Thursday, 19 March 2026

Blog

అల్లూరి సీతారామరాజు

జాతీయ స్ధాయి పోటీలకు ఎంపికైన ఉపాధ్యాయుడు

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్‌ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు జీ.కే వీధి మండలం, సీలేరు జెడ్పీ హెచ్ పాఠశాల పీడీ జీ చిన్ని ఎంపికయ్యారు. ఈ నెల 21న విజయవాడలో జరిగిన సర్వీసెస్‌ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో చిన్ని పాల్గొని తన క్రీడా ప్రతిభను చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దీంతో ఆంధ్ర జట్టు తరపున న్యూఢిల్లీలో జరగనున్ జాతీయ స్ధాయి పోటీలలో పాల్గొనున్నారు. ఈ మేరకు శనివారం పాఠశాల హెచ్ఏం నాగభూషణం, తోటి ఉపాద్యాయులు చిన్నిని అభినందించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం జెడ్పీ హై స్కూల్ 150 ఏళ్ల వేడుకలకు హాజరైన మాజీ ఎంపీ చింతా అనురాధ

అమలాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ 150 సంవత్సరాల మహోత్సవ వేడుకలుగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ హాజరయ్యారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ, స్కూల్ చరిత్రాత్మక ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ ఆమె మాట్లాడారు. విద్య రంగంలో ప్రభుత్వ పాఠశాలలు చూపుతున్న పురోగతిని అభినందించిన అనురాధ గారు, భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందించేందుకు అందరూ కలిసి పని చేయాల్సిన అవసరాన్ని వెల్లడించారు. ఈ వేడుకలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.

అమరావతి

తిరుపతిలో జర్నలిస్టుకు పై దాడి జరిగితే దీనిపై హైకోర్టు పిటిషనర్ జర్నలిస్ట్ మాచర్ల శ్రీనివాసులు వాదనను పరిశీలించిన మీదట రక్షణ కల్పించాలని డిజిపిని ఆదేశించారు

పిటిషనర్ జర్నలిస్ట్ మాచర్ల శ్రీనివాసులుకు భద్రత కల్పించమని ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ఆదేశించింది. ఎపిహెచ్‌సి010628592025 ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు, అమరావతి (ప్రత్యేక అసలు అధికార పరిధి) శనివారం, 22 నవంబర్ 2025 హాజరు మహానీయ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప రైట్ పిటీషన్ నెం: 32446/2025 ⸻ పిటిషనర్: 1. ఎం. శ్రీనివాసులు, సిన్/ late చెంచయ్య, వయసు: 52 సంవత్సరాలు, ఉద్యోగం: ఎడిటర్, తిరుపతి వార్త, చిరునామా: మెయిన్ రోడ్, సుబ్బారెడ్డి నగర్, తిరుపతి. ⸻ ప్రతివాదులు: 1. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం డిపార్ట్మెంట్, వెలగపూడి, గుంటూరు. 2. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మంగళగిరి, గుంటూరు జిల్లా. 3. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, తిరుపతి జిల్లా. 4. స్టేషన్ హౌస్ ఆఫీసర్, అలిపిరి పోలీస్ స్టేషన్, అలిపిరి, తిరుపతి జిల్లా. ⸻ పిటిషన్ విషయం: భారత రాజ్యాంగం ఆర్టికల్ 226 కింద దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, తేదీ 15.11.2025 న సమర్పించిన representation ప్రకారం భద్రత ఇవ్వకుండా ఉన్న ప్రతివాదుల చర్యను అక్రమం, అన్యాయం, అధికార లేమి, మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ఉల్లంఘనగా ప్రకటించాలని కోరుతూ, పిటిషనర్‌కు ప్రభుత్వం తరఫున వెంటనే రక్షణ కల్పించాలని కోరారు. ⸻ IA No: 1 of 2025 ఈ మధ్యంతర పిటిషన్ CPC సెక్షన్ 151 కింద దాఖలు చేయబడింది, 15.11.2025 తేదీ representation ప్రకారం పిటిషన్ పూర్తయ్యే వరకు పిటిషనర్‌కు భద్రత కల్పించాలని న్యాయస్థానాన్ని కోరింది. ⸻ ఆదేశం: కోర్టు ఈ విధంగా పేర్కొంది: 1. పిటిషనర్‌కు సంబంధించి, W.P.No.1294/2025లో కోఆర్డినేట్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, పరకమణి కేసులో పరిశోధన పూర్తయ్యే వరకు సాక్షులు మరియు నిందితులకు రక్షణ ఇవ్వాలని CID డీజీపీ, AP డీజీపీకి 20.11.2025న లేఖ రాశారు. 2. పిటిషనర్ ఈ కేసులో ప్రాస్పెక్టివ్ విట్నెస్ (భవిష్యత్ సాక్షి) అని కోర్టుకు తెలియజేశారు. 3. పై సమర్పణలను పరిగణనలోకి తీసుకుని, హైకోర్టు వైవాహిక పిటిషన్‌ను (W.P.) డిస్పోజ్ చేసింది. 4. ప్రతివాది నెం.3 (SP, తిరుపతి), CID డీజీపీ చేసిన సిఫార్సు ప్రకారం పిటిషనర్‌కు కావలసిన రక్షణ ఇవ్వాలని ఆదేశించింది. 5. ఖర్చులపై ఎలాంటి ఆదేశాలు లేవు. 6. పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లు మూసివేయబడ్డాయి. డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్

