Friday, 13 March 2026

Blog

తిరుపతి

నూతన సంవత్సరానికి సిద్ధమవుతున్న శ్రీ వినాయక హోటల్

తిరుపతి జిల్లా చిట్వేలు మండలంలో శివాలయం ఎదురుగా ఉన్న శ్రీ వినాయక హోటల్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆహ్వానిస్తోంది. హోటల్ యజమాని గిరి ఎంతో కష్టపడి అంచులంచెలుగా ఎదిగిన ఈ హోటల్ నేడు రుచికి, నాణ్యతకు మరో పేరుగా నిలుస్తోంది. శుభ్రత, రుచిపై ప్రత్యేక శ్రద్ధతో వెజ్, నాన్‌వెజ్ వంటకాలను అందిస్తూ ప్రతిరోజూ ఏదో ఒక స్పెషల్ ఐటమ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రతి ఆదివారం 99 రూపాయలకే బిరియాని మరియు ప్రత్యేక ఆఫర్లు ఉండటంతో కుటుంబాల ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హోటల్‌కు వచ్చే కస్టమర్లందరికీ గిరి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేవలం రూ.99కే రుచికరమైన బిరియాని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక ఆఫర్‌తో చిట్వేలు ప్రాంతంలో శ్రీ వినాయక హోటల్ రుచుల కేంద్రంగా మరింత గుర్తింపు పొందుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

తిరుపతి

మెరుగైన సమాజ నిర్మాణానికి సి.హెచ్.ఎస్ సేవా బాట

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలంలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, నీటి కొరత సమస్యలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ (సి.హెచ్.ఎస్) సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి ఫిల్టర్లను అమర్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ కార్యదర్శి గాడి ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల చిట్వేల్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీరు, ఫుడ్ బ్యాంక్, పాత వస్తువుల డొనేషన్ స్టాండ్ వంటి సేవా కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు. అదే విధంగా మార్గోపల్లి, వెంకటరాజుపల్లి, నగిరిపాడు, తిమ్మాయపాలెం, కేఎస్ అగ్రహారం తదితర గ్రామాల నుండి సి.హెచ్.ఎస్ సభ్యులు, గ్రామస్తులు ముందుకు వచ్చి తమ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా త్రాగునీటి ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని అభ్యర్థించినట్లు తెలిపారు. దీని కొనసాగింపుగా నేడు ఆయా గ్రామాలకు కూలింగ్ వాటర్ ఫ్రిజ్‌లను డెలివరీ చేయడం జరిగిందని, త్వరలోనే ఆర్వో ఫిల్టర్ల ఇన్‌స్టాలేషన్ కూడా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాల నిర్వహణ, నిరుపేదలకు ఆపద సమయంలో చేయూతనివ్వడం వంటి అనేక సేవా కార్యక్రమాలను సి.హెచ్.ఎస్ సంస్థ నిరంతరంగా చేపడుతోందన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకునే వారు సభ్యత్వం తీసుకోవచ్చని, సభ్యత్వం పొందిన వారికి ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు. మానవ జన్మ సార్థకత పుచ్చుకోవడంలో కాకుండా ఇచ్చుకోవడంలోనే ఉందని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్, సూర్యనారాయణ, బొంతల సతీష్, సంస్థ సభ్యులు ఎంవి నరసారెడ్డి, తిరుమల రెడ్డయ్య, అలిశెట్టి పెంచలయ్య, గాడి ఇంతియాజ్, బాలరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్‌కు కస్తూరి విశ్వనాథ నాయుడు ఘన నివాళి

రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు గుంటి వెంకటేశ్వర ప్రసాద్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలో చికిత్స పొందుతున్న ప్రసాద్ మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం చిట్వేలు పట్టణంలోని ఆయన స్వగృహానికి చేరుకున్న కస్తూరి విశ్వనాథ నాయుడు, మాజీ ఎమ్మెల్యే పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గుంటి ప్రసాద్ కుటుంబ సభ్యులను కస్తూరి విశ్వనాథ నాయుడు పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటి ప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం రైల్వే కోడూరు రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. మృదుస్వభావిగా అందరితో ఆప్యాయంగా ఉండే నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్యేను కడసారి చూసేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, బంధువులు, శ్రేయోభిలాషులు మరియు ఆత్మీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నియోజకవర్గవ్యాప్తంగా ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కస్తూరి విశ్వనాథ నాయుడు వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని నివాళులర్పించారు.

