Saturday, 14 March 2026

Blog

విశాఖపట్నం

మే లో భోగాపురానికి ఎయిర్ పోర్ట్

భోగాపురం ఎయిర్ పోర్టును అందంగా సిద్ధం చేస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వచ్చేనెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయనగరం-విశాఖపట్నం జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటు చేయనున్న జీఎంఆర్- మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ప్రారంభ వేడుకలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్కు ఎయిర్పోర్టును ప్రారంభించాలనుకున్నామని, కానీ, ఒక నెల ముందే ప్రారంభిస్తామన్నారు. ఎడ్యు సిటీ ఉంటే ఎన్నో విద్యాలయాలు, యూనివర్సిటీలు పెట్టుకోవచ్చన్నారు. ఏవియేషన్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు.

కామారెడ్డి

గంగపుత్ర సంఘం ఆద్వార్యంలో సన్మానం!

కామారెడ్డి, 17 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి నూతన సర్పంచ్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా, రామారె డ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బండి ప్రవీణ్ , ఉపసర్పంచ్ హనమయోల్ల నవీన్ గ్రామ పంచాయ తీ 3వ వార్డు మెంబర్ పిప్పరి లింబాద్రి లకు గంగ పుత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రాండ్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఈ ఉత్సవాత్మక కార్యక్రమం రామారెడ్డి ప్రాంతంలో జరిగింది.గంగ పుత్రసంఘం సభ్యులు అందరూ సమ్మిలితమై, నూతన నాయకులకు శాలువాలు కప్పి సన్మానించారు.ఈ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజలలో ఉత్సాహా న్ని రేకెత్తించింది. యువకులు అభినందాలు తెలిపుతూ, కొత్త నాయకుల భవిష్యత్ కార్యక్రమా లకు ఆదర్వాంధలు చెప్పుకున్నారు.ఈ సందర్భం గా మాట్లాడిన యువజన సంఘ నాయకులు, “ఇది మా గ్రామంలో కొత్త యుగం ప్రారంభం. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి కొత్త రంగులు తీసుకురావాలి” అని పిలుపునిచ్చారు. ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి సంతోషంగా పాల్గొని, గ్రామంలో ఐక్యతను ప్రదర్శించారు.

కామారెడ్డి

గంగపుత్ర యువజనుల సన్మానం!

కామారెడ్డి, 17 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి నూతన సర్పంచ్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా, రామారె డ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బండి ప్రవీణ్ , ఉపసర్పంచ్ హనమయోల్ల నవీన్ గ్రామ పంచాయ తీ 3వ వార్డు మెంబర్ పిప్పరి లింబాద్రి లకు గంగ పుత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రాండ్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఈ ఉత్సవాత్మక కార్యక్రమం రామారెడ్డి ప్రాంతంలో జరిగింది.యువజన సంఘ సభ్యులు అందరూ సమ్మిలితమై, నూతన నాయకులకు శాలువాలు కప్పి సన్మానించారు.ఈ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజలలో ఉత్సాహా న్ని రేకెత్తించింది. యువకులు అభినందాలు తెలిపుతూ, కొత్త నాయకుల భవిష్యత్ కార్యక్రమా లకు ఆదర్వాంధలు చెప్పుకున్నారు.ఈ సందర్భం గా మాట్లాడిన యువజన సంఘ నాయకులు, “ఇది మా గ్రామంలో కొత్త యుగం ప్రారంభం. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి కొత్త రంగులు తీసుకురావాలి” అని పిలుపునిచ్చారు. ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి సంతోషంగా పాల్గొని, గ్రామంలో ఐక్యతను ప్రదర్శించారు.

