Monday, 13 April 2026

Blog

కర్నూలు

ఉపాధిహామీ పథకంలో తప్పనిసరిగా e-Kyc

గ్రామీణులు వలస వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పించే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది. ఎంతో సదుద్దేశంతో దీనిని అందుబా టులోకి తీసుకురాగా కొందరు పథకాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పనులకు రాకున్నా మస్టర్లలో హాజరు వేసుకుని నిధులు పక్కదారి పట్టిస్తున్నారు.ఈ నేపథ్యంలో వీటన్నింటికీ అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ చేపట్టింది. ప్రతి ఉపాధి కూలీ ముఖ చిత్రం ఆధారంగా ఈ కేవైసీకి చర్యలు తీసుకుంటోంది.దీనిద్వారా ఉపాధి కూలీలకు పనులు చూపేలా కృషి చేస్తోంది.e-Kyc ప్రక్రియ చేస్తున్న గోనెగండ్ల మండల ఉపాధి హామీ సిబ్బంది..

అల్లూరి సీతారామరాజు

మొంథా తుఫాను ప్రభావంతో మూతపడిన జలపాతాలు

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:26 ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన వచ్చే మొంథా తుఫాను తో రాబోయే మూడు రోజులల్లో అల్లూరి జిల్లలో భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలు మేరకు అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల పరిదిలోని జలపాతాలను ఆదివారం నుండి ఈ నెల 28 వరకు మూసివేయడం జరుగుతుందని అరకు సర్కిల్ ఇనస్పెక్టర్ ఎల్ హిమగిరి పేర్కొన్నారు. కావున అరకు వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి వారి అరకు పర్యటనను వాయిదా వేసుకోవాలని సీఐ సూచించారు. స్థానిక గిరిజనులు భారీ వర్షాలు పడే సమయంలో వాగులు, గెడ్డలు దాటవద్దని హెచ్చరించారు. అత్యవసర సమయాలల్లో పోలీసులకు తెలపాలని అరకులోయ ఎస్ఐ జీ గోపాలరావు సూచించారు.

జనగాం

కార్మికుల సంక్షేమం హక్కుల కోసం నిరంతరం పోరాడే సంఘం సిఐటియు మాత్రమే

*కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి* . *పెట్టుబడిదారుల కోసం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి* స్టేషన్ ఘనాపూర్:-ఈరోజు సిఐటియు మండల కార్యాలయంలో సిఐటియు 9వ మహాసభకు అధ్యక్షులుగా రావుల జగన్నాథం, అమరాజు బాబు వ్యవహరించగ ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ రాపర్తి రాజు గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ కేంద్ర బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నటువంటి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడం వలన కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం వలన కార్మికులు స్వాతంత్రం పూర్వం నుండి అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి ట్రేడ్ యూనియన్ చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఉద్యోగుల రాజ్య భీమ చట్టం (ఈఎస్ఐ ), ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ (పిఎఫ్ ), గ్రాండ్ డ్యూటీ చెల్లింపుల చట్టం, బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ సెస్ చట్టం, వర్కింగ్ జర్నలిస్ట్ వేతన రేట్ల నిర్ధారణ చట్టం, మోటర్ ట్రాన్స్ పోర్ట్ కార్మికుల చట్టం లతోపాటు 29 రకాల కార్మికుల హక్కుల రక్షణ కోసం చేసినటువంటి చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమని. పని గంటలను 8గంటల నుండి 12 గంటలకు పెంచడం కార్మికుల శ్రమ దోపిడీ చేయడమే దేశంలో బిజెపి మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ధ్వంసం చేస్తూ ప్రజల, కార్మికుల, రైతుల, సబండ వర్గాల హక్కులను స్వాతంత్రాన్ని హరించి వేస్తుందని. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ప్రైవేట్ పరం చేస్తూ పెట్టుబడుదారుల కొమ్ము కాస్తుంది. పెట్టుబడుదారుల మెప్పు కోసమే బిజెపి మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను తయారు చేసిందని అన్నారు. 2016 నుండి అమల్లోకి వచ్చిన 7వ పే కమిషన్ పే స్కేలు ప్రకారం కార్మికులకు 26 వేల జీతం ఇవ్వాలి. కార్మికులందరికీ ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పిస్తూ అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ నెలకు 9000 ఇవ్వాలని కార్మికుల న్యాయపరమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి అడుగులకు మడుగులొత్తే విధంగా వ్యవహరిస్తూ పని గంటలను 8 గంటల నుండి 10 గంటలకు పెంచుతూ చేసినటువంటి జీవో నెంబర్ 282ను వెంటనే రద్దు చేయాలని. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి కొడపాక యాకయ్య వివిధ రంగాల కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు లింగనబోయిన శ్రీకాంత్, వెలిశాల రాజు, బొంకూరు రామచంద్ర, జి రామచంద్రం, దైద అనిల్, కొలిపాక వెంకన్న, గుమ్మల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు

