Tuesday, 17 March 2026

Blog

విశాఖపట్నం

మహిళను Instagram మరియు WhatsApp వేదికగా చేసుకొని వేధిస్తున్న ముద్దాయిని పట్టుకున్న విశాఖపట్నం సిటీ పోలీస్

మహిళను Instagram మరియు WhatsApp వేదికగా చేసుకొని వేధిస్తున్న ముద్దాయిని పట్టుకున్న విశాఖపట్నం సిటీ పోలీస్ *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు, సైబర్ క్రైమ్ పోలీసు, విశాఖపట్నం సిటి వారు, Instagram లో పరిచయం పెంచుకొని, పర్సనల్ ఫొటోస్ ని తీసుకొని తరువాత డబ్బులకు ఆశపడి ఫొటోస్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేస్తానని వివిధ రకాల WhatsApp మరియు Instagram వేదికగా వేధిస్తున్న ముద్దాయిపై కేసు నమోదు చేసి, సాంకేతిక సహాయంతో గుర్తించి, రిమాండ్ కి పంపించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు వివరాలోకి వెళితే: నగరానికి చెందిన ఒక మహిళకు instagram ద్వారా పరిచయమైన ముద్దాయి ఆమెను ప్రేమిస్తున్నానని, NEET seat ఇప్పిస్తానని పరిచయం పెంచుకుని సాధారణ ఫోటోలను సేకరించి, NEET seat కావాలంటే 30 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి, దానికి నిరాకరించినందుకు, గతంలో సేకరించిన సాధారణ ఫోటోలను న్యూడ్ గా morph చేసి దొంగతనం చేసినసెల్ ఫోన్లు మరియు SIM Card లను ఉపయోగించి create చేసిన whatsapp అకౌంట్స్ నుండి పిర్యాదికి పంపించి, డబ్బు కోసం బెదిరింపు మెసేజెస్ చేయడంతో అవి చూసి భయానికి లోనైన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించిన పోలీసులు బాధితురాలికి instagram ద్వారా పరిచయం అయిన వ్యక్తి డబ్బు కోసం వేదింపులకు పాల్పడినట్లు, గుర్తించి సదరువ్యక్తి గతంలో కూడా ఇలాంటి నేరానికి పాల్పడి నగరానికి చెందిన ఒక మహిళ వద్ద నుండి 3,50,000 రూపాయలు మోసగించినట్లు దర్యాప్తులో బయటపడటంతో, దర్యాప్తు ప్రక్రియలో ముద్దాయి గుంటూరు జిల్లా, చెందిన Madinapati Nagulmeera నే వ్యక్తి గా గుర్తించారు. అనంతరం, 29-11-2025 న అతడిని అరెస్ట్ చేసి, చట్టపరమైన ప్రక్రియలతో రిమాండ్ కు తరలించడం జరిగింది. హెచ్చరిక: ఎవరికైన అపరిచిత వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో ముఖ్యంగా టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ నందు రిక్వెస్ట్ వచ్చిన యాక్సెప్ట్ చేయకుండా ఉండాలని, అలానే మన సోషల్ మీడియా ఎకౌంటు లను ప్రైవేటు లో పెట్టుకోవాలి అని మరియు అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో సాంగత్యం పనికి రాదని, తెలియని లింక్ పై క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసువారు పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పిర్యాదుల కొరకు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లేదా టోల్ ఫ్రీ నెంబర్: 1930 లేదా శ్రీ కమిషనర్ ఆఫ్ పోలీస్: 7995095799 వారికి కాల్ చేసి ఫిర్యాదు చేయగలరని తెలిపారు.

