Saturday, 14 March 2026

Blog

విశాఖపట్నం

ధ్యానంతో మానసిక. శారీరిక ప్రశాంతత* *ఘనంగా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం*

*ధ్యానంతో మానసిక. శారీరిక ప్రశాంతత* *ఘనంగా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం* *బ్రహ్మకుమారి ల 2026* *నూతన క్యాలెండర్ ఆవిష్కరణ* *విశాఖపట్నం డిసెంబర్ 20పున్నమి ప్రతినిధి* ధ్యానం జ్ఞాన శక్తిని పెంపొందించడమే కాకుండా మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుందని ఆంధ్ర యూనివర్సిటీ యోగ డైరెక్టర్ భాను కుమార్ అన్నారు.. శనివారం డాబా గార్డెన్స్ వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో ప్రజా పిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భానుకుమార్ మాట్లాడుతూ ధ్యానం తో ఆత్మ పరిశీలన అంతర్గత ప్రశాంతత . చేకూరుస్తుంది అన్నారు.. శారీరక ఆరోగ్య విషయంలో రక్త పోటు నియంత్రించడంతోపాటు నాణ్యతతో కూడిన నిద్ర కు చక్కగా ఉపయోగపడుతుందన్నారు.. హార్మోన్ల క్రియాశీలత అరికట్టి భావోద్వేగాల తరంగాలు మార్పు చేసి ప్రశాంతత. విశ్రాంతిని చేకూరుస్తుంది అన్నారు.. ప్రముఖ సైకాలజిస్ట్.. యోగ శిక్షకులు బికే వెంకటరావు మాట్లాడుతూ ధ్యానం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ధ్యానాన్ని చేర్చుకోవాలన్నారు.. ప్రజా ప్రతి బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయం ప్రతినిధి రామేశ్వరీ మాట్లాడుతూ రాజయోగతో ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతంగా ఉండవచ్చునున్నారు.. ధ్యానం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యమైన జీవనాన్ని గడిపేందుకు అవకాశం ఉందన్నారు.. సర్వ మానవాళి మానసిక శారీరక ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని అలవర్చుకోవాలన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి. డాక్ యార్డ్ సంఘం గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు యోగ శిక్షకులు సన్యాసిరావు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్. బ్రహ్మకుమారిల ప్రతినిధులు సోమేశ్వరి అపరంజి తదితరులంతా పాల్గొని బ్రహ్మకుమారిస్ రూపొందించిన 2026 నూతన వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించారు..

విశాఖపట్నం

డిసెంబరు 23న 4వ జోన్ లో బహిరంగ వేలం నిర్వహణ.

