని ఆనాడు మేం తీసుకున్న ఒక నిర్ణయం ఇది. *వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప వంశీయులు పూసపాటి వారు* ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు గురించి ఆలోచిస్తున్న సమయంలో విశాఖ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు. మాన్సాస్ ట్రస్ట్ కు ఉన్న భూముల గురించి వివరించారు. వరల్డ్ క్లాస్ ఇన్ స్టిట్యూట్ ను తీసుకువస్తే మేం ఉచితంగా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతిరాజు. వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప కుటుంబం వారిది. అయితే ఎంవోయూ ఫైల్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. నేను ఫాలో అప్ చేస్తున్నప్పుడు సీఎం సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసి ఉచితంగా భూమి ఇస్తున్నారని ఫైల్ లో ఉందని, ఇది సాధ్యం కాదు అన్నారు. టోకెన్ అమౌంట్ కానీ, రూపాయి అయినా కట్టాల్సి వస్తుందేమో అన్నారు. అదితి గారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు రూపాయికి కూడా వారు ఒప్పుకోలేదు. గొప్ప మనసుతో వారు ఉచితంగా భూములు అందించారు. మా బ్లడ్ లోనే ఏవియేషన్ ఉంది అని, మాన్సాస్ పేరు పెడితే చాలని చెప్పారు. ఈ సభాముఖంగా అశోక్ గజపతిరాజు గారికి, అదితి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. *జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది* ఈ ఎడ్యుసిటీ కేవలం దేశానికి, రాష్టానికే కాదు.. ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవబోతోంది. ఐఎస్ బీ సంస్థ గురించి ఏవిధంగా విన్నారో దానికంటే బెటర్ గా ఉంటుంది. ఏవియేషన్ ఎడ్యుసిటీని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని మేం అహర్నిశలు కష్టపడుతున్నాం. ఏపీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. క్లసర్ విధానంలో ముందుకు వెళ్తాం. వివిధ జిల్లాల్లో 20కిపైగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం. ఈ క్లస్టర్లలో కేవలం కంపెనీలు తీసుకురావడమే కాకుండా.. మొత్తం ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తాం. ఏవియేషన్ రంగంలో ఒక ఇంజన్ తయారు చేయాలంటే సుమారు వెయ్యి కంపెనీలు వాళ్ల కాంపోనెంట్స్ ఇస్తారు. ఇది వర్టికల్ విధానం. హారిజాంటల్ క్లస్టర్ విధానంలో ఎడ్యుకేషన్. ఏవియేషన్ ఎడ్యుకేషన్ అనేది హారిజాంటల్. *ఎడ్యుకేషన్ ను ఇండస్ట్రీని ఇంటిగ్రేడ్ చేస్తాం* ప్రపంచానికే మన టాలెంట్ అందజేయాల్సిన అవసరం ఉంది. ప్రతి క్లస్టర్ లో సిస్టమాటిక్ అప్రోచ్ తో ముందుకు వెళ్తున్నాం. ఎడ్యుకేషన్ ను ఇండస్ట్రీని ఇంటిగ్రేడ్ చేస్తాం. యువకులను జాబ్ రెడీగా తయారుచేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. క్లస్టర్ బేస్ అప్రోచ్ మోడల్ ఫాలో అయ్యే ఒకే ఒక దేశం చైనా. క్లస్టర్ బేస్ అప్రోచ్ ఏపీ తీసుకుంటుంది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యం. ఇందుకోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చాం. ప్రజల సహకారం కూడా చాలా అవసరం. *99 పైసలకే భూములు ఇవ్వడం వల్ల టీసీఎస్, కాగ్నిజెంట్ వచ్చాయి* ఫార్చ్యూన్ 500 కంపెనీలకు 99 పైసలకే భూములు ఇస్తామంటే చాలామంది ఎగతాళి చేశారు. ఆ ఒక్క నిర్ణయం వల్ల టీసీఎస్, కాగ్నిజెంట్ వచ్చాయి. రాబోయే వంద రోజుల్లో మరో రెండు ఐటీ కంపెనీలు కూడా విశాఖకు రానున్నాయి. చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నాం. మంచి