విశాఖపట్నం

పంట పాడైపోతుంద‌నే దిగులు లేదు… ద‌ళారులు మోస‌గిస్తారే భ‌యం లేదు…*

*పంట పాడైపోతుంద‌నే దిగులు లేదు… ద‌ళారులు మోస‌గిస్తారే భ‌యం లేదు…* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* *అమ్మిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే రైతుల‌ ఖాతాల్లో జ‌మ‌వుతున్న ధాన్యం డ‌బ్బులు *ప్ర‌త్యేక‌ కొనుగోలు కేంద్రాల ద్వారా 10 వేల టన్నులు సేక‌రించేందుకు చ‌ర్య‌లు *ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న జిల్లాలోని గ్రామీణ మండ‌లాల‌ రైతులు *సాధార‌ణ ర‌కం క్వింటాకు రూ.2,369, స‌న్న ర‌కం ధాన్యానికి రూ.2,389 చెల్లింపులు విశాఖ‌ప‌ట్ట‌ణం, డిసెంబ‌ర్ 02 ః ఇప్ప‌టికే రైతుల ప‌క్ష‌పాతిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టింది. వారికి ద‌గ్గ‌ర్లోనే కొనుగోలు కేంద్రాలు పెట్టి.. సిబ్బందిని అక్కడే అందుబాటులో ఉంచి ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తోంది. పండిన పంట‌ను వెనువెంట‌నే అమ్మ‌కునేలా క్షేత్ర‌స్థాయిలో అధికార యంత్రాంగాన్ని స‌న్న‌ద్ధం చేయ‌టంతో పాటు గంట‌ల వ్య‌వ‌ధిలోనే రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేస్తూ అన్న‌దాత‌ల‌ మ‌న్న‌న‌లు పొందుతోంది. ప్ర‌భుత్వం తీసుకున్న సానుకూల నిర్ణ‌యాల వ‌ల్ల‌ స్థానిక రైతు సేవా కేంద్రం ప‌రిధిలోనే సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. తేమ శాతం చూడ‌టంతో పాటు, ధాన్యం అమ్ముకునేందుకు వీలుగా షెడ్యూల్ కూడా ఇస్తున్నారు. జీపీఎస్ అనుసంధాన‌మైన వాహ‌న ఏర్పాటు చేయ‌టంలో, ఎఫ్.టి.వో.లు జ‌న‌రేట్ చేయ‌టంలో కాల‌యాప‌న చేయ‌కుండా క్షేత్ర‌స్థాయి సిబ్బంది స‌హ‌కారం అందిస్తున్నారు. ధాన్యం అమ్మిన కొన్ని గంట‌ల స‌మ‌యంలోనే డ‌బ్బులు జ‌మ అవుతుండ‌టంతో రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. *ప్ర‌త్యేక కేంద్రాల ద్వారా ప‌దివేల ట‌న్నుల ధాన్యం కొనుగోలు* జిల్లాలోని గ్రామీణ మండ‌లాల ప‌రిధిలో ప‌ది వేల ట‌న్నుల ధాన్యం సేక‌రించేలా ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టింది. దీనికి గాను అధికారులు ప‌ద్మ‌నాభం మండ‌ల ప‌రిధిలో 5, భీమిలి మండ‌లంలో 2, ఆనంద‌పురం మండ‌లంలో 1, పెందుర్తి మండ‌ల ప‌రిధిలో 2 కేంద్రాలు.. మొత్తం 10 ఏర్పాటు చేశారు. గ‌తేడాది ఐదు వేల ట‌న్నులు ల‌క్ష్యం కాగా.. 5,600 ట‌న్నులు ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ఏడాది ప‌దివేల ట‌న్నులు సేక‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. జిల్లాలోని బ్యాంక్ గ్యారెంటీలు స‌మ‌ర్పించిన ఆరు మిల్లుల‌ను గుర్తించి లావాదేవీలు కొన‌సాగిస్తున్నారు. గ‌తేడాది సాంబా మ‌సూరి ధాన్యం కొనుగోలు చేయ‌లేదు. ఈ ఏడాది స్వర్ణ‌, 1121 వంటి స‌న్న‌ర‌కంతో పాటు సాంబా మసూరి కూడా తీసుకోవ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం సాధార‌ణ ర‌కం ధాన్యానికి రూ.2,369, సన్న ర‌కాల‌కు రూ.2,389 చెల్లింపులు చేస్తోంది. గ‌తేడాదితో పోల్చితే ఈ సారి రూ.69 క్వింటాకు అద‌నంగా చెల్లిస్తోంది. జిల్లాలో సుమారు 11,700 ఎక‌రాల్లో ధాన్యం పండిస్తుండ‌గా.. 27వేల ట‌న్నుల దిగుబ‌డి వ‌స్తోంద‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారులు తెలిపారు. *రైతు సేవా కేంద్రాల‌ను సంప్ర‌దిస్తే చాలు.. సేవ‌ల‌న్నీ అందుతాయి* ధాన్యం పండిన రైతులు స్థానికంగా ఉన్న రైతు సేవా కేంద్రాల‌ను సంప్ర‌దిస్తే చాలు అన్ని ర‌కాల సేవ‌లు ల‌భ్య‌మ‌వుతాయి. ముందుగా పండిన ధాన్యాన్ని టెక్నిక‌ల్ అసిస్టెంట్ ప‌రిశీలిస్తారు. తేమ‌శాతం ఇత‌ర వివ‌రాల‌ను అంద‌జేస్తారు. త‌ర్వాత రైతు సేవా కేంద్రంలో సంబంధిత అగ్రిక‌ల్చ‌ర్ అసిస్టెంటు వివ‌రాల‌ను న‌మోదు చేసి సంబంధిత రైతుకు షెడ్యూల్ ఇస్తారు. జిల్లాలో నిర్ణయించిన ఆరు మిల్లుల్లో ఏదొక మిల్లులో ధాన్యం అమ్ముకునేలా స‌మ‌చారం అందిస్తారు. జీపీఎస్ అనుసంధాన‌మైన వాహ‌నం ద్వారా ధాన్యాన్ని మిల్లుకు త‌ర‌లిస్తారు. ఒక‌వేళ రైతులే జీపీఎస్ అనుసంధాన‌మైన వాహ‌నం తెచ్చుకున్న‌ట్లయితే సంబంధిత న‌గ‌దును ప్ర‌భుత్వం చెల్లించేస్తుంది. ఈ విధంగా సోమ‌వారం (డిసెంబ‌ర్ ఒక‌టో తేదీ)నాటికి పెందుర్తి మిన‌హా మిగిలిన మూడు మండ‌లాల ప‌రిధిలో 167 మంది రైతుల నుంచి 821.52 మెట్రిక్ ట‌న్నుల‌ ధాన్యం కొనుగోలు చేసింది. 24-48 గంట‌ల వ్య‌వ‌ధిలోనే రూ.1.95 కోట్ల చెల్లింపులు జ‌ర‌గ‌టం విశేషం. 1. *ద‌ళారుల బెడ‌ద త‌గ్గింది… ధ‌ర గిట్టుబాటు అయ్యింది..