
వినాయక చవితి పండుగ సందర్భంగా నరసన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. శ్రీనివాస్ రావు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –“ఆ విఘ్నేశ్వరుడు, గణనాథుని ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందమయ జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి కుటుంబం సంతోషసమృద్ధులతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజల జీవితాల్లోని అన్ని విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.అలాగే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ –“వినాయక చవితి పండుగ, వేడుకలు, గణేష్ నిమజ్జనం కార్యక్రమాలను ప్రశాంతంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, అపశృతులకు తావులేకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జరుపుకోవాలి. పోలీసు శాఖ జారీ చేసిన జాగ్రత్తలు, నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి” అని సూచించారు.

