Friday, 13 March 2026

Blog

పశ్చిమ గోదావరి

రైల్ వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3% రాయితీ

రైల్ వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3% రాయితీ ▪️అన్ రిజర్వ్ టికెట్లపై రాయితీ జనవరి 14 నుంచి జులై 14 వరకు. రైళ్లలో అర్రిజర్వ్డ్ టికెట్లను రైల్ వన్ యాప్ ద్వారా కొని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసేవారికి 3% రాయితీని రైల్వే మంత్రిత్వశాఖ ఇవ్వనుంది. 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఆర్-వ్యాలెట్తో చెల్లింపుల్ని చేసేవారికే ప్రస్తుతం ఈ రాయితీని క్యాష్బ్యాక్ రూపంలో ఇస్తోంది. డిజిటల్ బుకింగ్లను ప్రోత్సహించడానికి ఈ యాప్ ద్వారా జరిగే అన్నిరకాల డిజిటల్ చెల్లింపులకు దీనిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత సాఫ్ట్వేర్లో తగిన మార్పులు చేయాలని ‘రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం (క్రిస్)కు మంగళవారం రైల్వేశాఖ ఆదే శాలిచ్చింది. ప్రయాణికుల స్పందన ఎలా ఉందో మే నెలలో తెలియజేస్తే దీనిపై తదుపరి పరిశీలన చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్-వ్యాలెట్ ద్వారా ఇప్పటికే ఉన్న రాయితీ కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఇతర ఏ ఆన్లైన్ విధానాల్లో కొన్న అన్ రిజర్వ్ టికెట్లకు వర్తించబోదని తేల్చిచెప్పింది.

అన్నమయ్య

శ్రీ సౌమ్యనాథ స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్న అతికారి కృష్ణ ​గౌరవప్రదంగా స్వాగతం పలికిన యెద్దల విజయ సాగర్ ​టీడీపీ నాయకులను పరిచయం చేసిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్

​వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నందలూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయ సాగర్ ఆయనకు మర్యాదపూర్వక స్వాగతం పలికి, ఆప్యాయంగా పలకరించారు. వీరు కలిసి స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​ఆలయ విశిష్టతను వివరించిన విజయ సాగర్: దర్శనానంతరం యెద్దల విజయ సాగర్ ఆలయ పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక విశిష్టతను అతికారి కృష్ణకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం నందలూరు మండలంలోని తెలుగుదేశం పార్టీకు చెందిన నాయకులను, కార్యకర్తలను అతికారి కృష్ణకు పేరుపేరునా పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతికారి కృష్ణ మాట్లాడుతూ: అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ​ఈ సందర్భంగా యెద్దల విజయ సాగర్ మాట్లాడుతూ: “వైకుంఠ ఏకాదశి వంటి పవిత్ర పర్వదినాన మన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ సౌమ్యనాథుని దర్శించుకోవడం చాలా సంతోషకరం అని. నందలూరు క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది అని. స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనించాలని, కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ అండగా నిలవాలని కోరుకుంటున్నాము అని. నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని” ఆయన తెలియజేశారు. ​ఈ కార్యక్రమంలో మండల జనసేన మరియు టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామారెడ్డి

మానసిక దృఢత్వం, మత్తు పదార్థాల నిరోధంపై కస్తూర్బా బాలికల విద్యాలయంలో అవగాహన

కామారెడ్డి 31 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళ వారం మానసిక సమస్యలు, పరీక్షా కాలంలో జాగ్ర త్తలు, మాదక ద్రవ్యాల నిరోధంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ వనిత ఈ కార్యక్రమాన్ని సమీకరిం చారు. జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ, ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ, ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే మానసిక దృఢ త్వం తప్పనిసరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి న జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ మానసి కంగా దృఢంగా ఉండాలని సూచించారు. “అప్పుడే మీ ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు” అని తెలిపారు. టీనేజీ వయస్సులో వచ్చే అవరోధాలను వివరిం చుతూ, పరీక్షా కాలంలో ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవ్వాలని, మానసిక ఒత్తిడి పెట్టుకోవద్దని ఆయన అన్నారు. మొబైల్ వ్యసనానికి దూరంగా ఉండాల ని సలహా ఇచ్చారు. మానసిక సమస్యలు తలెత్తి నా తమను సంప్రదించాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు.యువత మత్తు పదార్థాలు వద్దు.. బంగా రు భవిష్యత్తు కోల్పోకండిఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ మాట్లాడుతూ, టీనేజీలు మత్తు పదార్థాల కు లోనై, విలువైన జీవితాలను వృధా చేసుకుం టున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు కలిగే అనర్థాలను ఇంట్లో చెప్పాలని సూచించారు. రామారెడ్డి మండలంలో డ్రగ్స్ వాడ కానికి బానిసైన వ్యక్తులను ఇప్పటికే పట్టు కొని, మందలించి, కౌన్సిలింగ్ చేశామని తెలిపారు. “కుటుంబం, సమాజాన్ని కాపాడటం మీ బాధ్యత.. మీరు కూడా భాగస్వాములవ్వండి” అని యువత కు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిరోధానికి అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో పీఎచ్సీ మెడికల్ ఆఫీసర్ డా. సురేష్, సైకియా ట్రిక్ సోషల్ వర్కర్ డా. రాహుల్, ఉపాధ్యాయులు పద్మ, గంగలక్ష్మి, రజిత, అరుణలు, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