* ః బోణి గోవింద‌, బోణి గ్రామం, ఆనంద‌పురం మండ‌లం ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ‌టం వ‌ల్ల ద‌ళారుల బెడ‌ద త‌గ్గింది. వాళ్ల‌యితే త‌క్కువ ధ‌ర‌కు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేవారు. నేను 1121 స‌న్న‌ర‌కం బియ్యం అమ్మాను. క్వింటాకు రూ.2,389 చెల్లించారు. అదే ద‌ళారులైతే రూ.1800 గానీ రూ.1900 గానీ ఇచ్చేవారు. వారికైతే త‌రుగు కింద‌ క్వింటాకు ఐదు కేజీల ధాన్యం ఎక్కువ‌గా ఇవ్వాల్సి వ‌చ్చేది. నేను 174 బ‌స్తాల ధాన్యం విక్ర‌యించాను. నాకు 24 గంట‌ల్లో డ‌బ్బులు వ‌చ్చేశాయి. నాతో పాటు అమ్మిన వారికి కూడా న‌గ‌దు జ‌మ అయ్యింది. 2. *అధికారులు, సిబ్బంది బాగా స్పందిస్తున్నారు…* ః మ‌ద్దిల ప్రకాశ్, బోణి గ్రామం, ఆనంద‌పురం మండ‌లం మా ప్రాంతంలో బోణి గ్రామంలోనే ముందుగా కోత‌లు మొద‌ల‌య్యాయి. ఇక్క‌డ అధికారులు, సిబ్బంది స్పంద‌న బాగుంది. మేము ఏం అడిగినా ఓపిగ్గా చెబుతున్నారు. వాళ్లే కంప్యూట‌ర్లో వివ‌రాలు న‌మోదు చేస్తున్నారు. ఎప్పుడు ధాన్యం తేవాలో చెబుతున్నారు. దాని ప్ర‌కారం నేను ఒక సారి ఐదు ట‌న్నులన్న‌ర‌, ఇంకొక సారి ఐదు ట‌న్నులు క‌లిపి మొత్తం 180 బ‌స్తాల‌ ధాన్యం అమ్మాను. ఒక రోజు దాట‌గానే డ‌బ్బులు అకౌంట్లో ప‌డ్డాయి. 3. *అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియజేసుకుంటున్నాను* ః బోణి అప్ప‌ల‌రాజు, బోణి గ్రామం, ఆనంద‌పురం మండ‌లం ముందుగా అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఎక్క‌డా ఇబ్బంది లేకుండా అన్ని ర‌కాలుగా సాయ‌మందించారు. నేను 1121 స‌న్న ర‌కం ధాన్యం పండించాను. 11 ట‌న్నులు అమ్మాను. డ‌బ్బులు రెండో రోజు ప‌డ్డాయి. మా ఊరులోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయ‌టంతో కోత అయిన వెంట‌నే ధాన్యం అమ్ముకోగ‌లిగాను. ద‌ళారులైతే ఏవేవో చెప్పి బోలెడు కోత‌లు వేసేస్తారు. కానీ ఇక్క‌డ అలాంటిదేమీ లేదు. అంతా బాగానే జ‌రిగింది. 4. *చాలా సంతోషంగా ఉంది…* ః ఉప్ప‌లాల ఉద‌య భాను, బోణి గ్రామం, ఆనంద‌పురం మండ‌లం వ‌ర్షాలు ప‌డిపోతాయ‌ని అంద‌రం ఆందోళ‌న చెందాం. మా ఊరులో కాస్త ముందుగానే కోత‌లు అయిపోవ‌టంతో ఊపిరి పీల్చుకున్నాం. అక్క‌డ‌క్క‌డ శివారు పొలాల వారు ఇంకా కోస్తున్నారు. చాలా మంది ధాన్యం వెంట‌వెంట‌నే కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించేస్తున్నారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందీ ప‌డ‌కుండా ధాన్యం అమ్ముకోగ‌లిగాం. 190 బ‌స్తాల ధాన్యాన్ని అమ్మాను. *రైతుల‌కు ఇబ్బంది రాకుండా ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాం* *ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జిల్లా క‌లెక్ట‌ర్, విశాఖ‌ప‌ట్ట‌ణం* ధాన్యం పండించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాం. సాగు వివ‌రాల ఆధారంగా గ్రామీణ మండ‌లాల ప‌రిధిలో 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. జీపీఎస్ కు అనుసంధాన‌మైన వాహ‌నాల ద్వారా ధాన్యం మిల్లుల‌కు త‌ర‌లించ‌టం ద్వారా అవ‌క‌త‌వ‌క‌ల‌కు వీలులేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. జిల్లాలో ఆరు మిల్లుల‌ను గుర్తించాం. రైతులు వారికి ఇష్ట‌మైన మిల్లుకు ధాన్యం విక్ర‌యించుకొనేలా వెసులుబాటు క‌ల్పించాం. వ‌ర్షాలు కార‌ణంగా న‌ష్టం వాటిల్ల‌కూడ‌ద‌నే ముందు చూపుతో కాస్త ముందుగానే కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించాం. ప్ర‌క్రియ అంతా స‌జావుగానే జ‌రిగిపోతోంది. ఎక్క‌డా ఎలాంటి స‌మ‌స్య‌లు లేవు. *రైతులు ప్ర‌భుత్వ‌ కొనుగోలు కేంద్రాల‌ను ఆశ్ర‌యించాలి* రైతుల సౌక‌ర్యార్థం వారికి ద‌గ్గ‌ర‌లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేశాం. అంద‌రూ వాటిని స‌ద్వినియోగం చేసుకోవాలి. రైతులు ద‌ళారుల‌ను ఆశ్ర‌యించ‌కుండా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. మ‌ధ్య‌వ‌ర్తుల‌ను ఆశ్రయిస్తే క‌మీష‌న్ల రూపంలో దోచుకుంటారు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి గంట‌ల వ్య‌వ‌ధిలోనే డ‌బ్బు అందిస్తున్నాం. సివిల్ స‌ప్లైస్ కార్పొరేష‌న్ అధికారుల స‌హాయంతో ప్ర‌క్రియ‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నాం. ఏమైనా స‌మ‌స్య‌లున్న‌ట్ల‌యితే స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా త‌మ దృష్టికి తీసుకొస్తే వెనువెంట‌నే ప‌రిష్క‌రిస్తాం.

విశాఖపట్నం

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు* రోడ్ సేఫ్టీ మీటింగులో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

*రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు* రోడ్ సేఫ్టీ మీటింగులో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, హైవేలో జీబ్రా క్రాసింగ్ వద్ద సోలార్ బ్యాంకర్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ సమావేశ మందిరంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలసి రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల వివరాలను, వారికి ప్రభుత్వం తరపున అందజేసిన వివరాలు గూర్చి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా గుర్తు తెలియని వాహనాల ద్వారా ప్రమాదానికి గురైన బాధితులకు అందుతున్న పరిహారం గురించి సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యల గూర్చి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మేజర్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, పాఠశాల, కళాశాలల పరిసర ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు చేయవలసిందిగా జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. రోడ్ల పై జీబ్రా మార్కింగ్, రోడ్డుకు ఇరువైపులా మార్కింగ్ లు ఏర్పాటు చేయాలన్నారు. పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అవసరమైన చోట బస్ షెల్టర్ల ఏర్పాటుతో పాటు భారీ వాహనాలు నిలిపేందుకు ట్రక్-బేలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫుట్ పాత్ లు ఆక్రమణలకు గురి కాకుండా ప్రజలు వినియోగించుకునేలా పోలీస్, జీవీఎంసీ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన కూడళ్లతో పాటు అవసరమైన చోట సిసి కెమోరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు మధ్యలో ఉన్న చెట్ల వల్ల రోడ్లపై వాహనదారులకు లైటింగ్ ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పోలీస్ కమిషనర్ పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి ఆర్.సి.హెచ్. శ్రీనివాస్ గత సమావేశంలో చర్చించిన అంశాలను చేపట్టిన పురోగతిని సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో పోలీసు, వైద్యారోగ్య శాఖ అధికారులు, జీవీఎంసీ అధికారులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఫిషింగ్ హార్బర్ పై లెవెల్ కమిటీ సమావేశం

