Saturday, 14 March 2026

Blog

E-పేపర్

రాజంపేట జిల్లా కేంద్రం కోసం ఎందాకైనా పోరాడుదాం: రామిరెడ్డి ధ్వజ రెడ్డి గారు*

*రాజంపేట జిల్లా కేంద్రం కోసం ఎందాకైనా పోరాడుదాం: రామిరెడ్డి ధ్వజ రెడ్డి గారు* రైల్వే కోడూరు:రైల్వే కోడూరుకు న్యాయం చెయ్యాలి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గత కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న జేఏసీ సభ్యులకు సంఘీభావంగా దీక్షలో పాల్గొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేసి అనంతరం వారు మాట్లాడుతూ కూటమి నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారని నామమాత్రంగా ర్యాలీలలో పాల్గొంటున్నారని వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాయంలో మేము ఉన్న సమయంలో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించగా అప్పట్లోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు అప్పటి ఉమ్మడి కడప జిల్లా కలెక్టర్ గారికి రాజంపేట రైల్వే కోడూరు ప్రాంతాన్ని కడపలోనే కొనసాగించాలని లేనియెడల కోడూరు ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని వినతి పత్రాలు సమర్పించామని తక్షణమే ఐఏఎస్ ల బృందంతో ఒక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకొని పుంగనూరు,తంబలపల్లె,మదనపల్లె,రాయచోటి, రాజంపేట, కోడూరు ప్రాంతాలకు అనుగుణంగా భౌగోళికంగా సెంటర్ పాయింట్ గా ఉన్నందున రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగినదని కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయచోటి రాజంపేట కోడూరు మూడు నియోజకవర్గాలు కలిపి అన్నమయ్య జిల్లాగా రాయచోటిని ప్రకటించడం మంచి పరిణామాలు కావు అని తక్షణమే రైల్వే కోడూరు రాజంపేట ప్రాంతాలకు న్యాయం న్యాయం చేకూరె విధంగా కోడూరులోని వివిధ సంఘాలు, ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని అలాగే రేపు జరగబోయే బంద్ లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఉద్యమం మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లి అవసరమైతే ఎటువంటి ర్యాలీలు రాస్తారోకోలు ధర్నాలకైనా సిద్ధంగా ఉండి కోడూరు నియోజకవర్గానికి న్యాయం జరిగే వరకూ అందరూ కలిసికట్టుగా ఉందామని *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి & మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు గారు & కోడూరు వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజా రెడ్డి, అన్నారు* ఈ కార్యక్రమంలో సినియర్ నాయకులు పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి,ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు అన్వర్ బాషా, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నందా బాల, సర్పంచులు బుడిగీ శివయ్య,సుబ్రహ్మణ్యం రాజు,రఫీ,మైనార్టీ నాయకులు ముజీబ్,కరిముల్లా,రత్తయ్య,

E-పేపర్

సస్యరక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం కే ఆర్ కండ్రిక

సస్యరక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం కే ఆర్ కండ్రిక రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు మండలం లో మామిడి రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మామిడిలో పూత, పింద దశలలో చేపట్టవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతులు మరియు సస్యరక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం. కే. ఆర్. కండ్రిక గ్రామం రైల్వే కోడూరు మండలం నందు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడిలో పూత, పిందె దశలో చేపట్టవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతుల, సస్యరక్షణ చర్యలు పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ జి సందీప్ నాయక్, శాస్త్రవేత్త (తెగుళ్ళ విభాగం) వారు మాట్లాడుతూ మామిడిలో పూత ప్రారంభ దశలో 13-0-45 @ 5 గ్రాములు + యూరియా@ 10 గ్రాములు లీటరు నీటి కలిపి పై పాటుగా పిచికారి చేయడం వలన పూత త్వరగా రావడానికి దోహదపడుతుందని సూచించారు. అలాగే మామిడిలో సూక్ష్మ పోషక మిశ్రమం లేదా అర్క మ్యాంగో స్పెషల్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మామిడి పిందకట్టే దశలో మరియు కాయలు ఊరేదశలో ఒకసారి పైపాటుగా పిచికారి చేయాలని సూచించారు. మామిడిలో పూత మొదలయ్యే ముందు ఇమిడాక్లోప్రిడ్ @ 0.3 ml + వేప నూనె 1500 ppm@ 5 ml + కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటి కలిపి పైపాటుగా పిచికారి చేయడం వలన పూత ప్రారంభ దశలో ఆశించి తేనె మంచు పురుగు, తామర పురుగు మరియు ఆకుమచ్చ తెగులు ను సమర్థవంతంగా యాజమాన్యం చేయవచ్చని సూచించారు. అంతేగాక మామిడి పంట ఆశించే పండు ఈగను సమర్థవంతంగా యాజమాన్యం చేసుకోవడానికి పండు ఈగను ఆకర్షించే NBAIR, బెంగళూరు రూపొందించిన పండు ఈగ బుట్టలను వినియోగించాలని సూచించారు. సువెన్ అగ్రో ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ కొండా రెడ్డి ఆయిల్ పంట ప్రాధాన్యత, ఆవశ్యకత, సాగు చేసే విధానము, ప్రభుత్వం నుండి రైతులకు అందించే సబ్సిడీ వివరించడంతోపాటు ఈ ప్రాంతంలో మామిడికి ఆయిల్ పామ్ పంట ప్రత్యామ్నాయ పంట అని, రైతులు ఎవరైనా ఆయిల్ ఫామ్ సాగుకు ఆసక్తి గలవారు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించవలసిందిగా తెలియజేశారు. భాస్కర్ , ఉద్యాన అధికారి, రైల్వే కోడూరు మండలం వారు మాట్లాడుతూ ఉద్యాన శాఖ తరపున అమలు చేయుచున్న పథకాలు మరియు రాయితీల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన సహాయకులు అంజలి, దినేష్, రూపేష్ నాయక్, హరి ప్రసాద్ మరియు ఉద్యాన రైతులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఐపీఓల దూకుడు: 103 కంపెనీలు, ₹1.76 లక్షల కోట్ల సమీకరణ