డిసెంబరు 23న 4వ జోన్ లో బహిరంగ వేలం నిర్వహణ. – 4వ జోనల్ కమిషనర్ ఎమ్ .మల్లయ్య నాయుడు. *విశాఖపట్నం డిసెంబర్ 20పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 4వ జోన్ లో పలు వాణిజ్య సముదాయాల దుకాణాలకు, ఒక కళ్యాణ మండపం, ఒక మార్కెట్, జీవీఎంసీ మెయిన్ ఆఫీ కాంటీన్ నకు లీజు గజిటు నోటిఫికేషన్ నెంబర్ 07/2024 నందలి నిబంధనలు ప్రకారం అత్యవసర షార్ట్ నోటీసు 07.03.2025 ద్వారా ఇచ్చిన షరతులకు లోబడి అప్పగించిన తేదీ నుండి మూడు సంవత్సరాల పరిమితికి గుత్తకిచ్చుటకుగాను డిసెంబరు 23న తేది ఉ.గం.11.00 లకు జోన్-4 సూర్య బాగ్ కార్యాలయం నందు బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగునని 4వ జోన్ జోనల్ కమిషనర్ ఎమ్.మల్లయ్య నాయుడు శనివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. అలాగే జివిఎంసి 4వ జోన్ (సూర్యబాగ్) పరిధిలో గల డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయము(గ్రౌండ్ ఫ్లోర్) షాప్ లు 8,9,10,11(SC), 12, 13(PH) & 15(SC), (వార్డు నెం.35, నియర్ స్పింగ్ రోడ్), డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయము(మొదటి అంతస్తు) షాప్ లు 2(SC), 3,4,5,6,7,8,9,10,11(SC), 12,13(PH),14(ST),15(SC) (వార్డు నెం.35, నియర్ స్పింగ్ రోడ్), జగదాంబ వాణిజ్య సముదాయము షాప్ లు 3,5(PH),11,12,14&13(ST) (వార్డు నెం.31), పాత బస్ స్టాండ్ ఫేస్-II దుకాణాములు 1,2,3(PH),4,5,6, 7(SC), 8, 9(ST), 10,11, 12(SC),13,14 (వార్డు నెం.35), పాత బస్ స్టాండ్ ఫేస్-I దుకాణాము 5(SC) (వార్డు నెం.35), పద్మనగర్ వాణిజ్య సముదాయము 3, 4(SC), 6,7,11,12(SC) & 8(SC) (వార్డు నెం.39, లక్ష్మిటాకీస్ దగ్గర), సూర్యబాగ్ వాణిజ్య సముదాయము 8(SC) (గ్రౌండ్ ఫ్లోర్), 9(ఫస్ట్ ఫోర్) (వార్డు నెం.31, నియర్ జివిఎంసి జోనల్-4 ఆఫీసు), టి.ఎస్.ఆర్ కాంప్లెక్స్ వాణిజ్య సముదాయము 21,33,37,39(ST),46(SC),51(ST) (వార్డు నెం.31), అంగడిదిబ్బ వాణిజ్య సముదాయము 2(SC) (వార్డు నెం.29), జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని కాంటీన్ (వార్డు నెం.28), రెల్లివీధి రోడ్ సైడ్ ఫిష్ మార్కెట్లును 3 సంవత్సరముల కాల పరిమితికి గుత్తకు ఇచ్చేందుకు తేదీ 23-12- 2025 ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించబడునని జోనల్ కమిషనర్ తెలిపారు. సదరు వేలంపాటలో పాల్గొనదలచిన వారు దరావత్తు సొమ్ము తదితర పూర్తి వివరాలకు 4వ జోనల్ కార్యాలయం పని వేళలో పర్యవేక్షకులను సంప్రదించగలరని జోనల్ కమిషనర్ తెలిపారు

