Saturday, 19 July 2025

Blog

విశాఖపట్నం

అమ్మే నా దేవత

అమ్మంటే ఒక అదృష్టం అమ్మంటేఒక అపురూపం అమ్మంటే ఒక ఆనందం అమ్మంటే ఒక ఐశ్వర్యం అమ్మంటే ఒక అక్షర బీజం అమ్మంటే ఒక అపార శక్తి రూపం అమ్మంటే ఒక అనుబంధం అమ్మంటే ఒక అనురాగం అమ్మంటే ఒక ఔదార్యం అమ్మంటే ఒక ఆప్యాయత అమ్మంటే ఒక అక్షయపాత్ర అమ్మంటే ఒక దివ్య ఔషధం అమ్మంటే ఒక కమ్మని మకరందం అమ్మంటే ఒక అపూర్వ కానుక అమ్మంటే ఆకలి తీర్చే అన్నపూర్ణ అమ్మంటే ఒక అద్భుతం అమ్మంటే ఒక ఆశీర్వాదం అమ్మంటే ఒక అనంత ప్రేమ అమ్మంటే ఒక విజయ రథసారధి అమ్మంటే ఒక క్షీర సాగరం మదనం అమ్మంటే ఒక అమృత బాండం అమ్మఃటే ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లే ! అమ్మ లేకపోతే అన్నీ ఉన్న ఏమీ లేనట్లే!!

తెలంగాణ పెద్దపల్లి

ఆగస్టు 5 నుంచి 8 వరకు పెద్దపల్లి కలెక్టరేట్ లో ఆధార్ అప్డేట్ కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు…

ఆగస్టు 5 నుంచి 8 వరకు పెద్దపల్లి కలెక్టరేట్ లో ఆధార్ అప్డేట్ కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు… పెద్దపల్లి, జులై 18, పున్నమి ప్రతినిధి: ఆగస్టు 5 నుంచి 8 వరకు కలెక్టరేట్ లో ఆధార్ అప్డేట్ కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా ఆధార్ కార్డు పొందేందుకు మీసేవ ద్వారా అడ్రస్ తో జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్, తల్లి లేదా తండ్రి అప్ డేట్ చేసిన ఆధార్ కార్డు ఉండాలని అన్నారు. ఆధార్ కార్డులో అడ్రస్ మార్పు కోసం ఓటర్ ఐడి లేదా పాస్ పోర్ట్ లేదా నివాస సర్టిఫికెట్, బ్యాంకు పుస్తకం/ పోస్టల్ బుక్ తో సహా అటెస్టడ్ దరఖాస్తు ఫారం ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఆధార్ కార్డులు పేరు స్పెల్లింగ్ పొరపాట్ల సవరణకు ఓటర్ ఐడి లేదా పాస్ పోర్ట్ లేదా ప్యాన్ కార్డు లేదా ఎస్.ఎస్.సి మార్కుల మెమో లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా మైనర్ ఐతే బర్త్ సర్టిఫికెట్ ఉండాలని, పెళ్లి తర్వాత పేరు మార్పు కోసం సబ్ రిజిస్ట్రార్ జారీ చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్, పెళ్లి ఫోటో, ఇతర గుర్తింపు కార్డులు ఉండాలని, పూర్తిగా పేరు మార్పు కోసం గెజిటెడ్ చేసి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆధార్ కార్డు లో డేట్ అఫ్ బర్త్ కరెక్షన్ కోసం బర్త్ సర్టిఫికెట్, 21 సంవత్సరాల పైబడిన వారికి ఫోటో తో కూడిన మార్కుల మెమో లేదా ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలని అన్నారు. ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ కోసం బయట 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, ఈ క్యాంపులో అవసరం లేదని ఉచితం అన్నారు. ఆధార్ అప్డేషన్ అవసరం ఉన్నవాళ్లు ఈ 15 రోజుల వ్యవధిలో కావలసిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసే ఆధార్ అప్డేట్ క్యాంపును అవసరమైన ప్రజలు, ఉద్యోగులు వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