విశాఖపట్నం

సెట్విస్ సీఈవోగా ఎం. ర‌మ్య బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌*

*సెట్విస్ సీఈవోగా ఎం. ర‌మ్య బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌* విశాఖ‌ప‌ట్ట‌ణం, న‌వంబ‌ర్ పున్నమి ప్రతినిధి ః విశాఖ‌ప‌ట్ట‌ణం సెట్విస్ నూత‌న సీఈవోగా మెట్ట ర‌మ్య నియ‌మితుల‌య్యారు. 2016 గ్రూప్ -1 బ్యాచ్ కు చెందిన ఈమె ఇప్ప‌టి వ‌ర‌కు విశాఖ‌ప‌ట్ట‌ణంలో అసిస్టెంట్ లేబ‌ర్ క‌మిష‌న‌ర్ గా విధులు నిర్వ‌ర్తించారు. తాజా ఉత్త‌ర్వుల ప్ర‌కారం స్థానిక జ‌డ్పీ జంక్ష‌న్ స‌మీపంలో ఉన్న సెట్విస్ కార్యాల‌యంలో శుక్ర‌వారం ఈమె బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఇన్ఛార్జి సీఈవోగా విభిన్న ప్ర‌తిభావంతుల శాఖ ఏడీ కె. క‌విత అద‌నపు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

విశాఖపట్నం

వృక్ష శాస్త్ర విభాగంలో జాతీయ వర్క్ షాప్*

*వృక్ష శాస్త్ర విభాగంలో జాతీయ వర్క్ షాప్* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- ఆంధ్ర విశ్వవిద్యాలయం వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 16, 17 తేదీలలో జాతీయ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ కు సంబంధించిన పోస్టర్ ను ఏయు *ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ ఈరోజు విడుదల చేశారు.* పర్యావరణ- అటవీ- క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ రెండు రోజుల వర్క్ షాప్ కు సహకారం అందిస్తున్నాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా *వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రిజర్వింగ్ ద ప్లానెట్స్ గ్రీన్ హెరిటేజ్ ద రోల్* *ఆఫ్ ప్లాంట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనే అంశంపై ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు.* పీజీ విద్యార్థులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఆచార్యులు ఈ వర్క్ షాప్ లో పాల్గొనవచ్చు. పోస్టర్ ఆవిష్కరణ *కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం వి ఆర్ రాజు,* *విభాగాధిపతి ఆచార్య డి. సంధ్యా దీపిక, వర్క్ షాప్* *సమన్వయకర్త ఆచార్య ఎస్.బి పడాల్, విభాగ* *ఆచార్యులు ఆచార్య పి.కె రత్నకుమార్, డాక్టర్* *పి.బలరామ స్వామి యాదవ్, డాక్టర్ ఎస్ వి వి* *ఎన్ దొర, డాక్టర్ ప్రకాశరావు* తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పాడేరు పి.యం.ఆర్.సి కార్యాలయం సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియత్రణ సంస్థ

