ఖమ్మం, ఏప్రిల్
(పున్నమి జిల్లా ఇంచార్జీ )
భారతీయ జనతా పార్టీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ మరియు డి.వి.ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో ఏప్రిల్ 20 సోమవారం సాయంత్రం చలివేంద్రం ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, రుద్ర ప్రదీప్, ఇవి రమేష్, బీజేపీ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ పాల్గొననున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు వేసవి కాలంలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ పేర్కొన్నారు.