విశాఖపట్నం

దక్షిణ నియోజకవర్గంలో సెంటు భూములో ఆప్షన్ – 3 ద్వారా పూర్తయిన గృహాలను లబ్ధిదారులకు గృహ స్వాధీన పత్రం అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*దక్షిణ నియోజకవర్గంలో సెంటు భూములో ఆప్షన్ – 3 ద్వారా పూర్తయిన గృహాలను లబ్ధిదారులకు గృహ స్వాధీన పత్రం అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *విశాఖపట్నం డిసెంబర్ 20పున్నమి ప్రతినిధి* దక్షిణ నియోజకవర్గం పరిధిలో సెంటు భూములో ఆప్షన్ – 3 ద్వారా పూర్తయిన గృహాలకు స్వాధీన పత్రమును ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు లబ్ధిదారులకు అందజేశారు. గంగవరం మరియు నంగినారుపాడు లేఔట్స్ లబ్ధిదారులకు అదనపు రూ.50,000/- సహాయం మరియు హ్యాండోవర్ ప్రక్రియ కార్యక్రమం జూన్ 3 కార్యాలయంలో నిర్వహించారు . ముఖ్యంగా గంగవరం మరియు నంగినారుపాడు లేఔట్స్‌కు సంబంధించిన లబ్ధిదారులకు గత ప్రభుత్వ కాలంలో గంగవరం మరియు నంగినారుపాడు లేఔట్స్‌కు చెందిన లబ్ధిదారులకు రూ.1,80,000/- (ఒక లక్ష ఎనభై వేల రూపాయలు) మాత్రమే గృహ నిర్మాణ సహాయంగా మంజూరు చేయగా, కూటమి ప్రభుత్వం డిసెంబర్ 10, 2024 తరువాత పూర్తయిన (కంప్లీట్ అయిన) ఇళ్లకు సంబంధించి రూ.50,000/- (యాభై వేల రూపాయలు) అదనపు సహాయాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు (Government Orders) జారీ చేసిన నేపధ్యంలో ఈ అదనపు మొత్తాన్ని హౌస్ హ్యాండోవర్ పత్రాన్ని ఆన్‌లైన్ లాగిన్‌లో అప్‌లోడ్ చేసిన అనంతరం, నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. అదేవిధంగా రూ.50,000/- సహాయం SC, ST మరియు BC వర్గాలకు చెందిన లబ్ధిదారులకు మాత్రమే వర్తింపజేయబడిందని, OC వర్గాలకు ఈ సహాయం వర్తించదు అని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని r తెలిపారు. దక్షిణ నియోజకవర్గ పరిధిలో గంగవరం మరియు నంగినారుపాడు లేఔట్స్‌కు సంబంధించి మొత్తం 13,983 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయను వీటిలో 3,785 ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయని అన్నారు. నియోజకవర్గం లో డిసెంబర్ 10, 2024 తరువాత పూర్తయిన ఇళ్లు 2,907 ఉన్నాయనీ,.ఈ 2,907 ఇళ్లకు చెందిన SC, ST, BC లబ్ధిదారులందరూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రూ.50,000/- అదనపు సహాయానికి అర్హులనీ వివరించారు. అదనంగా వచ్చే నిధులతలబ్ధిదారుల ఇళ్లలో మరియు ఇల్లు చుట్టుపక్కల అవసరమైన పూర్తి పనులు చేయబడును. ముఖ్యంగా లోపల–బయట ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, లోపల–బయట వైట్ వాష్, పెయింటింగ్, ప్రధాన తలుపులు, బాత్రూమ్ డోర్స్, స్టెప్స్ (మెట్లు) వంటి పనులు చేయబడతాయినీ వివరించారు. అలాగే గతంలో కొంతమంది లబ్ధిదారులు ఇప్పటికే రూ.35,000/- స్వంతంగా చెల్లించిన సందర్భాలలో, వారికి మొత్తం రూ.85,000/- విలువైన అదనపు పనులు (Extra Items) చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఐటమ్స్, వైరింగ్ పనులు మరియు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు అనుమతించబడిన ఇతర అవసరమైన పనులు కూడా చేయబడతాయని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ లక్ష్మి గారు ప్రజలందరికీ మేలు చేకూర్చే విధంగా కృషి చేస్తున్నామని కూటం ప్రభుత్వం అధికారంలో వచ్చినట్టు నుంచి ప్రజా సంక్షేమ దేంగా పని చేస్తుందని వివరించారు కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, స్టేట్ డైరెక్టర్లు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ శ్రేణులు గృహ నిర్మాణ అధికారులు పాల్గొన్నారు….

విశాఖపట్నం

రూ.15 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన బండి సంజయ్

*రూ.15 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన బండి సంజయ్* _*విశాఖపట్నం డిసెంబర్ 20పున్నమి ప్రతినిధి*_ పేద, మధ్యతరగతి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ లో పెద్దఎత్తున అందుతున్న ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో సాయం కోసం దరఖాస్తు చేసుకున్న 21 మందికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.15.06 లక్షల విలువైన చెక్కులను శనివారం ఎం.వి.పి. కాలనీలోని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాసంలో ఆయన అందజేశారు. అనారోగ్యం ఆధారంగా రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఏయే సమస్యలకు ఈ సాయం అందుతుందనేది గంటా శ్రీనివాసరావును సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఆకస్మిక అనారోగ్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థికంగా ఆదుకుంటుందని గంటా తెలిపారు. కార్యక్రమంలో నార్త్ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు, కార్పొరేటర్ పి.వి. నరసింహం, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, జి. సుభాష్ చంద్రబోస్, గంటా నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సభకు ర్యాలీగా వెల్లిన గాజువాక బాజపా నాయకులు*

*అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సభకు ర్యాలీగా వెల్లిన గాజువాక బాజపా నాయకులు* *విశాఖపట్నం డిసెంబర్ 20పున్నమి ప్రతినిధి* విశాఖ బీచ్ రోడ్డు పార్క్ హోటల్ కూడలిలో బిజేపి జిల్లా పార్టీ అధ్యక్షుడు పరశురామరాజు ఆద్వర్యంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి గాజువాక నియోజకవర్గం నుండి ఇంచార్జి మరియు రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ విశాఖలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కేంధ్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్,రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ , రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ , ఎంపి భరత్ ,కూటమి శాసనసభ్యులు మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారని తెలిపారు. కేంద్ర ముంత్రి బండి సంజయ్ మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించారని తెలిపారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ వాజపేయి సేవలను కొనియాడారని చెప్పారు. అనంతరం రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో గాజువాక నాయకులు గూటూరు శంకరరావు,బొండా యల్లాజీరావు,బాటా శ్రీనివాసరావు,దామా సుబ్బారావు,బాస్కరనాయుడు,నాగేశ్వరరావు,రంగనాయకులు,తాతారావు,పేర్ల అప్పారావు,జగదీష్, మనోహర్, కృష్ణారెడ్డి , సూరిబాబు, నాగరాజు, సత్తిబాబు , బాబూరావు,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

​సింహగిరిపై ఇండియన్ క్రికెటర్ సందడి*

*​సింహగిరిపై ఇండియన్ క్రికెటర్ సందడి* *స్వామివారిని దర్శించు కున్న శ్రీ చరణి* *విశాఖపట్నండిసెంబర్ 20పున్నమి ప్రతినిధి* భారత యువ క్రికెటర్ శ్రీచరణి శనివారం సింహాచల క్షేత్రాన్ని సందర్శించారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆయన దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయానికి చేరుకున్న క్రికెటర్ శ్రీచరణికి ఆలయ సహాయ కార్యనిర్వహణా ధికారి కె.తిరుమలేశ్వరరావు సాదరంగా స్వాగతం పలికారు ఆలయ సంప్ర దాయాలను అనుసరిస్తూ, శ్రీ శ్రీచరణి ముందుగా భక్తుల నమ్మకమైన ‘కప్పస్తంభాన్ని’ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి విశిష్టతను ఆయనకు వివరించారు దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణలతో ‘వేద ఆశీర్వచనం’ అందజేశారు ఈ సందర్భంగా ఏఈఓ కె. తిరు మలేశ్వరరావు శ్రీచరణికి స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి, ఆలయ ప్రసాదాలను అందజేశారు భారత జట్టులో రాణించి దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ఆలయ పండితులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

విశాఖపట్నం

ఎయిర్ పోర్టు జోన్ క్రైం ఎస్ ఐ గా కే కిషోర్*

*ఎయిర్ పోర్టు జోన్ క్రైం ఎస్ ఐ గా కే కిషోర్* *విశాఖపట్నం డిసెంబర్ 20 పున్నమి ప్రతినిధి* ఎయిర్ పోర్టు జోన్ క్రైం ఎస్ ఐ గా కే కిషోర్ నియమితు లయ్యారు 2012 బ్యాచ్ కు చెందిన ఆయన శ్రీకాకుళం లో ఎస్ ఐ గా విధులు నిర్వ హించిన ఆయన 2018 విశాఖలో సైబర్ క్రైం,కంచర పాలెం లాండ్ ఆర్డర్ లో విధులు నిర్వహించి ప్రస్తుతం ఎయిర్ పోర్టు జోన్ క్రైం ఎస్ ఐ గా శనివారం బాధ్యతలు స్వీకరించారు గతంలో కంచర పాలెం స్టేషన్ లో పనిచేసిన అనుభవం ఉందని నేర నియంత్రణకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.