కాకినాడ

పెద్దాపురం శ్రీ మరిడమ్మ వారి దేవాలయం లో అన్నదాన కార్యక్రమం

పెద్దాపురం శ్రీ మరిడమ్మవారి దేవస్థానం నందు ప్రతీ ఆదివారం రోజున జరుగు అన్నదానం నకు దూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకు ఆకలితో హోటళ్లను ఆశ్రయించకూడదనే ఉద్దేశ్యం తో ప్రతీ ఆదివారం శ్రీ మరిడమ్మ వారి దేవస్థానం నందు అన్నదానం నిర్వహించడం జరుగుతున్నదని ఈవో విజయలక్ష్మి తెలిపారు. ప్రతీ ఆదివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విజయలక్ష్మి తెలిపారు. పలువురు భక్తులు ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా తమ ఆకలి తీరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమం ఇలాగనే కొనసాగాలని భక్తులు పలువురు అభిప్రాయపడ్డారు.

నిర్మల్

గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా జాతీయ సేవా పథకము స్పెషల్ క్యాంప్ లో భాగంగా వాటోలి గ్రామంలో ఈరోజు N SS వాలంటీర్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించా రూ

గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా జాతీయ సేవా పథకము స్పెషల్ క్యాంప్ లో భాగంగా వాటోలి గ్రామంలో ఈరోజు N SS వాలంటీర్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించా రూ ఈ సందర్భంగా గ్రామంలో నీ రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త చెదారాన్ని ఏరివేస్తూ రోడ్లను శుభ్ర పరుస్తూ ,గ్రామంలోని క్రీడా ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని ఏరివేస్తూ గ్రామంలోని ప్రజలను చైతన్య పరిచారు.అలాగే ఈ క్యాంపు లో మధ్యాహ్న భోజన విరామ అనంతరం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా మోటివేషనల్ స్పీకర్ లక్ష్మణ్ వాడేకర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు నేటి జీవన విధానం లో అనేక ఒత్తిడికి లోనై తమ జీవితంలో అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని పేర్కొంటూ జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి కాకుండా క్రమశిక్షణ అలాగే నడవడిక అలాగే ఏకాగ్రతతో కూడి ఉంటే దేనినైనా సాధించవచ్చుని వారు పేర్కొంటూ మనదేశంలో అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించినటువంటి మహానుభావులందరం పేదరికంలోనే పుట్టి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ తమ దృఢచిత్రంతో ఒక లక్ష్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారని అటువంటి వారి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు వెళ్లాలని వారి పేర్కొన్నారు అలాగే ఈ క్యాంపు లో మల్లికార్జున్ టీచర్ మాట్లాడుతూ నేడు విద్యార్థులు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని అటువంటి ఉత్తమ క్రమశిక్షణ నేర్పేటువంటిది సేవా దృక్పథం కలిగినటువంటిది జాతీయ సేవా పథకం అని అందులో భాగంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని క్రమశిక్షణ నిలబడి కనుక్కోడిగి ఉంటే ఎన్నో గొప్ప గొప్ప పదవులను అలంకరించవచ్చని కావున విద్యార్థులు ముఖ్యంగా ప్రతి విషయాన్ని తమ తల్లిదండ్రులతో పంచుకుంటూ అనవసరమైనటువంటి ఆకర్షణలకు లోను కాకుండా దృఢమైన ఆలోచనలతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని వారన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య మరియు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త లు ఆరె రాజు డా.ఓం ప్రకాష్ అధ్యాపకులు డా కల్పన రామ్మోహన్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య అధ్యాపకులు విద్యార్థులు సన్మానించారు.

