అన్నార్తులకు ఆహారం
లాక్ డౌన్ తో నెల్లూరు నగరంలో భోజనం లేక ఇబ్బందులు పడుతున్న పేదలు , నిరాశ్రయులకు మాగుంట సేవాసమితి ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవాసమితి వ్యవస్థాపకులు మాగుంట శరత్ చంద్రారెడ్డి, సాయి, నిషాద్ పాల్గొన్నారు..
లాక్ డౌన్ తో నెల్లూరు నగరంలో భోజనం లేక ఇబ్బందులు పడుతున్న పేదలు , నిరాశ్రయులకు మాగుంట సేవాసమితి ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవాసమితి వ్యవస్థాపకులు మాగుంట శరత్ చంద్రారెడ్డి, సాయి, నిషాద్ పాల్గొన్నారు..
మనికిరెడ్డి సేవలు ఆదర్శనీయమని, ఉభయ గోదావరి జిల్లాలలో మానికిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ మానికిరెడ్డి సత్యనారాయణ చేస్తున్న సేవలు అభినందనీయమని కొవ్వూరు స్పెషల్ జ్యూడిషియల్ జడ్జి చింతా పద్మారావు అన్నారు. మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డస్ సామాజిక సేవలో తక్కువ సమయంలో వివిధ ప్రాంతాల్లో ఎక్కువ సేవలు చేసినందుకు గాను డాక్టర్ మానికిరెడ్డి సత్యనారాయణ కు శనివారం సాయంత్రం కొవ్వూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రికార్డ్ ధ్రువీకరణ పత్రాన్ని, జ్ఞాపికను, మెడల్ ను జడ్జి పద్మారావు చేతులమీద అందించారు. మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డస్ ప్రతినిధి డాక్టర్ అద్దంకి రాజా మాట్లాడుతూ మానికిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, కాలేజీలలో విద్యార్థులకు చీ•• ద్వారా సామాజిక సేవతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు, లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ ద్వారా సేవా కార్యక్రమాలు. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాల ఆడ పిల్లలకు ఉన్నత విద్యకు నగదు ప్రోత్సహకాలు. ఎయిడ్స్, కుష్టు నివారణా కార్యక్రమాలు తక్కువ సమయంలో ఎక్కువ కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా గుర్తించి ఈ రికార్డును అందించామన్నారు. కార్యక్రమంలో జి. కె స్టడీ సర్కిల్ నిర్వాహకుడు సామాజికవేత్త గెల్లా కేశవ, పి.డి.ఎస్. యూ రాష్ట్ర నాయకుడు నంబూరి మహర్షి తదితరులు పాల్గొన్నారు.
కరోనా మహమ్మారి ప్రబలమవుతున్న కారణంగా నెల్లూరు నగరంలో ప్రజలు తిరగకుండా ఉండేందుకు గాను నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని నెల్లూరు నగరము నందు గల ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు, కూరగాయలు కాల్ ఆన్ డెలివరి సర్వీసు ద్వారా అందించుటకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నెల్లూరు నగర కమిషనర్, ఆహార భద్రత అధికారి, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్స్ వారితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒక్క ఫోన్ కాల్తో ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేయుటకు నిర్ణయించారు. ఈ క్రింద తెలిపిన షాపులలో సరకులు తీసుకొనవచ్చును. ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు పొందవచ్చని కమిషనర్ తెలిపారు. 1. మోర్ సూపర్ మార్కెట్, వేదాయపాళెం నిత్యావసర సరుకులు, కూరగాయలు 9705807146 8008534066 2. మోర్ సూపర్ మార్కెట్, మాగుంట లేఅవుట్ నిత్యావసర సరుకులు, కూరగాయలు 9912226853, 9666452697 3. మోర్ సూపర్ మార్కెట్, రాంజీనగర్ నిత్యావసర సరుకులు, కూరగాయలు 9030929165 4. రిలయన్స్ స్మార్ట్, దర్గామిట్ట నిత్యావసర సరుకులు, కూరగాయలు 9398736650, 8886083226, 7569042117 5. వెంకయ్య స్వామి ట్రేడర్స్, ఎ.