Sunday, 7 December 2025

Blog

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం లో భారీ ఎత్తున మద్యాన్ని పట్టుకున్న పోలీసులు

పున్నమి ప్రతినిధి ఎలక్షన్ కోడ్ అమల్లో……… భారీగా అక్రమ మద్యం స్వాధీనం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం లో భారీ ఎత్తున మద్యాన్ని పట్టుకున్న పోలీసులు యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సె మధు, తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మాల్, చెక్ పోస్ట్ వద్ద ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 210 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని మద్యాన్ని తరలించడానికి వాడిన కారును పోలీస్ స్టేషన్ కు తరలించి నిందితుడిపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఆంధ్రప్రదేశ్ రోజు సొసైటీ వారి రంగోలి హేళ విజేతలు శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు..,

ఆంధ్రప్రదేశ్ రోజ్ సొసైటీ వారు నిర్వహించిన రంగోలి పోటీలలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతిని సాధించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల …. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వారి అనీమియా అవగాహన మరియు హిమోగ్లోబిన్ స్క్రీనింగ్ ప్రోగ్రాం

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో అనీమియా అవగాహన కార్యక్రమం మరియు హీమోగ్లోబిన్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని డాక్టర్ జాస్మిన్ సుల్తానా గారి ద్వారా నిర్వహించారు. ఆమె పిన్నమనేని సిద్దార్థ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్, గన్నవరం‌లోని ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ విభాగం బ్లడ్ సెంటర్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. కార్యక్రమంలో మేడమ్ అనీమియాకు కారణాలు, అనీమియా వల్ల కలిగే సమస్యలు అలాగే రక్తాన్ని పెంచే ఐరన్‌ సమృద్ధిగా ఉన్న ఆహారాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి కలసల ప్రిన్సిపల్ డాక్టర్ వివి సుబ్రహ్మణ్య కుమార్ గారు అధ్యక్షత వహించారు. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏ అన్నపూర్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విభాగ అధ్యాపకులు Ch. Gayathri, Tehamina, T Kundana మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

రంగారెడ్డి

*సంస్థాన్ అభివృద్ధి చేసేవారికి ఓటేద్దాం.! ఊరికి సేవ చేసేవాడికె అవకాశం ఇద్దాం.! మన ఊరు – మన ఓటు గ్రామ అభివృద్ధి మన బాధ్యత – మాజీ సర్పంచ్ కోన్ రెడ్డి నరసింహ

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 06 :సంస్థాన్ నారాయణపురం మాజీ గ్రామ సర్పంచ్ కోన్ రెడ్డి నరసింహ మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని అన్నారు, గత ఏడు సంవత్సరాలుగా గ్రామా అభివృద్ధికి గ్రామ ప్రజలకు సేవ చేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలని ఉప్పల లింగస్వామి అధికార పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అని ఒక లక్ష్యంతో ఏడు సంవత్సరాలుగా గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, మనలో ఒక్కడి గా మన మధ్య తిరుగుతున్న ఆ నాయకుడికి అవకాశం కల్పిస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అండతో, మునుగోడు ఎమ్మెల్యే రాజన్న ఆశీస్సులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మన ముందుకు సంస్థాన్ నారాయణపురం సర్పంచ్ అభ్యర్థిగా ఉప్పల విజయలక్ష్మి- లింగస్వామి కి మన ఊరు- మన ఓటు- మన బాధ్యతగా వారినకి ఓటు వేసి గెలిపించుకొని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు,

విశాఖపట్నం

ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారి చేతుల మీదుగా దక్షిణ నియోజకవర్గం మహిళలకు కుట్టు మిషన్ ల పంపిణి.*

*ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారి చేతుల మీదుగా దక్షిణ నియోజకవర్గం మహిళలకు కుట్టు మిషన్ ల పంపిణి.* *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- * విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి చొరవతో వేదాంత కంపెనీవారి ఆర్థిక సహాయంతో ఈ రోజు జగదాంబ జంక్షన్ దగ్గర అంబికా బాగ్ లో దక్షిణ నియోజకవర్గం పేద మహిళలకు ఉచితంగా 75 మందికి కుట్టు మిషన్ లు పంపిణి చేశారు, ఈ సందర్బంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మాట్లాడుతూ పేద మహిళలు తన కాళ్ళ మీద తాము నిలబడాలని ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యం లో భాగంగా ఈ రోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫౌండ్స్ ద్వారా వేదాంత కంపెనీ చేస్తున్న అభివృద్ధి పనులలో భాగంగా ఈ కుట్టు మిషన్ లు పంపిణి చేసారన్నారు, ప్రతి మహిళా స్వయం ప్రతిపత్తి సాధించేలా అభివృద్ధి సాదించాలి అని అన్నారు, ఇలాంటి అభివృద్ధి పనులు భవిష్యత్తు లో వేదాంత వారి ప్రోత్సాహంతో మరిన్ని చెప్పడతామని అన్నారు, ఈ కార్యక్రమం లో లబ్ధిదార మహిళలు ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు సేవలు మరువలేనివని,ఎమ్మెల్యే గారికి, వేదాంత కంపెనీ వారికీ కృతజ్ఞతలు తెలియచేసారు, ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే వంశీకృష్ణ గారితో పాటు వేదాంత కంపెనీ తరుపున శ్రీ లక్ష్మి గారు పాల్గొన్నారు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు,

విశాఖపట్నం

సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఆస్తి

సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఆస్తి *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- * – ప్రకృతి రైతులకూ, ప్రకృతి పంటలతో ఉత్పత్తులకూ చేయూత ఇస్తాం – కొండపల్లి శ్రీనివాసరావు, ఎం ఎస్ ఎం ఇ, సెర్ప్, శాఖల మంత్రి సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఉన్న ఆస్తి అని ఆంధ్రప్రదేశ్ ఎం ఎస్ ఎం ఇ, సెర్ప్ తదితర శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రకృతి పంటల మేళాను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్, ప్రైవేట్, పాట్నర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా చాలా ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. రైతులకు చేయూత ఇవ్వడం లో తమ ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. గ్రామీణ రైతుల ఎఫ్ పిఒల ద్వారా గ్లోబల్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రకృతి రైతులకూ, ప్రకృతి పంటలతో ఉత్పత్తులను తయారు చేసే వారికి చేయూత ఇస్తాం అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం సెక్రటరీ చిరంజీవి చౌదరి, రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయకుమార్, నాబార్డ్ రిటైర్డ్ ఎం డి సూర్య కుమార్, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి, అవని ఆర్గానిక్స్ ఉషా గజపతి రాజులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికారత సంస్థ ఉత్తరాంధ్ర ఎక్జీక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు నాయుడు, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరి రామకృష్ణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, కార్యదర్శి పాలెం అశోక్, ప్రకృతి రైతులు పిఎల్ఎన్ రాజు, ఎన్ నరేంద్ర, రిషి, శంకర్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, ప్రకృతి రైతులు , సిద్ధ వైద్యులు పాల్గొన్నారు. ఈ మేళా నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, వారాహి ఫెడరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హలొ వైజాగ్, టెర్రస్ గార్డెన్ గ్రూప్ లు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ, అగ్రి డిఎన్ఎ వెంచర్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు

విశాఖపట్నం

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు నగర మేయర్ ఘన నివాళి.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు నగర మేయర్ ఘన నివాళి. *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- సమాజంలో అన్ని వర్గాలకు సమానత్వం కల్పించేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఎంతో కృషి చేశారని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వారి జీవితాలలో వెలిగి నింపిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఈ పుడమి ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో చిరస్మనీయునిగా ఉంటారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా భారత దేశ రాజ్యాంగాన్ని రచనలో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో జివిఎంసి సూపరింటెండెంట్ లు రియాజ్ ,శ్రీనివాస్ , ఉద్యోగులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

