Tuesday, 9 December 2025

Blog

E-పేపర్

ఈరోజుతో ముగియనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం*

ఈరోజుతో ముగియనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం* * ఈరోజు సాయంత్రానికి మొదటి విడత ప్రచారానికి తెర* ఈనెల 11న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి విడత పోలింగ్ అదే రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ తర్వాత ఫలితాలు దశల వారీగా పంచాయతీ ఎన్నికల వివరాలు మొదటి విడత 189 మండలాలు 4235 గ్రామ పంచాయతీలు 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు 27 లక్షల 41వేల 70 మంది పురుష ఓటర్లు 28 లక్షల 78వేల 159 మంది మహిళా ఓటర్లు 201 ఇతరులు 37వేల 562 పోలింగ్ కేంద్రాలు రెండో విడత 193 మండలాలు 4331 గ్రామ పంచాయతీలు 57 లక్షల 22వేల 665 మంది ఓటర్లు 27 లక్షల 96వేల 6 పురుష ఓటర్లు 29 లక్షల 26వేల 506 మహిళ ఓటర్లు 153 ఇతర ఓటర్లు 38వేల 337 పోలింగ్ కేంద్రాలు తుది విడత 182 మండలాలు 4157 గ్రామ పంచాయతీలు 53 లక్షల 6వేల 401 ఓటర్లు 26 లక్షల 1861పురుష ఓటర్లు 27 లక్షల 4వేల394 మహిళా ఓటర్లు 146 ఇతర ఓటర్లు 36వేల 483 పోలింగ్ కేంద్రాలు 3విడతల్లో మొత్తం 564 మండలాలు 12723 గ్రామ పంచాయతీలు 1కోటి66 లక్షల 48వేల 496 మంది ఓటర్లు 81లక్షల 38వేల 937 పురుష ఓటర్లు 85 లక్షల 9వేల 59 మంది మహిళా ఓటర్లు 500 మంది ఇతర ఓటర్లు 1లక్ష 12వేల 382 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్..

తూర్పు గోదావరి

శ్రద్ధాంజలి

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు పెడసనగంటి బాలకృష్ణ గారు సిపిఐ ఏలూరు జిల్లా సమితి సభ్యులు ఈరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు స్వర్గస్తులైనారు ఏలూరు జిల్లా సమితి సభ్యులు సిపిఐ నాయకులు ఆయనకు నివాళులర్పించారు END

E-పేపర్

ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సంఘం ఏపీ

ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ ఆంధ్ర ప్రదేశ్ సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ మరియు మాజీ MLC రామకృష్ణ సమక్షంలో ఏకగ్రీవంగా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి (తిరుపతి), ఉపాధ్యక్షుడు అప్పారావు (విజయనగరం), కార్యదర్శి సల్మాన్ రాజు( విజయవాడ) అదనపు ప్రధాన కార్యదర్శి సికిందర్ ( నెల్లూరు),సహాయకార్యదర్శి సుబ్రమణ్యం (కర్నూలు) మహిళా కార్యదర్శి శాంతి రాజశ్రీ (కోనసీమ)ను ఎన్నుకొన్నారు. తదనంతరం ఇంటర్మీడియేట్ విద్యా మండలి కార్యదర్శి శ్రీ రంజిత్ భాషా గారిని కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య,అందించడానికి తీసుకోవలసిన చర్యలు, అదేవిధంగా GO 283 ప్రకారం రూపొందించ బడిన సీనియారిటీ జాబితా ప్రకారం ప్రిన్సిపల్స్ కు పదోన్నతులు కల్పించాలని, ప్రతి FAC పోస్ట్ ను కూడా సీనియారిటీ ప్రాతిపదిక గా ఇవ్వాలని, కళాశాలల టైమింగ్స్ మార్చాలని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల ను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సూచించడం జరిగినది. అనంతరం విద్యా మండలి పరీక్షల నియంత్రణ అధికారి విక్టర్ గారిని కలిసి , 2026 లో జరుగు ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, సీనియారిటీ ప్రాతిపదికన అధికారులను నియమించాలని 4 సార్లు ఒకే విధమైన డ్యూటీ చేసిన వారిని తప్పించి వేరే సీనియర్ లకు అవకాశం కల్పించాలని అదేవిదంగా ప్రభుత్వ కళాశాలలో పనిచేసే అతిధి అధ్యాపకుల సేవలు పరీక్ష లలో ఉపయోగించుకోవాలని కోరారు.

