Sunday, 22 March 2026

Blog

అన్నమయ్య

ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం: అబుల్ కలాం ఆజాద్‌కు నివాళులు

-చిట్వేల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రత్యేక కార్యక్రమం – విద్య యొక్క ప్రాముఖ్యతను స్మరించుకున్న ప్రధానోపాధ్యాయులు చిట్వేల్, నవంబర్ 11: పున్నమి ప్రతినిధి భారత స్వాతంత్ర్య సమర యోధుడు, స్వతంత్ర భారతదేశపు తొలి విద్యా శాఖా మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్) చిట్వేల్ నందు మంగళవారం నాడు జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. -నివాళుల అర్పణ కార్యక్రమంలో భాగంగా, ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు మరియు ఉపాధ్యాయ బృందం కలిసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. -ఆజాద్ కృషిని స్మరించుకుంటూ ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. ఈ దినోత్సవాన్ని భారతదేశపు మొట్టమొదటి విద్యా మంత్రి మరియు ఆధునిక విద్యకు మార్గదర్శకుడైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తారని వివరించారు. “విద్యా రంగంలో ఆయన చేసిన కృషిని మరియు విద్య యొక్క ప్రాముఖ్యతను ఈ సందర్భంగా స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఆయన చూపిన మార్గంలో ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను సాధించాలి” అని ఆయన అన్నారు. -కార్యక్రమంలో పాల్గొన్నవారు: ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, రాజశేఖర్, శివ నారాయణ, విజయలక్ష్మి, కళావతి, సుహాసిని, సుజాత, రమాదేవి, ఈశ్వర్ రాజు మొదలగు ఉపాధ్యాయ బృందం, అలాగే పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అన్నమయ్య

కౌశల్ సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలకు చిట్వేల్ విద్యార్థులు ఎంపిక

-జిల్లా స్థాయికి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు – ఈ నెల 27, 28న ఆన్‌లైన్ పరీక్షలు చిట్వేల్, నవంబర్ 11: పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా, చిట్వేల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)విద్యార్థులు కౌశల్ సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలు – 2025 యొక్క జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ పోటీలను భారతీయ విజ్ఞానమండలి, ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు తెలిపారు. -పోటీల లక్ష్యం – నిర్వహణ: ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లోని కౌశలాలను (నైపుణ్యాలను) పెంపొందించడానికి ఇటువంటి పోటీలు ఎంతో ఉపకరిస్తాయి” అని అన్నారు.ఈ పోటీలు మొత్తం మూడు విభాగాలలో (క్విజ్, పోస్టర్, రీల్స్) మరియు మూడు స్థాయిలలో జరుగుతాయని ఆయన వివరించారు. -జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు: పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపికైన ప్రతిభావంతుల వివరాలను దుర్గరాజు వెల్లడించారు: కె. తేజశ్రీ, కె. హేమ సాయి రెడ్డి, ఎస్. అహమ్మద్ రీల్ పి. భవ్య పోస్టర్ జె. సాత్విక -అభినందనలు: జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మరియు పాఠశాల ఉపాధ్యాయుల బృందం హృదయపూర్వకంగా అభినందించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు చిరు బహుమతులను అందించి, తదుపరి పోటీలకు సిద్ధం కావాలని ప్రోత్సహించారు. -తదుపరి అంచె: జిల్లాస్థాయి కౌశల్ ఆన్‌లైన్ పరీక్షలు ఈ నెల 27, 28వ తేదీలలో జరగనున్నాయి. ఈ పోటీల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వాకింగ్ చేసే వాళ్ళ పై దూసుకెళ్లిన ఆవులు

