Sunday, 19 April 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

NPR, NRC నల్ల చట్టాలను ఉపసంహరించుకొవాలి

కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ గూడూరులోని పెద్ద మసీదు వద్ద రిలే నిరాహారదీక్షలు ప్రారంభమైనాయి. ఈ నిరసన కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, మాజీ పురపాలక అధ్యక్షురాలు దేవసేన పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే ఈ దీక్షలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ముస్లిం హక్కుల ప్రతినిధి అన్వర్ ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో దాయిన్ ,కబీర్ , నాగులు, ఉమర్ పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ సక్సెస్ స్టోరీస్

‘స్వరాజ్య’ ఎడిటర్‌  ఖాసా సుబ్బారావుకు విలువలే ఊపిరి 

గూడూరు, పున్నమి విలేఖరి ( షేక్‌ రసూల్‌ అహ్మద్‌) గాంధేయవాది నిష్కళంక దేశభక్తుడు విలువలే ప్రాధాన్యంగా జీవించిన పత్రికా సంపాదకుడు ఖాసా సుబ్బారావు నెల్లూరు నెల్లూరు జిల్లా కావలిలో 1896 జనవరి 23వ తేదీన జన్మించారు. సర్వేపల్లి రాధాక ష్ణన్‌ పని చేస్తున్న మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో తత్వశాస్త్రం అభ్యసించి పట్టభద్రుడై నారు. తర్వాత కొంతకాలం ఉపాధ్యాయుడుగా, ప్రధానోపాధ్యాయులుగా పని చేశారు. ఆ తర్వాత పల్లెపాడు లోని ఆశ్రమంలో ఉంటూ మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ స్వాతంత్ర సమరంలో పాల్గొని అనేకసార్లు జైలు శిక్షను కూడా అనుభవించారు.శాసనోల్లంఘన ఉద్యమంలో పోలీసులు లాఠీలతో దారుణంగా కొట్టిన సందర్భంలో ఆయన స్ప హ తప్పి పడిపోవడం జరిగింది. ఈ అంశం తీవ్ర దుమారం రేపి చివరకు బ్రిటీష్‌ పార్లమెంటు లో ప్రస్తావనకు వచ్చి ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖాసా సుబ్బారావును కలిసి పోలీసు దుర్మార్గపు చర్యలను ఖండిస్తూ ఒక నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ఫలితంగా అప్పటివరకు లాఠీలకు ఉండే లోహపు పిడిలను మొదటిసారిగా తొలగించడం జరిగింది. ఇలా స్వరాజ్య పోరాటంలో సుబ్బారావు పాల్గొంటూ ఓసారి జాతీయ భావాల ప్రచార కార్యక్రమంలో భాగంగా మద్రాసులోని స్వరాజ్య పత్రిక కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఖాసా సుబ్బారావు గారి లోని దేశభక్తిని గమనించి తన బదులు స్వరాజ్య పత్రికలో సంపాదకీయం రాయడానికి సుబ్బారావును కోరారు.అది మొదలు సుబ్బారావు గారు పత్రికా లోకంలో తన వైభవాన్ని విశేషంగా చాటుకున్నారు. భాష, భావవ్యక్తీకరణ, స్పష్టత, నిర్భీతి ఇలాంటి సుగుణాల వల్ల సుబ్బారావును పాఠక లోకం విశేషంగా అభిమానించింది. ఇలా ఖాసా సుబ్బారావు చివరకు జర్నలిజం లోనే స్థిరపడిపోయారు. చక్రవర్తి రాజగోపాలచారితో సహా అనేకమంది ఆయన కలం పోటుకు గురి అయినా ఆయన్ని అభిమానించడంలో ముందుండేవారు.స్వరాజ్య పత్రికకు సహాయ సంపాదకుడిగా 1924 నుంచి 1936 దాకా పని చేశారు. కోల్కతా నుంచి వెలువడే ఇండియన్‌ ఫైనాన్స్‌ మరియు ముంబై నుంచి వచ్చే ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌ కు సహాయ సంపాదకులుగా పని చేశారు.1940 లో ఇండియన్‌ ఎక్స్ప్రెస్‌ పత్రిక లో జాయింట్‌ ఎడిటర్‌ గా తర్వాత మెయిన్‌ ఎడిటర్‌ గా పని చేయడం జరిగింది. తెలుగులో ఆంధ్రప్రభ కు వీరు తొలి సంపాదకులుగా పనిచేశారు. 1946లో స్వతంత్ర వార పత్రిక ప్రారంభించారు. మధ్యలో ఆగిపోయిన స్వరాజ్య పత్రికను తిరిగి ప్రారంభించి మూడేళ్లు నడిపి తర్వాత వేరొకరికి అప్పగించారు. ఇలా తన సంపాదకీయాలతో పాఠకలోకాన్ని విశేషంగా ఆకట్టు కొనడమే కాకుండా ఆలోచనాత్మకమైన విశ్లేషణలతో ఖాసా సుబ్బారావు గారు రాసిన ”సైడ్‌ లైట్స్‌” అనే శీర్షిక ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. తన జీవిత చరమాంకం వరకు నైతిక విలువలతో జీవించిన ఖాసా సుబ్బారావు గారు 1961 జూన్‌ 16 వ తేదీన మరణించారు.

Featured ఆంధ్రప్రదేశ్

సంతాప సమావేశం

నెల్లూరు, జనవరి 16, 2020 (పున్నమి విలేఖరి) : ప్రముఖ రైల్వే కార్మికోద్యమ నాయకుడు, కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్‌ వెంకటరత్నం అనారోగ్యంతో 16-01-2020 ఉదయం 6-50 గంటలకు నెల్లూరులో మరణించారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయన పార్థివ దేహాన్ని పొదలకూరు రోడ్డు, ఎస్‌బిఐ కాలనీలోని ఆయన స్వగృహం వద్ద అభిమానుల దర్శనార్ధం వుంచారు. యుసిసిఆర్‌ఐ (యంఎల్‌) నాయకులు కా.సి.భాస్కర్‌ దివంగత నాయకుని పార్థివ దేహం పై ఎర్రజెండా కప్పి ఘనమైన నివాళులర్పించారు. తన జీవితం చివరి క్షణం వరకు దేశంలో పీడిత ప్రజల రాజ్యం కోసం కృషి చేసిన గొప్ప కమ్యూనిస్టు విప్లవకారుడని, కా.తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులు రూపొందించిన విప్లవ పంథాను దృఢంగా నమ్మి ఆ బాటలో కృషి చేసిన కార్మికోద్యమ నేత ఆయన అని కా.భాస్కర్‌ అమరులైన నేతకు నివాళులర్పించారు. ఓపిడిఆర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కా.కె.సుబ్బారెడ్డి మాట్లాడుతూ కా.రత్నం రైల్వే కార్మికోద్యమానికి, సమసమాజ స్థాపనకు అందించిన సేవలను వివరిస్తూ ఆయన ఆశయాల పరిపూర్తికి కృషి సల్పటమే ఆయనకు నిజమైన నివాళలని అన్నారు. ఏపిటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.వెంకటేశ్వరరావు దివంగత కార్మికోద్యమనాయకుడు రత్నం పీడిత ప్రజలకు, విచక్షణకు గురైన ప్రజలకు అందించిన సేవలను, చేపట్టిన కార్యకలాపాలను వివరించారు. జోహార్‌ కా.రత్నం, అమర్‌ హై కా.రత్నం అన్న నినాదాలతో పార్థివ దేహాన్ని దివంగత నాయకుని కోరిక మేరకు స్థానిక మెడికల్‌ కాలేజీకి దానం చేశారు. పై సంతాప కార్యక్రమంలో బంధుమిత్రులు పాల్గొన్నారు. దివంగత నాయకునికి తన జీవితం చివరి రోజుల్లో అనేక విధాలుగా సేవలందించి సహకరించిన బంధువులను వక్తలు కొనియాడారు.

Featured

దొంగే దొంగా… దొంగా అంటే ఎలా?

