యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
13వ వార్డు ప్రజలు గత నాలుగు సంవత్సరాలుగా లో వోల్టేజ్ కారణంగా నానా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి దృష్టికి ఇట్టి సమస్యను 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల శ్రీనివాస్ గారు తీసుకెళ్లగా తక్షణమే స్పందించి గౌరవ విద్యుత్ అధికారులు డి ఈ ఏ డి ఏ. ఈ గార్లకు ఎమ్మెల్యే గారు సమస్యను వివరించి అట్టి సమస్య పరిష్కారం కోసం కృషిచేసి ప్రజల సమస్యను తీర్చడం ముఖ్యంగా భావించి అక్కడ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినందుకు ముందుగా గౌరవ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి వార్డు ప్రజల తో కలిసి గుర్రాల శ్రీనివాస్ గారు నేడు ధన్యవాదాలు తెలుపుతూ అట్టి ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించడం జరిగింది
ఇట్టి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రగతి నగర్ 13వ వార్డు ప్రజలు లో వోల్టేజ్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ టీవీలు ఫ్రిజ్లు ఇంట్లో ఉన్నటువంటి వాటర్ మోటర్లు పిల్లలకు చదువుకోవడం కూడా సమస్యగా ఏర్పడిన సందర్భంలో ఇట్టి విషయాన్ని గ్రహించి ప్రజలందరి సహకారంతో గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లామని తదనంతరం జరుగుతున్నటువంటి పనులను పలు దఫాలుగా అక్కడికి వెళ్లి పరిశీలించి ప్రజలకి అతి త్వరలో అందుబాటులోకి ట్రాన్స్ఫార్మర్ను తీసుకురావాలని విద్యుత్ అధికారులను పలుమార్లు కలిసి సమస్యను వివరించడం జరిగిందన్నారు తక్షణమే ఎమ్మెల్యే గారి సహకారంతో 13వ వార్డు ప్రజల సమస్యలను తీర్చుట కొరకు నేడు నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటుచేసి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు
ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జనగాం కవిత నరసింహ చారి, పూదరి లక్ష్మీ సతీష్, విశ్రాంత ఉద్యోగస్తులు బాల్ రెడ్డి గారు కృష్ణమూర్తి గారు, వార్డు ప్రజలు గోమారి మహిపాల్ రెడ్డి, సురేష్, సంతోష్ సిరికొండ కిరణ్,ప్రసాద్, నరాల మహేష్, సత్యం వెంకటేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు


