Sunday, 22 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెస్ ఎంఈ పార్కును సీఎం ప్రారంభిస్తారు

కనిగిరి: ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్ 11వ తేదీన పెద్ద చెర్లోపల్లి మండలంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించేందుకు వస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

E-పేపర్

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ గారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తుచేశారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గారు స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ… ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి గారు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు‌. అందెశ్రీ గారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

E-పేపర్

*శ్రీ భగీరథ సగర (ఉప్పర) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన కార్యక్రమానికి హాజరైన ఎన్ఎండి ఫిరోజ్*

నంద్యాల శ్రీ భగీరథ సగర (ఉప్పర) సంక్షేమ సంఘం, నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని స్థానిక జమ్ముల పరమేశ్వరి దేవస్థానం నందు సోదర భావంతో, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగిందని. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి. ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ… “శ్రీ భగీరథ సగర (ఉప్పర) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస పవిత్రతను తెలియజేస్తూ, సోదర భావాన్ని పెంచే విధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘం నాయకులకు, సభ్యులకు నా హృదయపూర్వక అభినందనల తెలియజేశారు . మీరంతా ఇలా ఒకే వేదికపై కలిసి, భక్తిశ్రద్ధలతో వనభోజనాలు చేసుకోవడం నిజంగా ఆనందదాయకమని. ఉప్పర సామాజిక వర్గం అంటే కష్టాన్ని నమ్ముకుని, తమ నిబద్ధతతో సమాజ అభివృద్ధికి పాటుపడే వర్గం అన్నారు . ఈ సందర్భంగా మీరంతా సంఘటితంగా ఉండాలని, మీ ఐక్యతను చాటిచెప్పాలని కోరుకుంటున్నాను అని . ఐక్యతలోనే నిజమైన బలం, అభివృద్ధి దాగి ఉండన్నారు. నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, నంద్యాల బిడ్డగా మీకు నేను హామీ ఇస్తున్నాను అని . మీ సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన ఏ సమస్య అయినా నా దృష్టికి తీసుకురండి. మీ పిల్లల విద్య, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, అలాగే మీ సామాజిక వర్గానికి రావాల్సిన ప్రభుత్వ పథకాలు, హక్కుల విషయంలో నేను ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానని . సామాజిక వర్గ అభివృద్ధికి పాటుపడే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు నా సంపూర్ణ సహకారం ఉంటుందని . ఈ పవిత్ర కార్తీక మాసంలో శ్రీ భగీరథ స్వామి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వనభోజన కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి సురేష్ కుమార్, బనగానపల్లె మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొండు నడిపి బూసన్న, ఉడుములపాడు గ్రామ సర్పంచ్ ఉప్పరి రాధా ,నంద్యాల అసెంబ్లీ అధ్యక్షుడు బోయిని బాలాజీ, ప్రధాన కార్యదర్శి చిలకల బాలరాజు, ట్రెజరర్ గోరుకలు శివప్రసాద్ ,నంద్యాల అసెంబ్లీ గౌరవధ్యక్షుడు చిలకల చిన్నయ్య, తన్నీరు శివయ్య, డాక్టర్ గురు ప్రసాద్ ,టీచర్ సుబ్బరాయుడు, పెద్ద ఎత్తున సంఘీయులు తదితరులు పాల్గొన్నారు

Blog

నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ ను పరిశీలించిన ఎన్ఎండి ఫిరోజ్

నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ‘మైనారిటీ సంక్షేమ దినోత్సవం – 2025’ మరియు ‘జాతీయ విద్యా దినోత్సవం’ వేడుకలను 11 వ తేదీ ఉదయం 10 గంటలకు నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , నంద్యాల జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్ కలిసి నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ ను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం మరియు దేశంలో విద్యా సంస్కరణలకు భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటారని కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు హాజరవుతున్నారని తెలిపారు . అలాగే నంద్యాల జిల్లాలోని మైనారిటీ వర్గాల ప్రజలు, విద్యావేత్తలు మరియు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ మరియు నంద్యాల జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్ కోరారు ఈ కార్యక్రమంలో అస్ముద్దీన్ , అంజద్ భాషా సిద్దికి , మహమ్మద్ , బాగే తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