ఆంధ్రప్రదేశ్

జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

కొండాపురం, పున్నమి న్యూస్, డిసెంబర్ 17,(నాగరాజు కె). తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అభిమాన పాత్రుడు బీద రవిచంద్ర నెల్లూరు పార్లమెంటు టిడిపి నూతన అధ్యక్షులుగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని, వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మాజీ జిల్లా టిడిపి కార్యనిర్వాహ కార్యదర్శి చెరుకూరి వెంకటాద్రి నాయుడు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గతంలో బీద రవిచంద్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కాలములో కొండాపురం మండల టిడిపి అధ్యక్షుడిగాను, జిల్లా టిడిపి కార్యనిర్వాహ కార్యదర్శి గాను తాను పనిచేసినట్లు చెప్పారు.జిల్లా పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్న రవిచంద్ర ని పార్టీ అధిష్టానం అధ్యక్షుడిగా నియమించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.గతంలో కొండాపురం జడ్పీటీసీగా పనిచేసిన కాలము నుండి రవిచంద్ర కుటుంబముతో మంచి సంబంధాలు ఉన్నట్లు చెప్పారు.అంతే కాకుండ రాజకీయాల్లో పరిణతీతో కూడిన నైతిక విలువలు కలిగిన నేతగా బీద రవిచంద్రను అభివర్ణించారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి రవిచంద్ర చేసిన కృషి అజరామరం అన్నారు. బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాయలసీమ జోన్ ఇంచార్జిగా, గతంలోనూ టిడిపి నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర తెలుగు యూవత అధ్యక్షులు గా విభిన్న హోదాలలో పదవులను అలంకరించి తెలుగుదేశం పార్టీకి మరింతగా వెన్ను తెచ్చిన మహా నేత అని అభిప్రాయపడ్డారు. బడుగు బలహీనవర్గాల కు చెందిన బలమైన నేతగా ఉన్న బీద రవిచంద్ర యాదవ్ ను ఆయన పార్టీకి అందించిన విశేషమైన సేవలను గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీదర్ రవిచంద్ర ను నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులుగా నియమించడం పట్ల టిడిపి శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపినట్లుందని చెరుకూరి వెంకటాద్రినాయుడు అన్నారు

తూర్పు గోదావరి

సమాజానికి ఎంతో ఆదర్శముగానిలుస్తున్న చిడిపి గ్రామం అంగన్వాడీ ఆయా కుటుంబం.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం లోని చిడిపి గ్రామానికి చెందిన ప్రత్తిపాటి వెంకటలక్ష్మి అంగన్వాడీ ఆయగా పని చేస్తూ తనకు వచ్చిన జీతం లో నుండి కొంత తన తల్లిదండ్రులు కీ” శే ” కొయ్య అప్పారావు మరియమ్మ ల జ్ఞాపకార్ధముగ పలు సేవ కార్యక్రమాల్లో భాగముగ, 3 వేల రూపాయలు తో చిడిపి గ్రామం అంగన్వాడీ కేంద్రానికి బాత్ రూమ్ డోర్, గడియారం, గ్రామ ప్రజలు ప్రయాణ సౌకర్యార్థం 10 వేల రూపాయలు తో సిమెంట్ బల్లలు, ఏర్పాటు చెయ్యడం జరిగింది. మరియు తన కుమారుడు ప్రత్తిపాటి నాగరాజు ద్వారా దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తముగ సమాజామే కుటుంబముగ పలు సేవాకార్యక్రమాలు చెయ్యడానికి తన కుమారుడిని నిరంతరం ప్రోత్సహిస్తూ సహాయం అందిస్తున్నారు. సమాజం మనకు ఏమి ఇచ్చింది అని కాకుండా మనం సమాజానికి ఏమి చేసాం అనే మంచి సంకల్పం తో కుటుంబ సమేతముగ సమాజానికి ఆదర్శముగ,చిడిపి గ్రామం లోని అంగన్వాడీ ఆయా ప్రత్తిపాటి వెంకటలక్ష్మి కుటుంబం నిలుస్తుంది అని అంగన్వాడీ సూపర్వైజర్ యాడంగి భాగ్యకుమారి ప్రత్తిపాటి వెంకటలక్ష్మి కి అభినందనలు తెలియజేసారు,ఈ కార్యక్రమం లో ప్రత్తిపాటి వెంకటలక్ష్మి, ఆశా కార్యకర్త కొయ్య దమయంతి ,అంగన్వాడీ టీచర్ అక్కాబత్తుల నానెమ్మ, దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి ప్రత్తిపాటి నాగరాజు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు తహశీల్దార్ కార్యాలయంలో న్యాయం జరగలేదంటూ ఓ కుటుంబ ఆవేదన