కె.నగర్ నిత్యావసర సరుకులు 9030544863 6. మంచికంటి శ్రీనివాసులు ప్రొవిజన్స్, స్టోన్హౌస్పేట – నిత్యావసర సరుకులు 9849226000 7. మంచికంటి సూపర్ మార్కెట్, స్టోన్హౌస్పేట – నిత్యావసర సరుకులు 9985995995 8. అద్దెపల్లి సుబ్బారావు ప్రొవిజన్స్, స్టోన్హౌస్పేట – నిత్యావసర సరుకులు 8978433867 9. సరాబు వెంకటేశ్వర్లు ప్రొవిజన్స్, స్టోన్హౌస్పేట – నిత్యావసర సరుకులు 9885190744 10. భార్గవి ప్రొవిజన్స్, స్టోన్హౌస్పేట – నిత్యావసర సరుకులు 8309238999 11. శ్రీనివాస ప్రొవిజన్స్, స్టోన్హౌస్పేట – నిత్యావసర సరుకులు 9700555844 12. బిగ్ బజార్, ఎం.జి.బి.మాల్ - నిత్యావసర సరుకులు, కూరగాయలు 9136976270 పైన తెలిపిన షాపులు ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించుటకు అంగీకారము తెలియపరిచారు. సరుకులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు చేరవేయుటకు పోలీసులు అనుమతిచ్చారు. కావున ప్రజలకు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిత్యావసర సరుకులు, కూరగాయలు కావల్సిన వారు పైన తెలిపిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెప్పించుకొనవచ్చునని తెలిపారు.
రాపూరు పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్వయంగా యం.పి.డి.ఓ ఆమోస్ బాబు దగ్గర ఉండి పంచాయతీ సిబ్బంది చేత చెత్తను తొలగించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కెమికల్ స్ప్రే చేయించడం బ్లీచింగ్ చల్లడం పర్యవేక్షిస్తున్నరు. అలాగే రాపూరు మండలం లోని 18 సచివాలయాలు లోనూ సచివాలయ సిబ్బంది తో ఆ గ్రామాలలో పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. వీరి వెంట పంచాయతీ విస్తరణ అధికారి గంగయ్య పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా వ్యాధి …..మూడు రోజుల్లో లక్ష మందికి కరోనా అతి భయంకరమైన అంటువ్యాధిగా మారింది.గత డిసెంబర్లో చైనాలో పుట్టింది. మూడు నెలల్లోనే ప్రపంచంలోని దేశాలన్నింటికీ పాకింది. ఈరోజుకి 3,95,564 మందికి సోకింది. 17,233 ప్రాణాలను బలితీసుకుని ప్రపంచ జనాభానంతా గడగడలాడిస్తుంది. 22వ తేదీ మన దేశంలో జరిగిన స్వచ్ఛంద గృహనిర్బంధ కార్యక్రమాన్ని పరిశీలించినట్లయితే ప్రజలు ఎంత భయానికి లోనవుతున్నారో తెలుస్తుంది. ఈ వ్యాధి సోకిన వారి గణాంకాలను పరిశీలిస్తే ప్రజల భయాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయి. ప్రపంచ వ్యాపితంగా కరోనా సోకిన వారి సంఖ్య లక్షకు చేరుకోవడానికి 67 రోజులు పట్టింది. మరో 11 రోజులలోనే ఈసంఖ్య రెండు లక్షలకు చేరుకుంది. మరో మూడు రోజులలోనే ఈ రెండు లక్షలు సంఖ్య మూడు లక్షలు గా మారింది. 23వ తేదీ ఒక్క రోజే 41,371మందికి సోకింది. ఈ వ్యాప్తి ఇలాగే కొనసాగితే ప్రజల భవిష్యత్తు ఏమిటన్నది పెద్ద ప్రశ్న. సరైన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం కారణంగా చైనా తన దేశంలో పుట్టిన ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోగలిగింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే ఇటలీలో మరణ మృదంగం మోగుతుంది. ఈ వ్యాధి ని అదుపు చేయలేక అల్లాడి పోతుంది. ఈ వ్యాధి గురించి భయపడి పోవడం కాదు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మన ముందున్న ప్రాథమిక కర్తవ్యం.