ఫిషింగ్ హార్బర్ పై లెవెల్ కమిటీ సమావేశం *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ పైలెవెల్ నిర్మాణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్బం ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనుల ప్రగతి, హార్బర్ పరిసరాల, పరిసరాలపై శ్రీ గంగాధర్ ప్రసాద్, IAS, కలెక్టర్ మియున్స్ కమిటీ చైర్మన్ గా సమీక్షించారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ను అంతర్జాతీయ స్థాయిలో అత్యంత మోడ్రన్, మెరుగైన ఎనిమిదికి చెందిన స్టాండర్డ్ ఫిషింగ్ హార్బర్ గా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని తెలిపారు. హార్బర్ ప్రాంతంలోని చేపల వ్యాపారులు, కార్మికులు, మత్స్యకారులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై ప్రతి వర్కర్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా చట్టపరంగా ఉన్న హక్కులను మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హార్బర్ 2వ గేట్ లోని పార్కింగ్ స్థలం, చేపల వేలం స్థలం పర్యవేక్షణ, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాల్లో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, హార్బర్ వద్దకు వచ్చే చేపల వ్యాపారులు, మత్స్యకారుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలన్నారు. చేపల దిగుబడి, నిల్వ, రవాణా తదితర అన్ని రంగాల్లోనూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. ఈ సమావేశంలో హార్బర్ ను అభివృద్ధి పరచడంలో పాల్గొన్న అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డీ.వి. శ్రీనివాస్, ప్రాజెక్టు అధికారి, హార్బర్ అభివృద్ధి సంస్థ; ఎం. రమేష్, డి.వి. వర్క్స్ మేనేజర్, హార్బర్; మత్స్యశాఖ ఉపనిర್ದೇಶకులు ఎం. సురేష్; హార్బర్ డిప్యూటీ డైరెక్టర్ బి. రమణయ్య, తదితర అధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

వినూత్న బోధ‌న‌ ద్వారా విద్యార్థుల‌ను ఉత్త‌మంగా తీర్చిదిద్దాలి*

*వినూత్న బోధ‌న‌ ద్వారా విద్యార్థుల‌ను ఉత్త‌మంగా తీర్చిదిద్దాలి* *ఎండాడ జెడ్పీ, ఎంపీపీ పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించిన జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ *విశాఖ‌ప‌ట్ట‌ణం పున్నమి ప్రతినిధి:- * వినూత్న బోధ‌నా ప‌ద్ధతుల‌ను అవ‌లంబించ‌టం ద్వారా ఉత్త‌మ విద్యార్థుల‌ను తీర్చిదిద్దాల‌ని ఉపాధ్యాయుల‌ను ఉద్దేశించి జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ అన్నారు. క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగ‌ళ‌వారం ఉద‌యం ఎండాడ‌లోని జిల్లా ప‌రిష‌త్, మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల‌ను ఆయ‌న త‌నిఖీ చేశారు. అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. అక్క‌డి విద్యార్థుల‌తో మ‌మేక‌మ‌య్యారు. ప‌లు అంశాల‌పై ముచ్చ‌టిస్తూ కుశ‌ల ప్ర‌శ్న‌లు వేశారు. వివిధ పాఠ్యాంశాల్లోని అంశాలపై ప్ర‌శ్న‌లు అడిగారు. పుస్త‌కాల‌ను, అందులోని చిత్రాల‌ను చూపించి వాటి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో ఉపాధ్యాయుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. వినూత్న రీతిలో ఆస‌క్తిరేకించే విధంగా పాఠ్యాంశాల‌ను బోధించాల‌ని, తార్కిక భావ‌జాలం విద్యార్థుల్లో పెంపొందేలా బోధ‌న సాగించాల‌ని సూచించారు. పిల్ల‌లు అడిగే అన్ని ప్ర‌శ్న‌ల‌కు స్నేహ‌కూర్వ‌క వాతావ‌ర‌ణంలో స‌మాధానం ఇవ్వాల‌ని, అప్పుడే వారిలో బిడియం పోతుంద‌ని పేర్కొన్నారు. అనంత‌రం పాఠ‌శాల‌లోని ఇత‌ర వ‌స‌తుల‌ను, మ‌ధ్యాహ్న భోజ‌నం ప‌థ‌కం అమ‌లు తీరును ప‌రిశీలించారు. వివిధ రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. అక్క‌డున్న స‌మ‌స్య‌ల‌ను, ఇతర అంశాల‌ను ఉపాధ్యాయులను అడిగి క‌లెక్ట‌ర్ తెలుసుకున్నారు. ఆయ‌న‌తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్, బోధ‌న‌, బోధ‌నేతర సిబ్బంది ఉన్నారు.

