Friday, 13 March 2026

Blog

విశాఖపట్నం

విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి కి అభినందనలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ – బృందం.

విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి కి అభినందనలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ – బృందం. విశాఖపట్నం,డిసెంబర్ 30 పున్నమి ప్రతినిధి:- విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి సేవలకు ప్రభుత్వం పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉండగా, ఇప్పుడు డైడెక్టర్‌ జనరల్‌గా (డీజీ) ప్రమోషన్‌ ఇచ్చింది. అయితే అదే హోదాలో విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించాలని సూచించడం గమనార్హం.ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఫెడరేషన్ -ఏపీఎంఎఫ్ విశాఖపట్నం యూనియన్ శంక బ్రత బాగ్చి ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపింది. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం. లత, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేశానపల్లి.కిరణ్ కుమార్,కార్య దర్శి బేర.సురేష్ ,సహాయ కార్యదర్శి అప్పలరాజు, కోశాధికారి వాసుపల్లి రాజు , అలాగే కమిటీ సభ్యులు శంకర్, ప్రసాద్ యాదవ్, మీనా, జెమిని న్యూస్ ఎడిటర్ సారా, అనుపమ యాదవ్ , అర్జున్ తదితరులు ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలను అంద జేశారు.

తూర్పు గోదావరి

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామంలో అగ్ని ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి గోపాలపురం మండలం ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామ కాపురస్తులు సాయిల నాగరాజు గారి ఇంట్లో ఫ్రిడ్జ్ కాలి పోయి ఫైర్ అయిపోయింది ఇంట్లో కరెంట్ బోర్డులు మొత్తం కాలి పోయాయి ఇల్లు మొత్తం దగ్ధమైంది. గ్రామ ప్రజలు ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు RND

E-పేపర్

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపాలపురం గ్రామంలో అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి గోపాలపురం మండలం ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామ కాపురస్తులు సాయిల నాగరాజు గారి ఇంట్లో ఫ్రిడ్జ్ కాలి పోయి ఫైర్ అయిపోయింది ఇంట్లో కరెంట్ బోర్డులు మొత్తం కాలి పోయాయి RND

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో బాలకోటయ్యకు ఘన సత్కారం

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పొతుల బాలకోటయ్య కు ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కమిటీ చైర్మన్ కొట వీరబాబు పాల్గొన్నారు. జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు పి.మీరా హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో బాలకోటయ్య ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు చిరుమామిళ్ళ నానాజీ, జర్నలిస్టులు పఠాన్ సైదాఖాన్, అన్నవరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొని బాలకోటయ్య సేవలను ప్రశంసించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మరింత చురుకుగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.

విశాఖపట్నం

విశాఖపట్నం రూరల్‌లో బ్రాహ్మణ ఆత్మీయ కలయిక–2025 వనసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహణ

విశాఖపట్నం రూరల్ మండలం, కే.కోటపాడు సమీపంలోని చంద్రయ్యపేట గ్రామం దరిదాట్ల లేఅవుట్‌లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం మరియు లలితా గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో “బ్రాహ్మణ ఆత్మీయ కలయిక–2025” పేరుతో వనసమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి, హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, కార్పొరేషన్ డైరెక్టర్ వేదుల సూర్యప్రభ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అలాగే రాష్ట్ర అధ్యక్షులు దూర్వాసుల రామశాస్త్రి, అధికార ప్రతినిధి డా.పెంట శేషుబాబు శర్మ, రాష్ట్ర కోశాధికారి దంతుర్తి కళ్యాణ్, జిల్లా అధ్యక్షులు న్యాసావఝ్జల ప్రశాంత్, భాస్కర పట్ల సత్యప్రసాద్ శర్మ, గంటి భాస్కర్, దంతుర్తి కాశీ విశ్వనాథ శర్మ, దూర్వాసులు సాయి, చామర్తి కేశవాచార్యులు, రాచకొండ శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన శాసనసభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. దేవాలయాల్లో సేవలందిస్తున్న అర్చకులకు జీతభత్యాలను క్రమబద్ధంగా అందించడమే కాకుండా, ఇనాం భూముల ఆదాయాన్ని అర్హులైన అర్చకులందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని బండారు సత్యనారాయణమూర్తి సభాముఖంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది బ్రాహ్మణులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొని వనసమారాధన కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా, ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ ఉత్తర్వుల ప్రదానం

మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ICDS)లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గానికి చెందిన పలువురు మినీ అంగన్వాడీ కార్యకర్తలు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ అయ్యారు.ఈ సందర్భంగా సోమవారం నాడు నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో అప్గ్రేడ్ ఉత్తర్వులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలు, శాఖ అధికారులతో కలిసి కార్యకర్తలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, అంగన్వాడీ కార్యకర్తలు మహిళా, శిశు సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గ్రామీణ స్థాయిలో తల్లి–శిశు ఆరోగ్యం, పోషణ, విద్యా అవగాహన పెంపొందించడంలో వారి సేవలు అమూల్య మైనవని ప్రశంసించారు.అంగన్వాడీ కార్యకర్తల సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం చేపడుతున్న ఈ అప్గ్రేడ్ ప్రక్రియ అభినందనీయమని పేర్కొన్న ఆమె, కూటమి ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

చిన్నారుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త కోసం ప‌టిష్ట‌ చర్యలు*

*చిన్నారుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త కోసం ప‌టిష్ట‌ చర్యలు* *జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ *ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మూడు వ‌రుస స‌మావేశాలు *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి * జిల్లాలో బాల‌ల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, భద్రతను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర‌ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో ఐసీడీఎస్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన చైల్డ్ వెల్ఫేర్ & ప్రొటెక్షన్ కమిటీ, సిఫారసుల కమిటీ, జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015 – సెక్షన్ 27(8) ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ స‌మావేశాలు జ‌రిగాయి. వీటిల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి ఆర్. స‌న్యాసినాయుడు, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మయూర్ అశోక్, సీడ‌బ్ల్యూసీ క‌మిటీ స‌భ్యులు, అధికారులు భాగ‌స్వామ్య‌మ‌య్యారు. జిల్లాలోని చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ కు సంబంధించి తుది నమోదు సర్టిఫికెట్ల జారీ అంశాన్ని సమగ్రంగా పరిశీలించి అవసరమైన సిఫారసులు క‌లెక్ట‌ర్ చేశారు. జిల్లాలో అమలవుతున్న బాలల సంక్షేమం, రక్షణకు సంబంధించిన వివిధ కార్యక్రమాల పురోగతిపై ఆరా తీశారు. జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015 – సెక్షన్ 27(8) ప్రకారం చైల్డ్ వెల్ఫేర్, సంరక్షణ, రక్షణ, పునరావాసానికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ వివిధ అంశాల‌పై మాట్లాడారు. బాల కార్మిక వ్య‌వ‌స్థ నిర్మూల‌న‌కు, బాలల అక్రమ ర‌వాణ‌ నిరోధానికి, బాల్య వివాహాల నివారణకుచ, పిల్లల పునరావాసం కోసం త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. బాల కార్మిక వ్యవహారాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, బాల్య వివాహాల నివారణకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల ప్రభావం నుంచి పిల్లలను రక్షించే చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాల‌ని సూచించారు. డ్రాప్‌ఔట్ పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలకు సంబంధించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, 18 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని టీకాలు సమయానికి అందేలా చూడాలని స్పష్టం చేశారు. బాల‌, బాలిక సంర‌క్ష‌ణ గృహాల‌ను ప‌క్కాగా నిర్వ‌హించాలని, వ‌స‌తులు క‌ల్పించాల‌ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి ఆర్. స‌న్యాసినాయుడు సూచించారు. పిల్ల‌ల‌కు ఆరోగ్య‌క‌ర ఆహారం అందించాలని, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో సేవ‌లందించాల‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వి. రామలక్ష్మి శాఖాపరమైన అంశాలపై వివరించారు. అనంత‌రం అధికారులంతా క‌లిసి పోస్ట‌ర్ను ఆవిష్క‌రించారు. ఈ సమావేశాల్లో మహిళా శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ, జువెనైల్ వెల్ఫేర్ విభాగం అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్ర‌తినిధులు, సీడీపీవోలు, సూపర్వైజర్లు, చైల్డ్ లైన్ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

జిల్లా సంజీవని నిధికి స్వచ్ఛంద విరాళాలు అందించాలి*

*జిల్లా సంజీవని నిధికి స్వచ్ఛంద విరాళాలు అందించాలి* *అధికారుల‌కు, దాత‌ల‌కు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి * జిల్లాలోని పేద‌ల‌కు, అనారోగ్య బాధితుల‌కు సాయం చేయాల‌నే దృక్ప‌థంతో నెల‌కొల్పిన సంజీవ‌ని నిధి – డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ కు స్వ‌చ్ఛంద విరాళాలు అందించాలని, అధికారుల‌ను, దాత‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్రసాద్ విజ్ఞ‌ప్తి చేశారు. నూతన సంవత్సరం – 2026కు స్వాగతం పలికే సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న మానవీయమైన, అర్థవంతమైన సంప్రదాయాన్ని ఈ ఏడాదీ కొనసాగించాలని విన్న‌వించారు. అధికారులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలపడం సందర్భంగా పూలు, పండ్లు, కేకులు, మొక్కలు తదితరాలను అందించడం కన్నా.. ‘సంజీవని నిధి – జిల్లా సహాయ నిధి’కి స్వచ్ఛంద విరాళాలు అందించాలని ప్ర‌త్యేక సందేశం ద్వారా సోమ‌వారం విజ్ఞప్తి చేశారు. ‘సంజీవని నిధి – జిల్లా సహాయ నిధి’ ద్వారా సేకరించిన విరాళాలు జిల్లాలోని అవసరమైన, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించడంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ మానవీయ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ద్వారా, సమాజంలో బాధితులకు అండ‌గా నిల‌వ‌డంతో పాటు, సామాజిక బాధ్యతకు ఆదర్శంగా నిలవగలమని ఆయన పేర్కొన్నారు. ఈ విరాళాలు పూర్తిగా స్వచ్ఛందమైనవని స్పష్టం చేస్తూ, సేవాభావంతో నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దామని జిల్లా క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు. విరాళాలకు సంబంధించిన‌ వివరాలు: నిధి పేరు: SANJEEVANI NIDHI – District Relief Fund ఖాతా సంఖ్య: 50100500766040 బ్యాంకు & IFSC: HDFC Bank – HDFC0009179