— పున్నమి ప్రతినిధి దేశీయ మార్కెట్లో ఈ ఏడాది కూడా ఐపీఓల హవా కొనసాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలి పబ్లిక్ ఆఫర్లు భారీగా నిధులు సమీకరించాయి. మొత్తం మీద 103 కంపెనీలు రూ.1.76 లక్షల కోట్లను ఐపీఓల ద్వారా సమీకరించాయి. మార్కెట్ లిక్విడిటీ, మదుపర్ల విశ్వాసం, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులకు ఇది అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ఏడాదిలోనూ ఇదే ఉత్సాహం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

ఐపీఓల దూకుడు: 103 కంపెనీలు, ₹1.76 లక్షల కోట్ల సమీకరణ

— పున్నమి ప్రతినిధి దేశీయ మార్కెట్లో ఈ ఏడాది కూడా ఐపీఓల హవా కొనసాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలి పబ్లిక్ ఆఫర్లు భారీగా నిధులు సమీకరించాయి. మొత్తం మీద 103 కంపెనీలు రూ.1.76 లక్షల కోట్లను ఐపీఓల ద్వారా సమీకరించాయి. మార్కెట్ లిక్విడిటీ, మదుపర్ల విశ్వాసం, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులకు ఇది అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ఏడాదిలోనూ ఇదే ఉత్సాహం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసం: రూ.1.32 కోట్లు కాజేత

— పున్నమి ప్రతినిధి ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట సైబర్ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుణేలో జరిగిన ఘటనలో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని నమ్మించి రూ.1.32 కోట్లు కాజేశారు. విదేశీ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ ప్రతినిధులు, ఫ్యాషన్ డిజైనర్లుగా నటిస్తూ ఖరడీ ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జాతీయ అంతర్జాతీయ

బంగ్లాదేశ్ పరిస్థితి అత్యంత సున్నితంగా ఉంది: మాజీ దౌత్యవేత్త

— పున్నమి ప్రతినిధి బంగ్లాదేశ్ ప్రస్తుతం చాలా సున్నితమైన, ప్రమాదకర దశలో ఉందని భారత మాజీ దౌత్యవేత్త అనిల్ త్రిగుణాయత్ హెచ్చరించారు. మైనారిటీలకు తక్షణ రక్షణ కల్పించడం, శాంతిభద్రతలను పునరుద్ధరించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఫిబ్రవరి 12న జరగనున్న పారదర్శక ఎన్నికలు దేశాన్ని స్థిరీకరించేందుకు, ప్రజాస్వామ్య పరివర్తనను సజావుగా కొనసాగించేందుకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు

జాతీయ అంతర్జాతీయ

భారత వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకే రాహుల్ విదేశీ పర్యటనలు: బీజేపీ

— పున్నమి ప్రతినిధి జర్మనీలోని బెర్లిన్ వేదికగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌ను ప్రేమించే వ్యక్తి ఈ దేశం విఫలమవ్వాలని కోరుకుంటాడా అని ప్రశ్నించారు. ప్రజల మధ్య చిచ్చు పెంచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం భారత్ ప్రపంచ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని ఆయన పేర్కొన్నారు.

జాతీయ అంతర్జాతీయ

నాయకుడిలా కాదు, పిల్లవాడిలా వ్యవహరిస్తున్నారు: రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ

— పున్నమి ప్రతినిధి జర్మనీ వేదికగా భారత సంస్థాగత వ్యవస్థపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన ఏ ప్రయోజనం సాధించాలని చూస్తున్నారో అర్థం కావడం లేదని బీజేపీ నేత శోభా కరంద్లజే విమర్శించారు. ఇప్పటికీ ఆయన నాయకుడిలా కాకుండా పిల్లవాడిలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. విదేశాలకు వెళ్లి భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడే నేతగా ఆమె అభివర్ణించారు.

హైదరాబాద్

హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల కోసం TSRTC ప్రత్యేక బస్సులు

— పున్నమి ప్రతినిధి హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సేవలను ప్రారంభించింది. “ఘర్ లక్ష్మి ఇన్ఫోబాన్” పేరుతో ఈ స్పెషల్ బస్సులను ప్రవేశపెట్టింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దిశగా ఈ బస్సులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నడవనున్నాయి.

ఆంధ్రప్రదేశ్

జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు

— పున్నమి ప్రతినిధి జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఎల్పీజీ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండగా, సవరించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అమలులోకి రానున్నాయి. పాన్–ఆధార్ లింకేజీ తప్పనిసరి చేయడంతో పాటు సిమ్ వెరిఫికేషన్ నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఉద్యోగులకు కరవు భత్యం పెరగనుండగా, కొత్త ఐటీఆర్ ఫారం ప్రవేశపెట్టే అవకాశముంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.