హైదరాబాద్

పాల ప్యాకెట్లు కాదు.. కల్లు ప్యాకెట్లు పాల ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న దుండగులు ఎస్వీఎస్ పేరుతో పాల ప్యాకెట్లు సృష్టించి వాటిలో కల్తీ కల్లు అమ్ముతున్న వ్యాపారులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గుండ్ల పోచమ్మ, కండ్లకోయ, అయోధ్య నగర ప్రాంతాల్లో పాల ప్యాకెట్ల లాగా కనిపించే ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న వ్యాపారులు ఆకస్మిక దాడులు చేసి కల్తీ కల్లు విక్రయదారులను అరెస్టు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు

పున్నమి: పాల ప్యాకెట్లు కాదు.. కల్లు ప్యాకెట్లు పాల ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న దుండగులు ఎస్వీఎస్ పేరుతో పాల ప్యాకెట్లు సృష్టించి వాటిలో కల్తీ కల్లు అమ్ముతున్న వ్యాపారులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గుండ్ల పోచమ్మ, కండ్లకోయ, అయోధ్య నగర ప్రాంతాల్లో పాల ప్యాకెట్ల లాగా కనిపించే ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న వ్యాపారులు ఆకస్మిక దాడులు చేసి కల్తీ కల్లు విక్రయదారులను అరెస్టు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్

మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులను తక్షణం ఆదుకోవాలి

పున్నమి: జూలై 18 ప్రతినిధి దూపం అంజనేయులు అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా, తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఎల్బీనగర్ చౌరస్తాలో శుక్రవారం రోజున ధర్నా కార్యక్రమంలో మోటార్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులు పాల్గొని మాట్లాడుతూ కౌడా సతీష్ కుమార్, అతినిమోని నగేష్ కుమార్, టి రాజశేఖర్ రెడ్డి, బిజ్జులా రామకృష్ణ రెడ్డి, బొంగు రవి గౌడు, గడ్డం తిరుపతి యాదవ్, జి ఎన్ గౌడ్, అబ్దుల్ రాహూఫ్, దోర్నాల నాగరాజ్, సతీష్, ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఓలా ఉబర్ రాపిడో వంటి కంపెనీలను నిషేధిస్తూ గవర్నమెంట్ మోటార్ రవాణా రంగా కార్మికులకు మీటర్ విధానాన్ని తీసుకురావాలని గతంలో ఉన్న జీవోల ఆధారంగా ఒక నిర్దిష్టమైన రేటు నిర్ణయించి క్యాబ్ లకు మీటర్లను బిగించాలని అలాగే 2012 సంవత్సరంలో ఆటో మీటర్ చార్జీలను పెంచడం జరిగిందని అప్పటినుంచి ఇప్పటివరకు ఆటో చార్జీలను పెంచలేదని వాటిని కూడా సవరిస్తూ నిర్దిష్టమైనటువంటి రేటు నిర్ణయించాలని ఒలా ఉబర్ రాపిడో కంపెనీలలో క్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి టు వీలర్ బైక్ టాక్సీలను నిషేధించాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి తెలంగాణ ఐక్యత సమితి తెలంగాణ స్టేట్ క్యాబ్ చేసి నాయకులు టిఆర్ఎస్ కే వి నాయకులు గిగ్ ప్లాట్ఫారం వర్కర్స్ యూనియన్ కు సంబంధించిన నాయకులు మరియు ఆటో కార్మికుల సంఘాల నాయకులు రవాణా రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. మోటార్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులు క్యాబ్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లు మార్పు

పున్నమి: జూలై 18 ప్రతినిధి దూపం అంజనేయులు శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట గ్రామాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల పెంటను ‘కృష్ణ గిరి’, దోమల పెంటను ‘బ్రహ్మగిరి’గా మార్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు కొత్త పేర్లతో మార్చాలని అధికారులు ఆదేశించారు.

