సోషలిజం వైపు సమాజ మార్పు తథ్యం
వ్యవసాయ కార్మిక సంఘం, CITU మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో *భారత దేశం మీద అమెరికా సుంకాలుఅనే అంశం మీద క్లాసు నిర్వహించడం జరిగింది. ఈ క్లాసు కు గాడి సుధాకర్ గారు అధ్యక్షత వహించారు.ఈ క్లాసు ను జిల్లా స్టడీ సర్కిల్ నాయకులు శ్రీహరి గారు బోధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంమీద అమెకరిక పెత్తనం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నది. ప్రపంచంలో అమెరికా డాలర్ విలువ పడిపోతున్నది.డాలర్ విలువ పెంచడం కోసం ఈ రోజు అమెరికా ప్రపంచ దేశాల మీద ట్రంప్ సుంకాల యుద్ధం ప్రకటించారు. ఈ సుంకాలు భారతదేశం తప్ప మిగతా దేశాలు వ్యతిరేకిస్తున్నారు. భారత దేశం కూడా ఎగుమతి సుంకాలు రద్దు చేయాలని అన్నారు.ప్రపంచంలో అనేక దేశాలు సోషలిజం కోసం పోరాడుతున్నారు.ప్రపంచ పెట్టుబడి దేశం గా ఉన్న అమెరికా దేశంలో అక్కడ ఉండే యువత సోషలిజం వైపు వస్తున్నారని.అందుకే న్యూయార్క్ నగరంలో మేయర్ అభ్యర్థిగా సోషలిస్టు భావాలు ఉన్న వ్యక్తి గెలిచారని అన్నారు.కావున పోరాటాల ఫలితంగా సోషలిజం వైపు ప్రపంచం మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి అన్వర్ బాషా,రైతు సంఘం మండల నాయకులు డాక్టర్ సుబ్బారాయుడు,జన విజ్ఞాన వేదిక నాయకులు వేము పెంచలయ్య, CITU అనంతసాగరం మండల కన్వీనర్ ఉప్పలపాడు మస్తాన్,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగులూరు వెంకటేష్,భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి మీరా మొహిద్దిన్,DYFI నాయకులు సందాని మరియు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.











