Sunday, 22 March 2026

Blog

E-పేపర్

గత రెండు రోజులుగా ప్రచురితమైన ఫార్మాసిటీ భూములలో ప్రత్తి, వరి పంటలు వేసిన రైతుల పంటల ఉత్పత్తినీ కొనుగోలు కేంద్రాలలో కొనరూ అనే వార్త అవాస్తవం.

10.11.2025 పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ 9640204826 గత రెండు రోజులుగా ప్రచురితమైన ఫార్మాసిటీ భూములలో ప్రత్తి, వరి పంటలు వేసిన రైతుల పంటల ఉత్పత్తినీ కొనుగోలు కేంద్రాలలో కొనరూ అనే వార్త అవాస్తవం. యాచారం మండలం లోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపార్టీ , కుర్మిద గ్రామాలలోని (ఫార్మసిటీలో ఉన్న భూములు) ప్రత్తి, వరి పంటలు వేసిన రైతులు తమ వ్యవసాయ విస్తరణ అధికారి మరియు మండల వ్యవసాయ అధికారినీ కలిసి ప్రత్తి, వరి పంటలు నమోదు చేసుకోని, ప్రత్తి పంటను kapas kisan యాప్ లో స్లాట్ book చేసుకొని, మరియు వరి పంటను తమ కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వెళ్లవలసిందిగా కోరుచున్నాము. మీ వ్యవసాయ శాఖ, యాచారం మండలం రంగా రెడ్డి జిల్లా.

ఎన్ టి ఆర్ జిల్లా

పి.జి.ఆర్.ఎస్. అర్జీల పరిష్కారంలో నాణ్యత పెరగాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను పి.జి.ఆర్.ఎస్. అర్జీల పరిష్కారంలో నాణ్యత పెంచడానికి, మరింత మెరుగైన మరియు సంతృప్తికరమైన పరిష్కారాలను అందించడానికి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరం లో, సంయుక్త కలెక్టర్ ఎస్. ఇలక్కియతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ: అర్జీల పరిష్కా రంలో విధానపరమైన లోపాలు (ప్రొసీజర్ లాప్సెస్) లేకుండా చూడాలని అర్జీల పరిష్కారం సరిగా నిర్వహించని అధికారు లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుల ఆడిటింగ్ ను నిక్కచ్చిగా నిర్వహించాలని కీలక ప్రగతి సూచికలు (KPI) మరియు నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక (Action Plan) లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని సూచించారు. పి.జి.ఆర్.ఎస్. కు అందిన అర్జీలు: సోమవారం జరిగిన పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమంలో మొత్తం 155 అర్జీలు స్వీకరించ బడ్డాయి. శాఖల వారీగా వర్గీకరణ ఇలా ఉంది: రెవెన్యూ శాఖ: 51 పోలీస్ శాఖ: 23 పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ: 20 ఆరోగ్య & పంచాయతీరాజ్ శాఖ: 8 డిఆర్డిఏ: 6 దేవదాయ శాఖ: 5 విద్య, గృహ నిర్మాణం, జలవనరులు, సర్వే శాఖ: 4 చొప్పున విభిన్న ప్రతిభవంతుల సంక్షేమం & గ్రామీణ నీటి సరఫరా: 3 చొప్పున ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం. లక్ష్మీ నరసింహం, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

E-పేపర్

విద్యార్థి యువత కోసం రాజీ లేని పోరాట యోధుడు కామ్రేడ్ ఈశ్వరయ్య – శ్రీకాళహస్తి ఏఐటీయూసీ సన్మానం.*

*విద్యార్థి యువత కోసం రాజీ లేని పోరాట యోధుడు కామ్రేడ్ ఈశ్వరయ్య – శ్రీకాళహస్తి ఏఐటీయూసీ సన్మానం.* *సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్యకు తిరుపతిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సన్మానం* తిరుపతి, నవంబర్ 10 సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య ఎంపిక కావడం పార్టీకి గౌరవకరమైన అంశమని, ఆయన నాయకత్వం పార్టీని మరింత బలోపేతం చేస్తుందని. కామ్రేడ్ ఈశ్వరయ్యను గజమాల,దుస్సాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి గారు విద్యార్థి దశలోనే అసాధారణ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారన్నారు. ఎప్పుడూ రాజీ పడని స్వభావం, నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తపరచే ధైర్యం, ప్రజల సమస్యల పట్ల ఉన్న నిబద్ధత ఆయనను ఇతరుల కంటే ప్రత్యేకుడిగా నిలబెట్టాయని అన్నారు. విద్యార్థి ఉద్యమాలు ఉద్ధృతంగా సాగుతుండగా, ఈశ్వరయ్య గారు ముందు వరుసలో నిలబడి విద్యార్థు హక్కుల కోసం పోరాడేవారన్నారు. స్పష్టమైన ఆలోచన, వాక్చాతుర్యం, క్రమశిక్షణ ఆయన వ్యక్తిత్వానికి ముద్రవేసిన లక్షణాలు అని తెలిపారు.పార్టీ సిద్ధాంతాలకు అచంచలంగా కట్టుబడి, సామాజిక న్యాయ సాధన కోసం జీవితాంతం . ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య తిరుపతి పట్టణ కార్యదర్శి జిల్లా విశ్వనాథ్ కత్తి రవి జనమాల గురవయ్య వైయస్ మణి మించల శివకుమార్ తొండు మల్లికార్జున్ కార్తీక్ జ్యోతి సాయి మహేష్ సెల్వ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

పెద్ద రామాలయం ఎదురుగా వీరవల్లి వారి నూతన గృహ నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్

జగ్గయ్యపేట పట్టణంలోని పెద్ద రామాలయం గుడి ఎదురుగా, వీరవల్లి కిరణ్ కుమార్ మరియు మణికంఠ బ్రదర్స్ సంయుక్తంగా నిర్మాణం చేయనున్న నూతన గృహ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు, శంకుస్థాపనలు ఘనంగా నిర్వహించబడి, స్థానిక ప్రజలు మరియు ఇతర నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ గృహ నిర్మాణం ప్రాంత అభివృద్ధికి, సమాజానికి మార్గసూచిగా నిలవనున్నదిగా భావిస్తున్నారు.ఈ కార్యక్రమం జగ్గయ్యపేట పట్టణంలో సామాజిక, ఆర్థిక రంగాలలో జంట పురోగతికి తోడ్పడే ఘట్టంగా చెప్పుకోవచ్చు. వీరవల్లి కిరణ్ కుమార్ యొక్క దేవునికి మరియు సమాజానికి సేవా భావనతో నూతన సంధులు సృష్టించడం విశిష్టం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో జన్మదిన వేడుక లు

10/05/2025 *మాజీ మంత్రివర్యులు డాక్టర్ శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ చేసిన మనుబోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు*మరియు కార్యకర్తలు.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో ఆర్కా సోలార్ పవర్ రూఫ్‌టాప్ ప్లాంట్ ప్రారంభం

జగ్గయ్యపేట ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో భాగంగా పట్టణానికి చెందిన గోపు కిరణ్ కుమార్ ఏర్పాటు చేసిన ఆర్కా సోలార్ పవర్ రూఫ్‌టాప్ ప్లాంట్ను జగ్గయ్యపేట శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఘనంగా ప్రారంభిం చారు. ఈ ప్లాంట్ సత్యనారాయ ణపురం సాయిబాబా గుడి ఎదురుగా ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “సౌరశక్తి ఎప్పటికీ తరగని సహజ వనరు. ఇది శిలాజ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించి పర్యావర ణాన్ని కాపాడుతుంది. సౌర విద్యుత్ ఉత్పత్తి సమయంలో హానికర వాయువులు ఉత్పత్తి కాకపోవడం వలన వాతావరణ మార్పులను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది,” అని అన్నారు. అలాగే, ప్రజలు తమ ఇళ్లపై లేదా వ్యాపార సంస్థలపై సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవ డమే కాకుండా, నెట్ మీటరింగ్ ద్వారా అదనపు విద్యుత్తును విక్రయించి ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో భారత్ పునరుత్పాదక శక్తి రంగంలో ప్రపంచంలో అగ్రస్థానం లో నిలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సౌరశక్తి వినియోగంలో ఆదర్శం గా నిలుస్తోంది,” అని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాం సాయి ప్రసాద్, శ్రీరాం చిన్నబాబు, నూకల కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

వేములపల్లిలో పీఏసీఎస్ చైర్మన్‌గా ముక్కపాటి నరసింహారావు ప్రమాణ స్వీకారం

కంచికచర్ల మండలం, వేములపల్లి: కంచికచర్ల మండలంలోని వేములపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కొత్త చైర్మన్‌గా ముక్కపాటి నరసింహారావు సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథు లుగా ఉమ్మడి కృష్ణాజిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, “రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో సహకార సంఘాల పాత్ర అత్యంత కీలకం,” అని పేర్కొన్నారు. రైతులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడానికి నూతన చైర్మన్ కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, “వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకు తరఫున అన్ని విధాల సహకారం అందిస్తాం,” అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, రైతు నాయకులు, సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఏటూరు గ్రామంలో ఘనంగా సిద్ధి బుద్ధి వినాయక స్వామి ధ్వజస్తంభ మహోత్సవం

చందర్లపాడు మండలంఏటూరు గ్రామంలో సోమవారం నాడు సిద్ధి బుద్ధి వినాయక స్వామి ఆలయంలో ధ్వజస్తంభ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్ర మాన్ని నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ — “గ్రామ దేవాలయాలు గ్రామాల ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకలు. భక్తుల అంకితభావం వల్లే ఇలాంటి మహోత్సవాలు విజయవంతంగా జరుగు తున్నాయి,” అని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి మరియు దేవాలయ అభివృద్ధికి తాను అవసరమైన సహాయం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.