దొంగే దొంగా… దొంగా అంటే ఎలా? చర్చా వేదికలో వక్తల ఆవేదన నెల్లూరు, జనవరి 4, (పున్నమి ప్రతినిధి) : తెలుగు భాషను కూనీ చేసేందుకు అహర్నిశలు శ్రమించిన పాలకులు దొంగే… దొంగా దొంగా అని అరిచినట్లు తెలుగు భాషపై చవితి ప్రేమ చూపిస్తున్నారని పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నెల్లూరు నగరంలోని పున్నమి తెలుగు దినపత్రిక కార్యాలయంలో రాష్ట్రంలో తెలుగు మాధ్యమం రద్దు – ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం పై చర్చా వేదిక నిర్వహించారు. ఈ చర్చా వేదికలో తెలుగు భాషను కూనీ చేసేందుకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పలు జీవోలను ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు సుబ్బారెడ్డి వివరించారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పటి ఉపరాష్ట్రపతి, ఒకప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలుగు భాషను కనుమరుగు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారని ఆయన వివరించారు. అయితే ఇప్పుడు తెలుగు భాషకు నష్టం జరుగుతుందని వారే గొంతెత్తి అరవడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. తాము అధికారంలో వున్నప్పుడు రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియాను ప్రవేశపెట్టింది చంద్రబాబు ప్రభుత్వమే తీసుకొచ్చారని, అయితే ఇప్పుడు తెలుగు భాషకు ఏదో నష్టం జరిగిపోతుందని గగ్గోలు పెట్టడంలో ఆయన కూడా వుండడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో తెలుగు భాషను కాపాడుకునేందుకు పలువురు మేధావులు, ప్రజాసంఘాలు ఎంతో చిత్తశుద్దితో ఉద్యమాన్ని చేస్తున్నా చంద్రబాబునాయుడు లాంటి వారు కూడా భాష పరిరక్షణ పై మాట్లాడడం రాజకీయ రంగు పులుముకుంటుందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఒకప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు కూడా తెలుగు మాధ్యమాన్ని ఒక పద్ధతి ప్రకారం కూనీ చేస్తున్నారన్నారు. వీరిద్దరూ రెండు పార్టీలకు చెందిన నాయకులే అయినప్పటికి ఏ ఒక్కరూ కూడా చిత్తశుద్ది లేనివారేనని, అలాంటి వారి మాయమాటలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. దేశంలోనేగాక, ప్రపంచంలోనే మాతృభాషకు ఎంతో ప్రాధాన్యత వుందని, మాతృభాషలోనే భావిభారత పౌరుల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కేవలం ఆంగ్లంతోనే అభివృద్ధి అని చెప్పడం మూర్ఖత్వమన్నారు. ప్రాధమిక విద్య మొత్తం మాతృభాషలోనే జరగాలని, ఆంగ్ల భాషను బలవంతంగా రుద్దడం సరియైనదని కాదన్నారు. పున్నమి మాసపత్రిక గౌరవ సంపాదకులు డాక్టర్‌ గంగిశెట్టి శివకుమార్‌ మాట్లాడుతూ విదేశాలలో కూడా తమ మాతృభాషను గౌరవించే సంస్కృతి ఉందన్నారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్‌లో మాతృభాషను కనుమరుగు చేసేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారన్నారు. దేశవిదేశాలకు వెళ్లాలంటే ఆంగ్లం తప్పనిసరి అని వాదించే వారు ఎంత మంది విదేశాలకు వెళుతున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో అయిదుకోట్ల జనాభావుంటే కనీసం పది శాతం మంది కుటుంబీకులు కూడా విదేశాలకు వెళ్లే అవకాశం వుండదని, అలాంటి పరిస్థితుల్లో అందరి పై బలవంతంగా ఆంగ్ల భాషను రుద్దడం బాధాకరమన్నారు. ఖచ్చితంగా పదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన వుండాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పున్నమి పత్రిక సంపాదకులు సర్వేపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ పల్లెల్లో నేటికి ఎందరో ఉన్నత విద్యకు దూరంగా వున్నారని అలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం వుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలతో పాటు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థల అధిపతులు ప్రభుత్వపాలకులుగా చెలామణి అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వపాఠశాలలు కనుమరుగై ప్రైవేటు విద్య విలయతాండవం చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేద వర్గాలకు ఉన్నత విద్యను అందించాల్సిన అవసరం వుందన్నారు. ఈ చర్చా వేదికలో ఓపిడిఆర్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌.శివశంకర్‌, పలు సంఘాల నాయకులు బొగ్గరపు రాధాకృష్ణమూర్తి, కల్పం రమేష్‌, ఏ.శ్రీనివాసులు, టి.లక్ష్మీనారాయణ, సి.హెచ్‌.ప్రసాద్‌ బాబు, వి.బ్రహ్మయ్య, తోట సులోచనలతో పాటు ఏపీటిఎఫ్‌, యుటిఎఫ్‌, జనవిజ్ఞాన వేదిక, తెలుగు భాషోద్యమ సమితి, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు. చర్చా వేదికలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికి తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని ఎక్కువ మంది స్పష్టం చేశారు.