26 ఏళ్ల మిలేనియం ఘన వార్షికోత్సవం – MACT-2025 టాపర్స్కు భారీ బహుమతులు

26 ఏళ్ల మిలేనియం ఘన వార్షికోత్సవం – MACT-2025 టాపర్స్కు భారీ బహుమతులు *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- * “భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడుస్తోంది. అందుకు మనం సిద్ధంగా ఉండి, అవసరమైన నైపుణ్యాలను పొందాలి” అని పాత్రా ఇండియా బిపిఓ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి ముక్కవిల్లి గారు మిలేనియం ఆప్టిట్యూడ్ & కోడింగ్ టెస్ట్-2025 బహుమతి ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పేర్కొన్నారు. ట్రెండింగ్ టెక్నాలజీలను క్రమశిక్షణతో నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు ఎంతో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. MACT వంటి పరీక్షలు విద్యార్థుల్లో పోటీ భావనను పెంచుతాయని కూడా అభిప్రాయపడ్డారు. “ఎవరూ ఎదగడానికి ఎదురు చూసి సిద్ధం కాలేదు. ప్రారంభించడం ద్వారా మాత్రమే సిద్ధత వస్తుంది” అని వరదా రవికుమార్, సెంట్రల్ మేనేజర్, మిల్లేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రారంభ ప్రసంగంలో చెప్పారు. ఈరోజు కార్యక్రమం మిల్లేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ 26వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించబడుతోందని పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన శిక్షణతో పాటు ప్లేస్మెంట్ సహాయంపై మిల్లేనియం ఎల్లప్పుడూ దృష్టి పెట్టిందని వివరించారు. CRT ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, 2023లో మిల్లీనియం ఆప్టిట్యూడ్ టెస్ట్ను 50 లక్షల రూపాయల ప్రతిభా వేతనంతో ప్రారంభించామని, ఇందులో ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, వర్బల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్ వంటి ఇంటర్వ్యూలో కీలకమైన నైపుణ్యాలను పరీక్షించుకోడానికి విద్యార్థులకు అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం మిల్లేనియం ఆప్టిట్యూడ్ & కోడింగ్ టెస్ట్ 30 కళాశాలల్లో విజయవంతంగా నిర్వహించబడిందని, మొత్తం 5,500 మంది విద్యార్థులు పాల్గొన్నారని, అందులో 1,000 మంది ర్యాంకర్లుగా ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమం నిర్వహణలో సహకరించిన విశాఖ పరిసర ప్రాంతాల ప్రఖ్యాత కళాశాలల ప్రిన్సిపాళ్లు, HODలు, TPOలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మరిసెట్టి డింపుల్ (NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) మొదటి ర్యాంక్ సాధించి ₹50,000 నగదు బహుమతి గెలుచుకున్నారని ప్రకటించారు. 2వ ర్యాంక్ – వెమనమంద స్రీ సాయి ప్రణవ్ వర్మ (ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్) 3వ ర్యాంక్ – బెజవాడ నూక శ్రీనివాసరావు (ASK కాలేజ్ ఆఫ్ టెక్ & మేనేజ్మెంట్) 4వ ర్యాంక్ – షేక్ కరీముల్లా (MVR డిగ్రీ కాలేజ్) 5వ ర్యాంక్ – చింతల గణేష్ (సెంచూరియన్ యూనివర్సిటీ) తరువాత, బేహ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ CSE విభాగాధిపతి నారాయణరావు చొక్కాపు మాట్లాడుతూ—AI పరిశ్రమల్లో విస్తరిస్తున్నప్పటికీ, దాన్ని అమలు చేయడానికి ఇంజనీర్లు అవసరమని, విద్యార్థులు తాజా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. MVR డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ శ్రీ బి. రత్నకుమార్, విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఫిజిక్స్ హెచ్ఓడీ డాక్టర్ పి.ఎల్. సరణ్య తదితరులు మిలేనియం 26 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని కొనియాడారు. VIET, సెయింట్ ఆన్స్, BVK డిగ్రీ కాలేజీల ప్రతినిధులు కూడా ఈ ఉపయోక్తమైన పరీక్ష నిర్వహణకు మిలేనియంను అభినందించారు. తర్వాత ముఖ్య అతిథి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.