తురకపల్లి గ్రామం దుత్తలూరు మండలoలో తహశీల్దార్ కార్యాలయంలో న్యాయం జరగలేదంటూ ఓ కుటుంబం ఆవేదన 846/6 లో సర్వే నెంబర్ 50 సెంట్లు భూమి కలిగిన శ్రీకాంత్ భూమిని అదే గ్రామానికి చెందిన నేలటూరి అనే సింహాద్రి వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించి ఉన్నారు ఈ విషయం పై 2025 ఫిబ్రవరి లో దుత్తలూరు తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది తహశీల్దార్ యనమల నాగరాజు సానుకూలంగా స్పందించారు అప్పటికి న్యాయం జరగకపోవడంతో PGRS లో కంప్లైట్ ఇచ్చిన తరువాత ఆగస్ట్ లో కావలి రెవెన్యూ డివిజన్ అధికారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఈ విషయం పై వెంటనే స్పందించి ఎండోస్ మెంట్ ఇచ్చారు సదరు విషయం పై దుత్తలూరు తహశీల్దార్ మీకు తగు న్యాయం చేస్తారంటూ రెవెన్యూ డివిజన్ అధికారి వెల్లడించారు అనంతరం దుత్తలూరు తహశీల్దార్ యనమల నాగరాజు ఇరువురిని పిలిపించి విచారించి నేను చెప్పేoతవరకు ఇరువురు భూమిని సాగు చేయకూడదు అని తెలిపారు వెళితే క టీన చర్యలు తప్పవనీ చెప్పారు ఐన కూడా నేలటూరి సింహాద్రి అను అతను అధికారుల మాటలు లెక్కచేయకుండా భూమిని సాగు చేసారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం….. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి అవగాహన సదస్సు……

విజయవాడ…. లబ్బీపేట న్యూస్ (డాక్టర్ మంజుల గుదిమెళ్ళ..పున్నమి ) శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 16- 12-2025 వ తేదీన ఎన్.ఎస్.ఎస్ విభాగం వారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ధ్యానం అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి చేసే మానసిక ,శారీరక సాధన, వ్యక్తిగత ఎదుగుదలకు మెదడు పనితీరు మెరుగు పడుతుందని ధ్యానం ద్వారా మన ఆలోచనలు భావాలను అర్థం చేసుకొని మేధస్సును పెంచుతుందని తెలియజేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు జి. పద్మజ ఎన్. మాధవి, బి.వి దుర్గాభవాని విద్యార్థినులతో కొన్ని ఆసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. వి.వి.ఎస్. కుమార్ గారు ,ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్. కె.సరళ శ్రీమతి .టీ. నాగరాణి పి. శ్రీ భారతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

రాష్ట్ర మంత్రికి ముక్కంటి ప్రసాదాలు అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 16, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి విజయవాడలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పలు సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు అనంతరం, మంత్రికి శ్రీకాళహస్తి క్షేత్ర ప్రసాదాలను, దైవ ఆశీస్సులతో కూడిన చిత్రపటాన్ని అందజేశారు.

తిరుపతి

మృతదేహా ఖననం ధరలను నీయంత్రించాలని వినతి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 16, శ్రీకాళహస్తిలోని స్మశాన వాటికలో మృత దేహాన్ని (ఖననం) పుడ్చడానికి వాటిక నిర్వాహుకులు బీద, బిక్కి అనే తేడాలేకుండా అధిక ధరలు అడుగుతూ ప్రజలను పిడిస్తున్నారని ఈ చర్యలపై నియంత్రణ తీసుకురావాలని కోరుతూ మంగళవారం నాడు పట్టణంలోని కొందమంది సమాజ శ్రేయోభిలాషులు మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రవి, శివకుమార్, చిరంజీవి, కోట ప్రసాద్,శివ, కిరణ్, వెంకటేశ్వరరావు, నాగరాజు, శ్రీనివాసులు, కోటేశ్వరరావు, రాజ, ఉదయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి నారాయణ పాఠశాలలో ఘనంగా విజయ్ దివాస్ వేడుకలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 16, పట్టణంలోని నారాయణ పాఠశాలలో విజయ్ దివాస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఈశ్వర్ మాట్లాడుతూ, భారతదేశం–పాకిస్తాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకునే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివాస్‌ను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ సైన్యం భారత్ ముందు లొంగిపోవడంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించిందని ఆయన వివరించారు. ఈ విజయం ద్వారా భారత సైన్యపు ధైర్యం, త్యాగం, వ్యూహాత్మక ప్రతిభ ప్రపంచానికి స్పష్టంగా తెలిసిందని పేర్కొన్నారు. విజయ్ దివాస్ దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళి అర్పించే రోజుగా, భారత సైన్యం సాధించిన అత్యంత ఘన విజయాల్లో ఒకటిగా, దేశభక్తి, జాతీయ ఐక్యతను మరింత బలపరచే సందర్భంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నదని ఈశ్వర తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు భారత ఆర్మీ సైనికుల వేషధారణలో, అలాగే డాక్టర్లు, నర్సులు సహా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల వేషధారణలో అలరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.