Saturday, 21 March 2026

Author: RENUKUNTLA MURALI

RENUKUNTLA MURALI

32

Articles

ఆంధ్రప్రదేశ్

ఈ రోజున జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనైనది నిరసన కార్యక్రమం జిల్లా అద్య క్షుడు బి . లక్ష్మయ్య అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగిందికార్యక్రమంలో లక్ష్మయ్య గారు మాట్లాడుతూ 2024 మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు 18 నెలల నుండి బకాయిలు చెల్లించకుండా జాప్యం చేయడం వల్ల రాష్ట్రం లో రిటైర్మెంట్ అయిన ఉద్యోగ,ఉపాధ్యాయలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని బకాయిలు చెల్లించకపోవడం తో పిల్లల పెండ్లిలు చేయలేక, ఇల్లు కట్టుకోలేక,చేసిన అప్పులు తీర్చలేక బ్యాంకు ఈఎంఐ లు చెల్లించలేక నానా ఇబ్బందులకు గురవుతూ ఆరోగ్యాన్ని బాగుచేసుకోలేని దయనీయ మైన స్థితి లో ఉన్నాము.బకాయిలు రాక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 26 మంది పెన్షన్ దారులు కృంగి పోయి అప్పుల బాధలు భరించలేక చనిపోవడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘీభావం తెలిపిన టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీనివాస్,పెద్ది హరిబాబు TSGREA ప్రధాన కార్యదర్శి,అంబటి రాజయ్య తదితరులు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయులకువెంటనే బకాయిలను చెల్లించి పెన్షన్ దారుల చావులను ఆపాలని అన్నారు.గౌరవ అధ్యక్షుడు మిరియాల రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంద్ర సేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మా బాధను మానవతాధృక్పథంతో ఆలోచించి బకాయిలను వెంటనే చెల్లించి మా కుటుంబాలను ఆదుకోవాలి అని అన్నారు.జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది.కార్యక్రమం లో కృష్ణమూర్తి,రాంచంధర్,కుర్రెముల యాదగిరి ,రాంచందర్,రవీందర్,చలపతి రెడ్డి,మూర్తి, దాదాపు 50 మంది పెన్షన్ దారులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.