మనసుతో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరిస్తారు. ప్రకృతి సహకరిస్తుంది. ఐఎస్ బీ ఏర్పాటుచేసినప్పుడు చాలా మంది సాహసోపేత నిర్ణయం అన్నారు. చంద్రబాబు గారు వెనక్కి తిరిగి చూడలేదు. ఈ రోజు హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో చూశాం. అలాంటి సాహసోపేత నిర్ణయాలు మేం తీసుకుంటాం. మిస్సైల్స్ రెడీ గా ఉన్నాయి. అద్భుతమైన జీపీఎస్ లు కూడా మాకు ఉన్నాయి. మాకు ఏదైనా గైడెన్స్ కావాలంటే టైం టూ టైం ఇస్తారు. కలిసికట్టుగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను నెం.1గా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. *12 నెలల్లో ఏవియేషన్ ఎడ్యుసిటీని అభివృద్ధి చేస్తాం* నిన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి స్టూడెంట్ మాక్ అసెంబ్లీ గురించి వివరించాను. బాలల రాజ్యాంగ పుస్తకం గురించి చెప్పాను. దేశవ్యాప్తంగా ఈ మోడల్ ను ఇంప్లిమెంట్ చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. స్పీకర్ గారి సహకారంతో ఇదంతా చేయగలిగామని చెప్పాను. మిస్సైల్, జీపీఎస్ కు ఓ ఉదాహరణ చెబుతాను. శాసనసభలోనే స్టూడెంట్ మాక్ అసెంబ్లీ నిర్వహణకు నేను విజ్ఞప్తి చేశాను. రూల్స్ అంగీకరించవని అయ్యన్నపాత్రుడు గారు చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలోనే శాసనసభ సెట్టింగ్ వేసి నిర్వహించాలని చెప్పారు. కొంతమంది ప్రతిపక్ష నేతలకు తాము ఎక్కడ మాక్ అసెంబ్లీ నిర్వహించామో కూడా తెలియదు. మాపై ఆరోపణలు చేశారు. జీపీఎస్ గొప్పతనం ఏంటో అప్పుడు నాకు అర్థమైంది. టీడీపీలో పనిచేయడం మాలాంటి వారికి అదృష్టం. ఓ వైపు సీనియర్స్ గైడెన్స్, ప్రోత్సాహం మాకు దక్కుతోంది. మరోవైపు సీఎం గారు మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి మరో సెక్టార్ లో యూనివర్సిటీ తీసుకురావాలని భావిస్తున్నామం, ఇందుకు సంబంధించిన గైడెన్స్ కూడా అప్పుడే ఇచ్చారు. ఎడ్యుసిటీ ఏర్పాటులో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారి సహకారం కూడా

విశాఖపట్నం

విశాఖ దక్షిణ నియోజకవర్గం జోన్ 4 కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్సీ నిర్వహన

*విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి* ఉదయం 11:00 గంటలకు విశాఖ దక్షిణ నియోజకవర్గం జోన్ 4 కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్సీ నిర్వహించారు, ఈ కార్యక్రమం లో వివిధ వార్డులనుండి వచ్చిన అర్జీలను విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు స్వయంగా స్వికరించి ఆయా ప్రభుత్వ శాఖలా ప్రతినిధులకు అందచేశారు, అనంతరం వివిధ రకముల అనారోగ్య సమస్యలతో బాధపడిన పేద కుటుంబములకు చెందినవారు చికిత్స అనంతరము ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, గౌరవ ముఖ్య మంత్రి వర్యులు వారు, సదరు కుటుంబాల వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తము చెక్కుల ద్వారా ఆర్ధిక సహాయము అందజేసినారు, సదరు చెక్కులను గౌరవ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు విశాఖ జనసేన పార్టీ నగర అధ్యక్షులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారి చేతులమీదుగా లబ్దిదారులకు చెక్యూలు పంపిణీ చేసినారు. Cmrf లబ్దిదారుల వివరాలు: 1) 29 వార్డుకు చెందిన చెన్న జీవ రత్నం గారికి రూ, 2,00,000/-, 2) 31 వార్డుకు చెందిన విరోతి రాజేష్ గారికి రూ, రూ,47,500/-, 3) 32 వార్డుకు చెందిన కమిరెడ్డి వెంకట మోహన్ రెడ్డి గారికి రూ, 1,26,868/-. ఈ కార్యక్రమం లో బాధితులతో పాటు ప్రభుత్వ అధికారులు, ఆ యా వార్డులకు చెందిన కూటమి వార్డ్ కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కోటి సంతకాల ఉద్యమ ర్యాలీ సూపర్ సక్సెస్*…. * *ఉవ్వెత్తిన ఎగిసిన దక్షిణ శ్రేణుల నిరసన జ్వాల*