పత్రికలు, టీవీలు, ఫేస్ బుక్ లు, వాట్సాప్ లలో విపరీతంగా చర్చ జరుగుతున్న అంశం ‘ కరోనా‘. ప్రస్తుతం ప్రతి నోట వినిపిస్తున్న మాట కూడా ‘కరోనా‘. కరోనా దెబ్బకి ప్రపంచమంతా అట్టుడికి పోతోంది. ఈ వ్యాది నివారణకు ప్రభుత్వాలు పాఠశాలలకు,సినిమాహాళ్ళకు మూతలు వేస్తుంటే ప్రజలు తమ మూతికి మాస్కులు వేసుకుంటున్నారు. మూతికి మా స్కూలు కట్టుకోవడం ప్రారంభంకాగానే వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మూడు రూపాయలకు అమ్మే మాస్కు 60 రూపాయలకు కూడా దొరకడం లేదంటే మాస్కుల డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ మాస్కులు కరోనా వ్యాదిని నివారించ గలవా?.మాస్కులను కట్టుకోవడం అవసరమా? మాస్కు ల వల్ల ప్రయోజనం ఉందా? లేదా?.ఎవరు వాడాలి?ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? అనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా మన ముందుకు వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ మరియు భారతీయ వైద్య పరిశోధనా మండలి జారీ చేసిన సూచనల ప్రకారం కరోనా నివారణ కొరకు దేశంలోని ప్రజలందరూ మూతికి మాస్కులు కట్టుకోనవసరం లేదు. వాటిని కట్టుకోవడం ద్వారా ఈ వ్యాది నుండి రక్షించుకోవచ్చు అనే అభిప్రాయంతో లక్షలాది మంది మూతికి మాస్కులు కట్టుకుంటూ అనేక రకాల వైరస్ లను కూడా తెచ్చు కుంటారు. అది ఎలా అని అనుకుంటున్నారా? ఒకసారి మాస్క్ కట్టుకున్న తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో ఆ మాస్క్ ను తాకరాదు. మాట్లాడేటప్పుడు చేతితో మాస్కును కిందికి పైకి లాగడం చేస్తుంటారు.దీని వలన చేతికి అంటుకుని వున్న రకరకాల క్రిములను, వైరస్ లను మాస్కులకు అంటించుకుంటారు. ఇలా మాస్కులకు అంటుకున్న వైరస్ నోరు, ముక్కుల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు. ఒక్కసారి కట్టుకున్న మాస్క్ ఆరు గంటలు మాత్రమే పని చేస్తుంది. ఆ తర్వాత దాన్ని తీసివేసి వేరే మాస్కును వాడుకోవాలి కానీ సాధారణ ప్రజలు ఓకే మాస్కును రోజుల తరబడి వాడుతున్నారు . ప్రమాదాలను పెంచుకుంటున్నారు.ఇలా ప్రతి 6 గంటలకు ఒక మాస్క్ ను మార్చుకోవడం సాధారణ ప్రజానీకానికి వారి వృత్తి మరియు ఆర్థిక పరిస్థితి రీత్యా సాధ్యం కాదు.వ్యయ ప్రయాసలకు ఓర్చి కట్టుకున్నా రక్షణ ఉండదు.వీటికంటే తరచుగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. కరోనా రోగికి వైద్యం చేసే డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, కరోనా వ్యాదిగ్రస్తుల శుభ్రతకు ఉపయోగపడే శానిటరీ సిబ్బందికి, దగ్గరుండి చూసుకునే సహాయకులకు కరోనా వ్యాది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారిని హైరిస్క్ గ్రూపు అంటారు. వీరు మాత్రం ఈ మాస్కులను తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే పేషెంట్ నుండి ఆ వైరస్ వీరికి సోకకుండా ఉండడానికి. *పేషెంట్ కు సహాయకులుగా ఉండేవారు, పేషెంట్ ని పరామర్శించుటకు వచ్చే వారు కూడా మాస్క్ కట్టుకోవాలి.కరోనాతో బాధపడుతున్న రోగి తప్పకుండా మాస్క్ వాడాలి. రోగి మాస్కు కట్టుకోవడం వల్ల రోగికి ఉపయోగం ఏమీ లేదు కానీ అది సమాజానికి ఉపయోగపడుతుంది.తన నోరు మరియు ముక్కు నుంచి వెలువడే వైరస్ ను ఇతరులకు వ్యాపించకుండా ఈ మాస్క్ పనిచేస్తుంది. సర్జికల్ మాస్కులని, రెండు లేయర్ల మాస్కులని, మూడు లేయర్ల మాస్కులని, N95 మాస్కులని అనేక రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. N95 మాస్క్ ఎక్కువ ఉపయోగం. కానీ వాటి ఖరీదు ఎక్కువ. మాస్కులను వాడిన తరువాత తీసివేసే ఉత్తమ పద్ధతులను కొన్నింటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అవి ఏమంటే:- మాస్కును కట్టుకునే ముందు చేతులను సబ్బుతో గాని ఆల్కహాల్ తో కూడిన స్టెరిలైజర్ తో గాని 40 సెకండ్లపాటు శుభ్రం చేసుకోవాలి. మాస్కును కట్టుకున్న తర్వాత దానిని ఎట్టి పరిస్థితులలోనూ చేతులతో పైకి కిందకి లాగడం, మాస్కును సర్దుకోవడం లాంటివి చేయకూడదు. మాస్కును ఎట్టి పరిస్థితిలో కూడా చేతితో తాకరాదు.