Saturday, 14 March 2026

Blog

E-పేపర్

మల్లెం కొండు సురేష్ బాబు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ముక్కా రూపానంద రెడ్డి

మల్లెం కొండు సురేష్ బాబు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ముక్కా రూపానంద రెడ్డి రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు పట్టణం పాత బజార్ లో ఉండు వ్యాపారవేత్త మల్లెం కొండు సురేష్ బాబు అకస్మాత్తుగా మరణించారని తెలుసుకొని ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతేకాకుండా ఆర్యవైశ్యులందరూ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించినారు వాడితోపాటు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు పార్టీ నాయకులు అందరూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలొ ఎన్డీఏ కూటమి నాయుకులు పాల్కొన్నారు.

నాగర్‌కర్నూల్

నాగులపల్లి గ్రామ నూతన 03వ వార్డ్ మెంబర్ గా గెల్పించిన ప్రజలకు… ధన్యవాదాలు తెల్పిన దూపం అంజనేయులు

నాగులపల్లి గ్రామ నూతన 03వ వార్డ్ మెంబర్ గా గెల్పించిన ప్రజలకు… ధన్యవాదాలు తెల్పిన దూపం అంజనేయులు. పున్నమి డిసెంబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండలం నాగులపల్లి గ్రామ ప్రజలకు మరియు 03వ వార్డు సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారలు ఆదివారం రోజున జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి, బలపరిచిన దూపం అంజనేయులు 03వ వార్డు మెంబర్గా గెలిపించినందుకు 03వ వార్డు లో ముగురు బరిలో ఉన్న. అత్యధిగా మెజార్టీతో గెలిపించనా ఓటర్లకు మూడవ వార్డు ప్రజలందరికి ధన్యవాదాలు ఆయన చెప్పారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాత్రి వేళల్లో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు

నెల్లూరు — పున్నమి ప్రతినిధి డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు రాత్రి వేళల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, ప్రజల్లో భద్రతా భావం పెంపే లక్ష్యంగా రాత్రి 10 నుంచి 1 గంట వరకు గస్తీ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తనిఖీలు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశారు. మొత్తం ₹84,610 జరిమానా విధించారు. జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, శాంతిభద్రత పరిరక్షణ, రాత్రి వేళల్లో నేరాల నివారణ, ప్రజల్లో భద్రతా భావం పెంపు కోసం జిల్లా వ్యాప్తంగా రాత్రివేళలో రాత్రి 10.00 గంటల నుండి రాత్రి 1.00 గంట వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిణ.  నేరాలను అరికట్టడమే కాదు, ముందే నివారించడమే లక్ష్యం.  ముఖ్యంగా అల్లరి మూకలు, గ్యాంగులు, రౌడీ మూకలు తిరగబోయే ప్రాంతాల్లో ప్రత్యేక దాడులు.  గుర్తింపు లేని వ్యక్తులు, స్ట్రేంజర్స్, అనుమానాస్పద వ్యక్తుల వివరాల సేకరణ. సరైన ఐడీ ప్రూఫ్ లేకుండా ఉండేవారి పై విచారణ చేసి అవసరమైతే చట్టపరమైన చర్యలు.  రాత్రివేళ తిరుగుతున్న వ్యక్తులను ఆపి, వారి గమ్యం, కారణాలు విచారణ. స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేని వారిపై తగిన చట్టపరమైన చర్యలు.  రాత్రిపూట యువత గుంపులు గుమికూడే ప్రాంతాల్లో పోలీసుల ప్రత్యేక మొబైల్ పహారా. రౌడీ ఎలిమెంట్లు, ఈవ్ టీజింగ్, గ్యాంగ్ పోకడలను అరికట్టడమే లక్యం.  అవసరమైతే లాఠీ జులుపిస్తూ గస్తీ చేసి రాత్రి వేళల్లో ప్రజలకు భయం లేని వాతావరణం సృష్టించడం. ప్రజలు రాత్రివేళల్లో సురక్షితంగా ప్రయాణించేలా సమగ్ర భద్రతా చర్యలు.  రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, మార్కెట్ ఏరియాలు, చీకటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షణ.  కీలక జంక్షన్ల వద్ద ఆకస్మికంగా తనిఖీలు చేసి అనుమానాస్పద ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ట్రావెలర్ వాహనాలపై ప్రత్యేకంగా తనిఖీలు. మద్యం సేవించి వాహనం నడిపిన డ్రైవర్లపై MV Act ప్రకారం కేసులు నమోదు చేసి వాహనాల సీజ్. బార్లు, రెస్టారెంట్లు మూసిన తరువాత బయటకు వస్తున్న వ్యక్తులపై ప్రత్యేక తనిఖీలు.  తేది.19.12.25 న జిల్లా వ్యాప్తంగా వాహనాలు తనిఖీ చేసి, ఓపెన్ డ్రింకింగ్-8 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ 18 కేసులు, ఇ చలానా కేసులు 73 నమోదు, Rs.84,610/- ఫైన్ విధించారు.

