Friday, 6 February 2026
  • Home  
  • విద్యార్థులతో కలిసి భోజనం చేసిన విద్యార్థి నాయకుడు మల్లెం హేమంత్ కుమార్
- అన్నమయ్య

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన విద్యార్థి నాయకుడు మల్లెం హేమంత్ కుమార్

చిట్వేల్, డిసెంబర్ 15 పున్నమి ప్రతినిధి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ అధ్యక్షులు మల్లెం హేమంత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజన నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించిన హేమంత్ కుమార్, పిల్లలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే అందిస్తున్న భోజనం ఎంతో రుచికరంగా, నాణ్యతతో ఉందని ప్రశంసించారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు పోషకాహారం అందడంతో పాటు విద్యపై ఆసక్తి పెరుగుతోందని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆరోగ్యం, హాజరు మెరుగుపడేందుకు ఎంతగానో దోహదపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

చిట్వేల్, డిసెంబర్ 15 పున్నమి ప్రతినిధి

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ అధ్యక్షులు మల్లెం హేమంత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
భోజన నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించిన హేమంత్ కుమార్, పిల్లలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే అందిస్తున్న భోజనం ఎంతో రుచికరంగా, నాణ్యతతో ఉందని ప్రశంసించారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు పోషకాహారం అందడంతో పాటు విద్యపై ఆసక్తి పెరుగుతోందని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆరోగ్యం, హాజరు మెరుగుపడేందుకు ఎంతగానో దోహదపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.