Friday, 13 March 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

మునగచర్లలో రూ.115 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్), పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాంపౌండ్ వాల్స్, సిమెంట్ రోడ్లు, మెటల్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన మొత్తం 9 పనులకు శంకుస్థాపన చేయగా, వీటి అంచనా వ్యయం రూ.115 లక్షలుగా అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రోడ్లు, కాంపౌండ్ వాల్స్ వంటి సదుపాయాలతో గ్రామాల రూపురేఖలు మారతాయని, ఉపాధి హామి పథకం ద్వారా గ్రామీణ కార్మికులకు ఉపాధితో పాటు శాశ్వత ఆస్తుల సృష్టి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

మునగచర్లలో సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతం

నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో బుధవారం సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, సామాజిక భరోసా పెన్షన్లు పేదలు, వృద్ధులు, వికలాంగులు, విధవలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల గడప దాటే పాలన ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతోందని, గ్రామాల్లో సంక్షేమం మరియు అభివృద్ధి సమాంతరంగా కొనసాగుతున్నాయని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, గ్రామ సర్పంచ్ పంగులూరి నరసింహారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కూటమి నేతలు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఆంధ్రప్రదేశ్

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా నడిపిన దార్శనికుడు*

** (పున్నమి ప్రతినిధి) ఆర్థికలోటులోనూ అవకాశాలను సృష్టించిన ఘనుడు చంద్రబాబు* కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం విధ్వంసం నుండి వికాసం వైపు పరుగులు తీసింది. కూటమి ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వమని అభివృద్ధితో చాటిచెప్పింది.* సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావడంతో రాష్ట్ర ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్ పై ప్రతిపక్షాలు చేసిన అర్థరహిత విమర్శలు తేలిపోయాయి.* యువగళం హామీలను నెరవేర్చేందుకు నారా లోకేష్ అనుక్షణం తపనపడ్డారు. దేశ, విదేశాలు తిరిగి పెట్టుబడులను ఆకర్షించారు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించారు.* రాజధాని లేని రాష్ట్రంగా, భావితరాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన ఆంధ్రప్రదేశ్ లో… పొరుగు రాష్ట్రాలు సైతం అసూయపడే స్థాయి పెట్టుబడులను కూటమి ప్రభుత్వం తెచ్చింది.* ఆర్థికలోటుతో అంధకారంలో కూరుకుపోయిన రాష్ట్రంలో తన అపార అనుభవం, ప్రధాని మోదీ సాయం, పవన్ కళ్యాణ్ సహకారంతో వెలుగులు నింపారు చంద్రబాబు.* — MLC బీద రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, (నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు)* మెగా డీఎస్సీ హామీని నెరవేర్చుతూ తొలి సంతకంతో 15941 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి విద్యారంగం బలోపేతానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. 5757 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంతో పాటు స్టైఫండ్ ను 12.5 వేలకు పెంచింది. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా 50,000కోట్ల రూపాయలను(ఏడాదికి 33000 కోట్లు చొప్పున, నెలకు 2750కోట్లు) పింఛన్ల రూపంలో ఇప్పటివరకు లబ్దిదారులకు అందించింది కూటమి ప్రభుత్వం. 46 లక్షల రైతులకు లబ్ది చేకూరుస్తూ 6310 కోట్ల రూపాయలను “అన్నదాత సుఖీభవ పథకం” ద్వారా అందించి రైతన్నలకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం పేరిట 67.27 లక్షల విద్యార్థులకు మేలు చేకూర్చేలా వారి తల్లుల ఖాతాల్లో 10,090 కోట్ల జమతో పాటు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరిట కిట్స్ ను కూటమి ప్రభుత్వం అందిస్తోంది. 1144 కోట్ల వ్యయంతో, స్త్రీ శక్తి పథకం ద్వారా 3.25 కోట్ల బస్సు ప్రయాణాలను రాష్ట్ర మహిళలకు ఉచితంగా కల్పించింది కూటమి ప్రభుత్వం. 2.90లక్షల ఆటో డ్రైవర్ల ఖాతాల్లో 15 వేల చొప్పున 436 కోట్లు సాయం జమ చేసింది. ప్రతీ ఏటా 3 గ్యాస్ సిలిండర్ లు అందించాలన్న లక్ష్యంతో దీపం – 2 పథకం ద్వారా 2684 కోట్లు వెచ్చించి ఇప్పటివరకు 2 కోట్ల సిలిండర్ లను పేద, మధ్య తరగతి మహిళలకు పంపిణీ చేసింది కూటమి ప్రభుత్వం. పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న తపనతో రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పటివరకు 4 కోట్ల భోజనాలను పేదలకు నామమాత్రపు ధరకు అందించింది. మైనారిటీ సంక్షేమం కోసం 3670 కోట్లు కేటాయింపు తో పాటు ఇమామ్ లకు 10 వేలు, మౌజన్ లకు 5 వేలు అందిస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాలలో 8427 పాస్టర్లకు 5 వేల చొప్పున 51 కోట్ల రూపాయలు, దేవాలయాల్లోని పురోహితులకు 15 వేలు, నాయీ బ్రాహ్మణులకు 25 వేలు చొప్పున 90 కోట్లు అందించింది. వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్ల మరమ్మత్తులు చేపట్టడమే కాకుండా, 3 వేల కోట్ల రూపాయలతో రహదారులను నిర్మించింది కూటమి ప్రభుత్వం. “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” ద్వారా 84 లక్షల టన్నుల చెత్త సేకరణ చేపట్టింది. కూటమి ప్రభుత్వ చొరవతో జరిగిన సీఐఐ సమ్మిట్ లో 610 ఒప్పందాలు జరుగగా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు,16.13 లక్షల ఉద్యోగాలు మరియు 13 ఎస్.ఐ.పి.బి.సమావేశాల్లో 8.55 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. విశాఖ ఐటీ హబ్, గూగుల్ – రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్ కు శంకుస్థాపన జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలవరం పనుల్లో పురోగతి వచ్చింది. వెలిగొండ వేగం పుంజుకుంది. క్వాంటం వ్యాలీకి తొలి అడుగు పడటంతో అమరావతి పనులు ఊపందుకున్నాయి. పల్లె పండుగ పథకం ద్వారా గ్రామాల్లో 4 వేల కి.మీ. రోడ్ల నిర్మాణం జరిగింది. 13326 గ్రామ సభలను నిర్వహించి 3 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం లో రికార్డు స్థాయిలో ధాన్య సేకరణ జరిగింది. ధాన్యం అమ్మిన 24 గం.ల్లోనే రైతన్నల ఖాతాల్లో డబ్బును జమ చేసింది. ఒక్క ఖరీఫ్ సీజన్ లోనే 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. 3050 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 1.21 కోట్లమంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా “అమరజీవి జలధార పథకం” ద్వారా మంచి నీటి కుళాయి కనెక్షన్లు అందిస్తోంది కూటమి ప్రభుత్వం.