విశాఖపట్నం

మెడికల్ కాలేజీలు పూర్తిచేసి, ప్రభుత్వమే నిర్వహించాలి*

*మెడికల్ కాలేజీలు పూర్తిచేసి, ప్రభుత్వమే నిర్వహించాలి* *38వార్డు లో కోటి సంతకాల కార్యక్రమంలో వాసుపల్లి డిమాండ్* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఒక చరిత్రగా విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అభివర్ణించారు. వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. 38వ వార్డ్ ప్రెసిడెంట్ గురజాపు రవి, వార్డ్ యూత్ ప్రెసిడెంట్ చేపల నూకరాజు (బుడ్డి ) ఆధ్వర్యంలో కుర్పమార్కెట్ దగ్గర కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి హయాంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వల్ల వాటికి అనుబంధంగా ఉండే బోధన ఆసుపత్రులలో పేదలకు పూర్తిస్థాయిలో ఉచిత వైద్యం అందదని చెప్పారు. ఇంకా రోగనిర్ధరణ అలాగే ఇన్ పేషెంట్ మెడిసిన్స్ కి చార్జ్ చేస్తారని ఆరోపించారు. ఇదిలా ఉండగా మరో వైపు రాష్ట్రం పెద్ద సంఖ్యలో మెడికల్ సీట్లు కోల్పోతుందని తెలిపారు. గత ఏడాది 750 ఎంబిబిఎస్ సీట్లు సమకూర్చాల్సి ఉన్న చంద్రబాబు ప్రభుత్వ కక్ష పూర్తి విధానాలతో 700 సీట్లు కోల్పోయామని పేర్కొన్నారు. 2025 – 26 లో 1750 సీట్లు, అలా మొత్తం 2450 మెడికల్ సీట్లు మన పిల్లలు కోల్పోతున్నారని తెలియజేశారు. 1947 నుంచి 2022 వరకు రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజ్ మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పి పిపి పేరిట డ్రామాలు ఆడుతోందని ప్రజలకు అర్థమైందని వివరించారు. వైయస్ జగన్ ప్రభుత్వం హయాంలోనూ 7 మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తికాగా అయిదు కాలేజీలో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి అని చెప్పారు. మరో 10 కాలేజీల నిర్మాణ పనులు వివిధ దశలలో ఉన్నట్లు వెల్లడించారు. వైయస్సార్సీపి ప్రభుత్వం దిగిపోయేసరికి వాటిలో దాదాపు రూ. 3 వేల కోట్ల విలువైన పనులు జరిగినట్లు పేర్కొన్నారు. కొత్త మెడికల్ కాలేజీల కోసం ఏటా రూ. 1000 కోట్ల చొప్పున అయిదు ఏళ్ళు వ్యయం చేస్తే చాలని, కానీ ప్రభుత్వం ఆ దిశలో ఆలోచన చేయకుండా, పి పి పి పేరుతో ప్రైవేటీకరణ పై ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు కూడా పూర్తిచేసి అన్నిటిని ప్రభుత్వం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, స్టేట్ బూత్ కమిటీ సెక్రటరీ సన్యాసిరావు, సారిపిల్లి అరుణ, ఆకుల శ్యామ్,చేపల రాజు, చోడిపిళ్లి శివ,పిల్ల అప్పారావు,38వ వార్డు వైసిపి సీనియర్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అంతర్జాతీయ అతిథులు విచ్చేయున్నందున విశాఖ మ్యూజియంను ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి.