విశాఖపట్నం

సంక్రాంతి స్పెషల్: బీహెచ్‌పీవీ క్రికెట్ టోర్నమెంట్ డ్రా పూర్తి

విశాఖ జిల్లా – గాజువాక (పున్నమి ప్రతినిధి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బీహెచ్‌పీవీ హార్ట్‌ఫుల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో సంవత్సరంగా నిర్వహించనున్న బీహెచ్‌పీవీ మాజీ ఉద్యోగుల కుమారుల క్రికెట్ టోర్నమెంట్–2026కు సంబంధించిన డ్రా కార్యక్రమం బీహెచ్‌ఈఎల్ యూనియన్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ టోర్నమెంట్ జనవరి 9, 10, 11, 12 తేదీలలో నిర్వహించనున్నారు. డ్రా కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు, జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్, స్వచ్ఛ విశాఖ ప్రచారకర్త, ఆంధ్ర విశ్వవిద్యాలయ బోర్డు సభ్యులు ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై డ్రా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా మరింత బలపడతారని, ఇలాంటి టోర్నమెంట్లు స్నేహభావాన్ని, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నృత్య కళాకారిణి పల్సర్ ఝాన్సీ, రమేష్ మాస్టర్, బీహెచ్‌ఈఎల్ యూనియన్ అధ్యక్షులు బోండా బాబూరావు, టెక్కలి భాస్కర్ రావు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. అలాగే ఈ కార్యక్రమంలో జై రాము, ఎం. నాని బాబు, ఎం.ఎన్. కుమార్, పి. శ్రీనివాస్, కె. రవి కుమార్, రాజశేఖర్, సుబేదన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

విశాఖపట్నం

ఒత్తిడి వల్ల వ్యాధులు – ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి): నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి కారణంగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అన్నారు. గాజువాక బీసీ రోడ్డులోని విజ్ఞాన్ హై స్కూల్ ఆధ్వర్యంలో కేర్, రెయిన్బో, ఇన్వెండెంట్ డెంటల్ హాస్పిటల్స్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించగా, ముందస్తు వైద్య పరీక్షల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. ఉచిత వైద్య సేవలు అందించిన ఆస్పత్రుల సిబ్బంది సేవలను ఆయన ప్రశంసించారు.

విశాఖపట్నం

ఐదు సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి): ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) పిలుపునిచ్చారు. 87వ వార్డులో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా పోలియో నివారణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం పోలియో రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 87వ వార్డులో 19 కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు విజయరామరాజు, బెల్లంకొండ రాజన్ రాజు, వర్రే రాంబాబు, కళ్లేపల్లి శ్రీనివాసవర్మ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మెడికల్ కాలేజీలపై వైసీపీ డ్రామాలు – ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలి

గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి): రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన వైద్య విద్య లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల అభివృద్ధికి ముందుకు వెళ్తుంటే, వైసీపీ నాయకులు కుట్రలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ విమర్శించారు. కోటి సంతకాలు పేరుతో వైసీపీ ఆడుతున్న రాజకీయ నాటకాలను క్షేత్రస్థాయిలోనే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు చేసి పనులు వదిలేయడం, రుషికొండపై రూ.500 కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం ప్రజలకు గుర్తుందన్నారు. పీపీపీ విధానమే మెడికల్ కాలేజీల అభివృద్ధికి సరైన మార్గమని వైసీపీ ఎంపీలే పార్లమెంట్‌లో చెప్పి, ఇప్పుడు ద్వంద్వ వైఖరితో మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఈ సమావేశంలో తెలుగు యువత అధ్యక్షులు మానాపురం గణపతి, వాణిజ్య విభాగ అధ్యక్షులు ఎస్.మురళి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