పాడేరు (విశాఖ పున్నమి ప్రతినిధి) ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పి.యం.ఆర్.సి కార్యాలయం సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియత్రణ సంస్థ వారి ఆదేశాల మేరకు హెచ్.ఐ.వి. ప్రభావిత పిల్లల అవసరాల పై వివిధ శాఖల సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించినట్టు జిల్లా లేప్రసి ఎయిడ్స్ మరియు టీబి అధికారి, డా. ఎం. కిరణ్ కుమార్ గారు తెలియజేసారు. జిల్లా లేప్రసి ఎయిడ్స్ మరియు టీబి అధికారి మాట్లాడుతూ హెచ్.ఐ.వి. ప్రభావిత పిల్లలు మరియు వారి కుటుంభ సభ్యులు, స్వచ్చంద సంస్థలు మరియు విధ్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖవారితో సమన్వయ సమావేశము ఏర్పాటు చేయడమైనది. హెచ్.ఐ.వి. ప్రభావిత పిల్లలు అవసారాలు మరియు ఎదుర్కొటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారాలన లక్ష్యంతో హెచ్.ఐ.వి. ప్రభావిత పిల్లలతో ఈ సమావేశము నిర్వహించారు. ప్రభావిత రోగులు తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యలను అడిగి తెలుసుకున్నారు. హెచ్.ఐ.వి. ప్రభావిత పిల్లలు ఏ.ఆర్.టి మందులను సక్రమంగా తీసుకుంటూ, పౌష్టికాహారం తీసుకోవాలని తద్వారా ఆరోగ్యం మేరుగుపరుచుకోవచ్చని అన్నారు. జిల్లా పరిధిలో ఉన్న మండలములలో హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న మరియు హెచ్.ఐ.వి. ప్రభావితమైన 14 నుండి 25 సంవత్సరాల వయస్సు గల పిల్లలతో సమస్యలు మరియు అవసరాలు గుర్తింపు మరియు పరిష్కారానికి అవసరమైన చర్యల గురించి జిల్లా స్థాయి హెచ్.ఐ.వి./ఎయిడ్స్ ఎస్.వి.డి.ఎస్ స్వచ్చంద సేవా సంస్ధ మరియు నెట్ వర్క్ సిబ్బంది కూడా భాగస్వామ్యం చేసి అవగాహన కార్యాక్రమాలు నిర్వహించేల చర్యలు తీసుకోవాలని సూచించడమైనది. ఇతర స్వచ్చంద సేవా సంస్ధలు ముందుకు వచ్చి హెచ్.ఐ.వి./ఎయిడ్స్ కార్యాక్రమాలపై జిల్లా వ్యాప్తంగా విసృతంగా అవగాహన కలిపించాలని కోరారు. ఈ కార్యక్రమమునకు, జిల్లా లేప్రసీ, ఎయిడ్స్ మరియు టి.బి. అధికారి, డా. కిరణ్ కుమార్, విద్యా శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డా. బాలకృష్ణ, ప్రాధమిక విద్యా అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్, ఉన్నత విద్యా నోడల్ ఆఫీసర్ గౌరీ శంకర, జిల్లా డిప్యూటి డెమో పి. సింహాచలం, జిల్లా ఆరోగ్య విస్తరణ అధికారి గుల్లేలి సింహాద్రి, పాడేరు ఐ.సి.డి.ఎస్ సి.డి.పి.ఓ శారద దేవి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్ధ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ కె. రామచందర్, డి.ఎం.డి.ఒ.ఎస్ చిరంజీవి, హెచ్.ఐ.వి./ఎయిడ్స్ ఎస్.వి.డి.ఎస్ స్వచ్చంద సేవా సంస్ధ సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సమావేశం

