యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
*ఈరోజు భువనగిరి పట్టణ 23వ వార్డులో శ్రావణమాసం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం పూజలు మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రత పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించి ఈవ్రతంలో పాల్గొన్న మహిళలందరికీ వాయనాలు ఒక్కరికీ ఒక్కరు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది ఈసందర్భంగా మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలందరూ వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు ఆ అమ్మవారిని గౌరమ్మ రూపంలో కొలుచుకొని అమ్మవారిని ప్రత్యేక అలంకరణలు చేసి ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించి అమ్మవారికి అనేక రకాల నైవేద్యాలను సమర్పించి వ్రతం నిర్వహించి మహిళలందరూ వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు శ్రీలక్ష్మీదేవి అష్ట అవతారాలలో వరలక్ష్మి ఒకరు వరాలిచ్చే తల్లి వరలక్ష్మిగా భక్తులు కొలుస్తారు వివాహమైన స్త్రీలు కుటుంబ శ్రేయస్సు కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించడం వల్ల వివాహాలు జరిగిన మహిళలందరూ దీర్ఘ సుమంగళీ గా ఉంటారని అలాగే అష్టశ్వర్యాలైన సంపద,భూమి, శిక్షణ,ప్రేమ,కీర్తి,శాంతి,సంతోషం,శక్తి వంటివి లభిస్తాయని అన్నారు ఆ జగన్మాత అమ్మవారి ఆశీర్వాదంతో భువనగిరి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది ఈకార్యక్రమంలో మహిళలు అనసూయ లక్ష్మి లావణ్య నాగమణి రమణ రేవతి శ్యామల సుజాత ఆదిలక్ష్మి మల్లమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది*