విశాఖపట్నం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 110 ఫిర్యాదులు*

*విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి* *ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 110 ఫిర్యాదులు* *ప్రతీ సోమవారం నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS)కు ఈ రోజు 110 ఫిర్యాదులు రావడం జరిగినది* ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ Dr.శంఖబ్రత భాగ్చి, ఐ.పీ.ఎస్., గారు ప్రత్యక్షముగా పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు ఉండి, నగర సబ్-డివిజన్ ఏ.సి.పి లు మరియు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనీ, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక *(PGRS)* కార్యక్రమానికి 110 మంది ఫిర్యాదుదారులు వచ్చి తమ తమ సమస్యలను రిపోర్టులు ద్వారా పోలీసు కమిషనర్ గారికి అందజేసినారు. సిపి గారు ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదిదారులతో స్వయముగా మాట్లాడి, వారి వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సమస్యకు సంబంధించి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించవలసినదిగా ఆదేశాలు ఇవ్వడమైనది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక *(PGRS)* కార్యక్రమంలో ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్య భర్తల గొడవలు, మోసానికి సంబంధించినవి మరియు సివిల్ కేసుల విషయం సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.

విశాఖపట్నం

బంగ్లాదేశ్ లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు బోట్ అసోసియేషన్ పెద్దలు*

*బంగ్లాదేశ్ లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు బోట్ అసోసియేషన్ పెద్దలు* *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి* *9 మంది మత్స్యకారులకు పదివేలు(10000/రూ) మరియు 4000 విలువ చేసే నిత్యవసర వస్తువులు పంపిణీ*అదేవిధంగా బోటు యజమానికి 10000 మరియు నిత్యావసర వస్తువుల అందజేసిన ఎమ్మెల్యే మరియు అసోసియేషన్ సభ్యులు* *మత్స్యకారులను క్షేమంగా వెనక్కి రప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే* *మత్స్యకారుల విడుదలకు నిరంతరం పర్యవేక్షిస్తున్న అసోసియేషన్ పెద్దలకు మరియు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే* ఈరోజు ఫిషింగ్ హార్బర్ లో ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులకు పోషణ నిమిత్తం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు అసోసియేషన్ పెద్దలు శ్రీ లక్ష్మణరావు గారు అప్పారావు గారు సహకారంతో మత్స్యకార కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. 9 మంది మత్స్యకార కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు చ (10000) చొప్పున ,ఒక్కొక్కరికి పదివేల రూపాయలు మరియు 4000 రూపాయల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు . అదేవిధంగా బోటు యజమానికి 10000 రూపాయలు మరియు నిత్యాసర వస్తువులను అందజేశారు .కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ 9 మంది మత్స్యకారులను క్షేమంగా వెనక్కి రప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని తెలియజేశారు. మత్స్యకార కుటుంబీకులు అపోహలకు పోకుండా ధైర్యంగా ఉండాలని తెలిపారు. బంగ్లాదేశ్ మరియు భారతదేశానికి మధ్య జరుగుతున్న ఇటీవల సంఘటన నేపథ్యంలో మత్స్యకారుల విడుదలకు కొంత ఆలస్యం అయిందని అతి త్వరలో వారిని వెనక్కి రప్పించే బాధ్యత కేంద్ర మంత్రి, విశాఖ ఎంపీ భరత్ గారు, విజయనగరం ఎంపీ, ఎమ్మెల్యేలను నిరంతరం పర్యవేస్తున్నామని తెలియజేశారు. మత్స్యకారులకు తాము అండగా ఉన్నామని వారి కుటుంబ సభ్యులు అధైర్య పడకూడదని ఎమ్మెల్యే వంశీ గారు తెలిపారు . మత్స్యకారుల కుటుంబ సభ్యుల పోషణ నిమిత్తం ప్రభుత్వానికి కూడా 20000 రూపాయలు ఇవ్వాలని తాము నివేదించానని వివరించారు .కార్యక్రమంలో బోటు అసోసియేషన్ పెద్దలు కూటమి శ్రేణులు పాల్గొన్నారు….

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.