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే మరియు జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు, ఏర్పాటు కార్యక్రమం లో వార్డులలో జరగవలసిన అభివృద్ధి పనులు గురించి మరియు వార్డులలో పార్టీని ఏ విధముగా అభివృద్ధి చేయాలి మరియు వార్డులలో సమస్యలు గురించి కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులతో చర్చించారు, అలాగే వార్డులో అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు పార్టీ శ్రేణులకు దిశనిర్దేశం చేసారు. ఈ కార్యక్రమం లో దక్షిణ నియోజకవర్గం కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

యువభారతం నవ భారతాన్ని నిర్మించాలి*

*యువభారతం నవ భారతాన్ని నిర్మించాలి* ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం, నవంబర్పున్నమి ప్రతినిధి:-: యువభారతం నవ భారతాన్ని నిర్మించే దిశగా కృషి చేయాలని ఆంధ్ర *విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ అన్నారు.* శనివారం ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సర్ మాట్లాడుతూ రానున్న దశాబ్దాలు భారతీయ యువతవేనని అన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా రాణించడం, దేశ ప్రగతిలో భాగం కావడం ఎంతో ప్రధానమని సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని చెప్పారు. విద్యార్థి వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో యువత చురుకుగా పాల్గొనాలని చెప్పారు. అంతర్జాతీయ విద్యార్థులకు ప్రత్యేకంగా కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తామని వాటిలో అందరూ పాల్గొని, తమ ప్రతిభను చాటాలని సూచించారు. కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగాధిపతి ఆచార్య ఎస్. హరనాథ్, సోషియాలజీ, జర్నలిజం విభాగ ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపకులందరూ కలిసి దాదాపు 75 మొక్కలను నాటారు. *ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రాగాల స్వామి దాసు, ప్రొఫెసర్* *శ్రీమన్నారాయణ మూర్తి, డా. డి. రామారావు, డా. విజయలక్ష్మి, డా. పి.ఆర్.* *ఆర్. ప్రకాశ్, డా. ముట్లూరి అబ్రహాం, డా. జి. పుష్పలత, డా. చదువుల ఆశా కిరణ్* *రాజు, డా. సురేష్ మీనన్* తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ జీవో కాపీలను దగ్ధం చేసిన కార్మికులు

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను అమలులోకి తెస్తూ ఈ నెల 21న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా శనివారం సిఐటియు ఆధ్వర్యంలో అరకులోయ నాలుగు రోడ్లు జంక్షన్లో లేబర్ కోడ్ల జీవో కాపీలను కార్మికులు తగలబెట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ..కార్మిక చట్టాలకు వలస పాలన వాసనలు ఉన్నాయని వాటిని ఆధునికరించి అమలు చేసేందుకే నాలుగు లేబర్ కోడ్లు తెస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదంతా అబద్ధం అని పేర్కొన్నారు. వలస పాలనకు మించి బానిసత్వాన్ని కార్మికవర్గం మీద రుద్దేందుకు, కార్పొరేట్లకు కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసేందుకే కేంద్రం నాలుగు లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చిందని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ లేబర్ కోడ్ లలో అనేక కార్మిక వ్యతిరేక మార్పులను చొప్పించారని అన్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న కార్మిక చట్టాల ప్రకారం ఏదైనా కర్మాగారం లేదా కంపెనీ లే-ఆఫ్ చేయాలన్నా,లేదా లాకౌట్ చేయాలన్న 100 మంది అంతకుమించి కార్మికులు ఉంటే ఆ సంస్థ తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కాని కొత్తగా అమలు లోకి వస్తున్న లేబర్ కోడ్ ల ప్రకారం ఈ షరతు 300 మంది కార్మికులు ఉన్న కంపెనీలకు ఫ్యాక్టరీలకు వర్తించే విధంగా మార్చారు. అంటే 300 లోపు కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలు కంపెనీల యజమానులు తమ ఇష్టానుసారం పరిశ్రమలను లే-ఆఫ్ లేదా లాకౌట్లు చేసుకోవచ్చు అనే విధంగా లేబర్ కోడ్ లు ఉన్నాయన్నారు. ఈ విధంగా మూసివేస్తామని బెదిరిస్తూ కార్మికుల హక్కుల మీద, ఉద్యోగ భద్రత మీద, జీతభత్యాల మీద, వేటు వేసేందుకు యాజమాన్యాలకు ఆయుధం ఇచ్చినట్లు అయింది. అంతే కాకుండా ఈ లేబర్ కోడ్ లు కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్నాయి. కనీస వేతనం, పర్మినెంట్, ఇతర కార్మిక మౌలిక సౌకర్యాలు ఆడకుండా గొంతు నొక్కే పని చేస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న వైసిపి కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ కి అనుకూలంగా ఉంటూ నరేంద్ర మోడీకి, కార్పొరేట్లకు మద్దతు తెలుపుతున్నారు. భవిష్యత్తులో నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై పెద్ద ఎత్తున కేంద్రంపై ప్రతిఘటన చేసేందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఊమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఐటిడిఏ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దాడి రాజు, అప్పలరాజు, జిసిసి సోప్ యూనిట్ వర్కర్స్ యూనియన్ సత్యారావు, గిరిజన సంఘం నాయకులు రామారావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

