నందలూరు సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి)
మండల కేంద్రంలో వినాయక చవితి నిమజ్జనాలు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు శాంతి భద్రతల మధ్య విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఊరేగింపు ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమగ్ర బందోబస్తు చేపట్టి భద్రతను కాపాడిన నందలూరు ఎస్ఐ వడిశల మల్లికార్జున రెడ్డిని జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి, దాసరి గడ్డ యువత సభ్యులు శాలువ కప్పి సన్మానించారు.
జనసేన నాయకులు వంశీ, శివప్రసాద్, కొట్టే హరి, తరుణ్, డాల, అభి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