Featured బిజినెస్

వృత్తి జీవితం – 9 వ్యాపార మర్యాదలు (బిజినెస్‌ ఎటికెట్‌)

ముందుగా, ‘పున్నమి ‘ పాఠకులకు 2020 శుభాకాంక్షలు. 2020లో మీ జీవితం – ఆనందంగా, అర్ధవంతంగా, నాలుగు డబ్బులకు లోటు లేకుండా, హాయిగా సాగాలని కోరుకుంటూ ఈ వారం ఆర్టికల్‌. ఇంగ్లిష్‌లో బిజినెస్‌ ఎటికెట్‌ అనే ఒక పదం ఉంది. అంటే, మనం పని చేసే ఉద్యోగంలో / వ్యాపారంలో, దీసెంట్‌గా, హుందాగా, మర్యాద గా ప్రవర్తించాల్సిన నియమావళి అన్న మాట . వీటిని ఎక్కడా రాయరు. ఎవ్వరూ చెప్పరు. కళాశాలలో నేర్పించరు. కంపెనీ పాలసీలలో ఉండవు. వీటిని ‘అన్‌ రిటెన్‌ రూల్స్‌’ అంటారు. వీటిని పాటిస్తే, మనతో కలిసి పని చేసే వారు మనతో సమయం గడపడానికి ఇష్ట పడతారు. మనకి కావల్సిన కీలకమైన సమాచారంతో, సరి అయిన టైంలో పంచుకుంటారు. మనకి అవసరమైన హెచ్చరికలు చేస్తారు. ‘వ్యాపార మర్యాద’ లు మనం పాటించక పోతే, అవతలి వారు మనని ‘ కేవలం భరిస్తారు’. మన అవసరం అయి పోగానే దూరం పెడతారు. అవి ఏమిటో చూద్దాం . (1) ఎవరికైనా కాల్‌ చేసేటప్పుడు : రెండు సార్ల కంటె ఎక్కువ కాల్‌ చెయ్యకండి . మీరు 2 సార్లు కాల్‌ చేసినా వారు కాల్‌ తీసుకోవడం లేదంటే, కావాలని కావచ్చు , లేదా మరే పని లో అయినా బిజీగా ఉండి ఉండవచ్చు. మీరు ఏ పని మీద వారికి కాల్‌ చేశారో , చిన్న మెసేజి పెట్టండి. ఎస్సెమ్మెస్‌లోనో, లేక వాట్సాప్‌లోనో. మీరు సేల్స్‌లో ఉన్నారు అనుకోండి. వ్యాపారం కోసం చేసే కాల్స్‌కి పై సూత్రం వర్తిస్తుంది . కానీ, క్యాష్‌ కలెక్షన్‌ దగ్గర వర్తించదు! మన దగ్గర సరుకు తీసుకుని, అమ్ముకుని, మనకి డబ్బులు ఇవ్వడానికి డిలే చేస్తున్నారు అంటే, మనం 100 కాల్స్‌ చేసినా, తప్పు లేదు. ఇంటికి / దుకాణానికి వెళ్ళి, వెయిట్‌ చేసి పట్టుకుని అడిగినా తప్పు లేదు. ప్రతి రూల్‌ కీ కొన్ని మినహాయింపులు ఉంటాయి అన్న మాట! (2) అప్పు తీసుకోవడం, ఇవ్వడం, తిరిగి ఇవ్వడం : వేల కోట్ల వ్యాపారాలు చేసే బడా వ్యాపారస్తుల నుంచి, సగటు జీవి వరకూ, మనిషి కి అప్పు చేసే పరిస్థితి వస్తుంది! వ్యాపార జీవితం లో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ. అది మనకు ఇష్టం ఉండదు, కానీ కొన్ని సార్లు తప్పదు. మీరు గనక వ్యక్తిగత జీవితం లో అప్పు తీసుకుంటే, ఆ ఇచ్చిన వారు తిరిగి మనకి గుర్తు చేసే లోపల మీరు తిరిగి ఇవ్వండి ! ఇది మర్యాద చిహ్నం ! ఒక వేళ మీరు ప్రామిస్‌ చేసిన రోజు ఇవ్వ లేక పోతే , మనకి రెండు ఛాయిస్‌ లు ఉంటాయి . ఒకటి , మనం కమిట్‌ చేసిన డేట్‌ కి 2 లేక మూడు రోజుల ముందే, ‘ సారీ ‘ చెప్పి , మరి కొన్ని రోజులు పట్టేలా ఉంది అని చెప్పడం . రెండవది, పాక్షికం గా తిరిగి ఇవ్వడం . ‘ ఇదిగో సురేష్‌ ! నేను చెప్పిన 20 వేలూ ఇప్పుడు ఒక్క సారి గా ఇచ్చే పరిస్థితి లేదు . ఇప్పుడు రూ . 5 వేలు ఇస్తాను, మిగతాది వచ్చే నెలలో . తీసుకో, నాకు కొంచెం భారం తగ్గినట్లు ఉంటుంది ! ‘ అని . అర్ధం చేసుకుంటారు . మొహం చాటు వేయవద్దు ! మీరు అప్పు ఇచ్చే పక్షంలో : అప్పు ఇచ్చి స్నేహాన్ని పాడు చేసుకోకండి ! అలా అంటే అప్పు ఇవ్వ వద్దు అని కాదు ! అవసరానికి సాయ పడక పోతే స్నేహం ఎందుకు? ఎంత మొత్తం ఇవ్వాలి ? : తీసుకున్న వ్యక్తి చెప్పిన డేటు కి సర్ద లేక పోయినా , తిరిగి ఇవ్వడానికి చాలా కాలం పట్టేటట్లు ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బంది లేనంత చిన్న మొత్తం మాత్రమే ఇవ్వండి ! కానీ, పలుసార్లు అడిగి, తీసుకున్న వారు మొహం చాటేసే పరిస్థితి కల్పించ వద్దు ! మరొక విషయం : అవతలి వారు అడిగినంత మీరు ఇవ్వ లేక పోయినా, పాక్షికం గా సాయం చెయ్యండి. ‘ బాసూ ! నువ్వడినీ 50 వేలు నేను ఇచ్చే పరిస్థితి లేదు. నాకు బ్లాక్‌ అయి పోతుంది. నేను ఇప్పుడు 15 వేలు ఇవ్వ గలను . మిగతా 35 వేలు, మరెక్కడన్నా ట్రై చెయ్యి ! ‘ ఇలా. ఇంకో విషయం ! మీరు ఆ స్నేహితునికి అప్పు ఇచ్చినట్లు ఎవరికీ చెప్ప వద్దు ! మీరు గనక అప్పు ఇస్తే, భారం లేని మొత్తమే ఇవ్వండి . అవతలి వారు ఎప్పుడు ఇచ్చినా తీసుకునే దానికి సిద్ధం గా ఉండండి . అలా కుదరక పోతే, అసలు అప్పే ఇవ్వకండి .ఇది, వ్యక్తిగత జీవితంలో పాటించ వలసినీ ‘ వ్యాపార ‘ మర్యాద . ఈ టాపిక్‌ పైన మరొక్క ముఖ్య విషయం . ‘వడ్డీ’ కి ఇవ్వకండి, స్నేహితులకు, చుట్టాలకు, మీ పనిమనుషులకు. ప్రేమగా సాయం చేయ వలసిన చోట, దాని నుంచి ‘లాభ’ పడడానికి ప్రయత్నించకండి. మరిన్ని వ్యాపార మర్యాదలు, వచ్చే సంచికలో సలహాలు, సూచనలు పంపవలసిన చిరునామా: punnami. news@ gmail. com, essence. training @yahoo.com.