సీతమ్మధారలో అయ్యప్ప దివ్యోత్సవం తరుణ్ స్వామి దంపతుల ఆధ్వర్యంలో వి.వి.ఆర్ పీఠం అంబల పూజ అపూర్వ రాజసంతో

సీతమ్మధార శనివారం అద్భుతమైన ఆధ్యాత్మిక కాంతులలో తేలియాడింది. ప్రాంతమంతా గంభీర వేదఘోషలు, దీపాల వెలుగులు, భక్తిజన సమూహాల నినాదాలు మార్మోగుతుండగా, వి.వి.ఆర్ అయ్యప్ప పీఠం ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి అంబల పూజ అత్యంత రాజసమైన మహోత్సవ రీతిలో జరిగింది. ఆంధ్ర వాయిస్ ఎడిటర్ కుమారుడు తరుణ్ స్వామి దంపతుల దివ్యనిర్వహణ ఆద్యంతం జరిగిన మొత్తం పూజా కార్యక్రమాన్ని తరుణ్ స్వామి దంపతులే స్వయంగా పర్యవేక్షించి, స్వామివారి ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతీ క్షణాన్ని విశేష భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వారి చేతుల మీదుగా పూజారంభం కావడంతో అంబల ప్రాంతం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం రూపంలో వెలిగిపోయింది. ప్రతి క్షణాన్ని అలరించిన మహామహోత్సవ వాతావరణం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పవిత్ర అభిషేకాలు మహానైరుత్య దీపారాధనతో అంబల ప్రాంతం రాజభవనం తలపించేలా దివ్యకాంతులతో మెరపించడం త్రిపుట హోమాలతో దేవతానుగ్రహం ప్రసరించిన పీఠాధికారులు భక్తులకు ప్రత్యేక తీర్థప్రసాదాల పంపిణీతో సేవాభావాన్ని ప్రతిబింబించిన కార్యక్రమ నిర్వాహకులు అశేష భక్తులు “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో ప్రాంతాన్ని కంపింపజేయగా, పిల్లల నుండి పెద్దల వరకు కుటుంబ సమేతంగా విచ్చేసిన భక్తులు ఈ అంబల పూజను తమ జీవితంలో అరుదైన ఆధ్యాత్మిక మహోత్సవంగా భావించారు. సీతమ్మధారలో తరుణ్ స్వామి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ రాజసమైన అంబల పూజ, అయ్యప్ప భక్తుల హృదయాల్లో చిరస్మరణీయ దివ్యోత్సవంగా నిలిచిపోయింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.