ఉదయగిరి మండలంలోని ఆర్ అండ్ బీ అతిధి గృహం వెనుక ఖాళీ ప్రదేశంలో వాకింగ్ చేస్తున్న స్టేట్ పేట మహిళల పై అకస్మాత్తుగా సుమారు ముప్పై పైగా ఆవులు మంద దూసుకెళ్లింది ఈ ఘటనలో పలువురు మహిళలు గాయపడ్డారు గాయపడిన వారిని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కీసరలో పూర్ణచంద్రరావు కుటుంబానికి ₹5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు తెదేపా సభ్యత్వ ఇన్సూరెన్స్ పథకం కింద మంజూరు – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతులమీదుగా అందజేత

కంచికచర్ల మంగళవారంకీసర గ్రామానికి చెందిన ఆకుల పూర్ణచంద్రరావు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటనపై ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీ ఇన్సూరెన్స్ పథకంలో చేరిన పూర్ణచంద్ర రావు కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ మంజూరు పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం అందజేశారు. తెదేపా నేతలు, కార్యకర్తల సమక్షంలో సౌమ్య కీసర గ్రామంలోని ఆకుల కుటుంబ స్వగృహానికి వెళ్లి, పూర్ణచంద్ర రావు కుమారుడు ఆకుల గోపికృష్ణ చేతులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సౌమ్య కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీ ప్రజా సేవా ధ్యేయంతో ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుంది. సభ్యుల సంక్షేమం కోసం పార్టీ అన్ని స్థాయిల్లో కృషి చేస్తుంది. ఈ ఆర్థిక సాయం పూర్ణచంద్రరావు కుటుంబానికి జీవనాధారంగా ఉపయోగపడాలి” అనిఅన్నారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మండల కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కీసరలో పూర్ణచంద్రరావు కుటుంబానికి ₹5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు తెదేపా సభ్యత్వ ఇన్సూరెన్స్ పథకం కింద మంజూరు – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతులమీదుగా అందజేత

కంచికచర్ల మంగళవారంకీసర గ్రామానికి చెందిన ఆకుల పూర్ణచంద్రరావు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటనపై ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీ ఇన్సూరెన్స్ పథకంలో చేరిన పూర్ణచంద్ర రావు కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ మంజూరు పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం అందజేశారు. తెదేపా నేతలు, కార్యకర్తల సమక్షంలో సౌమ్య కీసర గ్రామంలోని ఆకుల కుటుంబ స్వగృహానికి వెళ్లి, పూర్ణచంద్ర రావు కుమారుడు ఆకుల గోపికృష్ణ చేతులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సౌమ్య కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీ ప్రజా సేవా ధ్యేయంతో ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుంది. సభ్యుల సంక్షేమం కోసం పార్టీ అన్ని స్థాయిల్లో కృషి చేస్తుంది. ఈ ఆర్థిక సాయం పూర్ణచంద్రరావు కుటుంబానికి జీవనాధారంగా ఉపయోగపడాలి” అనిఅన్నారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మండల కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో 15 కోట్ల ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భూమి పూజ ఘనంగా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల ప్రోత్సాహక దూరదృష్టితో రాష్ట్రవ్యాప్తంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జయంతిపురం గ్రామంలో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమం మంగళవారం ఘనంగాజరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, ఆర్డీవో బాలకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిశ్రమల విస్తరణకు రాష్ట్రం వేగంగా పునాదులు వేస్తోంది. జయంతిపురంలో ప్రారంభ మవుతున్న ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, జగ్గయ్యపేటను పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయడంలో మైలురాయిగా నిలుస్తుంది,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్

జిల్లా పదాధికారుల సమావేశంలో పాల్గొన్న బిజెపి మండలాల అధ్యక్షులు

జిల్లా పదాధికారుల సమావేశంలో పాల్గొన్న బిజెపి మండలాల అధ్యక్షులు రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు నియోజకవర్గంలోని బిజెపి మండల అధ్యక్షులు మదనపల్లెలో జరిగిన అన్నమయ్య జిల్లా మండల అధ్యక్షులు మరియు జిల్లా పదాధికారుల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి &జోనల్ ఇంచార్జి దయాకర్ రెడ్డి రైల్వే కోడూరు నియోజకవర్గ బిజెపి మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె మండల అధ్యక్షులు ముక్క రూపేష్ రెడ్డి , రైల్వేకోడూరు మండల అధ్యక్షులు సాయం శ్రీధర్ మొదలగువారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగినది.

