Wednesday, 22 April 2026

Blog

విశాఖపట్నం

భారీ వర్షాలు పొంచి ఉన్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

భారీ వర్షాలు పొంచి ఉన్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. * సహాయక చర్యలకు జీవీఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం రాబోయే కొన్ని రోజుల్లో విశాఖపట్నం తీరప్రాంతాలను తాకే అవకాశం ఉన్నందున, నగరంలో భారీ వర్షాలు పొంచి ఉన్నకారణంగా నగర పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సహాయక చర్యలు దిశగా జీవీఎంసీలో 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. భారీ వర్షాలు పొంచి ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం 24 గంటల కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేసి మూడు షిఫ్టులలో 25వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు సహాయక చర్యలకు ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేసి అందుబాటులో ఉంచామన్నారు. అలాగే అన్ని జోనల్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్ లను, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. కావున విశాఖ నగరంలో గల కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం, గాలివాన సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు, ప్రకటనల బోర్డులు క్రింద, శిధిలావస్థలోనున్న పాత భవనాలలో ప్రజలు ఉండరాదన్నారు. వర్షాలు సమయంలో ఎటువంటి ప్రమాదాలు నగర పరిధిలో జరిగినట్లయితే ప్రజలు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 0891-2507225 లేదా జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ టోల్ ఫ్రీ 1800-425-0009 నంబర్ కు సమాచారం అందించాలన్నారు. అత్యవసర సేవలకు సంబంధించి జీవీఎంసీ కంట్రోల్ రూమ్ 24 గంటలూ సిద్ధంగా ఉంటుందన్నారు. కావున ప్రజలు, వ్యాపారస్తులు కాలువలలో వ్యర్ధాలు పార వేయకుండా వర్షపు నీరు సునాయాసంగా పారేలా చూసుకోవాలన్నారు. అనధికారిక ప్రకటనలు, సామాజిక మాధ్యమాలలో వచ్చే తప్పుడు సమాచారం నమ్మకుండా అధికారిక ప్రకటనలనే విశ్వసించాలన్నారు. “పౌరుల భద్రతే ప్రాధాన్యంగా వర్షాలు తీవ్రతను బట్టి రక్షణ చర్యలను మరింత బలోపేతం చేస్తామని కమిషనర్ తెలిపారు.

విశాఖపట్నం

దూసుకువస్తున్న మంతా తుఫాన్* *ఆంధ్రప్రదేశ్ కి తప్పని ముప్పు*

*దూసుకువస్తున్న మంతా తుఫాన్* *ఆంధ్రప్రదేశ్ కి తప్పని ముప్పు* *ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఏదో ఒకచోట తీరం దాటే అవకాశం* *ఆంధ్రప్రదేశ్ కి రెడ్ అలెర్ట్* *అక్టోబర్ 26,27,28,29, తేదీల్లో చాలా కీలకమైన రోజులు* *28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయం లో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటనున్న మంతా* *ఈ సంవత్సరం వచ్చే అన్ని తుఫానులలో బలమైన తుఫాన్ ఇదే* *విశాఖపట్నం-తిరుపతి వరకు దీన్ని ప్రభావం,తీవ్రమైన వర్షాలు తెలంగాణ, హైదరాబాద్ భారీ వర్షాలు.* *సముద్రం కోస్తాబాగాల్లో ఉన్నట్లు వంటి మత్యకారులను అప్రమత్తం చేయాలి ఎవ్వరు కూడా సముద్రవేటకి వెళ్ళారాదు* *దిగువున వున్నా లోతట్టు ప్రాంత లంక ప్రజలను అప్రమత్తం చేయాలి.కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి* *బలమైన గాలులు గంటకు 70-100 కిలోమీటర్లు* *ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న స్కూల్స్, కాలేజీ, 28,29 తేదీల్లో సెలవు ప్రకటించవలసిందిగా వాతావరణ శాఖ అధికారులు సూచన* *దూర ప్రయాణ చేసేవాళ్ళు చెప్పిన డేట్స్ లో ప్రయాణాలు ఆపుకోవాలి* *మధ్య కోస్తాఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని బాగాల్లో, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన వర్షాలు