విశాఖ వేదికగా ఫిబ్రవరిలో ఐ ఎఫ్ ఆర్ కార్యక్రమం. *అంతర్జాతీయ అతిథులు విచ్చేయున్నందున విశాఖ మ్యూజియంను ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* విశాఖ నగరంలో విశాఖ వేదికగా ఘనంగా 2026 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ( ఐ ఎఫ్ ఆర్ ) కార్యక్రమం జరుగనున్నందున అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల అతిథులు, ప్రతినిధులు విశాఖలో విహరించనున్నారని ,విశాఖ మ్యూజియం ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ కు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. మంగళవారం ఆయన జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో విశాఖ మ్యూజియం అంతటా కలియతిరిగి పరిశీలించారు. ఈ పరిశీలనలో కమిషనర్ మాట్లాడుతూ ఫిబ్రవరిలో విశాఖ నగరంలో జరుగునున్న అంతర్జాతీయ వేదికగా ఐ ఎఫ్ ఆర్ కార్యక్రమం జరుగనున్నదని , ఈ విషయమై ఎపెక్స్ కమిటీ కోఆర్డినేషన్ మీటింగ్ లో నేవల్ అధికారులు పలు విషయాలను, అతిథులు సందర్శించవలసిన ప్రాంతాలను ప్రస్తావించారన్నారు. ఈ కార్యక్రమానికి దేశ ,విదేశాల నుండి అధిక సంఖ్యలో నేవల్ అధికారులు, ప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ముఖ్య అతిథులు విశాఖ నగరంలో పలు ప్రాంతాలను సందర్శిస్తారన్నారు. అందుకు జీవీఎంసీ నిర్వహిస్తున్న విశాఖ మ్యూజియంను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, మ్యూజియంలో ఉన్న ప్రదర్శనలను అన్ని వివరాలతో క్రమ పద్ధతిలో ప్రదర్శనకు ఏర్పాటు చేయాలన్నారు. మ్యూజియంలో ప్రదర్శించిన అన్ని వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పరిశుభ్రత పనులు చేపట్టాలని,అవసరమగు మరమ్మత్తులు, ల్యాండ్ స్కాపింగ్, గార్డెన్ అభివృద్ధి పనులు, పెయింటింగులు, లైటింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, అలాగే డ్రింకింగ్ వాటర్ తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి విశాఖ మ్యూజియంలో గల మేరీ టైం, హెరిటేజ్ మ్యూజియం లను అతిథులు, ప్రతినిధులను ఆకర్షించేలా అందంగా తీర్చిదిద్దాలని , త్వరితగతిన అవసరమగు పనులను పూర్తి చేయాలని ప్రధాన ఇంజనీరు పి వి వి సత్యనారాయణ రాజుకు కమిషనర్ ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీరు గంగాధర్, సహాయక ఇంజనీరు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం జయప్రదం చేయండి

జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం జయప్రదం చేయండి *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* – కాలుష్యం నివారణకు కృషి చేయండి – ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు – మన సముద్రాలను మనమే కాపాడుకుందాం – జెవి రత్నం వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. మంగళవారం విశాఖపట్నం లోని పెద్ద జాలారి పేటలో ఎ ఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు బీచ్ క్లీనప్ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ కాసు నేతృత్వంలో, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లు సుశీల, స్వాతి ల పర్యవేక్షణలో నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో రత్నం మాట్లాడుతూ కాలుష్యం నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు ని పిలుపునిచ్చారు. మన సముద్రాలను మనమే కాపాడుకుందాం అని, సముద్రాలు చెత్త కుండీలు కావని వివరించారు. ఇంటి వద్ద కూరగాయల పంటలు పండించడం ఎలా అనేది వివరించారు. ఈ కార్యక్రమంలో మిద్దె తోట రైతు అన్నపూర్ణ అవగాహన కల్పించారు, ఏక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ అనకాపల్లి హెచ్ ఆర్ డి ఐ.కృష్ణ కుమారి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎపి పిసిబి, కోరమాండల్ ఫెర్టలైజర్స్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ లు అందజేసిన గుడ్డ సంచులు విద్యార్థులకు పంపిణీ చేశారు, ఇంటింటికీ వంగ, టమాటా, పచ్చిమిర్చి, పచ్చి మిర్చి మొక్కలు పంపిణీ చేశారు. ఒక్క సారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు అనె నినాదాలతో ఊరేగింపు నిర్వహించారు