*కోటి సంతకాల ఉద్యమ ర్యాలీ సూపర్ సక్సెస్*…. * *ఉవ్వెత్తిన ఎగిసిన దక్షిణ శ్రేణుల నిరసన జ్వాల* * *కూటమి సర్కార్ పై మిన్నంటిన ప్రజా వ్యతిరేకత* * *పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి ప్రైవేటుపరం* * *పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేయడమే చంద్రబాబు ధ్యేయం* — *విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్* *విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి* జిల్లా వైఎస్ఆర్సిపి నిర్వహించిన కోటి సంతకాల ప్రతుల వ్యాన్ ర్యాలీ ఉద్యమం సూపర్ సక్సెస్ అయిందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విజయవంతం పట్ల కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అధిక సంఖ్యలో వ్యతిరేకిస్తున్నారనడానికి చిహ్నమన్నారు. ఈ మేరకు 35 వ వార్డు అధ్యక్షులు అలుపున కనక రెడ్డి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ సక్సెస్ సమావేశంలో వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని ఆరోపించారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైందన్నారు. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారని చెప్పారు. ఇందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభమైందన్నారు. ఈ సమయంలోనే తుపాను, వర్షాలు వచ్చాయని, దీంతో ఈ కార్యక్రమం ప్లాప్ అవుతుందని కూటమి సర్కార్ సంతోషించిందన్నారు కానీ, ప్రభుత్వ వ్యతిరేక ప్రజాభిప్రాయం సేకరణ ఏ దశలోనూ ఆగిపోలేదని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగిందన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంకల్పించారని, అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారని, తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్ ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించిందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విశాఖలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు. సంతకాల ప్రతుల వాహనాన్ని జీవీఎంసీ నుంచి మద్దిలపాలెం వరకు భారీ ర్యాలీగా నిర్వహించడం జరిగిందన్నారు. ఇకపై కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వైసిపి ఎండ గడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పిలుపుతో తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇదే తరహాలో…. జగనన్న జన్మదిన వేడుకలు జరగాలి! కోటి సంతకాల ఉద్యమ ర్యాలీ సక్సెస్ తరహాలో ఈనెల 21వ తేదీన జనహృదయనేత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విజయవంతం చేయాలని వాసుపల్లి పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట తప్పని ఏకైక లీడర్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే నని అన్నారు. అటువంటి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. సంచలనాత్మక నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారన్నారు. పేద , మధ్య అన్ని తరగతుల ప్రజలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ వైసీపీ నేనని అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ అకుంఠ దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వాడ వాడలా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని దక్షిణ నియోజకవర్గ పరిధిలో పలు సేవా కార్యక్రమాలతో పాటు భారీ కేక్ కటింగ్ లు సంబరాలు నిర్వహిస్తామని వాసుపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ,ఎంవోయూ మార్పిడి*

*జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ,ఎంవోయూ మార్పిడి* *విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి* ​భారతదేశంలోనే మొట్ట మొదటి జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుకు సంబంధించిన అంకురార్పణ,ఎంవోయూ మార్పిడి కార్యక్రమం విశాఖ లోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో అట్టహాసంగా జరిగింది ​ముఖ్య అతిథులుగా ​గోవా గవర్నర్,​మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు,​ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు,​కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు,​రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఎం.ఎస్.ఎం.ఈ.,సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్,​జీఎంఆర్ రాజు ​పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతి నిధులు మరియు అధి కారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాన్సాస్ ట్రస్ట్, ఈ ప్రతిష్టాత్మక ఏవియేషన్ ఎడ్యుసిటీ కోసం భీమిలి మండలం అన్నవరం గ్రామం లో 136.63 ఎకరాలభూమిని కేటాయించింది. *కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇది చరిత్రకత్మక దినం ఉత్త రాంధ్ర ఒకప్పుడు వెనుక బడ్డ ప్రాంతం వలసల ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి చెందిన విశాఖగా మార్చారు 18 నెలల్లో చంద్రబాబునాయుడు లోకేష్ పౌర విమానయానం అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభాగం ఇది అత్యంత ప్రాముఖ్యత కలగడానికి ప్రధాని మోడీ కారణం ప్రతి సం.12శాతం గ్రోత్ రేట్ ఉంది అంటే అప్పటి మంత్రి ఇప్పటి గవర్నర్ అయిన అశోక్ గజపతి రాజు పేజీ కనపడు తుంది 800 ఎయిర్ క్రాఫ్ట్ లు ప్రస్తుతం ఉన్నాయి 1700 ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ 100 రకాలు ఉద్యోగాలు ఉంటాయి ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కి అగ్రికల్చర్,ఇన్ఫ్రా,ఏవి యేషన్ తదితర అనేక అంశాలు పై చంద్రబాబు నాయుడుకి పూర్తి అవ గాహన ఉంటుంది రాబోయే 30,40 సం తరవాత ఏమి అవసరం అనే ఆలోచన చేస్తారు నెల రోజుల్లో ట్రయల్స్ జరుగుతాయి భోగా పురంలో జూలై లో భోగా పురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వుంటుంది యూనివర్సిటీ నీ ఎదుసిటీగా మార్చాం ప్రపంచంలో ఏ యూనివర్సిటీ తో అయినా మనం దీనిలో తేవచ్చు వలసలకు మనం వెళ్ళే రోజులు నుండి మన వద్దకు ప్రపంచం వచ్చే విధంగా తీర్చి దిద్దారు చంద్రబాబు నాయుడు *నారా లోకేష్ కామెంట్స్* బీహార్ లో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారంకి వెళ్ళాం గడిచిన 18నెలల్లో ఏపీలో ఒక మ్యాజిక్ జరుగుతుంది అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు మెసైల్స్,జి పి ఎస్ రెండు కలిసి పని చేస్తున్నాం తలసరి ఆదాయం తక్కువ ఉంది అని అహర్నిశలు కష్ట పడుతున్నాం అన్ని ఐటీ కంపెనీలు భీమిలికి వస్తున్నాయి