రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం, రాజ్యాంగ విలువలపై అవగాహన, తదితర ప్రయోజనాలే లక్ష్యంగా విద్యాశాఖ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఎంపిక చేసిన బాల ఎమ్మెల్యేలతో బుధవారం అమరావతి లో నిర్వహించిన నమూనా శాసనసభ సమావేశాల్లో బాల ఎమ్మెల్యేలు తమ ప్రతిభను కనబరిచారు.
మాక్ అసెంబ్లీలో పెడన శాసనసభ్యులు పాత్ర పోషించిన కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రక గ్రామం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో 10 వ తరగతి చదువుతున్న యండి. సఫా మహేజబ్బిన్ ని పెడన MLA శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు సత్కరించడం జరిగింది.