కడప

మైదుకూరు లో మూత్రశాలలు లేక ఇబ్బందులు*

*మైదుకూరు లో మూత్రశాలలు లేక ఇబ్బందులు*. . ఊరంతా చుట్టాలే ఉ.. పోసుకోవడానికి తావులేదు అన్న సామెత మైదుకూరులో గుర్తొస్తోందంటున్నారు ప్రజలు. . ఊర్లో ఇంత అభివృద్ధి చెందుతున్న ఉ.. పోసుకోవడానికి ప్రజలకు మరుగుదొడ్లు లేని పరిస్థితి.. నిత్యం మైదుకూరు పట్టణం కు అనేక గ్రామాల నుండివేలసంఖ్యలో ప్రజలు మహిళలు పనుల నిమిత్తం కూరగాయలు ఇతర వ్యవసాయ పనుల నిమిత్తం వస్తుంటారు.. మగవారైతే ఎలాగోలా పాటుపడతారు గాని అత్యవసర పరిస్థితి లో మహిళలు మూత్రశాలకు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి .. గతంలో పోస్ట్ ఆఫీస్ ప్రక్కన మరుగుదొడ్లు ఉండేవి నేడు అవి కనిపించడం లేదు.. నిత్యం రద్దీగా ఉండే బద్వేల్ రోడ్డు కడప రోడ్డు లో మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తే మహిళలకు సౌకర్యంగా ఉంటుందంటున్నా ఇతర ప్రాంతాల ప్రజలు.. బద్వేల్ రోడ్డులో మురికి కాలువలపై మరుగుదొడ్లు నిర్మించడం ..కడప రోడ్డులో గతంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ప్రక్కన మరుగుదొడ్డి నిర్మించడం మేలంటున్నారు ప్రజలు.. ప్రజల అవస్థలు ముఖ్యంగా మహిళల అవస్థలు దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల తో మున్సిపాలిటీ అధికారులు మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

తెలంగాణ

డి ఆర్ సి కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించిన : కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రి , పంపిణీ, స్వీకరణ ప్రక్రియను, జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ డిఆర్సి కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కేతపల్లి మండల కేంద్రంలోని పీపాల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రి, పంపిణీ, స్వీకరణ, కేంద్రాన్ని తనిఖీ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వాహనదారుడుకీ ప్రత్యేక కౌన్సిలిoగ్ ఇచ్చినా ఉదయగిరి సీఐ వెంకట్రావు

ద్విచక్ర వాహన దారుడికి హెల్మెట్ రక్షణ కవచంలా పని చేస్తుందని ఉదయగిరి సిఐ వెంకట్రావు తెలిపారు ఉదయగిరిలోని కరెంట్ ఆఫీస్ సర్కిల్ వద్ద హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక కౌన్సిల్oగ్ ఇచ్చారు ప్రతి ఒక్కరికీ కుటుంబాలు ఉన్నాయని వివిధ పనులు ముగించుకొని తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకోవాలంటే హెల్మెట్ తప్పని సరి అన్నారు మితిమీరిన వేగంతో వాహనాలు నడపరాదని సూచించారు వారితో పాటు ఉదయగిరి ఎస్ఐ ఇంద్రసేనా రెడ్డి ఉన్నారు.

తెలంగాణ

ఎటువంటి లోపాలు కనిపించకుండా సరిదిద్దుకోవాలన్న : కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఎటువంటి లోపాలు కనిపించిన వెంటనే సరిదిద్దుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టర్ శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల పోలింగ్ సామాగ్రిని, పోస్టల్ బ్యాలెట్ పత్రాలను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లపై అధికారులతో వివరంగా అడిగి తెలుసుకున్నారు.

E-పేపర్

రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చిన ఫార్మా సిటీ రైతులు

పున్నమి ప్రతినిధి రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చిన ఫార్మా సిటీ రైతులు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ వేళ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులన్ని చట్టవిరుద్ధమని ప్రెస్ నోట్ రిలీజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఫార్మా సిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చి, తమ మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు.. ప్రభుత్వంలోకి వచ్చాక ఫార్మా సిటీని రద్దు చేయలేదు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతుల భూములను కాపాడతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు అదే రైతులను భూములు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు చట్టం ప్రకారం, ఈ భూముల్లో కొత్త ప్రాజెక్టును నిర్మించలేరు ఫార్మా సిటీ కోసం చేసిన భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసి.. ఫ్యూచర్ సిటీ కోసం తిరిగి భూసేకరణ చేస్తున్నామని చెప్పి, కొత్త పర్యావరణ అనుమతులు పొంది, తిరిగి ప్రజా స్పందన చేసి భూసేకరణ చేయాలి.. కానీ ఇవేవీ ఈ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములపై ఫ్యూచర్ సిటీ నిర్మించడం చట్ట వ్యతిరేకం దీనికి తోడు మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కురమిద్దా గ్రామాలలో ప్రభుత్వం భూ సేకరణ చేయకూడదని హైకోర్టు స్టే ఇచ్చింది వివాదంలో ఉన్న ఈ భూములను అగ్ర నాయకులకు, పెట్టుబడిదారులకు కొత్త ఫ్యూచర్ సిటీ ప్రాంతం అని చూపించడం మోసం అలాగే గ్లోబల్ సమ్మిట్ ప్రతినిధులకు మా విజ్ఞప్తి ప్రభుత్వం స్థానిక రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసింది ప్రజా పాలన అంటూ పేపర్ యాడ్స్ ఇస్తూ తప్పుడు సందేశం చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోస పోవొద్దంటూ అంతర్జాతీయ పెట్టుబడిదారులను హెచ్చరిస్తున్నామంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఫార్మా సిటీ రెసిస్టెన్స్ కమిటీ