అన్నమయ్య

సైన్స్ ప్రతిభలో చిట్వేల్ విద్యార్థుల మెరుపు

అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్) విద్యార్థులు కౌశల్ సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలు – 2025 జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ పోటీలను భారతీయ విజ్ఞాన మండలి మరియు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీయడం, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించడమే ఈ పోటీల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. క్విజ్‌, పోస్టర్‌, రీల్స్‌ విభాగాలలో మూడు స్థాయిల్లో పోటీలు జరుగనున్నాయని వివరించారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు: కె. తేజశ్రీ, కె. హేమసాయిరెడ్డి, ఎస్. అహమ్మద్‌, పి. భవ్య (రీల్స్‌), జె. సాత్విక (పోస్టర్‌). ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఉపాధ్యాయుల బృందం విద్యార్థులను అభినందించి చిన్న బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయి ఆన్‌లైన్ పరీక్షలు ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్నాయని, విద్యార్థులు మరింత ప్రతిభ కనబరచాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

అన్నమయ్య

ఉర్దూ పాఠశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా చిట్వేల్ మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో సోమవారం ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయుడు కామాటం వెంకటేశ్వర్లు, సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగం అభివృద్ధికి చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు. హిందూ–ముస్లింల ఐక్యతకు ఆయన చేసిన సేవలు దేశానికి ఆదర్శమని తెలిపారు. విద్యా సంస్కరణలకు పునాది వేసిన మౌలానా ఆజాద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులను సూచించారు. తదనంతరం విద్యార్థులకు మిఠాయిలు, విద్యాసామగ్రి పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సంఘ సభ్యులు షేక్ మస్తాన్ భాష, రియాజ్ భాషా, షబ్బీర్ భాష, గాడి ఇంతియాజ్ అహ్మద్, మహిళా సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సాహితీ

అందెశ్రీ గారు ఇక లేరు అన్న వార్త అశనిపాతమై కురిసిన అక్షర ధార

*మంచి మనిషి మాయమైపోయాడు* పల్లవి- మాయమయి పోతున్నడన్నావు మనిషి నీవు మాయం అయిపోతే ఎట్లాగన్నా ఇంత మందికి తట్టి లేపితివి అన్న నీవు నిద్రలోకి వెళ్ళిపోతే ఎలా అన్న ” మాయమయి” ప్రకృతి మూగబోతోంది అన్న సెలయేళ్లు గలగలలుతగ్గాయి అన్న కవి కలాలు ఆగిపోయాయి అన్న కవి గళాలు మూగబోతాయి అన్న ” మాయమయి” పల్లె అందాలు ఎవరు వర్ణిస్తారు మానవతావాదం ఎవరు వివరిస్తారు తెలంగాణ తల్లిని ఎవరు ఓదారుస్తారు ఎంత పని చేసావు అన్న మాకు చింతలే మిగిల్చావు అన్న. ” మాయమయి” ఎల్లయ్యగా అవతరించావు నీవు అందెశ్రీ గా అందరికీ పరిచయమైనావు ప్రకృతి నుంచి పాఠాలు చదివావు జీవితాల నుంచి గుణపాఠాలు నేర్చావు “మాయమయి ” జనపదంలో పుట్టి ,జానపదాన్ని పట్టి జనం మెచ్చిన పాటలు తో పేరు పొందావు తెలంగాణ ఉద్యమంలో కీలకమయ్యావు నోటి మాటలతో అగ్నిమంచును కురిపించావు. “మాయమయి” ఇట్లు రచన-లోకనాథం సత్యానందం, మాస్టారు, శ్రీకాకుళం, ఫోన్ -9182863928. (వారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.)

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.