నంద్యాలలో ఆర్యవైశ్యులు, మైనార్టీలు అన్నదమ్ములుగా ఉంటారు : ఎన్ఎండి ఫిరోజ్

నంద్యాల పట్టణంలో ఆర్యవైశ్యులు అందరూ ప్రతి ఎన్నికల్లో మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు. కార్తీక్ మాసం సందర్భంగా శ్రీ ప్రథమ నంది దేవాలయంలో శ్రీ బాలాజీ కాంప్లెక్ ఆర్యవైశ్య సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక్ వన భోజనాలకు ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ ఎన్నికల్లో మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారని అన్నారు. ఆర్యవైశ్యులకు ఏ సమస్య వచ్చినా మా నాన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్, నేను ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామన్నారు. మా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్యవైశ్యుల ఇళ్ల మధ్యనే మా ఇళ్లు ఉందని గుర్తుచేశారు. స్నేహితులు, బంధువులు ప్రతి ఒక్కరు పద్మావతి నగర్ కానీ ఇతర ప్రదేశాల్లో మంచి ఇల్లు కట్టుకో అని సలహా ఇచ్చినా ఆర్యవైశ్యుల ఇళ్ల వద్ద ఉండే గొప్పతనం మాకు తెలుసన్నారు. సమాజంలో” అయ్యా” అని గౌరవంగా పిలిచేది ఒక్క ఆర్యవైశ్యులకే దక్కుతుందన్నారు. నంద్యాలలో ఉన్న పెద్ద, పెద్ద ఆర్యవైశ్యులు అందరూ అన్నదమ్ముల వలె ఉంటామన్నారు. ఆర్యవైశ్యులు సమస్యలు ఎదురైతే మీలో ఉన్న వారి దృష్టికి తీసుకొని వస్తె సమస్యలు పరిష్కరించడానికి ముందుంటున్నారు. మా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్యవైశ్యులు ఆదరించడం వల్లా మా నాన్నకు నాలుగు సార్లు మంత్రి పదవులు రావడానికి మీ పాత్ర ఉందన్నారు. గత ఎన్నికల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగాయని ఆర్యవైశ్యులు తెలుగుదేశంపార్టీకి 99 శాతం ఓట్లు వేసి గెలిపించారని అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. కార్తీక్ మాసంలో ఆర్యవైశ్యులు కుటుంబసభ్యులతో కలిసిరావడం సంతోషంగా ఉందన్నారు. కార్తీక్ మాసం వనభోజనాలు కు రావడం ఆనందంగా ఉందని అందరికీ ఆ శివపార్వతుల ఆశీర్వాదాలు కలగాలని కోరారు. అనంతరం నిర్వాహకులు ఎన్ఎండి ఫిరోజ్ ని , శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ మేడా మురళీధర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా, ఇల్లూరి లక్ష్మయ్య , భీమిశెట్టి మనోజ్ కుమార్ , నంద్యాల నాగేంద్ర , మిరియాల చంద్రమౌళి , బింగుమల్ల సుబ్బలక్ష్మయ, మున్సిపల్ వైస్ చైర్మెన్ గంగిశెట్టి నాగ శ్రీధర్, కశేట్టి చంద్ర శేఖర్ , విజయ్ కుమార్ , నిచ్చెనమెట్ల సుబ్బరామయ్య , తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఏపీ-ఎంఎస్‌ఎంఈ ఎగుమతి అభివృద్ధి మహాసభ ఘనంగా ప్రారంభం గ్లోబల్ మార్కెట్లలో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈలకు కొత్త దిశ