విశాఖపట్నం

అన్నవరం రైతుల సమస్యకు పరిష్కారం* *ఇంటికో ఉద్యోగం, 6 సెంట్ల నివేశన స్థలం: గంటా*

*అన్నవరం రైతుల సమస్యకు పరిష్కారం* *ఇంటికో ఉద్యోగం, 6 సెంట్ల నివేశన స్థలం: గంటా* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* భీమిలి మండలంలోని అన్నవరం భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో మే ఫెయిర్, ఒబెరాయ్ వంటి ప్రముఖ హోటల్స్.. రిసార్ట్స్.. కు ప్రభుత్వం భూములు కేటాయించిన విషయం విదితమే. 28 మంది రైతులు ఒకొక్కరు 50 సెంట్లు చొప్పున దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సాగు చేసుకుంటున్నారు. ఆతిథ్య రంగానికి ప్రభుత్వం భూములిచ్చిన సమయంలో రైతులు ఆందోళన చేశారు. అయితే భూ సాగుకు సంబంధించి ఎలాంటి అధికారిక రికార్డులు లేకపోవడంతో రైతులకు పరిహారం చెల్లింపు సాధ్యపడదని అధికారులు అప్పట్లో తేల్చి చెప్పారు. దీంతో తమకు న్యాయం చేయాలని రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రైతులు ఎమ్మెల్యే గంటా ను మంగళవారం ఎం.వి.పి. కాలనీ లోని ఆయన నివాసంలో కలిశారు. రైతులు.. భీమిలి ఎమ్మార్వో పి.రామారావు, జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, చిక్కాల విజయ్ బాబు లతో చర్చించిన తర్వాత ఒక్కో రైతుకు స్థానికంగా 6 సెంట్ల స్థలాన్ని, కుటుంబానికి ఒకరికి ఉద్యోగ అవకాశం ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు రైతులు సానుకూలంగా స్పందిస్తూ.. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న గంటా కు కృతజ్ఞతలు తెలిపారు. కోర్టులో దాఖలు చేసిన కేసు విత్ డ్రా సహకరించడానికి రైతులు సుముఖత వ్యక్తం చేశారు.

విశాఖపట్నం

సాగ‌ర్ న‌గ‌ర్-1 సచివాల‌య సిబ్బందికి జిల్లా క‌లెక్ట‌ర్ ఘాటు హెచ్చ‌రిక‌

*వారం రోజుల్లో పురోగ‌తి క‌నిపించ‌కపోతే సస్పెండ్ చేస్తా…* *సాగ‌ర్ న‌గ‌ర్-1 సచివాల‌య సిబ్బందికి జిల్లా క‌లెక్ట‌ర్ ఘాటు హెచ్చ‌రిక‌ *విశాఖ‌ప‌ట్ట‌ణం పున్నమి ప్రతినిధి * నిర్దేశించిన ల‌క్ష్యాల మేర‌కు వారం రోజుల్లో పురోగ‌తి క‌నిపించ‌క‌పోతే స‌స్పెండ్ చేయ‌క త‌ప్ప‌ద‌ని స‌చివాల‌య ఉద్యోగుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ హెచ్చ‌రించారు. క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సాగ‌ర్ న‌గ‌ర్-1, 2 వార్డు స‌చివాల‌యాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. ప‌లు రికార్డుల‌ను ప‌రిశీలించారు. స‌చివాల‌యం-1లో ప్రభుత్వ ల‌క్ష్యాల మేర‌కు త‌గిన విధంగా పురోగ‌తి లేక‌పోవ‌డాన్ని గ‌మ‌నించిన ఆయ‌న అసంతృప్తి చెందారు. సిటిజ‌న్ స‌ర్వే, ఈ-కేవైసీ చేయ‌టంలో బాగా వెనుక‌బ‌డి ఉన్నార‌ని, ఇంత నిర్ల‌క్ష్యంగా ఉంటే ఎలా అని నిల‌దీశారు. ఇంకా 400 మంది తాలూక‌ ఈ-కేవైసీ పెండింగ్ ఉండ‌టంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆయ‌న వారం రోజుల స‌మయం ఇచ్చారు. ఈ వారం రోజుల్లో పురోగ‌తి క‌నిపించ‌క‌పోతే అత్యంత క‌ఠిన‌ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. రికార్డుల నిర్వ‌హ‌ణ‌, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌పై అప్డేట్ గా ఉండాల‌ని, ఎప్ప‌టి ప‌నే అప్పుడే పూర్తి చేసుకోవాల‌ని సూచించారు. ఆయ‌నతో పాటు స‌చివాల‌యాల జిల్లా కో-ఆర్డినేట‌ర్ ఉషారాణి ఉన్నారు. @అనంత‌రం అదే కాంపౌండ్ లో ఉన్న యూపీహెచ్సీని సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ అక్క‌డి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. అందుతున్న వైద్య సేవ‌ల‌పై రోగుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు సామాన్య ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. రోజువారీ ఓపీ, సిబ్బంది హాజ‌రు, ఇత‌ర వివ‌రాల‌పై అక్క‌డ అధికారులను ఆరా తీశారు. ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన రీతిలో మెరుగైన సేవ‌లందించాల‌ని ఈ సంద‌ర్భంగా సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.