ఏదయినాఅవసరమై మాస్కులను తాక వలసి వస్తే చేతులను తప్పనిసరిగా సబ్బుతో శుభ్రం చేసుకున్న తర్వాతే తాకాలి.చేతులు శుభ్రం చేసుకోకుండా తాకితే ఆ మాస్కును తీసివేయాలి. అలా జరగకపోతే చేతికున్న క్రిములు మాస్కుకు అనవసరంగా పాకవచ్చు. దీని వల్ల వ్యాది సోకవచ్చు. .మాస్కులు తీసేటప్పుడు దానిని వెనక నుండి తీసివేయాలి. మాస్కులు తీసివేసిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. వాడి తీసివేసిన మాస్కును ఎక్కడంటే అక్కడ వేయరాదు.దానిని ప్రత్యేకమైన వేస్ట్ బుట్టలో వేయాలి. తగలబెట్టడం కానీ భూమిలో పూడ్చిబెట్టడం కానీ చేయాలి. అలా చేయకపోతే ఈ మాస్కుల కారణంగా కరోనా వ్యాది మరికొందరికి వచ్చే అవకాశం ఉంది. కరోనా నివారణకు ప్రజలందరూ మాస్కులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎదుటివారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు విడుదలయ్యే గాలి తుంపర్లు మన మొఖం మీద పడకుండా ఉండేందుకు మాస్కులు ఉపయోగపడుతాయి అనే భావనతో మాస్కును కట్టుకుంటారు.మాస్కుని సరైన పద్ధతిలో వాడకపోతే కరోన వైరస్ ని నిరోధించడం సాధ్యం కాక పోగా కరోనా వ్యాది వ్యాప్తి జరిగే అవకాశమే ఎక్కువ. మాస్కులను సరైన పద్ధతిలో వాడలేకపోతే మాస్కు లను వాడకపోవడం మంచిది. గంటకోసారి చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం ద్వారా కూడా కరోనా వ్యాప్తిని నిరోధించగలం. డాక్టర్ యం. వి. రమణయ్య ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు 9490300431
ఢిల్లీ షహీన్ బాగ్ ( పున్నమి ప్రతినిధి గూడూరు) రగిలించిన స్ఫూర్తి భారతదేశమంతటా విస్తరిస్తోంది. మతోన్మాదుల ఆశయాలను అడియాశలు చేస్తూ దేశమంతటా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా మహిళలు తమ నిరసనలను దీక్షల రూపంలో తెలియజేస్తున్నారు. పాలకుల మనసులు మారాలని తద్వారా హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి సమైక్యతను కాపాడుకోవాలని దీనికి రాజ్యాంగ రక్షణే శిరోధార్యమని ప్రజలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా గూడూరు పట్టణంలో గత 27 రోజులుగా స్థానిక పెద్ద మసీదునందు కులమతాలకతీతంగా ప్రజలు తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నేడు గూడూరు మహిళలు కూడా దీక్షలో పాల్గొనడం ఈ ఉద్యమానికి మరింత వూతం లభించినట్లయింది. గూడూరు పట్టణ చరిత్రలో అప్పుడెప్పుడో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళలు తిరిగి అదే మసీదు నందు తమ దీక్షను ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ షంషేర్ మాట్లాడుతూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను తెచ్చింది కనుక ప్రజలందరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈమె కోరారు. దేశంలోని ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఈమె వాపోయారు. NPR చట్టాలకు వ్యతిరేకంగా వైయస్ జగన్ గారు అసెంబ్లీలో తీర్మానం చేస్తామనడం మంచి పరిణామమని షంషేర్ చెప్పారు. స్వాతంత్రం కోసం ఎందరో ముస్లిములు ప్రాణత్యాగం చేశారు అలాంటి ముస్లింలను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని, అలాగే నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని బిజెపి నాయకులను హెచ్చరించారు. హాషిం..ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు హాషిం మాట్లాడుతూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ చట్టాలపై పూర్తి అవగాహన ఉందని కనుకనే మహిళలు ఈ నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే గూడూరు పట్టణంలో మహిళలు సైతం దీక్షలో పాల్గొనడం కేంద్ర ప్రభుత్వాలకు చెంప పెట్టు లాంటిదని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని తల్లితో పేర్కొనే మోడీ, అమిత్షాలు భారతదేశంలోని తల్లులను వీధుల్లోకి లాగటం ఎంతవరకు సమంజమని పేర్కొన్నారు. ఇది బీజేపీ నాయకుల కుటిలత్వాన్ని సూచిస్తుందని ఈయన స్పష్టం చేశారు.
విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రతిఒక్కరు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని దీనికి తమ వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని మిత్ర ఫౌండేషన్ చైర్మన్ షేక్. షబ్బీర్ భరోసానిచ్చారు. గూడూరులోని విందూరు మిత్ర ఎస్టీ కాలనిలో 5వ తేది సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదవారి బిడ్డల చదువు మధ్యలో ఆగిపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందని అయిన కొంతమంది ఏవో కారణాలతో డ్రాపౌట్స్ గా మిగిలిపోతున్నారని ఆవేదన చెందారు. అలాంటి వారికోసం తమ సంస్థ అన్నిరకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఈ సందర్బంగా అక్కడి పేద విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, పలకలు, ఛార్ట్స్, పరీక్షలకు అవసరమగు మెటీరియల్స్ తదితర సామాగ్రిని అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ మరియు పట్టుదలతో చదవాలని, అలాగే ఎవరైనా క్రీడాకారులు వుంటే వారిని గుర్తించి తగిన క్రీడా వస్తుసామాగ్రిని అందిస్తామని షబ్బీర్ పేర్కొన్నారు. ఆరోగ్య విషయంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని షబ్బీర్ ఉపదేశిస్తూ విద్యార్థులు మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలని వారికి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం విందూరు మిత్ర ST కాలనీలో నివసిస్తున్న 30 కుటుంబాలకు మరియు చిన్న పిల్లలకు బ్రెడ్, పాలు, పాయసం, ఆపిల్ పండ్లుతో పాటు మరికొన్ని వస్తువులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలని ప్రజలతోపాటు షేక్.అబ్దుల్లా, జాఫర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు ఎంపీ ఆదాలకు కేంద్ర మంత్రి సమాధానం దేశంలోని రాష్ట్ర, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని ఆర్బీఐ ప్రశంసించి నట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్సభలో రాతపూర్వకంగా సోమవారం తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి దేశంలోని కేంద్ర సహకార బ్యాంకుల పరిస్థితి గురించి అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబు చెప్పారు. అలాగే ఈ బ్యాంకుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానం చెబుతూ సహకార వ్యవస్థను పటిష్టపరిచేందుకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు (నాబార్డు) పలు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.రుణ పంపిణీ, వసూళ్ల కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 33 రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్రాల్లో 363 సహకార బ్యాంకులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రుణ కేటాయింపు మొత్తం పెరుగుతోందని తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం బ్యాంకులు లాభాల్లో ఉన్నాయని స్పష్టం చేశారు.
