ఆంధ్రప్రదేశ్
** (పున్నమి ప్రతినిధి) ఆర్థికలోటులోనూ అవకాశాలను సృష్టించిన ఘనుడు చంద్రబాబు* కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం విధ్వంసం నుండి వికాసం వైపు పరుగులు తీసింది. కూటమి ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వమని అభివృద్ధితో చాటిచెప్పింది.* సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావడంతో రాష్ట్ర ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్ పై ప్రతిపక్షాలు చేసిన అర్థరహిత విమర్శలు తేలిపోయాయి.* యువగళం హామీలను నెరవేర్చేందుకు నారా లోకేష్ అనుక్షణం తపనపడ్డారు. దేశ, విదేశాలు తిరిగి పెట్టుబడులను ఆకర్షించారు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించారు.* రాజధాని లేని రాష్ట్రంగా, భావితరాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన ఆంధ్రప్రదేశ్ లో… పొరుగు రాష్ట్రాలు సైతం అసూయపడే స్థాయి పెట్టుబడులను కూటమి ప్రభుత్వం తెచ్చింది.* ఆర్థికలోటుతో అంధకారంలో కూరుకుపోయిన రాష్ట్రంలో తన అపార అనుభవం, ప్రధాని మోదీ సాయం, పవన్ కళ్యాణ్ సహకారంతో వెలుగులు నింపారు చంద్రబాబు.* — MLC బీద రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, (నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు)* మెగా డీఎస్సీ హామీని నెరవేర్చుతూ తొలి సంతకంతో 15941 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి విద్యారంగం బలోపేతానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. 5757 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంతో పాటు స్టైఫండ్ ను 12.5 వేలకు పెంచింది. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా 50,000కోట్ల రూపాయలను(ఏడాదికి 33000 కోట్లు చొప్పున, నెలకు 2750కోట్లు) పింఛన్ల రూపంలో ఇప్పటివరకు లబ్దిదారులకు అందించింది కూటమి ప్రభుత్వం. 46 లక్షల రైతులకు లబ్ది చేకూరుస్తూ 6310 కోట్ల రూపాయలను “అన్నదాత సుఖీభవ పథకం” ద్వారా అందించి రైతన్నలకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం పేరిట 67.27 లక్షల విద్యార్థులకు మేలు చేకూర్చేలా వారి తల్లుల ఖాతాల్లో 10,090 కోట్ల జమతో పాటు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరిట కిట్స్ ను కూటమి ప్రభుత్వం అందిస్తోంది. 1144 కోట్ల వ్యయంతో, స్త్రీ శక్తి పథకం ద్వారా 3.25 కోట్ల బస్సు ప్రయాణాలను రాష్ట్ర మహిళలకు ఉచితంగా కల్పించింది కూటమి ప్రభుత్వం. 2.90లక్షల ఆటో డ్రైవర్ల ఖాతాల్లో 15 వేల చొప్పున 436 కోట్లు సాయం జమ చేసింది. ప్రతీ ఏటా 3 గ్యాస్ సిలిండర్ లు అందించాలన్న లక్ష్యంతో దీపం – 2 పథకం ద్వారా 2684 కోట్లు వెచ్చించి ఇప్పటివరకు 2 కోట్ల సిలిండర్ లను పేద, మధ్య తరగతి మహిళలకు పంపిణీ చేసింది కూటమి ప్రభుత్వం. పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న తపనతో రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పటివరకు 4 కోట్ల భోజనాలను పేదలకు నామమాత్రపు ధరకు అందించింది. మైనారిటీ సంక్షేమం కోసం 3670 కోట్లు కేటాయింపు తో పాటు ఇమామ్ లకు 10 వేలు, మౌజన్ లకు 5 వేలు అందిస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాలలో 8427 పాస్టర్లకు 5 వేల చొప్పున 51 కోట్ల రూపాయలు, దేవాలయాల్లోని పురోహితులకు 15 వేలు, నాయీ బ్రాహ్మణులకు 25 వేలు చొప్పున 90 కోట్లు అందించింది. వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్ల మరమ్మత్తులు చేపట్టడమే కాకుండా, 3 వేల కోట్ల రూపాయలతో రహదారులను నిర్మించింది కూటమి ప్రభుత్వం. “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” ద్వారా 84 లక్షల టన్నుల చెత్త సేకరణ చేపట్టింది. కూటమి ప్రభుత్వ చొరవతో జరిగిన సీఐఐ సమ్మిట్ లో 610 ఒప్పందాలు జరుగగా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు,16.13 లక్షల ఉద్యోగాలు మరియు 13 ఎస్.ఐ.పి.బి.సమావేశాల్లో 8.55 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. విశాఖ ఐటీ హబ్, గూగుల్ – రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్ కు శంకుస్థాపన జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలవరం పనుల్లో పురోగతి వచ్చింది. వెలిగొండ వేగం పుంజుకుంది. క్వాంటం వ్యాలీకి తొలి అడుగు పడటంతో అమరావతి పనులు ఊపందుకున్నాయి. పల్లె పండుగ పథకం ద్వారా గ్రామాల్లో 4 వేల కి.మీ. రోడ్ల నిర్మాణం జరిగింది. 13326 గ్రామ సభలను నిర్వహించి 3 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం లో రికార్డు స్థాయిలో ధాన్య సేకరణ జరిగింది. ధాన్యం అమ్మిన 24 గం.ల్లోనే రైతన్నల ఖాతాల్లో డబ్బును జమ చేసింది. ఒక్క ఖరీఫ్ సీజన్ లోనే 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. 3050 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 1.21 కోట్లమంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా “అమరజీవి జలధార పథకం” ద్వారా మంచి నీటి కుళాయి కనెక్షన్లు అందిస్తోంది కూటమి ప్రభుత్వం.