తెలంగాణ రంగారెడ్డి హైదరాబాద్

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తిచేయాలి- మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, జులై 18, పున్నమి ప్రతినిధి : బాచుపల్లి – గండి మైసమ్మ వరకు 6 వరసల రోడ్డు, బహుదూర్ పల్లి నుంచి దూలపల్లి మీదుగా కొంపల్లి వరకు సాగే రహదారి నిర్మాణాలకు అటవీ భూమి బదలాయింపు పై రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ సువర్ణ, హెచ్ ఎండీఎ కమిషనర్ సర్ఫరాజ్ నవాజ్, జిహెచ్ ఎంసీ అదనపు కమిషనర్, కొంపల్లి మున్సిపల్ కమిషనర్, మేడ్చెల్స్ అదనపు కలెక్టర్, తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూమి, ఫారెస్టేతర స్థలాల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పనులకు శంకుస్థాపన జరిగే విధంగా యుద్ధ ప్రాతిపదికన నిర్దేశించిన పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. అటవీ శాఖకు చెందిన 19 ఎకరాల భూమి అప్పగింతకు సంబంధించి మొదటి దశ ఫార్మాటిలిటీలన్నీ గడువులోగా అయ్యేలా చూడాలని ఆదేశించారు. స్థానికులకు చెందిన భూముల సేకరణ, నష్టపరిహారం చెల్లింపులో మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు. భూసేకరణకు పరిహారంగా ఇచ్చే నిధులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే 8 శాసన నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి అన్నారు. బహదూర్ పల్లి నుంచి కొంపల్లి రోడ్డులో అటవీ భూమి బదలాయింపునకు సంబంధించి స్టేజ్-1 ప్రక్రియ పూర్తయిందని ఫారెస్ట్ అధికారులు శ్రీధర్ బాబుకు వివరించారు. బాచుపల్లి – గండి మైసమ్మ రోడ్డు నిర్మాణానికి అవసరమైన అటవీభూమి ట్రాన్సఫర్ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. సుభాష్ నగర్ పైపు లైన్, సెయింట్ యాన్స్ స్కూల్ రోడ్డు నిర్మాణం పనులను కూడా పూర్తి చేయాలని రెవిన్యూ, మున్సిపల్ అధికారులను శ్రీధర్ బాబు ఆదేశించారు.

నిర్మల్

హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించే PHC హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేసారు. అలాగే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించి, పాఠశాల ఆవరణలో మొక్క నాటరు.ఈ కార్యక్రమంలో నాయకులు రాంనాథ్, మాజీ ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్, నాయకులు జమాల్, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు గంగయ్య, నాగభూషణ్, అనిల్,అశోక్,రమేష్, నారాయణ, నరేందర్, సురేష్, శంకర్, శ్రావణ్, నర్సారెడ్డి, VDC కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నిర్మల్

హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించే PHC హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేసారు. అలాగే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించి, పాఠశాల ఆవరణలో మొక్క నాటరు.ఈ కార్యక్రమంలో నాయకులు రాంనాథ్, మాజీ ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్, నాయకులు జమాల్, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు గంగయ్య, నాగభూషణ్, అనిల్,అశోక్,రమేష్, నారాయణ, నరేందర్, సురేష్, శంకర్, శ్రావణ్, నర్సారెడ్డి, VDC కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించే PHC హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేసారు. అలాగే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించి, పాఠశాల ఆవరణలో మొక్క నాటరు.ఈ కార్యక్రమంలో నాయకులు రాంనాథ్, మాజీ ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్, నాయకులు జమాల్, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు గంగయ్య, నాగభూషణ్, అనిల్,అశోక్,రమేష్, నారాయణ, నరేందర్, సురేష్, శంకర్, శ్రావణ్, నర్సారెడ్డి, VDC కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

ఆగస్టు 22 నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు*

యూపీఎస్‌సీ సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానున్నాయి. 2025లో మొత్తం 979 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. ఇందులో 38 ఖాళీలను దివ్యాంగులకు రిజర్వ్‌ చేశారు. మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 22, 23, 24, 30, 31 తేదీల్లో జరుగుతాయి. పూర్తి షెడ్యూల్‌ కోసం upsc.gov.in వెబ్‌సైట్‌ చూడొచ్చు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.