విశాఖపట్నంలో ఫెయిర్‌ఫీల్డ్ బై మారియట్ హోటల్‌లో ఇండియా ఎస్‌ఎంఈ ఫోరమ్ మరియు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ మద్దతుతో “ఏపీ-ఎంఎస్‌ఎంఈ ఎగుమతి అభివృద్ధి మహాసభ–2025” శనివారం ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభలో రాష్ట్రవ్యాప్తంగా 250కుపైగా ఎంఎస్‌ఎంఈలు, అలాగే 13 దేశాల నుంచి 35 అంతర్జాతీయ కొనుగోలు దారులు మరియు వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ దేశాలలో కోస్టా రికా, ఈజిప్ట్, ఘనా, హంగేరీ, మలావీ, నేపాల్, న్యూజీలాండ్, రష్యా, శ్రీలంక, టాంజానియా, టోగో, ఉగాండా, జింబాబ్వే ఉన్నాయి. అంతర్జాతీయ ప్రతినిధులను శ్రీ కొండపల్లి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈల శాఖామంత్రి; శ్రీ పి. విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే (బిజెపి); శ్రీ తమ్మిరెడ్డి శివశంకరరావు, చైర్మన్, ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి సంస్థ; మరియు శ్రీ ఆర్.వి. ప్రథమేష్, అదనపు కమీషనర్, కస్టమ్స్ కమిషనరేట్, విశాఖపట్నం స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ – “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమల విప్లవ దశలో ఉంది. మా ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి ప్రత్యేక విధానాలు, సాధారణ సదుపాయ కేంద్రాలు, ఆర్థిక మద్దతు కల్పిస్తూ వ్యాపార సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టిస్తోంది,” అని అన్నారు. బిజెపి ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ – “రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో ఎంఎస్‌ఎంఈల బలోపేతం అభివృద్ధి దిశగా కీలక అడుగు,” అని పేర్కొన్నారు. చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు మాట్లాడుతూ – “నాణ్యత, సమయపాలనతో రాష్ట్ర ఎంఎస్‌ఎంఈలు ప్రపంచ మార్కెట్లలో ప్రతిష్ఠ పొందుతున్నాయి. అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఆంధ్రప్రదేశ్ ఎగుమతులను మరింత బలోపేతం చేస్తాయి,” అని అన్నారు. సీఈఓ విశ్వా ఎం మాట్లాడుతూ – “రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దాదాపు 30 శాతం వాటా ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లదే. ప్రతి జిల్లాలో డిజిటల్ మరియు ఆర్థిక సమగ్రతతో కూడిన ఎకోసిస్టమ్ నిర్మిస్తున్నాం,” అని తెలిపారు. ఇండియా ఎంఎస్‌ఎంఈ ఫోరమ్ అధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ – “ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అత్యంత పురోగామి రాష్ట్రాలలో ఒకటి. 2047 నాటికి ఎగుమతులను $20 బిలియన్‌ నుంచి $450 బిలియన్‌కు పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం స్పష్టమైన మార్గరేఖతో ముందుకెళ్తోంది,” అని అభిప్రాయపడ్డారు. తదుపరి సెషన్లలో “ఎగుమతులను బలోపేతం చేయడం – విధానావసరాలు”, “ఈ-కామర్స్ ఎగుమతుల వృద్ధి” వంటి అంశాలపై నిపుణులు చర్చించారు. వాతావరణ అనుకూల మౌలిక సదుపాయాలు, డిజిటల్ ట్రేడ్ సిస్టమ్‌లు, లాజిస్టిక్స్ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. రోజు ముగింపులో జరిగిన అంతర్జాతీయ ప్రతినిధుల ప్రెజెంటేషన్ సెషన్లో రూ.174 కోట్ల విలువైన వ్యాపారావకాశాలు చర్చకు వచ్చాయి. పాల్గొన్న ఎంఎస్‌ఎంఈలు అంతర్జాతీయ కొనుగోలు దారులతో ప్రత్యక్షంగా చర్చలు జరిపి వ్యాపార భాగస్వామ్యాలు, సంయుక్త ఒప్పందాల దిశగా ముందడుగు వేశారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈలకు గ్లోబల్ వేదికను కల్పించిన ఈ మహాసభ, రాష్ట్ర ఎగుమతుల విస్తరణకు, కొత్త అంతర్జాతీయ మార్కెట్లను అందుకోవడంలో మైలురాయిగా నిలిచింది.

అనకాపల్లి

ఏటికొప్పాకలో శ్రీశ్రీశ్రీ బండిమాంబ జాతర…!!!

అనకాపల్లి జిల్లా నవంబర్ 09 ( పున్నమి న్యూస్) ప్రతినిధి (ఆనంద్): ఎలమంచిలి నియోజకవర్గం ఎలమంచిలి రూరల్.ఏటికొప్పాక గ్రామంలో.బండిమాంబ అమ్మవారి ఆలయంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. స్థానిక ఉత్సవ కమిటీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, యువకులు, కూటమి నాయకులు తదిరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

శ్రీ సౌమ్యనాథ స్వామినీ దర్శించుకున్న క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు

జనసేన పార్టీ పీ.ఏ.సీ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి టీడీపీ నాయకులు గంటా గోపి ఆహ్వానం మేరకు నందలూరులోని ప్రసిద్ధ చెందిన శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా దేవాలయ పరిసరాల్లో జనసేన,టీడీపీ,ఎన్డీఏ కార్యకర్తలు కలిసి సూరికి ఘన స్వాగతం పలికారు.స్థానిక నాయకులు పూలమాలలు వేసి సన్మానించారు.స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కనకరాజు సూరి భక్తుల అభ్యున్నతి,రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.స్థానిక ప్రజలు,కార్యకర్తలు ఆయనను కలుసుకోవడానికి విరివిగా తరలి వచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా గోపి, రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయసాగర్,భూశెట్టి వెంకట సుబ్బయ్య,జంగిటి సుబ్బయ్య, అలాగే జనసేన నాయకులు కొట్టే శ్రీహరి,అరుణ్ పాండే, ఉల్లి ఉపేంద్ర,డాల,భాస్కర్, శ్రీహరి,రత్నం,రాము సార్, రమేష్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