అల్లూరి సీతారామరాజు

అరకు: హెల్మెట్ ధారణపై అవగాహణ ర్యాలీ

అరకులోయ లో డిఎస్పి షేక్ సహబాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో సోమవారం హెల్మెట్ ధారణపై అవగాహన బైక్ ర్యాలీ చేపట్టారు. డిసెంబర్, జనవరి నెలలో పర్యాటకుల రాక పెరిగి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో హెల్మెట్ పై అవగాహణ పరుస్తున్నామని డీఎస్పీ అన్నారు. పొగ మంచు ఎక్కువగా ఉన్నప్పుడు చోదకులు అప్రమత్తంగా డ్రైవ్ చేయాలన్నారు. కొత్త మోటర్ వాహన చట్టం నిబంధనలు తెలిపారు. అరకు సీఐ హిమగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి ఎస్ఐ లు గోపాలరావు, పాపినాయుడు, శ్రీనివాసరావు ఉన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కెమిస్ట్రీ విభాగo వారి గెస్ట్ లెక్చర్…

8 .12. 2025వ తేదీ శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల,రసాయన శాస్త్ర విభాగం వారు RAINBOW WEEK CELEBRATIONS- 2025 లో భాగంగామొదటి రోజున గెస్ట్ లెక్చర్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నన్నపనేని మాధవి , (ప్రొఫెసర్,HOD,పిజి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ )గారు ముఖ్య అతిథిగా పాల్గొని *తాజా పరిణామాలు-పరిశోధన అవకాశాలు *అనే అంశంపై ఉపన్యసించారు. నానో కెమిస్ట్రీ అంశాలను అర్థవంతంగా విద్యార్థులకు వివరించారు. నానో స్థాయిలో పదార్థాలు పొందే ప్రత్యేక లక్షణాలు….. ఉపరితల ప్రాంతం పెరగడం, కొత్త రకాల ఎలక్ట్రిక్ మరియు ఆప్టికల్ లక్షణాల ప్రదర్శన లాంటి అంశాలను ఉదాహరణలతో చూపించారు. నానో పార్టికల్స్, నానో రాడ్స్, నానో ట్యూబ్స్, నానో ఫిలిమ్స్, నానో కంపోజిట్ వంటి రకరకాల నాను మెటీరియల్స్ ను చిత్రాలతో వివరించారు. వీటి తయారీ పద్ధతులు , ఉపయోగాలు మరియు డిమాండ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉపన్యాసంలో అనంతరం సింథసిస్ పద్ధతుల గురించి లోతుగా చర్చించారు. ముఖ్యంగా టాప్ – డౌన్ మరియు బాటమ్- అప్, పద్ధతులు , తేడాలు, వాటి ప్రయోజనాలు గురించి విద్యార్థులతో చర్చించారు. గ్రాఫిన్ ,గ్రాఫిన్ ఆక్సైడ్, తయారీ గురించి మరియు రసాయన రేడక్షన్ పద్ధతి ద్వారా కాపర్ నానో పార్టికల్స్ తయారీలో ఉపయోగించే సోడియం బోరో హైడ్రేట్ ఆస్కారిక్ ఆమ్లం వంటి ప్రొడ్యూసింగ్ ఏజెంట్ల ప్రాముఖ్యత ను వివరించడమే కాకుండా నానో సైన్స్ ఎందుకు భవిష్యత్తు టెక్నాలజీకి బలమైన పునాది అవుతుందో వివరించి ,పరిశ్రమల్లో ఈ పదార్థాలకు పెరుగుతున్న డిమాండ్ ను, నానో పదార్థాల అనువర్తనను గురించి మాట్లాడుతూ ముఖ్యంగా డ్రగ్ డెలివరీ క్యాన్సర్ చికిత్సలో నానో పార్టికల్స్ ద్వారా ట్యూమర్ కణాలను గుర్తించి చికిత్స చేయడం , బయోసెన్సర్లు, మెడికల్ ఇమేజింగ్, టిష్యూ ఇంజనీరింగ్, ఇలాంటి అనేక రకాల ఉపయోగాలను గురించి విద్యార్థులలో చక్కని అవగాహనను కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రమణ్య కుమార్ గారు మాట్లాడుతూ రోజు రోజుకి మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న శాస్త్రీయ ఆధునిక రంగాలపై అవగాహన కలగడం చాలా అవసరము అని ఈ లెక్చర్ విద్యార్థుల జీవితాలలో కొత్త ఆలోచనలను రేకెత్తించి , పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందింప చేస్తుందని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎన్ మాధవి…. (హెడ్ ఆఫ్ ద పిజి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, JKC కాలేజ్ అటానమస్…. గుంటూరు) కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి వి ఎస్ కుమార్ గారు, రసాయన శాస్త్ర విభాగాధిపతి M. సుభాషిణి అధ్యాపకులు , లావణ్య, శ్యామల,రాధిక మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.