Sunday, 7 December 2025
  • Home  
  • బుచ్చిరెడ్డిపాలెం విద్యుత్ సబ్ స్టేషన్లో హైపవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు – ఏడి రమేష్ చంద్ర.
- Featured

బుచ్చిరెడ్డిపాలెం విద్యుత్ సబ్ స్టేషన్లో హైపవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు – ఏడి రమేష్ చంద్ర.

08-06-2020 బుచ్చిరెడ్డిపాలెం(పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో హై పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. ఇటీవల నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న బుచ్చి పెరుగుతున్న జనాభా దృష్ట్యా విద్యుత్తు వినియోగం ఎక్కువ కావడంతో లో ఓల్టేజ్ సమస్యతో ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎ డి రమేష్ చంద్ర అన్నారు. ఈ నేపథ్యంలో బుచ్చి సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి 5MVA, 3.5MVA, 8MVA ట్రాన్స్ఫార్మర్ల లో 5 MVA ట్రాన్స్ఫార్మర్ తొలగించి దాని స్థానంలో 8MVA ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు.బుచ్చిరెడ్డిపాలెం మండలం మొత్తం ఇక్కడినుండే విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో అంతకు ముందు తో పోల్చుకుంటే ప్రస్తుతం విద్యుత్ వినియోగం ఎక్కువయిందని అందువలన లోడ్ సరిపోక లో వోల్టేజ్ కారణాలు వంటివి తలెత్తుతున్నాయని అందువలన హై పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తున్నట్లు రమేష్ చంద్ర వెల్లడించారు.ఈ ట్రాన్స్ఫార్మర్ను నెల్లూరు కరెంట్ ఆఫీస్ నుంచి తీసుకువచ్చినట్టు ఏడి రమేష్ చంద్ర వెల్లడించారు. ఇకపై బుచ్చిరెడ్డిపాలెం మండలం లో లోవోల్టేజీ సమస్య పునరావృతం కాదని పేర్కొన్నారు.

08-06-2020 బుచ్చిరెడ్డిపాలెం(పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో హై పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. ఇటీవల నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న బుచ్చి పెరుగుతున్న జనాభా దృష్ట్యా విద్యుత్తు వినియోగం ఎక్కువ కావడంతో లో ఓల్టేజ్ సమస్యతో ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎ డి రమేష్ చంద్ర అన్నారు. ఈ నేపథ్యంలో బుచ్చి సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి 5MVA, 3.5MVA, 8MVA ట్రాన్స్ఫార్మర్ల లో 5 MVA ట్రాన్స్ఫార్మర్ తొలగించి దాని స్థానంలో 8MVA ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు.బుచ్చిరెడ్డిపాలెం మండలం మొత్తం ఇక్కడినుండే విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో అంతకు ముందు తో పోల్చుకుంటే ప్రస్తుతం విద్యుత్ వినియోగం ఎక్కువయిందని అందువలన లోడ్ సరిపోక లో వోల్టేజ్ కారణాలు వంటివి తలెత్తుతున్నాయని అందువలన హై పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తున్నట్లు రమేష్ చంద్ర వెల్లడించారు.ఈ ట్రాన్స్ఫార్మర్ను నెల్లూరు కరెంట్ ఆఫీస్ నుంచి తీసుకువచ్చినట్టు ఏడి రమేష్ చంద్ర వెల్లడించారు. ఇకపై బుచ్చిరెడ్డిపాలెం మండలం లో లోవోల్టేజీ సమస్య పునరావృతం కాదని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.