విశాఖపట్నం

తుఫాను దృష్ట్యా సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమం రద్దు

తుఫాను దృష్ట్యా సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమం రద్దు . విశాఖపట్నం -జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్. విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి : తుఫాను దృష్ట్యా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో, అన్ని జోనల్ కార్యాలయాల్లో అక్టోబర్ 27వ తేదీన అనగా సోమవారం నిర్వహించవలసిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS ) కార్యక్రమమును రద్దు చేయడమైనదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. కావున విశాఖ నగర ప్రజలు పి జి ఆర్ ఎస్ కార్యక్రమం రద్దు చేసిన విషయాన్ని గమనించవలసిందిగా పత్రికా ప్రకటన ద్వారా కమిషనర్ ప్రజలకు తెలిపారు.

ఖమ్మం

పట్టణం లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి కామెంట్స్….

ఖమ్మం….. పట్టణం లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి అధికార పార్టీ వాళ్లే గొడవలు చేస్తారు మళ్ళీ తిరిగి బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడతారు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కి తూట్లు పొడుస్తున్నారు రాజకీయ దురుద్దేశం తో టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు ప్రజా సమస్యలకోసం సేవే లక్ష్యం గా పని చేసే పార్టీ బీజేపీ పార్టీ అంబేద్కర్ రాజ్యాంగం కి విలువ ఇవ్వండి రంగుల రాట్నం సినిమా చూపిస్తూ ప్రజల చెవిలో పూలు పేడుతున్నారు ఇచ్చిన హామీలు అమలు అయ్యే పరిస్థితి లేదు వీళ్ళ పాలనలో 10 నెలల క్రితం చేసిన పనుల బిల్లులు రావు 10 రోజుల క్రితం చేసిన పనుల బిల్లులు వస్తాయి అప్పుల పాలు అయినం అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం ది బీజేపీ ప్రభుత్వం వైపు చూసే ప్రజలకి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక స్కీమ్ లు ఇస్తున్నాం ఖమ్మం జిల్లాలో రోడ్ల పరిస్థితి ఆధ్వన్నాం,పశువుల అక్రమ రవాణా, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇసుక తోలుకోవడం ఎవరు మంత్రి నో ఎవరు కాంట్రాకర్ నో అర్ధం కానీ పరిస్థితి ఉందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక పోతే అభివృద్ధి చేసే దిక్కు లేదు ఈ ప్రభుత్వం కి ఈ ప్రభుత్వం స్వేత పత్రం ప్రకటించాలి ఇచ్చిన హామీలు ఎటు పోయాయో ఎవడికి ఓటు చోరీ ఎక్కడ ఓటు చోరు అనాడు మీరు ఓటు చోరీ చేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ వాళ్ళకి కర్రు కాల్చి ఒత పెట్టేలాగా మీరు బీజేపీ ప్రభుత్వం నీ గెలిపించాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు

విశాఖపట్నం

ముఖ్యమంత్రి కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బహిరంగ లేఖను ఈ రోజు జగదాంబ వద్ద గల సీఐటీయూ జిల్లా కార్యాలయం లో మీడియాకు విడుదల చేసారు. ప్రెస్ మీట్ లో శ్రీనివాసరావు తో పాటు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. కె. ఎస్. వి కుమార్, బి జగన్, వి కృష్ణా రావు లు పాల్గొన్నారు… విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమరావతి. *విషయం: గూగుల్పై ప్రజలకు వాస్తవాలు చెప్పండి.* అయ్యా! అమెరికా తరువాత అతిపెద్ద డేటా సెంటర్ రాబోయే ఐదు సంవత్సరాలలో 15 బిలియన్ డాలర్ల (లక్షా 25 వేల కోట్లు) పెట్టుబడితో విశాఖపట్నంలో నెలకొల్పనున్నట్లు ఢిల్లీలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశం తరువాత మీరు ప్రకటించారు. దానితో పాటు ఏఐ హబ్్న కూడా నెలకొల్పబోతున్నట్లు చెప్పారుసహజంగానే ఇది ప్రజల్లో ముఖ్యంగా విద్యావంతులైన యువతరంలో అనేక ఆశలు రేకెత్తించింది. దీనికోసం 500 ఎకరాలు కేటాయించారు. గూగుల్ అదానీ కనెక్స్, ఏయిర్టెల్ కమ్యూనికేషన్స్ కూడా భాగస్వాములవుతున్నాయి. లక్షా 80 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఐటీ శాఖా మాత్యులు నారా లోకేష్ ప్రకటించారు. ఈ విజయాన్ని చూసి ఇరుగు, పొరుగు రాష్ట్రాల వారు అసూయపడుతున్నట్లుగా, ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బిజెపి నేతలే అన్ని ఉద్యోగాలు రావని, పర్యావరణానికి నష్టం ఉంటుందని చెప్పక తప్పలేదు. కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కూడా 5-6 వేల వరకు ఉద్యోగాలు వస్తాయని పరోక్షంగా ఇంకో 30 వేల మందికి ఉపాధి దొరకొచ్చని చెప్పారు. ప్రభుత్వ ప్రచారం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వం చెబుతున్నదే వాస్తవం అయితే ప్రతిపక్షాల దృష్ప్రచారం నిలబడదు. దాని గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇటీవల మీడియాలో వస్తున్న విభిన్న కథనాలు, వివిధ దేశాల అనుభవాలు పరిశీలిస్తే దీనిపై వాస్తవాలతో నిమిత్తం లేకుండా అతిశయోక్తులతో ప్రచారం జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ క్రింది సమస్యలపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని కోరుతున్నాను. (1) అమెరికా తరువాత అతి పెద్ద డేటా సెంటర్ (1 గిగావాట్) కోసం విశాఖపట్నంలో గూగుల్ అత్యధిక పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ డేటా సెంటర్ ద్వారా సముద్ర గర్భం నుండి కేబుల్ కనెక్షన్ల ద్వారా 12 దేశాల అనుసంధానించిన గేట్వేగా ఉ ండబోతున్నది. తద్వారా గూగుల్ వ్యాపారం ప్రపంచమంతటా విస్తరించడానికి విశాఖపట్నం డేటా సెంటర్ దోహదం చేస్తుంది. దీనివల్ల గూగుల్కు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు పెరుగుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ల్కో ఏ విధంగా లాభం చేకూరుస్తుంది? (2) గూగుల్ డేటా సెంటర్ కోసం విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం, అనకాపల్లి జిల్లాలోనూ 480 ఎకరాలు కేటాయించారు. ఇందులో పంటలు పండే భూములున్నాయి, దళితుల అసైన్డ్ భూములున్నాయి. వాటిని తీసుకోవడం ద్వారా రైతులు, కూలీలు ఉపాధి కోల్పోతారు. ఉదా:- తరువాడ గ్రామంలో దళితులు జీవన భృతిని కోల్పోతామంటూ ఆందోళన చేస్తున్న విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. సింహాచలం దేవస్థానం క్రింద పంచ గ్రామాల ప్రజలు ఇళ్ళపట్టాలకోసం దీర్ఘకాలంగా పోరాడుతున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదు. కానీ అదే ప్రాంతంలో అడవివరంలో గూగుల్ కోసం భూములు కేటాయించారు. ఇదేమి న్యాయం? 2019లో మీ ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకున్నది. దీని ప్రకారం 70 వేల కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. తరువాత వచ్చిన ప్రభుత్వం 2023లో అదానీ కనెక్స్ట్ మరలా ఒప్పందం చేసుకొని డేటా సెంటర్ కోసం 400 ఎకరాలు కేటాయించింది. అందులో 130 ఎకరాలు (రుషికొండ -3 చుట్టూ) కోటి రూపాయల చొప్పున రిజిస్టర్ చేసింది. ఇప్పుడు ఆ భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. అదానీ డేటా సెంటర్ పెట్టలేదు. ఉపాధీ కల్పించలేదు. ఇప్పుడు గూగుల్ జాయింట్ వెంచర్ చేస్తున్నారు. ఈ స్థితిలో అదానీకి కేటాయించిన భూముల్ని గూగుల్ డేటా, ఎఐ హబ్బుకోసం కేటాయించాలి. ఆ భూములు ఖాళీగా పెట్టి మరోచోట తిరిగి రైతుల భూములు సేకరించడం సమంజసం కాదు. పైగా అభివృద్ధి పేరుతో ప్రజల మనోభావాలను ముందుకు తెచ్చి నష్టపోతున్న రైతుల నోళ్ళు నొక్కడం సరైంది కాదు. (1) రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటివరకు వైజాగ్ ఐటి పార్కు పేరుతో పనోరమ హిల్స్పై 10 కంపెనీలకు పైగా స్థలాలు. కేటాయించారు. ఒక్క కంపెనీ కూడా ప్రారంభంకాలేదు. (3) ఇలాంటి డేటా సెంటర్ ద్వారా 5-6 వేలకు మించి ప్రత్యక్ష ఉద్యోగాలు రావని నిపుణులు చెప్తున్నారు. విశాఖలో ఒక పెద్ద డేటా సెంటర్ను మానిటరింగ్ చేయడానికి, దానికి అనుబంధంగా విద్యుత్, నీళ్ళు వగైరాల సరఫరాకు ఎంతమంది ఉద్యోగులు: అవసరం అవుతారో గూగుల్తో జరిగిన ఒప్పందంలో నిర్దిష్టంగా హామీ ఇచ్చారా? వారు తీసుకునే సిబ్బందిలో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంత మందిని తీసుకుంటారు? గత అనుభవాలను బట్టి వివిధ పరిశ్రమల్లో స్థానికులకు చాలా తక్కువ ఉద్యోగాలే లభించాయన్నది వాస్తవం ప్రపంచం అంతటా ఐటి ఉద్యోగాల్లో కోత పడుతోందన్న వాస్తవం మీకు తెలుసు, ఇందులో మన రాష్ట్రం వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నారు. ఉదా:- అత్యంత ప్రతిష్టాత్మకమైన బిసిఎస్ గత మూడు మాసాల్లో 20 వేల మంది మధ్యంతర సిబ్బందిని తొలగించింది. కొత్తగా 10 వేల మందిని తీసుకుంటామని ప్రకటించింది. ఎఐ ప్రభావంతో గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వగైరా ప్రఖ్యాత కంపెనీలు కూడా సిబ్బందిని తగ్గిస్తున్నాయి. ఈ స్థితిలో ఎఐ హబ్బులో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం ఖచ్చితమైన అంచనా వేసిందా? ఉద్యోగ భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కోరుతున్నాను. వాస్తవాలతో నిమిత్తం లేని లెక్కలు భవిష్యత్తులో యువతరాన్ని మరింత అసంతృప్తికి గురిచేయవా? (4) రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే గూగుల్ లాంటి కంపెనీలు అనేకం వాటంతట అవే వచ్చి ఉండేవి. ఈ పాటికి విశాఖ. సహా రాష్ట్రం మరో అడుగు ముందుకేసి ఉండేది. ఇప్పుడు 22 వేల కోట్లు ఎదురిచ్చి ఆహ్వానించాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా ప్రత్యేకహోదా కోసం పోరాడండి. (5) జి.వో.40లో పేర్కొన్న విధంగా గూగుల్ డేటా సెంటర్కు వివిధ రూపాల్లో 22 వేల కోట్లు రాయితీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఏ కంపెనీకి ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రాయితీల ద్వారా రాష్ట్రానికి వస్తున్న లాభం ఎంత? భూములు త్యాగం చేసిన రైతులకు జరుగుతున్న లాభం ఏమిటీ? కనీసం ఈ మొత్తానికి సమానంగా ప్రభుత్వ వాటా ఎందుకు తీసుకోలేదు? (6) విశాఖలో అదానీ గూగుల్ డేటా సెంటర్ పెడితే ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే పర్యావరణ మార్పులతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో డేటా సెంటర్ ద్వారా పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం లేదా? డేటా సెంటర్కు అవసరమైన 2 వేల మెగా వాట్ల విద్యుత్, రోజుకి 80 ఎంజిడి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? దీని ప్రభావం విశాఖ, అనకాపల్లి జిల్లాలపై ఎలా ఉంటుండో పరిశీలించి నిర్ధారణ చేశారా? (7) భారతదేశంలోని 140కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమాచారం, ప్రభుత్వ సర్వీసులు దీనితో అనుసంధానించబడతాయి. తద్వారా పడిపోతున్న ఐటి కంపెనీల లాభాలు తిరిగి పుంజుకోవచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత, అత్యంత విశ్వసనీయమైన ప్రభుత్వ సమాచారానికి భద్రత ఏమిటి? ప్రయివేటు కార్పొరేట్ కంపెనీలు దీనిని దుర్వినియోగం చేయకుండా ఒప్పందంలో ఏమైనా షరతులు ఉన్నాయా? 2023లో పార్లమెంటు ముందుంచిన వ్యక్తిగత డేటా ప్రైవసీ బిల్లు ఇంత వరకు చట్టరూపం తీసుకోలేదు. బడా బటి కంపెనీల ఒత్తిడితోనే దానిని ఆపి ఉ ంచారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో ప్రజలడేటా ప్రైవేటు కంపెనీ చేతుల్లోకి పోతున్నది. గూగుల్ డేటా సెంటర్ల ద్వారా పౌరుల వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం రాదా? అనేక దేశాల్లో ప్రభుత్వ డేటా ప్రభుత్వంరంగ సంస్థల ద్వారా నిర్వహిస్తున్నారు. మనదేశంలోనూ సి-డాక్, ఎన్ఐసి వంటి సంస్థలున్నాయి. ఇప్పుడు ప్రయివేటు ఐటి కంపెనీలు లాభాపేక్షతో వాటిని ఆక్రమిస్తున్నాయి. ప్రభుత్వమే అవసరమైన డేటా సెంటర్లు పెడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజల, ప్రభుత్వ డేటాకు భద్రతా ఉంటుంది. పై అంశాలను సమగ్రంగా పరిశీలించి నిష్ణాతుల అభిప్రాయాలు, అంతర్జాతీయ అనుభవాలు తీసుకొని ప్రజలకు నష్టంకాని రీతిలో గూగుల్ డేటా సెంటర్పై తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. మన రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, ఉద్యోగభద్రతకు కంపెనీల నుండి గ్యారెంటీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ఖమ్మం