తిరుపతి

గ్రామస్థాయి సమస్యల పరిష్కారమే లక్ష్యం: ముక్కా రూపానంద రెడ్డి

గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా చిట్వేల్ మండల నాయకులు, కార్యకర్తలతో బుధవారం రోజున ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించినట్లు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. రైల్వే కోడూరు పట్టణం రాఘవరాజుపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిట్వేల్ మండలానికి చెందిన గ్రామ, పంచాయతీ నాయకులు పాల్గొని తమ గ్రామాల్లో ఉన్న తాగునీటి సమస్యలు, సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, గ్రావెల్ రోడ్లు, పాఠశాలల మౌలిక వసతులు, పంచాయతీ స్థాయి సమస్యలను వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా అమలు చేయడానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన ముక్కా రూపానంద రెడ్డి, గ్రామస్థాయిలో టీడీపీని మరింత బలంగా నిలబెట్టేందుకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన సంవత్సర సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు.

తిరుపతి

కంపసముద్రం ‘స్తంభారాయుని’ క్షేత్రంలో జనవరి 1న విశేష పూజలు

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేలు మండలం కంపసముద్రం పంచాయతీ పరిధిలోని గుడ్లవారిపల్లె గ్రామంలో వెలసిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ స్తంభారాయు స్వామి ఆలయం నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబైంది. ప్రతి ఏటా జనవరి 1న స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బుధవారం స్వామివారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ, గ్రామస్తులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉదయం 7 గంటల నుంచే విశేష అభిషేకాలు, ఫలపుష్ప అలంకరణలు, హారతులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. స్వామివారిని నూతన ఏడాది తొలిరోజున దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రత్యేకతగా పేరుగాంచిన పొంగుబాలు సమర్పణ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకునేందుకు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి చెక్కభజనలు నిర్వహించడంతో పాటు రోజంతా నిరంతర అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకుని వేడుకను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మీయ సమావేశం

రాధాకృష్ణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చాకలకొండ నందు పాత,కొత్త ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాల నందు గత కొన్ని సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, మరియు బదిలీ పై ఈ పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయునికి మరియు ప్రమోషన్ పై వివిధ పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు, మరియు ఇదే పాఠశాలలో పనిచేస్తూ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు అందుకున్న ఉపాధ్యాయునికి, ఇదే పాఠశాలలో ప్రమోషన్ పొందిన వ్యాయామ ఉపాధ్యాయునికి మరియు నూతనంగా 2025 DSC ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, మరియు ఎంఆర్సి సిబ్బందికి, ఆత్మీయ సమావేశం ఘన మరియు సన్మానం ప్రధానోపాధ్యాయులు P. రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పై కార్యక్రమంలో MEO – 1 పి.రమేష్, ఏ. సుభాషిని, ఎస్ తులసీరామ్ రెడ్డి, సమీరా బేగం, ప్రతాప్, నరేష్, మస్తానయ్య, వెంకటేశ్వర్లు, మము లాభి, లక్ష్మీ ప్రసన్న, లక్ష్మయ్య, మహేష్, మోహన్ రావు, సూరా రామిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు వెలుగోటి కృష్ణ, ఎమ్మార్సీ సిబ్బంది మౌనిక రెడ్డి, ధర్మారెడ్డి హజరత్ రెడ్డి,జలీల్ పాల్గొన్నారు

తెలంగాణ

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన : కలెక్టర్

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ బుధవారం నల్గొండ జిల్లా కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ

జగ్గయ్యపేట మునిసిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో మసీద్ సెంటర్ వద్ద నిర్వహించిన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీ నెట్టెం రఘురామ్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు నేరుగా అందించడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంత సమర్థంగా చేరుతున్నాయో ఈ కార్యక్రమం స్పష్టంగా చూపుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక పింఛన్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ఒక్కరూ కూడా ప్రభుత్వ సహాయం నుండి దూరం కాకుండా చూసే బాధ్యత తమదేనని ఆయన తెలిపారు. పింఛన్ల రూపంలో లబ్ధిదారులకు నెలవారీ ఆర్థిక భరోసా లభించడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో నిజంగా అమలవుతున్నాయనే విషయానికి ఈ కార్యక్రమం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడు నెట్టెం శివరామ్, 10వ వార్డు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి, మాజీ కౌన్సిలర్ కోరకుటి సైదులు, 11వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోరకుటి బొబ్బిలి, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో ఎమ్మెల్యే సౌమ్య కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో బుధవారం నాడు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కలిసి ఎమ్మెల్యే సౌమ్య నూతన సంవత్సర కేకును కట్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తూ ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా పాలన సాగిస్తుందని ఆమె పేర్కొన్నారు.ఈ వేడుకల్లో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్‌, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల సంఘం ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, వివిధ హోదాల రాష్ట్ర డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్లు, కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో స్వాగతించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో ఎమ్మెల్యే సౌమ్య కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో బుధవారం నాడు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కలిసి ఎమ్మెల్యే సౌమ్య నూతన సంవత్సర కేకును కట్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తూ ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా పాలన సాగిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్‌, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల సంఘం ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, వివిధ హోదాల రాష్ట్ర డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్లు, కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతోస్వాగతించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.