ఎన్ టి ఆర్ జిల్లా

వాసవి మాత జన్మస్థలం ‘వాసవి పెనుగొండ’గా గుర్తింపు – హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్య సంఘం

పెనుగొండ క్షేత్రంలో జన్మించిన ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత జన్మస్థలాన్ని “వాసవి పెనుగొండ”గా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం అభినందనీయమని యన్.టి.ఆర్. జిల్లా ఆర్యవైశ్య సంఘం నేత పారేపల్లి సాయిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పెనుగొండ పట్టణంలో అధికారులు “వాసవి పెనుగొండ”గా సూచిక బోర్డు ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యులను గౌరవిస్తూ ఈ కీలక తీర్మానం చేయించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని కొనియాడారు.

E-పేపర్

జనవరి 3వ తేదీన ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్లు

జనవరి 3వ తేదీన ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్ల సంఘాల JAC

E-పేపర్

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ లో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు కొమ్మ శివ

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ లో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు కొమ్మ శివ రైల్వేకోడూరు డిసెంబర్ 31 పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సచివాలయ సిబ్బంది పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు కొమ్మ శివ నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ .ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం .

అన్నమయ్య

కంపసముద్రం ‘స్తంభారాయుని’ క్షేత్రంలో జనవరి 1న విశేష పూజలు

-నూతన ఏడాది వేళ అంగరంగ వైభవంగా వేడుకలు | పొంగుబాలతో మొక్కులు తీర్చుకోనున్న భక్తులు | రోజంతా అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు చిట్వేలు, డిసెంబర్ 31: పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం కంపసముద్రం పంచాయతీ పరిధిలోని గుడ్లవారిపల్లె గ్రామంలో వెలసిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ స్తంభారాయు స్వామి ఆలయం నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబైంది. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన ఈ క్షేత్రంలో స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం భక్తులకు ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా బుధవారం (జనవరి 1న) స్వామివారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ మరియు గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నూతన సంవత్సరం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. స్వామివారికి విశేష అభిషేకములు, ఫలపుష్ప అలంకరణలు మరియు హారతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది. నూతన ఏడాది తొలిరోజున స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఏడాది పొడవునా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారని భక్తుల నమ్మకం. -ముగియనున్న పొంగుబాలు ముక్కు బడులు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతల్లో ‘పొంగుబాలు’ సమర్పించడం ప్రధానమైనది. భక్తులు తమ కోర్కెలు సిద్ధించాలని లేదా నెరవేరిన కోర్కెలకు కృతజ్ఞతగా ఆలయ ప్రాంగణంలో పొంగుబాలు (పాలు పొంగించి నైవేద్యం వండటం) సమర్పించి మొక్కుబడులు తీర్చుకోనున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ఆకర్షణీయంగా చెక్కభజనలు.. నిరంతర అన్నదానం భక్తి పారవశ్యాన్ని పెంచేలా ఉదయం 9 గంటల నుండి కళాకారులచే చెక్కభజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరాయంగా **అన్న ప్రసాద వితరణ (అన్నదానం)జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. -భక్తులకు విన్నపం నైవేద్యాలు, ప్రసాదాలతో స్వామివారిని సేవించి, ఆయన కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ కోరింది. భక్తులు క్రమశిక్షణతో క్యూలైన్లలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని, పవిత్రమైన ఈ వేడుకను జయప్రదం చేయాలని గ్రామ పెద్దలు ప్రార్థిస్తున్నారు.

