Saturday, 14 March 2026

Blog

E-పేపర్

ప్రజలే నా దేవుళ్లు.. నిరంతరం ప్రజాసేవే మేడిపల్లి నక్కర్త నా తల్లిలాంటిది’ ఆలంపల్లి లావణ్య నర్సింహా

పున్నమి ప్రతినిధి: ప్రజలే నా దేవుళ్లు.. నిరంతరం ప్రజాసేవే మేడిపల్లి నక్కర్త నా తల్లిలాంటిది’ ఆలంపల్లి లావణ్య నర్సింహా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మిత్రపక్షాల తరఫున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి ఆలంపల్లి లావణ్య నర్సింహా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్యానల్ వార్డు సభ్యులకు, మిత్రపక్ష అభ్యర్థులకు ఓటేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందఠరేగా మాట్లాడుతూ ఆయన “గెలుపు-ఓటములు రాజకీయాల్లో సహజం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నా సావాసం ప్రజలతోనే ఉంటుంది. ప్రజలే నా దేవుళ్లు. మేడిపల్లి నక్కర్త నా కన్న తల్లిలాంటిది” అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఎవరూ అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గెలిచిన పాలకవర్గంతో కలిసి గ్రామ అభివ ృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని, గెలుపు కోసం కష్టపడ్డ మిత్రపక్ష కార్యకర్తలకు, తనకు అండగా నిలిచిన మేడిపల్లి నక్కర్త గ్రామ ప్రజలందరికీ తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని లావణ్య నర్సింహా స్పష్టం చేశారు. గ్రామ ప్రజలంతా తన హృదయంలో ఎప్పటికీ పదిలంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రజల తీర్పును శిరసావహిస్తూ, ఎప్పుడూ గ్రామ అభివృద్ధి కోసం శాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. చివరగా “గెలుపు–ఓటమి సహజం ప్రజల తీర్పే అంతిమం” అని అన్నారు.

అన్నమయ్య

నందలూరు మండల వ్యాప్తంగా దోమల దండయాత్ర – ప్రజల ఆరోగ్యానికి ముప్పు, పట్టించుకోని అధికారులు

నందలూరు మండల వ్యాప్తంగా దోమల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామాల చుట్టుపక్కల, కాలనీలలో, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమల పెరుగుదల అధికమైంది. ఫలితంగా పట్టపగలే దోమలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. మండలంలోని ప్రధాన వీధులు, నివాస కాలనీలు, పాఠశాలల పరిసరాలు, అంగన్వాడీ కేంద్రాలు, డ్రైనేజీలు దోమల పుట్టిల్లుగా మారాయి. సాయంత్రం వేళ ఇళ్లలో ఉండడం కూడా కష్టంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని, నిద్రలేమి, దురద, జ్వరాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నప్పటికీ సంబంధిత ఆరోగ్య శాఖ, పంచాయతీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేలు, డ్రైనేజీ శుభ్రత కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం లేదని విమర్శిస్తున్నారు. గ్రామాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని, వెంటనే ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రత్యేక దోమల నివారణ డ్రైవ్ చేపట్టాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడే అవకాశముందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

కర్నూలు

ఎన్టీఆర్ వీరాభిమాని కలిసిన శ్రీశైలపుమహానంది (టైగర్ )…!

డిసెంబర్ 19 పున్నమి న్యూస్ ప్రతినిధి: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం గనేకల్ గ్రామంలో నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని అభిమానంతో ఇంటి గోడ పైన ఎన్టీఆర్ అని ముద్ర వేసుకున్న ఈ అభిమాని ఇంటికి వెళ్లి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారిని అభినందించిన మీ పసుపు సైనికుడు శ్రీశైలపుమహానంది, (టైగర్) తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు.

అన్నమయ్య

శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి

విజయవాడలో కొలువు దీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని గురువారం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాజంపేట టీడీపీ నాయకులు శ్రీ మేడా విజయ శేఖర్ రెడ్డి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు మరియు వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట లేబక గ్రామ సర్పంచ్ లంకయ్య గారి వెంకట నరసయ్య, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి మనోహర్ నాయక్, ఆడుపూర్ గురుకుల పాఠశాల చైర్మన్ ఇరువురి మురళి, దళిత నాయకుడు సాతపల్లి వెంకి తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

E-పేపర్

చింతపల్లిగూడ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన డాక్టర్,, ఉక్కుల అశోక్