నేలకొండపల్లి మండలంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ డిమాండ్

పున్నమి ఖమ్మం జిల్లా ప్రతి నిధి నేల కొండపల్లి మండలం నేలకొండపల్లి మండలంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ డిమాండ్ చేశారు. కొత్తకోత్తూరు గ్రామ రైతు మాలోతు హనుమా పొలాన్ని సందర్శించిన ఆయన, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. ఈ పథకం ద్వారా రైతులకు ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాలకు ఆర్థిక రక్షణ లభిస్తుందని చెప్పారు. రైతుల ఆదాయ స్థిరీకరణ, మెరుగైన వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా కిసాన్ మోర్చా నాయకులు కళ్యాణం నాగేశ్వరరావు, సయ్యద్ మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

జనగాం

ఇప్పగూడెంవాసులకు తప్పని ఇక్కట్లు

• బురదమయంగా కాలనీలు.. పట్టింపులేని పాలకులు.. • గృహ సముదాయాల మధ్య నిలిచిన మురుగునీళ్లు ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలు ఇప్పుగూడెం రెండో వార్డులో గృహ సముదాయాల మధ్య నిలిచిన మురుగునీళ్లు స్టేషన్ ఘన్పూర్, అక్టోబరు 26 (తెలుగు గళం): మండలంలోని ఇప్పగూడెం గ్రామం రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన గ్రామమైన ప్పటికే అభివృద్ధిలో మాత్రం వెనకంజలో ఉంది. అందుకు నిదర్శనం గ్రామంలోని పలు వీధుల్లోని రోడ్ల దుస్థితే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గ్రామంలోని 1, 2, 3వ వార్డుల్లోని పలు రోడ్లు పూర్తిగా బురదకూపంగా మారి అటుగా వెళ్లే వారు కాలు తీసి కాలుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. గ్రామంలోని పాత నుంచి రంగరాయ గూడెం గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. గుంతల్లో నీరుచేరడంతో రోడ్డు మీదుగా నడిచే వాళ్లు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2వ వార్డులోని గృహ సముదాయాల మధ్య నెలకొన్న బురదకూపం కుంటను తలపిస్తోంది. చుట్టు పక్కల గృహాల వారు దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. అనేక రోజులుగా నీళ్లు నిల్వగా మారి ఉండడంతో దుర్గందం వస్తుందని సమీప గృహాలకు చెందిన వారు వాపోతున్నారు. గ్రామంలోని కొత్త బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీకి వెళ్లే రోడ్డు పైన మోకాలు లోతు బురద ఏర్పడడంతో వాహనదారులు రోడ్డుమీదుగా వెళ్లేందుకు నరకయాతన పడుతు న్నామని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేలుకొని రోడ్ల అభివృద్ధి పైన, గృహ సముదాయాల మధ్య నిలిచిన నీళ్లు తొలగించే చర్యలు చేపట్టేలా దృష్టి సారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.