విశాఖపట్నం

ఇంటర్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్*

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ , ZPH స్కూల్ గ్రౌండ్ , గోపాలపట్నం* లో *(SGF)స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆంద్రప్రదేశ్* వారి ఆధ్వర్యంలో జరుగు *ఇంటర్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్* ను *13 జిల్లాల నుంచి అండర్ 14,17, 19 విభాగాలు బాల బాలికల క్రీడాకారులు పాల్గొన్నారు*, ఈ కార్యక్రమాన్ని *ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులు నుండి గౌరవ వందనం స్వీకరించి , క్రీడా పోటీలను ప్రారంభించిన* ప్రభుత్వ విప్ *గణబాబు* ఈ సందర్భంగా *గణబాబు* మాట్లాడుతూ *క్రీడాకారులు క్రీడాలో రాణించి* *జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తూ ప్రాంతానికి , రాష్ట్రానికి పేరుప్రత్యేకతలు తీసుకురావాలని తెలియజేశారు*. ఈ కార్యక్రమంలో *DEO ప్రేమ్ కుమార్ dy DEO గారు APTTA వైస్ ప్రెసిడెంట్ aptta ys president DR DVSY శర్మ గారు , SGF)స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆంద్రప్రదేశ్ సభ్యులు , స్కూల్ HM , సిబ్బంది , 13 జిల్లాల క్రీడాకారులు మొదలగున్నవారు పాల్గొన్నారు*.

విశాఖపట్నం

మొంథా’ తుఫాన్ సమీపిస్తోంది… అందరూ అప్రమత్తంగా ఉండాలి

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి ‘మొంథా’ తుఫాన్ సమీపిస్తోంది… అందరూ అప్రమత్తంగా ఉండాలి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తీరప్రాంత ప్రజలు అధికారులు ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించాలన్నారు – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు. అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు పిలుపునిచ్చారు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండి, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు పిలుపునిచ్చారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ వద్ద ఆర్టీసీ బస్సులో పొగలు.. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది

విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు నందిగామ హైవే సమీపంలో శనివారం సాయంత్రం ఆగిపోయింది. బస్సు ఇంజిన్‌లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికు ల్లో భయాందోళన నెలకొంది. ఈ విషయం గమనించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రహదారి పక్కన నిలిపి, అందులో ఉన్న 15 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం ఆ ప్రయాణికులను మరో బస్సులో కోదాడకు తరలించారు. ఇంజిన్‌లో ఆయిల్ లీక్ అవ్వడం వల్ల పొగలు వ్యాపించాయని డ్రైవర్ తెలిపారు. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ చాకచక్యం తో పెద్ద ప్రమాదం తప్పింది.

E-పేపర్

ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు అండగా చంద్రన్న ఫౌండేషన్

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9133469506 ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు అండగా చంద్రన్న ఫౌండేషన్* …. *ఖానాపూర్ గ్రామ పెద్దలకు, యువకులకు నమస్కారం*….. *చంద్రన్న ఫౌండేషన్ ఆద్వర్యం లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంట్ బ్యాగుల పంపిణీ* … సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు మన గ్రామ బస్ స్టాపు దగ్గరికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు వస్తున్నారు … డొంకని చంద్రన్న సేవా ఫౌండేషన్ ఆద్వర్యం లో మన ఖానాపూర్ గ్రామ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఒక్కోక్కరికి 20 సిమెంట్ బ్యాగులను పంపిణీ చేస్తున్నందుకు చంద్రన్న వారసులుగా మేము సంతోషిస్తున్నామని . మన గ్రామానికి సోమవారం రోజున ఉదయం 10 : 30 నిమిషాలకు బస్ స్టాపు ( చిల్ల) దగ్గర కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రానున్నారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా చేయడం ఎంతో సంతోషమని . కావునా ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, యువకులు, ప్రతి ఒక్కరు పేరు పేరున మన గ్రామ బస్ స్టాపు (చిల్ల) దగ్గర కు రావాల్సింది గా కోరుకుంటున్నాను . ఫౌండేషన్ ద్వారా మరికొద్ది రోజుల్లో వాటర్ ఫిల్టర్ కు కూడా భూమి పూజా కార్యక్రమం జరుగుతుంది . ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా నాన్న గారి కోరిక మేరకు సేవా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎవరు అన్యతగా భావించొద్దు … ఇట్లు …. డొంకని చంద్రన్న సేవా ఫౌండేషన్ ఛైర్మెన్ గోపి గౌడ్ , శ్రీనివాస్ గౌడ్

విశాఖపట్నం

ఘనంగా గ్యార్మీ షరీఫ్ వేడుకలు.