యారాడ బీచ్ వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం

విశాఖపట్నం, యారాడ (పున్నమి ప్రతినిధి): విశాఖపట్నంలోని యారాడ బీచ్ వద్ద సోమవారం ఉదయం సముద్ర ఒడ్డుకు భారీ తిమింగలం కొట్టుకొచ్చి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది . తీరానికి చేరుకున్న తిమింగలాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలనలు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక అంచనాల ప్రకారం మృతి చెందిన తిమింగలం సుమారు 350 కిలోల బరువు, దాదాపు 15 అడుగుల పొడవు (వెడల్పు) ఉన్నట్లు భావిస్తున్నారు. అలల తీవ్రత లేదా ఆరోగ్య సమస్యల కారణంగా తిమింగలం సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో యారాడ బీచ్‌కు తరలివచ్చారు. భద్రతా చర్యల దృష్ట్యా పోలీసులు జనాన్ని నియంత్రిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. తిమింగలం మృతిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అటవీ శాఖ, మత్స్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

E-పేపర్

సర్పంచ్ అభ్యర్థి మృతి.. డబ్బును తిరిగిచ్చేసిన ఓటర్లు!*

పున్నమి ప్రతినిధి : సర్పంచ్ అభ్యర్థి మృతి.. డబ్బును తిరిగిచ్చేసిన ఓటర్లు!* TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి గుండెపోటుతో మృతిచెందడంతో అతని వద్ద ఓటు కోసం తీసుకున్న డబ్బులను గ్రామస్థులు తిరిగిచ్చారు. ఈ ఘటన నల్గొండ (D) మునుగోడు (M) కిష్టాపురంలో జరిగింది. చెనగోని కాటంరాజు BRS మద్దతుతో పోటీ చేయగా 143 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమితో మనస్తాపానికి గురైన ఆయన గుండెపోటుకు గురై చనిపోయారు. ఓట్ల కోసం ఆయన పంచిన డబ్బును పలువురు గ్రామస్థులు జమ చేసి తిరిగి ఇచ్చేశారు.

కామారెడ్డి

సర్పంచ్ బండి ప్రవీణ్‌తో ఎమ్మెల్యే మదన్మోహన్ సెన్సేషనల్ మీటింగ్..

రామారెడ్డి మండలం మోడల్‌గా మారబోతుందా? షాకింగ్ ప్రామిస్! కామారెడ్డి,20 డిసెంబర్, పున్నమి ప్రతినిధి ) కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రం సంచల నం సృష్టించింది! సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన బండి ప్రవీణ్‌కు ఎమ్మెల్యే మదన్మోహన్ స్పెషల్ గిఫ్ట్.. హైదరాబాదులో తన నివాసంలోనే రహస్య కలయిక! మండలానికి కావాల్సిన అన్ని నిధులు, పథకాలు ఒక్కటి కూడా తప్పకుండా అందుతా యి.. నేనే పర్సనల్‌గా చూస్తాను!” అం టూ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మాటిచ్చారు. అంతే కాదు.. పాలక వర్గం రామారెడ్డి మండలాన్ని మోడల్ మండలంగా తీర్చిదిద్దాలని స్పష్టమైన ఆర్డర్!ఈ మీటింగ్‌తో రామారెడ్డి మండల ప్రజలు సంతోషంగా ఉన్నారు. బండి ప్రవీణ్ విజయం ఇప్పుడు మండల అభివృ ద్ధికి సూపర్ బూస్ట్ అవుతుందా? రామారెడ్డి మోడల్ మండలంగా మారితే.. తెలంగాణలోని ఇతర మండలాలకు ఇది ట్రెండ్ సెటర్ అవుతుం ది! మండల ప్రజలు ఎదురు చూస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.