కామారెడ్డి

రైతు పాస్‌బుక్‌ల ముద్రణ ఆగింది.

– ఆరు నెలలుసాగు సీజన్ దరిదాపుల్లోనే రైతు నిరాశ ముద్రణ ఆగింది, రైతు ఆగిపోయాడు పాస్‌బు క్ లేకపోవడంతో సాగు సీజన్ ఆపరాటం లోపాస్‌ బుక్ లేదు… పంట ఎక్కడ? ఆరు నెలల జాప్యం.. రైతులు రుణాలు లేక ఆకలి ఎదుర్కొంటున్నరు రిజిస్ట్రేషన్ పూర్తయినా ఆశ లేకపోతే పంటలు వదిలేయొద్దని రైతులు ఆందోళనలు కామారెడ్డి, నవంబర్ 10 (పున్నమి ప్రతినిధి): శ్రీమంతుడు వెండి పళ్లెంలో అన్నం తింటే, నిరుపే దలు స్టీల్ పాత్రల్లో తింటారు. కానీ రైతన్న మట్టిలో నే జీవనం సాగిస్తాడు. ఇప్పుడు ఆయనే పెంచిన భూమి పచ్చటి పంట ఇవ్వకముందే ప్రభుత్వం “పాస్‌బుక్ లేని రైతు”గా గమనిస్తోంది. భూమాత సిస్టమ్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయినా, వేలాది మంది రైతులకు ఇప్పటికీ పట్టాదారు పాస్‌బుక్‌లు అందని స్థితి నెలకొంది.గత ఆరు నెలలుగా ఈ సాంకేతిక ఆటంకం రైతు జీవనాధారాన్ని కుదిపేస్తోంది. ప్రతి నెలా వందల లావాదేవీలు పూర్తవుతున్నా, పాస్‌ బుక్ ముద్రణకి సంబంధించిన ఫైళ్లు హైదరాబా ద్‌లోని ముద్రణ కేంద్రాల్లో పేరుకుపోయాయి. రెవె న్యూ అధికారులు కొత్త పాస్‌బుక్ డిజైన్ డెవలప్‌ మెంట్ కారణంగా ఆలస్యం జరుగుతోందని చెబు తున్నారు. కానీ ఈ వివరణ రైతులకు ఉపశమనం ఇవ్వడంలేదు.“పట్టా పేర్లు స్క్రీన్‌లో కనిపిస్తున్నా యి కానీ చేతిలో పాస్‌బుక్ లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదు. విత్తనాలు కొనడానికి, నీటిపారుదలకి ఖర్చు తేలడం లేదు,” అని కామా రెడ్డికి చెందిన ఒక రైతు పొలంలో కూర్చుని ఆవే దన వ్యక్తం చేశాడు. మిగతా రైతులు కూడా “ఆరు నెలల వాయిదా చాలా ఎక్కువ కాలం. పాస్‌బుక్ లేకపోతే మన పంటలు కూడా నిలవవు” అంటూ నిరాశను వెల్లగక్కుతున్నారు.రైతు సంఘాలు ఇప్పటికే రెవెన్యూ, తపాలా కార్యాలయాల చుట్టు పాదయాత్రలు, ధర్నాలు ప్రారంభించాయి. “ముద్ర ణ సాంకేతికత పేరుతో రైతుల భవిష్యత్తు ఆగిపో వడం విచారం. ప్రభుత్వం వెంటనే తేలికత తీసుకో వాలి” అని రైతు సంఘం నాయకులు తెలిపారు. పాస్‌బుక్‌లు లేకపోవడం ప్రత్యక్షంగా రుణాల జారీపై ప్రభావం చూపుతోంది. రుణాలు లేకపోవ డం వల్ల విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయ లేకపోతున్నారు. దీనివల్ల రాబోయే పంట సీజన్ ఆలస్యమవుతోంది. వ్యవసాయ కార్యకలాపాలు దెబ్బతింటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిం టుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.“ఈ సమ స్యను ప్రభుత్వం ప్రాథమిక ప్రాధాన్యతగా తీసుకో వాలి. పాస్‌బుక్ జారీ ప్రాసెస్‌ను వేగవంతం చేయకుండా రైతు భరోసా కేవలం కాగితం మాటగా మిగిలిపోతుంది,” అని తహసీల్దారు కార్యాలయం ముందు ఆందోళన చేస్తామంటున్న రైతులు

అన్నమయ్య

శ్రీ భువనేశ్వరి సమేత భుజంగేశ్వర స్వామి వారిని దర్శించిన ముక్కా వరలక్ష్మి

మూడవ కార్తీక సోమవారం శుభసందర్భంగా రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి సమేత భుజంగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇన్‌ఛార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు వరలక్ష్మిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, ప్రజలు, భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.