ఘనంగా గ్యార్మీ షరీఫ్ వేడుకలు. *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* …ఆంధ్రాయూనివర్సిటీ ఔట్ గేట్ సమీపంలో సందాని ఇస్లామిక్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాజరత్ మహబూబ్ సుభాని, గౌస్ పాక్ వారి గ్యార్మీ షరీఫ్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు మధ్యాహ్నం అసర్ నమాజ్ అనంతరం ఖురాన్ ఖాని, సాయంత్రం సమీప పరిసర ప్రాంతాల్లో గౌస్ పాక్ వారి సందల్ సందాని ఇస్లామిక్ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు జరిగింది. నరై తక్బీర్ అల్లాహు అక్బర్, గౌస్ క దామాన్ నహి చోడేంగే అంటూ గౌస్ అజం వారిని ప్రశంసిస్తూ వారి భక్తిని చాటుకున్నారు. అనంతరం రాత్రి గౌస్ పాక్ నిషాని వద్ద సలాతు సలాం, ఫాతేహ, సర్కార్ గౌస్ పాక్ వారి జెండా ఆవిష్కరణ జరిగింది. పెద్ద ఎత్తున (తబ్ రుఖ్), ప్రసాద వితరణ, ఆమ్ దావత్ జరిగింది. నగర పరిసర ప్రాంతంల నుండి పెద్ద ఎత్తున ముస్లిం లు పాల్గొన్నారు

విశాఖపట్నం

మంత తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి –

*“మంత తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – సమన్వయంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కోండి” – డీఐజీ శ్రీ గోపీనాథ్‌ జట్టి ఐపీఎస్* *విశాఖపట్నం,అక్టోబర్ పున్నమి ప్రతినిధి:* విశాఖపట్నం రేంజ్‌ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ శ్రీ గోపీనాథ్‌ జట్టి ఐపీఎస్ గారు విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల ఆల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం మరియు శ్రీకాకుళం జిల్లా ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేంజ్ పరిధిలో గల వివిధ జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐజీ గారు పలు కీలక సూచనలు చేశారు: “మంతా” తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో అన్ని అధికారులు అప్రమత్తంగా ఉండి, అందుబాటులో ఉండాలని, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన పరికరాలు, వనరులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. తీరప్రాంత గ్రామాలన్నింటినీ సందర్శించి, మత్స్యకారులు మరియు గ్రామస్థులకు తగిన హెచ్చరికలు ఇవ్వాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24/7 కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసి, తగిన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, రోడ్లను ముందుగానే గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌ కేసులపై సమీక్ష నిర్వహించి, పాతనేరస్తులు మరియు అంతర్రాష్ట్ర గ్యాంగుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాత్రిపూట గస్తీ పెంచి, వ్యూహాత్మక ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో నిందితులను గుర్తించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు ఫ్రీజ్‌ అయిన డబ్బు తిరిగి అందేలా చూడాలని సూచించారు. డిజిటల్‌ అరెస్ట్‌, ఫైనాన్షియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్ వంటి మోసాలను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సోషల్‌ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తరచుగా అభ్యంతరకర పోస్టులు చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా పూర్తిగా అరికట్టేందుకు రవాణా మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించి, చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గంజాయి కేసుల్లో పట్టుబడి పోలీస్‌ స్టేషన్లలో ఉన్న వాహనాలను త్వరితగతిన డిస్పోజల్‌ చేయాలని సూచించారు. రేంజ్‌ పరిధిలో శాంతి భద్రతలపై చర్చించి, పోలీస్‌ అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, మీటింగ్‌లు నిర్వహించరాదని హెచ్చరించారు.