పాఠశాల శతవార్శికోత్సవాలను విజయవంతం చేయండీ…ప్రధానోపాధ్యాయులు తీగల వెంకటయ్య

శ్రీకాళహస్తి నవంబర్ 09, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్నంలోని ఆర్పీ బి ఎస్ జెడ్పి బాయ్స్ హై స్కూల్ ఇప్పటికీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ప్రస్తుతం 104వ సంవత్సరం జరుగుతున్న తరుణంలో ఈ శత దినోత్సవ వేడుకలు జరుపుకొనుటకు ఆదివారం నాడు పాఠశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల వెంకటయ్య, పురుషోత్తం, గోపాలకృష్ణ ,రామచంద్రయ్య, రంగయ్య, చిట్టిబాబు, పూర్వ విద్యార్థులు పాల్గొని రాబోవు సంవత్సరంలో అనగా 2026 వ సంవత్సరంలో ఈ 100 సంవత్సరాల శత దినోత్సవ వేడుకలు జరుపుకొనుటకు ప్రస్తుత తాత్కాలిక కమిటీని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా తదుపరి కార్యక్రమాలు జరుగుతాయని నిర్ణయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల వెంకటయ్య మాట్లాడుతూ…. తానూ ఈ పాథశాల విద్యార్థినేని ఇప్పుడు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, అలాగే తను చదివిన పాఠశాల ఆధ్వర్యంలో మీ అందరి సహకారంతో శతదినోత్సవాలు వేడుకలు జరుపుకొనుటకు నిశ్చయించడం, అలాగే గత 100 సంవత్సరాల అందుబాటులో ఉన్న పూర్వ విద్యార్థుల యొక్క సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

తిరుపతి

శ్రీ అయ్యప్పస్వామి దీక్ష నిత్య పూజ నియమావళి పుస్తక ఆవిష్కరణ

శ్రీకాళహస్తి నవంబర్ 09, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి మురళి గురు స్వామి శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి వ్యవస్థాపకులు జ్యోతిబాపూలే జాతీయ అవార్డు గ్రహీత రచించిన పుస్తకం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రముఖులచే పుస్తక ఆవిష్కరణ జరిగినది. సర్వాత్మనంద స్వాములు, శ్రీ విద్యా స్వరూపానంద గిరి స్వాములు దాసరి శ్రీనివాసులు lAS (ఎండోమెంట్ HDPT చైర్మన్) చేతుల మీదుగా శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష నిత్య పూజ నియమావళి పుస్తక ఆవిష్కరణ జరిగినది. ఈ సందర్బంగా రచయిత పూస్తకం గురుంచి వివరిస్తూ ..అయ్యప్ప స్వామి దీక్ష సామాన్య దీక్షగా భావిస్తున్నారు పూర్వా కాలంలో అయ్యప్ప స్వామి దీక్ష గ్రహ మండల కాల దీక్ష అంటే 48 రోజులు కటోర దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని (పెద్ద పాదం)ఎరిమేలి మార్గంలో కాలినడకలు వెళ్లి ఎంతో పవిత్రమైన పుణ్య నది పంపానది లో స్నానం చేసి అష్టాదశ మెట్లు 18 మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శనం చేసుకుని కార్తీకమాసంలో ఎంత విశిష్టంగా అయ్యప్ప దీక్షను చేస్తుంటారు ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ఎంతో ఈ పుస్తకం ఉపయోగపడుతుందని ఇందులో క్షుణ్ణంగా మాలాధారణ ఎలా చేయాలి నియమాలు ఎలా ఉండాలి పూజా విధానం స్వామివారి శరణు ఘోషలు స్వామివారి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచి ఉన్నాయని ప్రతి ఒక్కరు అటువంటి నియమాలు పాటిస్తే నిత్యజీవితంలో కూడా ఉపయోగపడుతుంది అందరూ కూడా అయ్యప్ప స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేతలు అవధాని ఆముదాలమురళి ప్రవచకులు, కన్యకా పరమేశ్వరి చైర్మన్, నడవాటి శరవణ నందం దొర కుమార్ భక్తులు సంఘ సేవకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.