జిఎంఆర్ 10వ తరగతి ఫెయిల్ అయ్యారు ఆ తర్వాత మాన్సాస్ లో ఇంటర్ చదివి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ లు కడుతున్నారు సెంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం టైమ్ లో కొంత మంది ఎగతాళి చేశారు ఎయిర్పోర్ట్ కి 5వేల ఎకరాలు అవసరమా అని ఇప్పడు దాని విలువ అర్థం అవు తుంది కొన్ని చోట్ల ఇప్పుడు 2వ ఎయిర్పోర్ట్ నిర్మాణం కి ట్రై చేస్తున్నారు సివిల్ ఏవియేషన్ లో ప్రపంచంలో 25శాతం మన తెలుగు వారు ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన ఒక గజం భూమి కోసం కొట్టు కుంటున్న సమాజంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తున్నారు గజపతి కుటుంబం దీనికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు భూములు నిమిత్తం అంత గొప్ప కుటుంబం గజపతి కుటుంబం *గంటా శ్రీనివాసరావు బీమిలి ఎమ్మెల్యే కామెంట్స్* మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పెద్దలు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ సిఈవో శివ ప్రసాద్ రాజు,ఐటీ మంత్రి లోకేష్ కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు ముందు ఉంటారు హైదర బాద్ నగర అభివ్రుద్ది చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది దేశ యావత్తు రాజకీయాలు ఏపీ భవన్ లో ఉండేవి శంషాబాద్ విమానా శ్రయం నిర్మాణంలో ముఖ్య భూమిక చంద్రబాబు నాయుడుది భోగాపురం ఎయిర్ పోర్ట్ ను అను సంధానం చేసుకుంటూ విశ్వ విద్యాలయం ఏర్పాటు చూస్తే చంద్రబాబు నాయుడు విజన్ అర్ధం అవుతుంది ఈ 18 నెలల్లో మొత్తం ఇకో సిస్టమ్ తీసుకొచ్చారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముఖ్య భూమిక పోషిస్తున్న వ్యక్తి లోకేష్ ఒకప్పుడు విమానం లగ్జరీ ఇప్పుడు అవసరం అయింది 12నెలలు అంటే కుదరదు ఒకరోజు ముందే పూర్తి చేయాలి అనే అంత ఆలోచనతో లోకేష్ పని చేస్తున్నారు *గోవా గవర్నర్,​మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు కామెంట్స్* ఉత్తరాంధ్ర విద్యార్ధులకు మంచి విద్యా మా ట్రస్ట్ నుండి ఇస్తున్నాం మన ప్రాంతానికి ఒక నైపుణ్యం కలిగిన ఎడ్యు కేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు దీనిపై అతి ఎక్కువ శ్రద్ధ తీసుకున్న చంద్రబాబు నాయుడు లోకేష్ లకి ప్రత్యేక ధన్యవాదములు *అయ్యన్న పాత్రుడు స్పీకర్ కామెంట్స్* 1983లో రాజకీయాలు లోకి వచ్చాను అప్పటి నుండి చూస్తున్న ఇప్పుడు ఉత్త రాంధ్రకీ మహర్దశ వచ్చింది ఉత్తరాంధ్రకీ ఎన్ టి రామా రావు ఒక గుర్తింపు తెచ్చారు ఇప్పుడు చంద్ర బాబు, లోకేష్ మమ్మల్ని నిద్ర పోవడం లేదు రాష్ట్ర అభివృద్ధి కి కూటమి ప్రభుత్వం పని చేస్తుంది ఇంతలా పని చేస్తున్న కూడా ఇంకా అడ్డంకులు సృష్టి స్తున్నారు పార్టీలు ఉంటాయి కానీ మంచి కార్యక్రమంకి ప్రోత్సాహం ఉండాలి జీఎంఆర్ మల్లికార్జున ఢిల్లీ లో ఒకమాట అన్నారు నా ప్రాంతంలో నాకు ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం కలిగింది ఏవి యేషన్ యూనివర్సిటీ కి భూములు ఇచ్చిన ఘనత అశోక్ గజపతి రాజుది ఇప్పటి రోజుల్లో 10వేలు డొనేషన్ చేసి లక్ష రూపాయల ప్రచారం చేసుకుంటున్నారు వేల కోట్లు రూపాయలు విలువ చేసే భూములు ఆస్తులు ప్రజలకి ఇచ్చేసి సామాన్య జీవితం గడుపు తున్న వ్యక్తి అశోక్ గజపతి రాజు పెద్ద పెద్ద ప్రాచీన్యత పొందిన వ్యక్తులు అనేక మంది ఈ మాన్సాస్ నుండి వచ్చినవారే

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.