విశాఖపట్నం

సాగర తీరాన వైజాగ్ ఆటో ఎక్స్ పో

సాగర తీరాన వైజాగ్ ఆటో ఎక్స్ పో ప్రారంభించిన విఎంఆర్డిఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, జాయింట్ కమిషనర్ రమేష్ *విశాఖపట్నం డిసెంబర్ 20 పున్నమి ప్రతినిధి* కొలువుతీరిన అన్ని బ్రాండ్ల కార్లు,బైకులు రేస్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల ఎక్స్ పో సాగర తీరాన వైజాగ్ ఆటో ఎక్స్ పో 2025 ఘనంగా ప్రారంభమైంది. వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, జాయింట్ కమిషనర్ రమేష్ సంయుక్తంగా దీన్ని ప్రారంభించారు. రెండు రోజులు పాటు జరిగే ఈ ఈవెంట్ లో సుమారు 20 బ్రాండ్లు కార్లు, బైకుల కంపెనీలు తమ ఉత్పత్తులను వాహన కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు. సంవత్సరాంతపు డిస్కౌంట్ సేల్స్ లో భాగంగా పలు మోడల్ కార్లు బైకులు అమ్మకాలు జరిపేందుకు సిద్ధంగా ఉంచారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్ రంగంపై జీఎస్టీ శాతాన్ని గణనీయంగా తగ్గించడంతో వాహన కొనుగోలు ప్రియులకు ఊరట లభించింది. ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ రేస్ ఎంటర్టైన్మెంట్స్ సారథ్యంలో గడిచిన 15 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఆటో ఎక్స్ పో ఈవెంట్లు మూలంగా ఒకే చోట కంపెనీల ఉత్పత్తులను ఉంచడం వాహన కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ముఖ్య గౌరవ అతిథులు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా మారుతి కారు విక్టోరియాస్ ను ఆవిష్కరించారు. అలాగే టీవీఎస్ కంపెనీకి చెందిన రెండు మోడల్ మోటారు బైక్లను లాంచింగ్ చేశారు. శని ఆదివారాల్లో బీచ్ రోడ్ లో విశ్వ ప్రియా ఫంక్షన్ హాల్ ఎదురుగా గల పార్కింగ్ స్థలంలో జరుగుతున్న ఈ ఎక్స్ పోను విశాఖ వాసులు సందర్శించి ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ప్రణవ్ గోపాల్ కోరారు. కార్యక్రమంలో ఈస్ట్ ఏసిపి కే లక్ష్మణమూర్తి, జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే విజయ మోహన్, హాలిడే వరల్డ్ ప్రతినిధి సిహెచ్ గోపి, ప్రముఖ వ్యాపారవేత్త కూనల కామేష్, రేస్ ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్, పలు ఆటోమొబైల్ కంపెనీల సీఈవోలు, జిఎంలు, సేల్స్ హెడ్ లు పాల్గొన్నారు.

కామారెడ్డి

చలి పంజా భయంకరంగా మారింది!