జాతీయ ప్రతిభా పురస్కారాలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఏ విధంగా ఉపకరిస్తున్నాయని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం లోక్సభలో ప్రశ్నించారు. ఈ ప్రతిభా పురస్కారాలు ఎంత మంది విద్యార్థులకు అందుతున్నాయని ,వాటికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మానవ వనరుల శాఖ మాత్యులు రమేష్ పాఖ్రి యల్ నిశాంక్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2008 నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అంద జేస్తున్నామని తెలిపారు. చదువును కొనసాగించలేని వారికి ప్రోత్సాహకంగా ఈ పురస్కారం కింద లక్ష రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నామని తెలిపారు. తొమ్మిదవ తరగతిలో 12 వేల రూపాయలు మొదటిసారిగా అందజేస్తామని, ఇక అక్కడి నుంచి 12వ తరగతి వరకు ఈ పురస్కారం లభిస్తుందని పేర్కొన్నారు .ఎంపిక చేసిన విద్యార్థులు ముఖ్యంగా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు దీన్ని ప్రత్యేకిం చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ, కేంద్రపాలిత ప్రాంతాలను బట్టి ఈ ప్రతిభా పురస్కారాలు మొత్తం నిర్ణయమవుతుందని పేర్కొన్నారు ఈ పరీక్షను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. 18. 75 లక్షల రూపాయలను మంజూరు చేశామని, లక్షా 36 వేల 239 స్కాలర్షిప్పులు దేశవ్యాప్తంగా అందజేస్తున్నామని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని స్పష్టం చేశారు. ఈ స్కాలర్షిప్పుల వల్ల ఎంతోమంది తమ చదువు కొనసాగించారనే సంఖ్య తమ వద్ద లేదని తెలిపారు. పర్యాటక కాలుష్యం వల్ల ఇబ్బంది లేదు దేశంలోని పర్యాటక ప్రాంతాల వల్ల పర్యాటకుల ఆరోగ్యానికి ఎటువంటి నష్టం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సోమవారం లోక్సభలో రాతపూర్వకంగా తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో పర్యాటక ప్రాంతాల్లో నీటి, వాయు కాలుష్యం గురించి ప్రశ్నించారు .పర్యాటక కేంద్రాల వల్ల పర్యాటకుల ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం ఉందని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి సమాధాన మిస్తూ, ఇంతవరకూ పర్యాటక ప్రాంతాల కాలుష్యం వల్ల పర్యాటకులు జబ్బున పడిన దాఖలాలు లేవని, అటువంటి విషయం తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు. కేంద్ర కాలుష్య మండలి తమ శాఖల ద్వారా దేశంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పర్యాటకుల ద్వారా గత మూడేళ్లలో 85. 858 యుఎస్ మిలియన్ డాలర్లను విదేశీ మారక ద్రవ్యంగా ఆర్జించినట్లు తెలిపారు.