కామారెడ్డి

ఘన వైకుంఠ ఏకాదశి వేడుకలు

కామారెడ్డి, 30 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తారు. రామారెడ్డి మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం పల్లకి సేవలు పలు వీధుల గుండా వెళ్లి భక్తులకు దర్శనమిచ్చారు.భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పా టు చేశారు. రామారెడ్డి మండల బండరాలలోని స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల ఆకర్షణ కేంద్రంగా మారింది. భక్తుల ఉత్సాహం తండోపతండాలుగా వచ్చిన భక్తులు అభిషేక పూజలు, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తుల రద్దీతో కిటికిటలా డాయి. ప్రత్యేకంగా రామారెడ్డి మండల కేంద్రంలోని ఈ ఆలయం ప్రాంతీయ భక్తులకు పవిత్ర క్షేత్రంగా పేరుగాంచింది.జిల్లా వ్యాప్తంగా పలు ఆలయల్లో వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 30, 2025) పర్వదినం మార్మోగాయి.భక్తులు పాల్గొని ఉత్తర ద్వార దర్శనం పొందారు.పూజా విధానాలు భక్తులు దైవిక నిష్ఠతో ఉపవాసం, జాగరణం, విష్ణు సహస్ర నామ పారాయణం చేశారు. ఆలయాల్లో భక్తులకు మంచి నీరు, క్యూలైన్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పర్వం వైకుంఠ ప్రాప్తికి మార్గం అని భక్తులు భావిస్తున్నారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ శ్రీ బండి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ శ్రీ హన్మొయ్యొల్ల నవీన్, వార్డు సభ్యులు పిప్పరి లింబాద్రి, రంజిత్, రాజు, మాజీ సర్పంచ్, దండబో యిన సంజీవ్, మాజీ ఎంపీటీసీ నామాల యాదగి రి, శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు

Blog E-పేపర్ Featured Others ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ తెలంగాణ పశ్చిమ గోదావరి పిల్లలకు విద్య విజ్ఞానం

APSET–2025 నోటిఫికేషన్ విడుదల

APSET–2025 నోటిఫికేషన్ విడుదల యూనివర్సిటీలలో & డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, పదోన్నతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష APSET 2025 ను ప్రభుత్వం తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. పరీక్ష తేదీలు (ఆన్‌లైన్):➡️ 28 & 29 మార్చి 2026 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ:➡️ 09 జనవరి 2026 దరఖాస్తు ఫీజు:🔹 జనరల్: ₹1600/-🔹 BC / EWS: ₹1300/-🔹 SC / ST / PwD / థర్డ్ జెండర్: ₹900/- అర్హత, సిలబస్, పరీక్ష కేంద్రాలు, లేట్ ఫీజు వివరాలు తదితర సమాచారం కోసం: www.andhrauniversity.edu.inwww.apset.net.in

పశ్చిమ గోదావరి

ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య

ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య ▪️ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల్లో వ్యాయామ విద్య నేర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా యోగా, ఆరోగ్య విద్య, డ్రిల్, క్రీడలు నిర్వహించాలని సూచించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి తరగతికీ వారానికి ఆరు పీరియడ్లను ప్రత్యేకంగా వ్యాయామానికి కేటాయించాలని, ప్రతి విద్యార్థికీ రోజుకు కనీసం ఒకగంట శారీరక శ్రమ ఉండేలా చూడాలని ఆదేశించింది. పాఠశాల అసెంబ్లీలో ప్రతి రోజూ పది నిమిషాలు ధ్యానం, వారానికి ఒక పీరియడ్ను నిర్దేశించిన సిలబస్ మేరకు ఆరోగ్య విద్యకు కేటాయించాలని సూచించింది. ఈ మేరకు కాల నిర్ణయం పట్టికను విడుదల చేసింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.