కామారెడ్డి, 20డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లాలో పంజాబీ చలి పూర్తి దెబ్బకు గురైంది. దుకాణదారులు సాయంక్రమం 7 గంటల తర్వాత అన్ని షాపులు తప్పక మూసివేయాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.భయంకర చలి విపరీతంకామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌తో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధార ణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతు న్నాయి. రాష్ట్రంలో 19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు, సంగారెడ్డి 4.5°సి, హైదరాబాద్ 6.3°సి నుంచి మరింత తగ్గుతున్నాయి.దుకాణాల మూసివేత ఆర్డర్సాయంక్రమం 7 గంటల తర్వాత రోడ్లు ఖాళీగా ఉండాలి. అధికారులు స్పష్టంగా చెప్పారు – అందరూ ఇంటి లోపలే ఉండాలి! చలి గాలులు తిమ్మిరి, పొగమంచు కలిగించుతున్నా యి, బయట తిరగకూడదు.ఆరోగ్య ప్రమాదాలు చలి వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, జలుబు, దగ్గు, దహన సమస్యలు తీవ్రంగా పెరుగుతాయి. వృద్ధులు, చిన్న పిల్లలు, రోగులు మరింత జాగ్రత్త! రాబోయే మూడు రోజులు చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది.ప్రజలకు సలహాలుసాయంక్రమం 7 గంటల ముందే షాపింగ్ పూర్తి చేసి ఇంటికి చేరు కోండి.వెచ్చని దుస్తులు, స్కార్ఫ్‌లు వాడండి; వేము భోగం చేయకండి.గ్రీన్ టీ, సూప్ తాగి శరీరాన్ని వెచ్చగా ఉంచండి.పిల్లలు, వృద్ధులను బయటకు తీయకండి; ఆవిరి మంచు రోజుల్లో జాగ్రత్తలు పెంచండి.ఈ భయంకర చలి పంజా నుంచి తప్పిం చుకోవడానికి అధికారుల ఆదేశాలు పాటించండి. జిల్లా వ్యాప్తంగా అమలు జరుగుతోంది!

కామారెడ్డి

రామారెడ్డి మండలం BNRKS భవన్‌లో కార్మికుల అవగాహన సదస్సు:

ఏకతాటి విధానాలకు వ్యతిరేకంగా గట్టి పోరాట తీర్మానం! కామారెడ్డి,20 డిసెంబర్,( పున్నమి ప్రతినిధి ) : నిర్మాణ రంగాల కార్మిక సంఘం రామారెడ్డి మండ ల కమిటీ BNRKS భవన్‌లో జరిగిన అవగాహన సదస్సు సంచలన తీర్మానాలతో ముగిసింది. ము ఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్, జిల్లా కార్యదర్శి అబ్దుల్ రజాక్, జిల్లా కోశాధికారి ధ్యానబోయిన శ్యామ్‌లు పాల్గొ న్నారు.సదస్సులో నాయకులు మాట్లాడుతూ, “ప్రతి కార్మికుడు సంఘంలో సభ్యత్వం తీసుకోవా లి. మన సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు చేయించుకుందాం” అని పిలుపు నిచ్చారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకతాటి నిర్ణ యాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ,కార్మిక సంక్షేమ చట్టాలను ఎంత కొట్టి తెచ్చుకున్నా, వాటి ని ఎత్తేసి నాలుగు కోట్లలో తీసేశారు.కార్మికులు భారీ నష్టపోతున్నారని ఆరోపించారు.మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం కార్మిక నాయకులతోనూ, కార్మికు లతోనూ మాట్లాడకుండా సంక్షేమ ఫలాలకు గండి కొట్టి ప్రైవేటీకరణ చేస్తోందని తీవ్రంగా ఖండించా రు.అందరూ ఏకతాటిపై ఉన్నారు.ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి.రాష్ట్ర నాయకత్వం పిలిచి నప్పుడు ప్రతి కార్మికుడు నిరసన తెలపడానికి సిద్ధంగా ఉండాలని కోరారు.నిర్మాణ రంగాల్లో పని చేసే ప్రతి కార్మికుడు లేబర్ కార్డు చేయించుకోవాల ని సూచించారు. సదస్సులో సహాయక కార్మిక అధికారి ఖమ్రుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ లిపేల్లీ నారాయణ,జిల్లా మండల కమిటీ అధ్యక్షు లు బింగీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పుసలశివ, ప్రసార కార్యదర్శి ఉపల్వాయి గంగాధర్ నారాయ ణ, అన్నారం రాచమల్ల శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు దేమేరవి తదితర గ్రామాల సభ్యులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.