నాగర్ కర్నూల్ ప్రతినిధి/ అక్టోబర్ 13 (పున్నమి):
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి సొంత నివాసంలో కలిసి తన కుమారుని నిశ్చితార్థానికి రావాలని ఆహ్వానించిన మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆచారి తన కుమారుడైన తల్లోజు భరత్ నిశ్చితార్థం ఈనెల 31న జరుగుతున్నందున సీఎం ని రావాలని కోరారు. అనంతరం.. ఆమనగల్లు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని, నాలుగు మండలాలకు కూడలి అయినటువంటి ఆమనగల్ లో సబ్ రిజిస్టర్, ఎస్. టి .ఓ, మరియు ఆర్.టీ.ఏ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిచి వెంటనే ఏర్పాటు చేస్తామని తెలిపారన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, రేవంత్ మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు ఆసిఫ్ ఆలీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపల్లి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