ఊరందూరు కాల్వలో తేలిన మహిళ మృతదేహం

శ్రీకాళహస్తి పున్నమి క్రైం న్యూస్, డిసెంబర్ 30: శ్రీకాళహస్తి మండలం ఊరందూరు చెరువు దగ్గర ఉన్న ఎస్టీ కాలనీలో ఊరందూరు కాల్వలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనది. ఆమె వయస్సు 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండవచ్చునని పంట పొలాల్లో ఉండే రైతులు ఆ మృతదేహం గుర్తించి శ్రీకాళహస్తి రూరల్ పోలీసు వారికి తెలియగాజేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసు వాళ్ళు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ తరలించారు. మృతదేహం చేతులపై హిందీలో అక్షరాలు ఉండడం గమనించిన పోలీసులు ఎవరికైనా వివరాలు తెలిస్తే శ్రీకాళహస్తి రూరల్ పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిందిగా పోలీసులు cell:9154141891 , cell:7330823611.

తిరుపతి

తెలంగాణ సీఎంకి ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: శ్రీకాళహస్తి నియోజిక వర్గనికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరిచుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన సందర్భంగా తిరుమలలో ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో PCC ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, జిల్లా ST సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీను గౌడ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫయాజ్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా తొండమనాడులో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి, కుమార్తె పవిత్ర రెడ్డి, మనవడు దేవస్కంద రెడ్డిలు స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొనడంతో వీరికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బర్రి సుదర్శన్ రెడ్డి, జై చంద్రారెడ్డి, నారాయణ, భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మహేష్, సుబ్బానాయుడు కండ్రిగ వేణు, జయ కృష్ణ రెడ్డి, బలరాం, చంగల్ రాయులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వైభవంగా శ్రీ వైకుంఠనాథ స్వామీవారి ఏకాదశి మహోత్సవం

శ్రీ కాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: మండలంలోని కాట్రపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వైకుంఠనాథ స్వామీ ఆలయంలో అంగరంగ వైభవంగా పూజలు, కోలాటాల నడుమ పురవీధుల్లో ఊరేగింపులతో వేడుకలను నిర్వహించి భక్తులకు తీర్ధ, ప్రసాదాలు, అందజేయడంతో భక్తులు ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని ఆనందానుభూతిని పొందారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ స్వగ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠనాథ స్వామీ వారి ముక్కోటి ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా ఏకాదశి మహోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఆయన సతీమణి శ్రీకాళహస్తీశ్వరా స్వామీవారి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు కోలా విశాలి నేతృత్వంలో ఏకాదశి వేడుకలను ఘనగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నంద కుమార్, గవర్ల కృష్ణయ్య, కోలా గోవర్ధన్, గ్రామస్తులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

తిరుపతి

శివయ్య సన్నిధిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు

శ్రీ కాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: శ్రీ కాళహస్తీశ్వరా స్వామీవారి అమ్మ వార్ల దర్శనార్దం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షు, ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు తన కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం నాడు ఆలయానికి వెచ్చేశారు. వీరికి ఆలయాధికారులు, స్థానిక భాజపా నాయకులు సాదర స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం ఆలయ వేదపండితుల చేత ఆశీర్వాదం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్ధ, ప్రసాదలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భార్య పై దాడి భర్తకు 14 రోజులు రిమాండ్

ఉదయగిరి లోని రజక విధిలో ఈ నెల 28న చి పీ నాపీ తిరుపతమ్మ పై భర్త గురవయ్య చాకుతో దాడి చేశాడు నిందితుడైనా ఆమె భర్త గురవయ్యను ఉదయగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో హాజరుపరిచారు గురవయ్యకు జడ్జి జె, అంజయ్య 14 రోజులు రిమాండ్ విధించారనీ ఉదయగిరి ఎస్ఐ అల శ్రీను పేర్కొన్నారు నిందితుడీనీ ఆత్మకూర్ సబ్ జైల్ కు తరలించారు.

యాదాద్రి భువనగిరి

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రాచీన శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్టీ ఉప్పల లింగస్వామి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 30 :సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ప్రాచీన శివాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి సర్పంచిగా ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గెలుపొందిన తర్వాత మొదటిసారిగా శివాలయం ని దర్శించుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు రాజమౌళి ఉప్పల లింగస్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి సాయినాథ్ గౌడ్,క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, గునుగంటి రాజు గౌడ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.