విశాఖపట్నం

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీలు;

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీలు; వార్డు, క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విశాఖ టిడిపి కార్యాలయంలో ఘనంగా జరిగింది. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం. శ్రీభరత్ గారు, శాసన మండలి ప్రభుత్వ విప్ డా.వేపాడ చిరంజీవిరావు గారు కమిటీల ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వచ్చే స్థానిక సంస్థలలో విజయకేతనం ఎగురవేసే దిశగా నూతన కమిటీలు కృషి చేయాలని కోరారు. అధిక సంఖ్యలో ఉత్తర నియోజకవర్గ టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర్రక్రియ‌ను స‌మ‌ర్ధంగా నిర్వ‌హించాలి*

*ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర్రక్రియ‌ను స‌మ‌ర్ధంగా నిర్వ‌హించాలి* *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:-* *అధికారుల‌ను ఆదేశించిన రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి వివేక్ యాద‌వ్ *జిల్లాలో చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను వివ‌రించిన క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ విశాఖ‌ప‌ట్ట‌ణం, డిసెంబ‌ర్ 06 ః ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడటానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్దేశించిన విధానాల ప్ర‌కారం జిల్లాలో ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను స‌మ‌ర్ధంగా నిర్వ‌హించాల‌ని జిల్లా అధికారుల‌ను రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి వివేక్ యాద‌వ్ ఆదేశించారు. ముంద‌స్తు ఎస్.ఐ.ఆర్. నేప‌థ్యంలో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఒత్తిడికి గురికాకుండా ప్ర‌ణాళికాయుతంగా విధులు నిర్వ‌ర్తించాల‌ని చెప్పారు. శ‌నివారం జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, ఈఆర్వోలు, ఏఆర్వోలతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. వివిధ అంశాల‌పై సూక్ష్మంగా స‌మీక్షించిన ఆయ‌న ఓట‌ర్ల జాబితా విధానంలో భాగంగా నిర్వ‌హించే మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను ప‌క్కాగా చేప‌ట్టాల‌ని సూచించారు. ఓటరు జాబితాలో వారి పేర్లు, తండ్రి/తల్లి పేర్లను ధృవీకరించడానికి 2002 సంవత్సరం ఓటరు జాబితాను పరిశీల‌న‌లోకి తీసుకోవాల‌న్నారు. 2002 జాబితాను 2025 నాటి జాబితాతో స‌రిపోల్చి వివరాల‌ను న‌మోదు చేసుకోవాల‌ని, ఆయా పోలింగ్ స్టేష‌న్, నియోజ‌క‌వ‌ర్గం వారీగా ఓట‌ర్ల వివ‌రాల‌ను మ్యాపింగ్ చేయాల‌ని సూచించారు. స్వీయ పత్రాల స్వీక‌ర‌ణ‌, మ్యాపింగ్ ప్ర‌క్రియ పార‌ద‌ర్శ‌క రీతిలో జ‌రిగేలా అధికారులు, సిబ్బంది చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులూ త‌లెత్త‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉంటూ ప్ర‌క్రియ‌ను స‌జావుగా చేప‌ట్టాల‌న్నారు. *జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 24.54 శాతం మ్యాపింగ్ జ‌రిగింది ః జిల్లా క‌లెక్ట‌ర్* ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు జిల్లాలో చేప‌ట్టిన ప్ర‌క్రియ‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 24.54 శాతం మ్యాపింగ్ జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ సీఈవోకు వివ‌రించారు. ఏడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో 20,20,726 మంది ఓట‌ర్లు ఉండ‌గా, 2,81415 మంది వివ‌రాల‌ను మ్యాపింగ్ చేశామ‌ని, మిగిలిన ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని పేర్కొన్నారు. వార‌సులు, ఇత‌ర సంతానం తాలూక వివ‌రాల‌ను కూడా జాగ్ర‌త్త‌గా అనుసంధానం చేస్తున్నామ‌ని చెప్పారు. అయితే జిల్లాలో దాదాపు అన్నీ పట్ట‌ణీక‌ర‌ణ ప్రాంతాలే కావ‌టం, వ‌ల‌స కార్మికుల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల వివ‌రాల సేక‌ర‌ణ‌లో క్షేత్ర‌స్థాయిలో కొంచెం క్లిష్ట‌త ఏర్ప‌డుతోంద‌ని ఈఆర్వోలు సీఈవో దృష్టికి తీసుకొచ్చారు. ఈఆర్వోలు సంగీత్ మాధుర్, ద‌యానిధి, సుధాసాగ‌ర్, మ‌ధుసూధ‌న్, సునీత‌, శేష‌శైల‌జ‌, జ్ఞాన‌వేణి, ప‌లువురు ఏఈఆర్వోలు స‌మావేశంలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.