విశాఖపట్నం

నగర వాసులతో కిటకిటలాడిన వి ఎం ఆర్ డి ఎ పార్కులు

నగర వాసులతో కిటకిటలాడిన వి ఎం ఆర్ డి ఎ పార్కులు * ఉచిత ప్రవేశం కల్పించిన చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారికి ప్రశంసలు *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* నాగులచవితి సందర్భంగా నగరంలోని వి ఎం ఆర్ డి ఎ కు చెందిన పార్క్ లు నగరవాసులతో కిటకిటలాడాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జనసందోహం తో పార్కుల్లో సందడి వాతావరణం కనిపించింది. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు వచ్చే కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా వి ఎం ఆర్ డి ఎ కి చెందిన పార్క్ ల్లో ఉచిత ప్రవేశం కల్పించినట్లు VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ప్రకటించారు. దీంతో విశాఖ చుట్టుపక్కల సమీప ప్రాంతాల ప్రజలు కైలాసగిరి, తెన్నేటి పార్కు, బీచ్ రోడ్డులో ఉన్న వుడా పార్కు, సెంట్రల్ పార్కుల వద్ద బారులు తీరారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పుట్టల్లో పాలు పోసి, నాగదేవతకు భక్తితో కొలిచి, ప్రసాదాలు పెట్టి, మొక్కులు తీర్చుకున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ఆయా పార్కుల్లో పూజలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒకేసారిగా పెద్ద సంఖ్య లో నగరవాసులు పార్కుల వద్ద చేరుకోవటంతో పార్క్ ల పరిసరాల్లో కొద్ది సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం పూజలు, బాణసంచా వెలిగించడం, అల్పాహారం తీసుకోవడంతో పాటు మధ్యాహ్నం భోజనాలు (పిక్నిక్) కూడా చేసి ఆనందంగా గడిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నాగుల చవితి పురస్కరించుకొని వి ఎం ఆర్ డి ఎ కు చెందిన పార్క్ ల్లో ఉచిత ప్రవేశం కల్పించిన VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారికి నగర వాసులు ప్రశంసించారు. తామెప్పుడూ ఇంతగా ఆనందం గడపలేదని, బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా సంబరాలు చేసుకోలేదని సందర్శకులు పేర్కొన్నారు. ఇదంతా ఆయా పార్కుల్లో తమకు ఉచిత ప్రవేశం కల్పించడం వలనే అంటూ వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారి సేవల్ని కొనియాడారు. శనివారం నాగుల చవితి పూజలతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి రోజంతా పార్కుల్లోసరదాగా గడిపేందుకు అవకాశం కల్పించటం కోసం ఈ ఉచిత ప్రవేశం నిర్ణయం తీసుకున్నామని VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు పెద్ద ఎత్తిన ఉపయోగించుకున్నారని తెలిపారు. నగర ప్రజల సంతోషంగా ఆనందంగా గడిపేందుకు వి ఎం ఆర్ డి ఎ పార్క్ ల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.

విశాఖపట్నం

నాగుల చవితి భారతీయ సంస్కృతికి ప్రతీక — డాక్టర్ కందుల నాగరాజు

నాగుల చవితి భారతీయ సంస్కృతికి ప్రతీక — డాక్టర్ కందుల నాగరాజు *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* నాగుల చవితి భారతీయ సంస్కృతికి ప్రతీక అని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. నాగుల చవితి పండుగ సందర్భంగా పుట్టలో పాలు వేసి, పూజలు చేసి అందరూ బాగుండాలని ఆయన ప్రార్థించారు. ప్రకృతిని ఆరాధించడం, జీవవైవిధ్యాన్ని గౌరవించడమని చెప్పారు. వ్యవసాయానికి సర్పాల సహాయాన్ని గుర్తించడాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ పండుగలో నాగులను నాగ దేవతలుగా, నాగరాజులుగా పూజించడం ద్వారా ప్రకృతిలోని ప్రతి అంగాన్ని, జీవులను దైవంగా చూసే హిందూ సంస్కృతిలోని లోతైన భావనను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, ప్రకృతితో మమేకమై జీవించే సంస్కృతిలో భాగమని తెలిపారు. ప్రకృతిని దైవంగా భావించే భారతీయ సంస్కృతిలో భాగంగా చెట్టు, పుట్ట, నది, పర్వతం వంటి వాటిని పూజిస్తారని వెల్లడించారు. నాగులు పంటలను నాశనం చేసే కీటకాలను తిని, రైతులకు పరోక్షంగా సహాయపడతాయన్నారు. ఈ విధంగా, ప్రకృతికి, వ్యవసాయానికి సర్పాల సహకారాన్ని గుర్తించి, కృతజ్ఞత తెలియజేసే సంస్కృతిని ఇది సూచిస్తుందని అన్నారు. నాగులను దైవంగా పూజించడం ద్వారా, మానవులతో పాటు జీవకోటిలో ప్రతి ప్రాణికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, వాటిని గౌరవించాలని ఈ పండుగ తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కందుల నలినీ దేవి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.