-76 సంవత్సరాలుగా రైతులు పేరు మీద ఉన్న భూమిని దేవస్థానం కు అప్పగింత..
-నవంబర్ 1న జరిగే వేలంపాటను అడ్డుకోండి
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు రైతులకు పిలుపు.
కాకినాడజిల్లా,కొత్తపల్లి :
యు కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీకి సంబంధించిన సర్వేనెంబర్ 121 122 గల 20 ఎకరాల జురాయితీ భూమిని 1949 నుండి బలహీనవర్గాల కు చెందిన రైతులు సాగు చేసుకుంటున్నారని కానీ నేడు మూడు రోజుల క్రితం దేవస్థానం డిపార్ట్మెంట్ వారు బోర్డు పెట్టి జెండాలు పాతి ఇది మా భూమి అని చెప్పడం అన్యాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఇలాకాలో రైతులకు అన్యాయం జరగడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు
ఆదివారం ఉదయం సిపిఐ జిల్లా కార్యదర్శి కే బోడకొండ సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి శాఖ రామకృష్ణ ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు తదితరులతో కూడిన బృందం కొమరగిరి లో 20 ఎకరాల భూమిని పరిశీలించింది అక్కడ రైతుల ఆవేదనను ఆలకించింది
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం నుండి అంటే సుమారు 90 సంవత్సరాలుగా పొజిషన్లో ఉండి లింక్ డాక్యుమెంట్లు , పాస్ పుస్తకాలు, పేరడంగల్ వన్ బి రికార్డు రెవిన్యూ పనులు రైతు భరోసా లోన్స్ ఇన్ని అర్హతలు ఉన్న భూమిని ఎండోమెంట్ అటాచ్మెంట్ చేసుకోవడం దారుణమన్నారు 2006 సంవత్సరం నుండి ఇది కోర్టులో ఉన్న ఇప్పటికి ఎండోమెంట్ వెనకాల కొంతమంది అధికార పార్టీ పెద్దల హస్తంతో ఈ కుట్ర జరిగిందన్నారు 2012 అప్పటి కలెక్టర్ ఆర్డిఓ స్థానిక తాసిల్దార్ ఇది ఎండోమెంట్ భూమి కాదని జరాయితి భూమిని పేపర్ ప్రకటన ఇచ్చిన అధికార పార్టీ అండదండలతో ఈ భూమిని ఆక్రమించుకున్నారని మధు విమర్శించారు ఇన్ని సంవత్సరాలగా ఏ ఎమ్మెల్యే ఏ అధికారులు ఈ భూమిపై కన్నెత్తి చూడలేదని కానీ నేడు స్థానిక ఎమ్మెల్యే ఇంచార్జ్ అండదండలతోనే ఇదంతా జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారని మధు పేర్కొన్నారు నవంబర్ 1న గొర్స ప్రాంతంలో వేలంపేట పెట్టారని ఇలాంటి అన్యాయమైన వేలం పాటను చుట్టుపక్కల ఉన్న రైతులు వారికి అండగా వచ్చి అడ్డుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజాసంఘాలు మద్దతు తెలపాలని మధు కోరారు దీనిపై పిఠాపురంలో రౌండ్ టేబుల్ వేసి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని మధు ప్రకటించారు
ఈ కార్యక్రమంలో రైతులు సత్యనారాయణ సుబ్బారావు కృష్ణ బాపనయ్య దానయ్య తదితరలు పాల్గొన్నారు


