శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని బజార్ వీధికి చెందిన ప్రముఖులు, కీర్తిశేషులు తుమ్మ రమణయ్య సతీమణి తుమ్మ వేదవతమ్మ ఆకస్మికంగా మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని, వేదవతమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బియ్యపు మధుసూదన్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “వేదవతమ్మ మరణం బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ తల్లి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, శ్రీవారి సురేష్, పటాన్ ఫరీద్, కొండు కృష్ణమూర్తి, చిన్నబ్బా తదితరులు ఉన్నారు. వారు కూడా వేదవతమ్మ మృతి పట్ల తమ సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.

తుమ్మ వేదవతమ్మ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంతాపం
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని బజార్ వీధికి చెందిన ప్రముఖులు, కీర్తిశేషులు తుమ్మ రమణయ్య సతీమణి తుమ్మ వేదవతమ్మ ఆకస్మికంగా మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని, వేదవతమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బియ్యపు మధుసూదన్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “వేదవతమ్మ మరణం బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ తల్లి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, శ్రీవారి సురేష్, పటాన్ ఫరీద్, కొండు కృష్ణమూర్తి, చిన్నబ్బా తదితరులు ఉన్నారు. వారు కూడా వేదవతమ్మ మృతి పట్ల తమ సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.