Featured అనంతపురం

రైతు బాగుండాలనేది  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయం.. — *కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి*

రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా* *నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 366 చెరువులు కృష్ణా జలాలతో నింపుతాం* *దేశానికి వెన్నెముక రైతన్న* *రైతు బాగుండాలనేది  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయం.. — *కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి* “ఎన్నికలకు మునుపు కదిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాను. ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులన్నింటిని కృష్ణా జలాలతో నింపుతామని అప్పుట్లో హామీ ఇచ్చాను. కచ్చితంగా ఈ రెండేళ్లలో అన్ని చెరువులను నింపి తీరుతాను..” అని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి పేర్కొన్నారు. కదిరి మండల పరిధిలోని పట్నం రంగనాయకుని చెరువును ఎమ్మెల్యే చొరవతో హంద్రీనీవా జలాలతో నింపారు.  ఆదివారం ఎమ్మెల్యే ఆ చెరువులోకి దిగి జల హారతి ఇచ్చారు. అనంతరం మహానేత వైఎస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడే మీడియాతో మాట్లాడారు. *అందులోని ముఖ్యాంశాలు:* ®  మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో అప్పట్లో హంద్రీనీవా ప్రాజెక్టు ను ప్రారంభించారు. © వైయస్ హయాంలోనే 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ©వైఎస్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వెంటనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. © హంద్రీనీవా కాలువ సామర్థ్యం 2,200 క్యూసెక్కులు మాత్రమే. ఈ కాలువ గుండా ఎక్కువ నీటిని తీసుకురావడం సాధ్యపడదు . అందుకే దీన్ని ఈ రెండేళ్లలో 6 వేల క్యూసెక్కులకు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. © కదిరి నియోజకవర్గ పరిధిలో మొత్తం 380 చెరువులు ఉండగా ఈ రెండేళ్లలో 366 చెరువులు నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈ ప్రక్రియ పూర్తయితే నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు ఉండవు. © తలుపుల, ఎన్ పి కుంట మీదుగా వెళ్తున్న హంద్రీనీవా మెయిన్ కెనాల్ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ©దేవుడి కృప, ప్రజలందరి ఆశీర్వాదాలతో నేను నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాను. ,* రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. దేశానికి వెన్నెముక రైతన్న. మాది రైతు ప్రభుత్వమని నిరూపించు కుంటాము.

Featured అనంతపురం

బిసిల అభివృద్ధికి పాటుపడతాం – బిసి సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ

రాష్ట్రంలో బిసిల అభ్యున్నతికి పాటుపడతామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బిసి/ ఓబిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ వందేళ్ల కిందట దేశంలో అణగారిన వర్గాల, పేద ప్రజల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారన్నారు. పూలే ను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేపట్టారని, ఎన్నో రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీలకు అండగా నిలిచారన్నారు. ఆయన బాటలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. చేపట్టారన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీ సోదరుల కు రాష్ట్ర కేబినెట్ లో స్థానం కల్పించారని, అమ్మ ఒడి, పెన్షన్లులాంటి పథకాలను ప్రవేశపెట్టారని, టైలర్ లు, నాయి బ్రాహ్మణుల కు ఆర్థిక సాయం చేశారని, 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించగా అందులో బి సి, ఎస్సీ, ఎస్ టిలకు ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇచ్చారన్నారు. జిల్లాలో బిసి భవన్ నిర్మాణానికి, బిసిలకు రుణాల మంజూరుకు, బిసి స్టడీ సర్కిల్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిసీలకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ పూలే ను ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులు అంతా తమ పిల్లలను బాగా చదివించాలని, విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందేలా తోడ్పాటు అందించాలన్నారు. విద్యార్థులు ఆత్మన్యూనతా భావానికి లోను కాకుండా చిన్నప్పటినుంచే ధైర్యాన్ని నూరిపోయాలని, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బిసి ల అభివృద్ధికి పాటు పడుతోందని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారికోసం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులంతా ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థిని, విద్యార్థులకు పూలే ప్రతిభా అవార్డులను మంత్రి, ఎంపీలు ప్రధానం చేశారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ వీరాంజనేయులు, జడ్పీ సీఈఓ శోభా స్వరూపారాణి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్, బిసి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పిడుగు శ్రీనివాసులు, బిసి సంఘం నాయకులు, విద్యార్థుని, విద్యార్థులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

గ్రామ సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అనిల్ కుమార్

గ్రామ సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అనిల్ కుమార్ ప్రజలకు సూచించారు. నెల్లూరు నగరంలో పెండింగ్ లో వున్న పనులన్నింటినీ త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రణాళికాబద్దంగా పనులు జరుగుతున్నాయన్నారు. 5వ డివిజన్లోని లక్ష్మీపురం, వైకుంఠపురం,లో పర్యటనలో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ కమిషనర్ మూర్తి, వైసీపీ నేతలు ముక్కాల ద్వారకానాధ్, దార్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