పున్నమి ప్రతినిధి : చింతపల్లిగూడ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన డాక్టర్,, ఉక్కుల అశోక్ కొంగరకలన్ డివిజన్ డాక్టర్ ,, ఉక్కుల అశోక్ చింతపల్లిగూడ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుత పనుల ప్రగతి, నాణ్యత, పనితీరును సంబంధించిన అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చింతపల్లిగూడ వాసులకు ఇబ్బందులు లేకుండా రోడ్ పనులను త్వరితగతిన మరియు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డివిజన్ అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రతి పనిని పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు. *అతి త్వరలోనే మా ప్రియతమా నాయకుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసన సభ్యులు గౌ,, శ్రీ,,మల్ రెడ్డి రంగారెడ్డి మరియు రాష్ట్ర రోడ్డు డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌ,,శ్రీ,, మల్ రెడ్డి రాంరెడ్డి ప్రారంభిస్తారు* ఈ కార్యక్రమం లో DE, AE, వర్క్ ఇన్స్పెక్టర్ చింతపల్లిగూడ గ్రామ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్ నాయకులు శేరి రమేష్, జోగు మహేందర్, ఉడుతల రవి గౌడ్, జోగు నర్సింహ, భాస్కర్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు… *డా,, ఉక్కుల అశోక్* కొంగరకలాన్ డివిజన్

ఆదిలాబాదు

క్యాలెండర్ల విడుదల

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విడ్స్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల 2026 నూతన క్యాలెండర్లను ఇండస్ట్రియల్ జిఎం పద్మ భూషణ్ రాజు, ఎల్డియం ఉత్పల్ కుమార్ ధామ్, విడ్స్ సీసీ గంగాధర్, సిఎస్సి డిఎం రాహుల్, ఏఈఓ శివప్రసాద్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ కమలాకర్, సంతోష్ లు విడుదల చేశారు. ఈ సందర్భంగా డిఐసి జీఎం మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా నిర్వహించే అవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.ఎం.ఈ డిఎం పృథ్వీరాజ్, ఏడిఎం ఆదర్శ్, పీఎంఈజీపి శివ, సత్యనారాయణ, భూమన్న, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి

టెట్ వాయిదా వేయాలి రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ప్రభుత్వానికి డిమాండ్

*టెట్ వాయిదా వేయాలి* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు ప్రభుత్వానికి డిమాండ్* *🍥రాష్ట్రంలో జనవరి 3 నుంచి 20 నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను వాయిదా వేయాలని వెరీ వెరీ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎం ఎంఎన్ విజయకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఇరవై రోజులుగా రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, సహాయక ప్రిసైడింగ్ అధికారులుగా బాధ్యతను నిర్వర్తించారని,దాని వల్ల టెట్ పరీక్షకు సన్నద్ధమవ్వడానికి తగిన సమయం వారికి లభించలేదని పేర్కొన్నారు. టెట్ పరీక్షకు సిద్ధమవ్వడానికి వారికి తగినంత సమయం ఇవ్వాలని, అందుకే జనవరి నెలలో జరగనున్న ఈ పరీక్షను వాయిదా వేయాలని వేసవి సెలవుల్లో నిర్వహిస్తే అందరికీ సానుకూలంగా ఉంటుందని కోరారు.*

తిరుపతి

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం పై అవగాహన కల్పించిన సి.ఐ.

తొట్టంబేడు పున్నమి న్యూస్ డిసెంబర్ 18, తొట్టంబేడు మండలం శివనాథపురం కొత్త కండ్రిగ జంక్షన్లో తొట్టంబేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ తిమ్మయ్య ఆధ్వర్యంలో కానిస్టేబుల్ లోకేష్, రాజేష్ , ఎస్ .టి. ఎఫ్ సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సి.ఐ. తిమ్మయ్య మాట్లాడుతూ.. మీ ప్రాణం _మీ బాధ్యత, మీ భద్రతే _ మా బాధ్యత అంటూ ఫ్రెండ్లీ పోలీస్ పద్ధతిలో ద్విచక్ర వాహనదారులకు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఆయన కోరారు. వాహనదారులు హెల్మెట్ వాడాలని ఎంతో పటిష్టముగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని అందుకు ద్విచక్ర వాహనదారులు సహకరించాలని లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.. త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఆర్.సి తనిఖీలను చేశారు.

తిరుపతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీవో సంఘ అధ్యక్షుడిగా చెంచురత్నం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 18, శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక కొత్తపేటలో వున్న ఎన్జీవో కార్యాలయంలో జరిగిన ఏపీ ఎన్జీవో ఎన్నికలలో చెంచు రత్నాన్ని ఎన్జీవో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోగా అనంతరం ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తిలో ఎన్జీవో నాయకులు, వీఆర్వోలు అధ్యక్షుడికి ఘనంగా గజమాలతో సత్కరించారు. ఈ సందర్బంగా చెంచు రత్నం మాట్లాడుతూ…. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటానని వారికి ఎటువంటి సమస్యలొచ్చిన ముందుండి పోరాడుతాను ఆయన హామీ ఇచ్చారు. రెండు పర్యాలు అధ్యక్షుడిగా చేశానని ఈసారి కూడా తనని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

తిరుపతి

పేదవాడికి అండగా కూటమి ప్రభుత్వం.. బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 18, శ్రీకాళహస్తి నియోజికవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ గురువారం నాడు పట్టణంలో పర్యటించి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి నేరుగా వారికి అందజేయడం జరిగింది. మంజూరైన మొత్తం ఆర్థిక సాయం: రూ. 5, 54,900/- బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి పేదవాడికి అండగా నిలవడమే మన కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.