E-పేపర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలను పిపిపివిధానంలో నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 12వ తేదీ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రజా ఉద్యమ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష, వైసిపి నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రజా ఉద్యమ ర్యాలీ యొక్క ఉద్దేశాలను, లక్ష్యాలను ఈ సందర్భంగా వైసీపీ నేతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష, వైసిపి నేతలు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్మార్గపు ఆలోచనతో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ విధానంలో నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వైసిపి ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద , మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు , ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులను తీసుకువచ్చి తొలి దశలో ఐదు మెడికల్ కళాశాలలను దిగ్విజయంగా ప్రారంభించారన్నారు. ఈ మెడికల్ కళాశాలలు విజయవంతంగా మూడవ విద్యాసంవత్సరాన్ని కొనసాగిస్తున్నాయని, ఈ ఘనచరిత్ర వైఎస్ఆర్సిపి పార్టీ దేనిని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుర్మార్గపు దురుద్దేశపు ఆలోచనలతో మెడికల్ కళాశాలలను పిపిపి విధానంలో ప్రవేట్ చేసేందుకు చేస్తున్న కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు పిలుపుమేరకు ఈనెల 12వ తేదీ నంద్యాలలోని ఉదయానంద రెసిడెన్సీ నుండి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమ ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ఉన్నత అధికారులకు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రజా ఉద్యమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణను చేపడుతున్నామని తెలిపారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమ ఉద్దేశాలను రాష్ట్రపతికి తెలియజేయడం జరుగుతుంది పేర్కొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రజా ఉద్యమం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ రద్దు చేసేంతవరకు కొనసాగుతుందని పోరాటానికి ప్రజలు పూర్తి మద్దతును ఇవ్వాలని కోరారు. మెడికల్ కళాశాలల నిర్వహణను ప్రవేట్ యాజమాన్యం తీసుకుంటే వారు నష్టపోక తప్పదని హెచ్చరించారు. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా అధికారం చేపడుతుందని, పిపిపి విధానాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మి అమీర్, రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రెటరీ శశికళ రెడ్డి, వైసిపి గోస్పాడు మండల అధ్యక్షుడు పి పి రాజశేఖర్ రెడ్డి, నంద్యాల మండలం ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైసిపి జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడురసూల్ ఆజాద్, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు పివి రమణ, వైసిపి జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా సెక్రెటరీ దేవనగర్ భాష, జిల్లా సెక్రెటరీ శివ నాగిరెడ్డి, అసెంబ్లీ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు మనోజ్, కౌన్సిలర్స్ భాస్కర్, చంద్రశేఖర్ రెడ్డి, మేసా చంద్రశేఖర్, సర్పంచ్ కోటిరెడ్డి, వైసిపి నాయకులు జాకీర్ హుస్సేన్, సాయిరాం రెడ్డి, రత్నబాబు చౌదరి, సోహెల్ రానా, అభిబ్, శంకర్ రెడ్డి,తిమ్మరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు