ముదిరాజ్ కులస్థులకు (ముదిరాజ్ సంఘo ) చెందిన స్మశాన వాటికను “1064” సర్వేనెంబర్ కలిగిన భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా *”బహుజన స్మశాన వాటికల పరిరక్షణ కమిటీ యాదాద్రి భువనగిరి”*
జిల్లా కమిటీ అధ్యక్షులు “*పెంట నర్సింహ్మ ముదిరాజ్*” గారు మాట్లాడుతూ
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి ఎదురుగా ఉన్న మా ముదిరాజ్ కులస్థుల సమాధులను కొంతమంది గుర్తు తెలియని దుండగులు భూమిని చదును చేస్తున్నారు ,ఇట్టి భూమిలో సుమారు 60 కి పైగా సమాధులు తీసివేశారు అని వీరిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు గారు,మాజీ కౌన్సిలర్ ఎనబోయిన జహంగీర్, సాధు విజయ్, గొర్రెంకల శివశంకర్, ఇట్టబోయిన గోపాల్, ఉడత భాస్కర్, దుగ్యల రవి,షాగంటి నర్సింహా, గడిల ప్రభాకర్,గుర్రాల మల్లేష్, పెంట నితీష్, తుమ్మల నగేష్,పెంటబోయిన నాగరాజు,బాలరాజు,కొల్పుల హరినాథ్, ఇండ్ల శ్రీను, ప్రవీణ్ ,ముదిరాజు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు….


