వంగూర్ మండలం తిరుమలగిరి గ్రామంలో దొంతినేని నరసింహారావు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో 6 రోజులపాటు సాగిన ఎన్ఎస్ఎస్ శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రిన్సిపల్ టి .గోపాల్ రెడ్డి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సమాజంలో జీవించటం నేర్చుకుంటారని అన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు కృష్ణయ్య, సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఆరు రోజుల ప్రత్యేక క్యాంపులో విద్యార్థులు గ్రామాల్లో ఉండే సమస్యలను తెలుసుకున్నారని, పరిష్కార మార్గాలను కూడా నేర్చుకున్నారని అన్నారు. గ్రామ ప్రజలు విద్యార్థులు తమకు ఎంతో సహకరించాలని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు, డి. ఆంజనేయులు, శ్రీరాములు, హనుమంతు, లింగస్వామి, జ్యోతి శ్రీ, కోకిల, ప్రేమానందం, కాలేజీ పూర్వ విద్యార్థులు పొలం శివ, ఎం. తులసిరామ్, విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం
వంగూర్ మండలం తిరుమలగిరి గ్రామంలో దొంతినేని నరసింహారావు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో 6 రోజులపాటు సాగిన ఎన్ఎస్ఎస్ శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రిన్సిపల్ టి .గోపాల్ రెడ్డి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సమాజంలో జీవించటం నేర్చుకుంటారని అన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు కృష్ణయ్య, సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఆరు రోజుల ప్రత్యేక క్యాంపులో విద్యార్థులు గ్రామాల్లో ఉండే సమస్యలను తెలుసుకున్నారని, పరిష్కార మార్గాలను కూడా నేర్చుకున్నారని అన్నారు. గ్రామ ప్రజలు విద్యార్థులు తమకు ఎంతో సహకరించాలని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు, డి. ఆంజనేయులు, శ్రీరాములు, హనుమంతు, లింగస్వామి, జ్యోతి శ్రీ, కోకిల, ప్రేమానందం, కాలేజీ పూర్వ విద్యార్థులు పొలం శివ, ఎం. తులసిరామ్, విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

