*మహబూబ్ హుస్సేన్ జిగర్ అవార్డు గ్రహీత – అబు జియా సయ్యద్ జలీల్ అజార్కు వెల్ఫేర్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ ఘన సన్మానం.*
నిర్మల్ నవంబర్ 19.
ఇటీవల ప్రతిష్ఠాత్మక మహబూబ్ హుస్సేన్ జిగర్ అవార్డు అందుకున్న అబు జియా సయ్యద్ జలీల్ అజార్ను, తెలంగాణ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ ఘనంగా సన్మానించారు. నిర్మల్ పట్టణంలోని తన నివాసంలో ఆయన్ని ఆహ్వానించి, శాలువా కప్పి స్మారక చిహ్నం అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ మాట్లాడుతూ—సాహిత్యం, సామాజిక సేవ రంగాల్లో అజార్ చేసిన కృషి ప్రశంసనీయమని, యువతకు ఆయన నిజమైన ఆదర్శమని అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో Md. జీషణ్ అలీ, కాంగ్రెస్ లీడర్ అనీస్ అహ్మద్ ఖాన్, అల్మాస్ ఖాన్, Md. జాహెద్ అలీ తదితరులు పాల్గొన్నారు.