గూడూరు

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి కామెంట్స్…

ఏపీలో రాజధాని‌ మీద విచారణ జరిపింది జీఎన్ రావు కమిటీ కాదు.. జగన్ రెడ్డి కమిటీలా ఉంది. – ఏపీ తన సొంత జాగీరులా సీఎం వ్యవహరిస్తున్నారు. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నలభై వేల మంది ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. – ఏపీ ప్రభుత్వం పిచ్చిచర్యలని మానుకోవాలి. జీఎన్ రావు కమిటీ నివేదికని చెత్తబుట్టలో‌ పడేయాలి. వైసీపీలోనే వ్యతిరేఖత వస్తుంది. ఏపీ ముడు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. – బీజేపీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటుంది. కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదు. – సెల్ఫ్ ఫైనాన్స్ తో అమరావతిని రాజధానిగా అభివృద్ది చేమోచ్చు. – మడెం తిప్పమని, మాట తప్పవని చెప్పే జగన్ రాజధాని విషయంలో ఇచ్చిన మాటకి ఎందుకని కట్టుబడటం లేదు. – ఏపీ అనేక సమస్యల్లో ఉంది. సంక్షేమ పథకాలకి నిధులు ఎక్కడ నుంచి తెస్తారు. మీ నిర్ణయాలతో ప్రజలు నవ్వుకుంటున్నారు. – అభివృద్ధి చెందిన వైజాగ్ ని మళ్లీ మీరు అభివృద్ధి చేసేదేమిటి? – రాజధానిని మారిస్తే సహించేది లేదు. కేంద్ర పార్టీ‌ దృష్టికి తీసుకువెళ్లి ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తెస్తాం. – ఏపీ ప్రభుత్వంపై విశ్వాసం పోతుంది. అంబానీ, అదానీ లాంటి వారంతా వెనక్కు వెళుతున్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం.

Featured ఆంధ్రప్రదేశ్

వినువీధుల్లో ఇస్రో ఘనకీర్తి పిఎస్‌ఎల్‌వి సి-47

కొద్దిసేపటి క్రితం నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ సి-47ను రోదసిలోకి దిగ్విజయంగా పంపింది. శాస్త్రవేత్తల ఉత్కంఠకు తెరదించుతూ నిర్ధిష్ట లక్ష్యం వైపు దూసుకెళ్లింది. వినువీధుల్లో ఇస్రో ఘనకీర్తిని చాటింది మన పిఎస్‌ఎల్‌వి సి-47 రాకెట్‌. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో గగన కీర్తిని తమ ఖాతాలో వేసుకొంది. అచ్చొచ్చిన వాహక నౌక పిఎస్‌ఎల్‌వి నుంచి సి-47 రాకెట్‌ కొద్దిసేపటి క్రితం నిప్పులు చెరుగుతూ నింగిలోకి వెళ్లింది. నిర్ధిష్ట కక్ష్యలో చేరింది. అత్యాధునిక రెసల్యూషన్‌ కలిగిన కెమెరాలతో భూవాతావరణ పరిస్థితులను 0.28 మీటర్ల కంటె మెరుగైన రెసల్యూషన్‌లో ఫోటోలు తీసే కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని నిర్ధిష్ట సమయంలో నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో పాటు అమెరికాకు చెందిన 12 నానో శాటిలైట్లను మన పిఎస్‌ఎల్‌వి వాహక నౌక రోదసిలోకి పంపింది. భారత సమాచార సాంకేతిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచే కార్టోశాట్‌ – 3 ఉగ్రహం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్తో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దేశ ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రసంశలు కురుస్తున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తల ఘనకీర్తిని సర్వత్రా కొనియాడుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇమిడివుండే కార్టోశాట్‌-3 దేశానికి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది. ప్రత్యేకించి భారత సైన్యానికి అభివృద్ధి ప్రణాళికలకు ఈ ప్రయోగం దిక్సూచిగా మారనుంది. దాదాపు 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌-3 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన స్లోక్‌-4పి అనే నానో ఉపగ్రహాలు, మెష్‌బెడ్‌ అనేమరో బుల్లి ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి సి-47 దిగ్విజయంగా కక్ష్యలోకి పంపింది. దాదాపు పదేళ్లపాటు ఈ ఉపగ్రహం భారతదేశానికి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.