Thursday, 5 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకాణి ని మర్యాదపూర్వకంగా కలిసిన వీరి చలపతి”

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా నియమితులైన సందర్భంగా వీరి చలపతి గారు మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పూజితమ్మ గారిని కూడా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంకెనపల్లి నరసింహారెడ్డి, నెల్లూరు లోని అఖిల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా ఖలీల్ అన్న గారిని వైఎస్ఆర్సిపి పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీ, నెల్లూరు జిల్లా చెందిన అంకెనపల్లి నరసింహారెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రానున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఖలీల్ అన్న గారి నాయకత్వంలో పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తామని నరసింహారెడ్డి గారు తెలిపారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే విజయాలు సాధ్యమవుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఖమ్మం

వెలుగుమట్ల బాధితుల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగుతుంది మంత్రి పొంగులేటి నోటిని అదుపులో ఉంచుకోవాలి – దేవకీ వాసుదేవరావు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెలుగుమట్లలో నివసిస్తున్న పేద ప్రజలను ఫిబ్రవరి 24 నుండి రోడ్డుపైకి నెట్టివేసి వారితో మూడు ముక్కుల ఆట ఆడుతున్నట్లుగా జిల్లా కు చెందిన ముగ్గురు మంత్రులు వ్యవహరిస్తున్నారని దేవకీ వాసుదేవరావు ఆరోపించారు. రెక్కాడితే గాని డొక్క నిండని పేదల జీవితాలతో ఇలా ఆడుకోవడం దుర్మార్గమని అన్నారు. వెలుగుమట్ల బాధితులకు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తోందని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నోటి కి వచ్చినట్టు మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన నోటి ని అదుపులో ఉంచుకోవాలని సూచించారు. “ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చడమేనా? ప్రజా పాలన అంటే ప్రజలను రోడ్డున పడేయడమేనా?” అని ఆయన ప్రశ్నించారు. పార్టీలు మారి అధికార పదవులు పొందిన నాయకులు ప్రజల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. 31.7 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి దాని విలువ రూ.250 కోట్లు అని గొప్పలు చెప్పుకుంటున్న జిల్లా కలెక్టర్‌కు అది నిజంగా ప్రభుత్వ భూమా లేదా భూదాన్ భూమా అనే విషయం కూడా తెలియదా అని ప్రశ్నించారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని దేవకీ వాసుదేవరావు తెలిపారు. సమావేశం లో జిల్లా సీనియర్ నాయకులు మండధపు సుబ్బారావు, గుత్త వెంకటేశ్వర్లు, వంకదాని రామకృష్ణ లతో పాటు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి

ముస్తాబాద్ /మార్చి /పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ని రాంరెడ్డిపల్లె గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద సంపంగి మమత–శ్రీనివాస్ దంపతులు నిర్మించుకున్న కొత్త ఇంటికి ఈరోజు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి హాజరై గృహప్రవేశంలో పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సొంత ఇల్లు కలగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు నేడు రాక

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు నేడు అనగా గురువారం (05-03-2026) సాయంత్రం 5.30 గంటల నుండి వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు అందుబాటులో ఉండనున్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలతో ఆయన చర్చించనున్నారు. అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న వివాహాది శుభకార్యాలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఈ విషయాన్ని నేదురుమల్లి కార్యాలయం వర్గాలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశాయి. కావున పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆయనను కలవాలని కార్యాలయం తరఫున కోరడమైనది.

ఖమ్మం

ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్

ఖమ్మం మార్చి ( పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి ) ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం నిజమైన మానవత్వం. అలాంటి సేవా భావంతో ముందుకు వచ్చి ఒక పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మనసులు గెలుచుకున్నారు ఖమ్మం బాలయ్య అభిమానీ నల్లమల్ల రంజిత్. ఖమ్మం నగరంలోని బోనకల్ క్రాస్ రోడ్డుకు చెందిన చందా సత్యం ఒక సామాన్య కూలీ. గణపతి నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమై ప్రస్తుతం పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. కొంతకాలంగా చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. సత్యం కుటుంబంలో భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబానికి ఏకైక ఆధారం అయిన సత్యం అనారోగ్యంతో మంచాన పడటంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. పిల్లల చదువుకు కూడా ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని తెలుసుకున్న ఖమ్మం జిల్లా ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు స్పందించారు. సంస్థ తరపున నల్లమల్ల రంజిత్ ముందుకొచ్చి సత్యం వైద్య ఖర్చుల కోసం రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నల్లమల్ల రంజిత్ మాట్లాడుతూ, తాను నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా బాలయ్య అభిమానులతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. చందా సత్యం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమం లో సతీష్,మధు తారక్,గోపి,సాయితేజ,రవి,నిరజ్,సామినేని సత్యం ఉన్నారు స్థానికులు నల్లమల్ల రంజిత్ చేసిన సహాయాన్ని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఖమ్మం

ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్

ఖమ్మం మార్చి ( పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి ) ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం నిజమైన మానవత్వం. అలాంటి సేవా భావంతో ముందుకు వచ్చి ఒక పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మనసులు గెలుచుకున్నారు ఖమ్మం బాలయ్య అభిమానీ నల్లమల్ల రంజిత్. ఖమ్మం నగరంలోని బోనకల్ క్రాస్ రోడ్డుకు చెందిన చందా సత్యం ఒక సామాన్య కూలీ. గణపతి నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమై ప్రస్తుతం పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. కొంతకాలంగా చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. సత్యం కుటుంబంలో భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబానికి ఏకైక ఆధారం అయిన సత్యం అనారోగ్యంతో మంచాన పడటంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. పిల్లల చదువుకు కూడా ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని తెలుసుకున్న ఖమ్మం జిల్లా ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు స్పందించారు. సంస్థ తరపున నల్లమల్ల రంజిత్ ముందుకొచ్చి సత్యం వైద్య ఖర్చుల కోసం రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నల్లమల్ల రంజిత్ మాట్లాడుతూ, తాను నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా బాలయ్య అభిమానులతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. చందా సత్యం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమం లో సతీష్,మధు తారక్,గోపి,సాయితేజ,రవి,నిరజ్,సామినేని సత్యం ఉన్నారు స్థానికులు నల్లమల్ల రంజిత్ చేసిన సహాయాన్ని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఖమ్మం

ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్

ఖమ్మం మార్చి ( పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి ) ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం నిజమైన మానవత్వం. అలాంటి సేవా భావంతో ముందుకు వచ్చి ఒక పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మనసులు గెలుచుకున్నారు ఖమ్మం బాలయ్య అభిమానీ నల్లమల్ల రంజిత్. ఖమ్మం నగరంలోని బోనకల్ క్రాస్ రోడ్డుకు చెందిన చందా సత్యం ఒక సామాన్య కూలీ. గణపతి నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమై ప్రస్తుతం పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. కొంతకాలంగా చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. సత్యం కుటుంబంలో భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబానికి ఏకైక ఆధారం అయిన సత్యం అనారోగ్యంతో మంచాన పడటంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. పిల్లల చదువుకు కూడా ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని తెలుసుకున్న ఖమ్మం జిల్లా ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు స్పందించారు. సంస్థ తరపున నల్లమల్ల రంజిత్ ముందుకొచ్చి సత్యం వైద్య ఖర్చుల కోసం రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నల్లమల్ల రంజిత్ మాట్లాడుతూ, తాను నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా బాలయ్య అభిమానులతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. చందా సత్యం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమం లో సతీష్,మధు తారక్,గోపి,సాయితేజ,రవి,నిరజ్,సామినేని సత్యం ఉన్నారు స్థానికులు నల్లమల్ల రంజిత్ చేసిన సహాయాన్ని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

అన్నమయ్య

పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబుకు ‘కాకర్ల’ ఘన స్వాగతం

రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు చిట్వేల్ మండలంలో ఘన స్వాగతం లభించింది. గురువారం మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల నాగార్జున నాయుడు ఆహ్వానం మేరకు ప్రసాద్ బాబు తొలిసారిగా వారి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి రాజకీయాలు, పార్టీ పటిష్టతపై కీలక భేటీ జరిగింది.భేటీలో నాగార్జున నాయుడు గారు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా విపక్షంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ జెండాను మోసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. మండలంలోని పలు రాజకీయ అంశాలను, పరిష్కరించాల్సిన సమస్యలను అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రసాద్ బాబు సానుకూలంగా స్పందిస్తూ.. “ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుంది” అని భరోసా ఇచ్చారు. మండలంలో పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు త్వరలోనే చిట్వేల్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రసాద్ బాబు ప్రకటించారు. ఆ సమావేశంలో కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేస్తామని తెలిపారు. కొత్త పాత కలయికతో రాజంపేట పార్లమెంట్‌ను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు లారీ సుబ్బారాయుడు, బొక్కసం చలపతి, ఆకేపాటి వెంకట రెడ్డి, మద్దిన కోటయ్య నాయుడు, మాచినేని సుబ్బారామయ్య, మించల బాలకృష్ణ యాదవ్, పగడాల వెంకటేష్, బాలు రెడ్దియ్య, బండారు శివప్రసాద్, రాయిన సుబ్బారాయుడు, నంద్యాల ధనంజయ, కాకర్ల కోటేశ్వరరావు, తుంగా చంద్రశేఖర్, పగడాల శివ, కట్టా గిరి బాబు, గూడూరు నాగరాజు, మోసాటి సుబ్రహ్మణ్యం, కస్తూరి శివ, రాయపు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్

ఖమ్మం మార్చి ( పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి ) ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం నిజమైన మానవత్వం. అలాంటి సేవా భావంతో ముందుకు వచ్చి ఒక పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మనసులు గెలుచుకున్నారు ఖమ్మం బాలయ్య అభిమానీ నల్లమల్ల రంజిత్. ఖమ్మం నగరంలోని బోనకల్ క్రాస్ రోడ్డుకు చెందిన చందా సత్యం ఒక సామాన్య కూలీ. గణపతి నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమై ప్రస్తుతం పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. కొంతకాలంగా చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. సత్యం కుటుంబంలో భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబానికి ఏకైక ఆధారం అయిన సత్యం అనారోగ్యంతో మంచాన పడటంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. పిల్లల చదువుకు కూడా ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని తెలుసుకున్న ఖమ్మం జిల్లా ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు స్పందించారు. సంస్థ తరపున నల్లమల్ల రంజిత్ ముందుకొచ్చి సత్యం వైద్య ఖర్చుల కోసం రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నల్లమల్ల రంజిత్ మాట్లాడుతూ, తాను నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా బాలయ్య అభిమానులతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. చందా సత్యం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమం లో సతీష్,మధు తారక్,గోపి,సాయితేజ,రవి,నిరజ్,సామినేని సత్యం ఉన్నారు స్థానికులు నల్లమల్ల రంజిత్ చేసిన సహాయాన్ని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.