Sunday, 7 December 2025
  • Home  
  • రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి
- Featured

రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

రాపూరు, మే 20, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలోని రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.మండల స్థాయి అధికారులు, వైద్యులతో పరిస్థితిని సమీక్షించి, ప్రజలెవ్వరూ ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలంటూ, బహిరంగ ప్రకటన ద్వారా సూచనలు, సలహాలు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి మనుబోలు బి.సి. కాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ప్రాథమిక సమాచారం ప్రకారం చుట్టుపక్కల నివాసాలు ఉన్న వారికెవ్వరికీ కరోనా వ్యాప్తి చెందలేదు.కాలనీ వాసులందరూ ఆందోళన చెందకుండా, నివారణకు అవసరమైన చర్యలు తీసుకోండి.ఈ ప్రాంతంలో నివసించే కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.ప్రజల అవసరాలకు ప్రత్యేకాధికారులను నియమించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ప్రజల అవసరాల కోసం మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ, వాలంటీర్లను అందుబాటులో ఉంచాం. అవసరమైనన్ని మాస్కులను, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతాం. వాలంటీర్ల ద్వారా మాస్కులను, శానిటైజర్లను, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తాం. వ్యాధి లక్షణాలు కానీ, అనుమానంగానీ ఉంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని నివృత్తి చేసుకోండి. ఎవరికీ ఏ అవసరమైనా అధికారులను సంప్రదించండి సమస్య పరిష్కారం కాకపోతే, నా దృష్టికి తీసుకొని రండి. ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ, ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తాం అని తెలిపారు

రాపూరు, మే 20, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలోని రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.మండల స్థాయి అధికారులు, వైద్యులతో పరిస్థితిని సమీక్షించి, ప్రజలెవ్వరూ ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలంటూ, బహిరంగ ప్రకటన ద్వారా సూచనలు, సలహాలు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి మనుబోలు బి.సి. కాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ప్రాథమిక సమాచారం ప్రకారం చుట్టుపక్కల నివాసాలు ఉన్న వారికెవ్వరికీ కరోనా వ్యాప్తి చెందలేదు.కాలనీ వాసులందరూ ఆందోళన చెందకుండా, నివారణకు అవసరమైన చర్యలు తీసుకోండి.ఈ ప్రాంతంలో నివసించే కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.ప్రజల అవసరాలకు ప్రత్యేకాధికారులను నియమించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ప్రజల అవసరాల కోసం మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ, వాలంటీర్లను అందుబాటులో ఉంచాం. అవసరమైనన్ని మాస్కులను, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతాం. వాలంటీర్ల ద్వారా మాస్కులను, శానిటైజర్లను, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తాం. వ్యాధి లక్షణాలు కానీ, అనుమానంగానీ ఉంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని నివృత్తి చేసుకోండి. ఎవరికీ ఏ అవసరమైనా అధికారులను సంప్రదించండి సమస్య పరిష్కారం కాకపోతే, నా దృష్టికి తీసుకొని రండి. ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ, ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తాం అని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.